31, మార్చి 2011, గురువారం

భోపాల్‌ ఇకపై భోజ్‌పాల్‌

మధ్యప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని భోపాల్‌ను ఇకపై భోజ్‌పాల్‌ పేరుగా వ్యవహరిస్తారు. రాజా భోజ్‌ 11వ శతాబ్దంలో మాల్పా ప్రాంతాన్ని పాలించాడు. మహ్మద్‌ గజనీపై 1024లో రాజాభోజ్‌ విజయం సాధించాడు. భోపాల్‌లో రాజాభోజ్‌ పట్టాభిషేకం మిల్లేనియం లేడుకల సందర్భంగా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివ రాజ్‌సింగ్‌ చౌహాన్‌ భోపాల్‌కు భోజ్‌ పాల్‌ పేరును ప్రతిపాదించారు. భోపాల్‌లోని బడా తలావో సరస్సును ఇకపై 'భోజ్‌ తాల్‌' గా వ్యవహరిస్తారు. అలాగే విఐపిరోడ్‌ను 'రాజాభోజ్‌' మార్గ్‌గా పిలుస్తారు. బొంబాయి ని ముంబైగా, మద్రాసును చెన్నైగా, కలకత్తాను కోల్‌కత్తా, బేంగళూర్‌ను బెంగుళూరుగా వ్యవహరిస్తున్నందున భోపాల్‌ను భోజ్‌పాల్‌గా ఎందుకు పరిగణించకూడదంటారు.

నేతల ఆస్తులపై ఇడి ఆరా?

నల్ల ధనం రారాజు హసన్‌ అలి అరెస్టు తదనంతర పరిణామా లు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజా పరిశోధనలో రాష్ట్రానికి చెందిన పలువురు బడా రాజకీయ నేత లు, పేరుమోసిన వ్యాపారులతోనూ ఈ గుర్రాల నవాబుకు లావాదేవీలున్నాయని రూఢీ అవడంతో దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఇడి) లోతుగా ఆరా తీయ సాగింది. రాష్ట్ర o నుంచి పది వేల కోట్ల రూపాయల నల్ల ధనాన్ని విదేశాలకు తరలించినట్లు వచ్చిన ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు రంగం లో దిగిన ఇడి హవాలా రాయుళ్ల కదలికలపై నిఘా వేసింది. ఎక్కువ భాగం రాజకీయ నేతలకు సంబంధించినవేనని ఆరోపణ లు వస్తుండడంతో నేతల ఆస్తులపై ఇడి ఆరా తీయసాగింది. పదేళ్ల కాలంలో అతి సంపన్నలైన నేతల వివరాలను సేకరించడంపై ఇడి దృష్టి సారించింది.

ఎవరెన్ని అవరోధాలు కల్పించినామనదే అధికారం : జగన్

వైఎస్ ఖ్యాతిని చరిత్రపుటల్లోంచి చెరిపేసేందుకు పాలక, విపక్షాలు ఏకమై కుట్రలు పన్నుతున్నారని మాజీ ఎం.పి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎవరెన్ని అవరోధాలు కల్పించినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకోలేరని... రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని పార్టీ వర్గాలకు భరోసానిచ్చారు.

వివేకా , జగన్ మధ్య ఉప ఎన్నికల పోరు

కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభ సీట్లకు బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డికి, అబ్బాయ్ వైయస్ జగన్ మధ్య ఉప ఎన్నికల పోరు ప్రారంభమైనట్లే. ఈ రెండు స్థానాలకు ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడులైంది. దీంతో వివేకానంద రెడ్డి, జగన్ మధ్య ఉప ఎన్నికల పోరు జోరందుకుంటుంది.

చిత్తూరు ని విడిచి వెళ్ళడం అంత దౌర్భాగ్యం మరొకటి ఉండదు

ఘనమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వం కలిగిన చిత్తూరు జిల్లాలో పుట్టడం ఎవరికైనా సౌభాగ్యదాయకమని రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ అన్నారు. చిత్తూరు పట్టణంలో శతాబ్ది ఉత్సవాలను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషాసంస్కృతీ సాంప్రదాయాల మేలుకలయికని, భిన్నత్వంలో ఇంతటి ఏకత్వాన్ని మరెక్కడా చూడలేమన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, మాడభూషి అనంతశయనం అయ్యంగార్ వంటి తత్వవేత్తలు, రాజనీతికోవిదులు చిత్తూరు జిల్లా నుంచీ దేశానికి సేవలందించారని ప్రశంసించారు.తన బాల్యంలో సుప్రసిద్ధ నటుడు చిత్తూరు నాగయ్య పేరు బాగా వినిపించేదన్నారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన జిల్లాను వదిలిపెట్టి ఎక్కడికీ వెళ్ళద్దని .. అలా ఎవరైనా జిల్లాను విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటే అంతకు మించిన దౌర్భాగ్యం మరొకటి వుండదన్నారు.

ఉద్యమ ద్రోహులెవరో బైట పెడతా...

తొందర్లేనే తెలంగాణ ద్రోహులెవరో తేలుస్తానని సిర్పూరు ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన తీరు విషయంపై అధిష్టానానికి కూడా వివరించా...నిర్ణయం వారిపైనే వదిలేసా అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ...తాను తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసి పోటీ చేస్తే ప్రత్యర్థిగాతెలుగుదేశం తరపున సిర్పూరు మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐకే రెడ్డి నిలిస్తే వారు తెలంగాణ ద్రోహులు కాదా అని ప్రశ్నించారు.. తెలంగాణా కి ఉద్యమానికి ఎవేరెవరు ద్రోహం చేస్తున్నారో పూర్తి వివరాలను త్వరలోనే కాగజ్‌నగర్‌ లో బహిరంగ సభ పెట్టి వెల్లడిస్తానని సమ్మయ్య పేర్కొన్నారు.

బాబా ఆరోగ్యం మరింత మెరుగు

సత్యసాయి బాబా ఆరోగ్యం మరింత మెరుగుపడిందని వైద్యులు వెల్లడించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు ప్రత్యేక బులెటిన్‌ను విడుదల చేశాయి. బాబాకు అన్ని రకాల పరీక్షలు చేశామని, హృద్రోగ నిపుణుల పర్యవేక్షణలో వైద్యసేవలు కొనసాగుతున్నాయని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డెరైక్టర్ ఏఎస్ సఫాయాతెలిపారు.

దేశం లో రొటేషన్

ప్రజాపద్దుల సంఘం (పీఏసీ) సహా శాసనసభకు సంబంధించిన అన్ని కమిటీల్లోనూ రొటేషన్ ప్రాతిపదికన నేతలకు అవకాశం కల్పించాలని టీడీపీ భావిస్తోంది. అసెంబ్లీలో పీఏసీ కార్యాలయాన్ని నాగం జనార్దన్‌రెడ్డి బుధవారం ఖాళీ చేయడంతో ఈసారి ఆయనకు అభ్యర్థిత్వం దక్కకపోవచ్చనడానికి ఇదే సంకేతమని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదే నిజమైతే ఈసారి వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డికి అవకాశం దక్కొచ్చంటున్నారు. గతంలో టీడీపీ హయాంలో 610 జీవో సభాసంఘానికి ఆయన చైర్మన్‌గా వ్యవహరించారు.

ఉగాది నుంచి శివన్న కి ఆర్జిత సేవల కట్

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఏప్రిల్ 1 నుంచి ఐదు రోజుల పాటు జరిగే ఉగాది ఉత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ఈఓ వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. గర్భాలయంలో భక్తులు నిర్వహించే రుద్రాభిషేకం, కుంకుమార్చన, రుద్ర, చండీ యాగాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.ఉత్సవాలు జరిగే ఐదు రోజులూ స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక వాహన సేవలు, గ్రామోత్సవం నిర్వహిస్తామన్నారు.

ఓట్ల కోసం ఓదార్పు వాయిదా

‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ’ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విజయనగరం జిల్లాలో నిర్వహిస్తున్న ఓదార్పు యాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారు. కడప లోక్‌సభ, పులివెందుల ఉప ఎన్నికల షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 6 వరకు జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహించాల్సి ఉంది.

27, మార్చి 2011, ఆదివారం

పార్టీ ప్రతిష్ట దిగజారిస్తే ఊరుకోను

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చేవిధంగా వ్యకిగత విమర్సలకు సైతం దిగుతున్న నేతలపై తీసుకు నెందుకు వెనుకాడ బోమని పీసిసి చీఫ్ డి.శ్రీనివాస్ స్పష్టం చేసారు. పీసీసీ అధ్యక్షునిగా మూడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా జరిగిన సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నవారిపై చర్యలు తీసుకోవడం పెద్దపనేమీ కాద ని ...ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో వుంచుకొని చర్య తీసుకోవడానికి సంకోచిస్తున్నామని అన్నారు.


2004లో ఉన్న ఐక్యత 2009 నాటికి పార్టీలో లేదని, ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో వై ఎస్ ఉన్నప్పుడే కన్పించిందని అన్నారు. ప్రస్తుతం అంతా ఐక్యంగా పనిచేయాల్సిన తరుణంలో పార్టీ నేతలు ఎవరిష్టమొచ్చినట్లు వాళ్లు ప్రకటనలివ్వడం భావ్యం కాదని .. దీని వల్ల ప్రజల్లో చులకన భావం కలుగుతుందని పీసీసీ అధ్యక్షుడు డీఎస్ అన్నారు. .

క్రమశిక్షణారాహిత్యానికి మారుపేరు జెసి

క్రమశిక్షణారాహిత్యానికి మారుపేరు జెసి అని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి జెసి దివాకర్ రెడ్డి విశ్వప్రయత్నం చేశారని ధర్మవరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఆరోపించారు.

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2009 ఎన్నికలలో అంతపురం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించడానికి జెసి తీవ్రం గా ప్రయత్నించారని.. ఈ విషయం అప్పట్లో వై ఎస్ దృష్టికి తీసుకు వెల్లినందునే మంత్రి వర్గంలోకి తీసుకోలేదన్నారు. మంత్రి రఘువీరా రెడ్డిపై పోటీ చేయడానికి తాను సిద్ధమని నిన్న జెసి విసిరిన సవాల్ కు వెంకటరామిరెడ్డి ప్రతిసవాల్ విసురుతూ మాజీ మంత్రి జెసి పై పోటీకి తాము సిద్దంగా ఉన్నామని .. ఆయన ఎ పార్టీ నుంచి పోటీకి దిగినా తాము గెలిచి తీరుతామన్న ధీమా వ్యక్తం చేరారు వెంకటరామిరెడ్డి.

వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ లోకి తెలంగాణా నాయకుడు?

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ వైపు కాంగ్రెస్ నాయకుల ఆసక్తి పెరుగుతున్నట్లుంది.తెలంగాణ లోని కొన్ని జిల్లాల నాయకులు కూడా జగన్ ను కలవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా నాయకుడు ఎ.ఇంద్రకిరణ్ రెడ్డి ఆదివారంనాడు జగన్ ను కలిశారు. ఇంద్రకిరణ్ రెడ్డి గతంలో జడ్ పి ఛైర్మన్ గా పని చేశారు. తదుపరి 1991లో టిడిపి తరపున లోక సభకు ఎన్నికై, పి.వి.నరసింహారావు ప్రభుత్వాన్ని రక్షించడం కోసం కాంగ్రెస్ వైపు వెళ్లారు. అప్పటి నుంచి కాంగ్రెస్ ఐ లోనే ఉంటున్నారు. తొలుత కోట్ల విజయభాస్కరరెడ్డి అనుచరుడిగా ఉన్న ఈయన తర్వాత కాలంలో రాజశేఖరరెడ్డి అనుచరుడిగా కొనసాగారు.

వేసవిలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు

వేసవిలో డయేరియా, మలేరియా, డెంగీ, చికున్‌గున్యా తదితర వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పి.వి.రమేష్ అధికారులను ఆదేశించారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నమోదయ్యే అన్ని రకాల జ్వరాల వివరాలనూ వారానికోసారి నివేదికలు ఇవ్వాలన్నారు. వీటి ఆధారంగా వ్యాధులు ప్రబలిన ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. పారిశుద్ధ్య నిధులతో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టేలా కలెక్టర్లు ఆయా శాఖల అధికారులకు ఆదేశించాలన్నారు. గిరిజన, మైదాన ప్రాంతాల్లో మూడు సార్లు మలాథిన్ స్ప్రే చేయించాలని, నీటి వనరుల పరిస్థితులపై శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. ఆశ కార్యకర్తలకు నిర్ధేశించిన ఏరియాలో ప్రతిరోజూ ఇంటింటి సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జ్వరం వచ్చిన ప్రతి రోగికీ క్లోరిఫిన్, ప్రైమిఫిన్ మాత్రలు మూడు రోజుల పాటు వేయించాలని చెప్పారు.

అమితాబ్, రేఖలే మర్గదర్శకులట

అందరూ మాజీ మిస్ ఇండియాల మాదిరిగానే ఈ మిస్సమ్మ కూడా చివరికి చిత్రసీమకు వచ్చేసింది. మిగతావారిలా హింగ్లిష్ (హిందీ, ఇంగ్లిష్ కలగలిసిన భాష) మాట్లాడకుండా స్వచ్ఛమైన హిందీ మాట్లాడాలన్నది ఈ అమ్మడు కోరిక. హిందీ నేర్చుకోవడానికి అమితాబ్, రేఖలే తనకు మార్గదర్శకురాలని మాజీ మిస్ ఇండియా వరల్డ్ సారా డయాస్ జేన్ చెబుతోంది. అభిషేక్ హీరోగా రూపొందుతున్న గేమ్ సినిమాతో ఈమె వెండితెరకు పరిచయమవుతోంది. ప్రతి డైలాగును స్పష్టంగా చెప్పడానికి చాలా కష్టపడుతోంది కూడా. ‘అమితాబ్, రేఖ సహజంగానే చక్కటి హిందీ మాట్లాడుతారు.

ఎంతో కష్టపడ్డారు కాబట్టే వాళ్లు నైపుణ్యం సాధించగలిగారు. చిన్నప్పటి నుంచి వీరిద్దరి సినిమా చూస్తూ డైలాగులను గమనిస్తున్నాను’ అని ఈ ముంబై భామ చెప్పింది.

మాస్, బూతు ఒకటి కాదు : భాస్కరభట్ల

ప్రస్తుతం సినిమాల్లో అశ్లీల పదాలు, ద్వంద్వార్థాలు బాగా తగ్గాయని సినీ గేయ రచయిత భాస్కర భట్ల రవికుమార్ అభిప్రాయపడ్డారు. 1980-90 దశకంలో విడుదలైన చిత్రాల్లో అధికంగా అశ్లీలం ధ్వనించేదన్నారు. అరుుతే 2000 సంవత్సరం నుంచి సెన్సార్ బోర్డు పటిష్టంగా పని చేస్తుండడంతో అలాంటి వాటికి తావులేకుండా పోయిందన్నారు.
మాస్ చిత్రాలకు ఆదరణ బాగా ఉందని, అయితే మాస్, బూతు సంభాషణలు ఒకటి కావని వివరించారు. సాహిత్యం సరిగా వినిపించకుండా సంగీతం మాత్రమే వినిపించే పాటలు ఎక్కువ కాలం మనగలగడం కష్టమని, రెండూ సమపాళ్లలో ఉన్న పాటలే కొంతకాలం గుర్తుంటున్నాయని అన్నారు.

పోకిరి చిత్రంలో ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..’ అనే పాట తనకు బాగా గుర్తింపు తెచ్చిందని, ఇందులో అశ్లీలత లేదని, ఆడవాళ్లు కూడా హాయిగా పాడుకుంటున్నారని అన్నారు. కొత్తగా ‘తీన్‌మార్’లో టైటిల్ సాంగ్‌ను, పబ్ సాంగ్‌ను రాశానని, ఆడియో హిట్ అయిందని చెప్పారు.

సీఎం,హోం మంత్రిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలా..? వద్దా..?

ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప, ఆయన కుటుంబసభ్యులు, రాష్ట్ర హోం మంత్రి ఆర్.అశోక్‌లపై లోకాయుక్త పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదుకు సిద్ధమయ్యారు. సోమవారం లేదా మంగళవారం ప్రథమ సమాచార నివేదికను నమోదు చేసే అవకాశాలున్నాయి. ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఆదేశాల మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి న్యాయ నిపుణులతో లోకాయుక్త పోలీసులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

లోకాయుక్త న్యాయ నిపుణుడు చంద్రశేఖర్ సెలవుపై మైసూరు వెళ్లినందున ఆయన వచ్చిన తరువాత చర్చించి సీఎం,హోం మంత్రిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలా..? వద్దా..? అనేది సోమవారం నిర్ణయిస్తామని లోకాయుక్త ఏడీజీపీ రూప్‌కుమార్ దత్తా తెలిపారు.

ఫైనల్ మ్యాచ్ రోజు ప్రత్యేక సెలవు

ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ తిలకించేందుకు ఏప్రిల్ రెండున ప్రత్యేక సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఫైనల్ మ్యాచ్ రోజు సెలవు దినంగా ప్రకటించాలన్న ప్రస్తావనపై తొందర్లోనే నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ దక్షిణ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఏప్రిల్ రెండున జరగనున్న విషయం విదితమే.

కాలయాపన కోసమే..కమిటీలు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్సే ప్రధాన శత్రువని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ రాష్ట్ర కో-కన్వీనర్ విమలక్క విమర్శించారు. ముంబై తెలంగాణ బహుజన ఫోరం (ఎంటీబీఎఫ్) కన్వీనర్లుతో తెలంగాణ విషయమై చర్చ అనంతరం ఆమె మాట్లాడుతూ... ఉద్యమాన్ని అణచివేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

డిసెంబర్ తొమ్మిది ప్రకటనను వెనక్కితీసుకున్న కేంద్ర మంత్రి చిదంబరం, రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీకృష్ణ కమిటీ నివేదికకు సహకరించారని, దీన్నిబట్టి తెలంగాణ రాష్టస్రాధనకు కాంగ్రెస్ పార్టే ప్రధాన శత్రువని దుయ్యబట్టారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ఇప్పటివరకు ఎటువంటి కమిటీలు పనిచేయలేదని చరిత్ర చెబుతోందన్నారు. ఇవి కేవలం కాలయాపన కోసమేనని చెప్పారు.

వికృత రాజకీయాలకు వేదికగా తమిళనాడు

తమిళనాట మక్కల్ శక్తి కట్చిగా ఆవిర్భవించిన లోక్‌సత్తా పార్టీ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టింది.
ఒకప్పుడు సంస్కృతి సంప్రదాయాలకు, సామాజిక ఉద్యమాలకు, ఆత్మగౌరవానికి మారుపేరు తమిళనాడు .. కొ న్నేళ్లుగా
తమిళనాడు వికృత రాజకీయాలకు వేదికగా మారిందని లోక్‌సత్తా పార్టీ జాతీయ కన్వీనర్, ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాట అధికారం కోసం తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకు అభ్యర్థులను రంగంలోకి దించామని అన్నారు. ఎన్నికల కమిషన్ పిరికితనానికి పరాకాష్టగా తమిళనాడులో ఉచిత పథకాలు ఉన్నాయని విమర్శించారు. ఉచితాల పై ఎన్నికల కమిషన్ మేలుకోని పక్షంలో ఆంధ్రప్రదేశ్‌లో ఓటు వేస్తే నెలకు ఐదు సీసాల మద్యం ఇస్తాం, స్కూటరిస్తాం.. అన్న వాగ్ధానాలు పుట్టుకొచ్చే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశా రు.

మొహాలీకి మన్మోహన్, గిలానీ

భారత ప్రధాని మన్మోహన్ క్రికెట్ దౌత్యం ఫలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మొహాలీలో ఈ నెల 30న జరిగే భారత్-పాక్ క్రికెట్ వరల్డ్‌కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ను తిలకించేందుకు రావాలని మన్మోహన్ పంపిన ఆహ్వానానికి ప్రధాని గిలానీ అంగీకరించవచ్చని సంకేతాలు వచ్చాయి. ఉజ్బెకిస్థాన్ పర్యటనలో ఉన్న గిలానీకి ఈ ఆహ్వానం గురించి అధికారులు తెలపగా ఆయన చిర్నవ్వు చిందించార ని సమాచారం. మొహాలీకి వెళ్లే అంశంపై ఆయన తమ అధికారులతో చర్చించారని పాక్ మీడియా కథనం.

చిరంజీవిని ఆహ్వానించి ఏం సాధించిందో ...

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు సీట్లు నెగ్గడం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సత్తాకు నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు.. ఎవరు ఎన్ని మాట్లాడినా జగన్ తన దైన శైలిలో ప్రజల్లోకి వెళ్తున్నారనే సంకేతాలు ఈ ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందన్నారు. ఎవరు ఎటువైపు ఉన్నారో తెలుసుకోలేకుండా కేంద్ర, రాష్ట్ర రాజకీయాలు గందరగోళంలో పడ్డాయన్నారు.. జగన్కి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నాయకత్వం చిరంజీవిని ఆహ్వానించి ఏం సాధించిందో అర్ధం కావడం లేదని ఆయన పేర్కొన్నారు.

గెలిచే అవకాశాలు జగన్‌కే : బొత్స

కడప ఉప ఎన్నికలో గెలిచే అవకాశాలు యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే ఉన్నాయని రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ లాబీలోని తన చాంబర్లో ఆయన మీడియాతో కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా కడప ఉప ఎన్నిక ఫలితాలెలా ఉంటాయని అడిగితే, ‘‘నాకు తెలిసినంతవరకు జగన్‌కే అనుకూలంగా ఉంటాయి. న్యాయంగా, సాంప్రదాయికంగా చూసినా ఆయనే గెలిచే అవకాశాలున్నాయి. అసలక్కడ నామినేషన్లు పడతాయనే నేను అనుకోవడం లేదు’’అని బదులిచ్చారు. నామినేషన్లు పడకపోవడమేంటి, కాంగ్రెస్ తరపున కూడా వేయరా ఏమని ప్రశ్నిస్తే, ‘‘నేనింతకంటే ఎక్కువ మాట్లాడను. మీరే ఆలోచించుకోండి’’ అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మూడు సీట్లు వచ్చాయంటున్నారు.

అసలేమీ లేని జగన్‌కు మూడు సీట్లు రావడం గురించి మాట్లాడరా? దీనంతటికీ కారణం మా పార్టీవాళ్లే. జగన్‌ను వాళ్లెవరూ ప్రత్యర్థిగా భావించకపోవడంవల్లే ఇలాంటి ఫలితాలొస్తున్నాయి. ఓవైపు జగన్ పార్టీ పెట్టి కాంగ్రెస్‌ను ఓడించేందుకు సిద్ధమవుతుంటే, మా వాళ్లేమో ఆయన మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తారని మాట్లాడుతున్నారు. జగన్‌ను ప్రత్యర్థిగా చూడలేక పోవడమనే బలహీనత. విజయనగరం జిల్లాలో జగన్ ఓదార్పు యాత్రకు జనం బాగానే వస్తారని..జగన్ పార్టీలోకి మా జిల్లా కాంగ్రెస్ నేతలెవరూ వెళ్లరు’’ అన్నారు.

25, మార్చి 2011, శుక్రవారం

సచిన్ కోసం వరల్డ్‌కప్ ట్రోఫీ ప్రతి రూపం

క్రికెట్ ప్రియుల ఆరాధ్యదైవమైన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కోసం బెంగుళూరులోని శ్రీసాయిగోల్డ్ ప్యాలెస్ నిర్వాహకులు టి.ఎ.శరవణ సుమారు 4.5 కిలోల బంగారు తాపడం చేసిన వరల్డ్‌కప్ ట్రోఫీ ప్రతి రూపాన్ని సిద్దం చేశారు. 4.5 కిలోల బరువున్న ఈ వెండి ట్రోఫీకి బంగారు తాపడం చేయడానికి 60 గ్రాముల బంగారాన్ని వినియోగించినట్లు తెలిపారు. దీంతోపాటు ఒక బాల్, బ్యాట్ కూడా తయారు చేసినట్లు..ఈ ట్రోఫీ, బాల్, బ్యాట్ తయారీకి రూ.5 లక్షలు వెచ్చించినట్లు టి.ఎ.శరవణ తెలిపారు.

ఉద్యమం పేరిట కేసీఆర్ చేస్తున్నదేమిటి?

తెలంగాణ ఉద్యమం పేరుతో రాజకీయ లబ్ది పొందుతూ ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నారని, ఉద్యమం పేరిట కేసీఆర్ చేస్తున్నదేమిటని తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ రఘునందన్‌ ప్రశ్నించారు. ఉద్యమ స్ఫూర్తితో స్థాపించిన టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా కేసీఆర్ మాట్లాడటం శోచనీయమని అన్నారు. ఎందరో విద్యార్థుల బలిదానాలు చేసి తెలంగాణ కోసం ఉద్యమాన్ని నిర్వహిస్తుంటే కేసీఆర్ తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కాంగ్రెస్‌తో పోతామనడం విడ్డూరంగా ఉందన్నారు.

పాన్‌ కార్డు పొందటం ...వివరాల అప్‌డేట్‌ చేయటం సులభమే

పాన్‌ కార్డు లేకుంటే ఇంతవరకు కొన్ని వ్యవహారాలు అందుబాటులోకి రాకుండా వున్నాయి. ఇక ముందు పాన్‌ కార్డు లేని వారిపై అధిక పన్నుల మోత కూడా వుంటుంది. పాన్‌ కార్డు లేని వారితో పాటు, తప్పుడు పాన్‌ నంబరు ఇచ్చే వారి వద్ద నుంచి పన్ను మినహాయింపు (టీడీఎస్‌)ను అధికంగా రాబట్టదలచినట్లు కేంద్రం కొత్త బడ్జెట్‌లో పేర్కొంది. ఇందుకు సంబంధించి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి నిబంధన వర్తించే విధంగా ఆదాయపు పన్ను చట్టంలో సవరణలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

ఇప్పటికే పలు రకాల వ్యవహారాలకు పాన్‌ను తప్పనిసరి చేశారు. ఆదాయపు పన్ను పరిథిలోకి రాని వారు వీటిని పొందక తప్పటం లేదు. పెట్టుబడి మార్కెట్‌లోని అన్ని రకాల లావాదేవీలకు పాన్‌ తప్పనిసరిగా వుండాలని ఇంతకు ముందే స్పష్టం చేశారు. ఇప్పుడు పాన్‌ లేకపోతే ఇక ఆయా వ్యక్తులపై భారాన్ని పెంచే చర్యలు చేపడతామని కేంద్రం కొత్త బడ్జెట్‌లో స్పష్టం చేసింది.

జీవితకాలం పాటు అమలులో వుండే పాన్‌ కార్డు ద్వారా వ్యక్తుల, సంస్థల ఆర్థిక లావాదేవీలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పన్ను ఎగవేతదారులను గుర్తించాలని ఆదాయపు పన్ను శాఖ భావిస్తోంది. అందుకే ఎన్నో రకాల ఆర్థిక లావాదేవీలకు దీన్ని విస్తరించుకొంటూ వెళుతోంది. రాష్ట్రంలో పాన్‌ కార్డు దరఖాస్తులను స్వీకరించేందుకు యుటీఐ, ఇతర సంస్థలతో ఆదాయపు పన్ను శాఖ పొత్తు కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈనాటి వరకు 45 లక్షల మందికి పాన్‌ కార్డులున్నట్లు తెలుస్తోంది.

ఒకరు ఒక పాన్‌ కార్డును మాత్రమే కలిగి వుండాలి. రెండో కార్డు వుంటే రూ. 10,000 వరకు జరిమానా విధించబడుతుంది. అయితే రాష్ట్రంలో దాదాపు 55,000 మంది వద్ద రెండు పాన్‌కార్డులు వున్నట్లు ఆదాయపు పన్ను (ఐటి) శాఖ గుర్తించి చాలా వాటిని రద్దు చేసింది. ఒకసారి కేటాయించిన పాన్‌లో ఇక మార్పులు చేయరు. కేవలం చిరునామాలో మార్పులను మాత్రమే నమోదు చేస్తారు. పాన్‌ను ఇవ్వటానికి గతంలో బాగా ఆలస్యం జరిగేది. ఇప్పుడు 15రోజుల వ్యవధిలోనే వస్తోంది. ఆన్‌లైన్‌ ద్వారా కూడా పాన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు అందజేశాక దాని పరిస్థితి ఏమిటనేది ఐటీ శాఖ వెబ్‌సైట్‌ సాయంతో తెలుసుకోవచ్చు.

తప్పనిసరి వేటికి?

ఏదైనా సంస్థ జీతాలు చెల్లించేటప్పుడు టీడీఎస్‌ను వసూలు చేసే వ్యక్తులకు సంబంధించిన పాన్‌ కార్డు నెంబరు తప్పనిసరి. ఐటీ రిటర్న్‌ దాఖలుకు, ఆ శాఖ అధికారితో జరిపే అన్ని రకాల ఉత్తర ప్రత్యుత్తరాలకు, అక్కడ చెల్లించే చలానాలకు పాన్‌ అవసరం వుంది.

వ్యాపారి వార్షిక టర్నోవర్‌ రూ. 5 లక్షలు దాటినప్పుడు, ఐటీ చట్టాలకింద పన్నులు, సుంకాలు చెల్లించే వారికి పాన్‌ అవసరం. కొనుగోలుదారుడైన వ్యాపారి నుంచి పన్నును వసూలు చేసేటప్పుడు అతని పాన్‌ను అమ్మకందారు పేర్కొనాలి. ఎగుమతిదారులు, దిగుమతిదారులు, పన్ను కట్టలేకపోయినా పాన్‌ వుండితీరాలి.

స్థిరాస్తి విలువ రూ.5లక్షలు దాటినప్పుడు వాటి కొనుగోలు, అమ్మకాలు, మోటారు వాహనాలు కొనుగోలు, హోటళ్లలో నగదు రూపేణా రూ. 25,000కు మించి చెల్లింపు, సెల్‌ఫోన్‌ సహా టెలీఫొన్‌ కనెక్షన్‌ పొందటానికి పాన్‌ అవసరం. బ్యాంకు, పోస్టాఫీసులో రూ.50,000కు మించిన డిపాజిట్లకు, ఫండ్లు సంబంధిత వ్యవహారాలకు, డీమ్యాట్‌ ఖాతా ప్రారంభించడానికి పాన్‌ కార్డు తప్పనిసరి.

పాన్‌ కార్డు వివరాల అప్‌డేట్‌ సులభమే

ఆదాయపు పన్ను శాఖ అధికారులు అందించే పర్మినెంట్‌ ఎకౌంట్‌ నెంబర్‌ (పాన్‌-శాశ్వత ఖాతా సంఖ్య) ఎంతో ముఖ్యమైన ప్రస్తుత తరుణంలో వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా చిరునామా మారిన పక్షంలో పాన్‌కార్డు వివరాల్లోని సమాచారం ఎంతో ఉపకరిస్తుంది. ఒకసారి పాన్‌కార్డు తీసుకునేటప్పుడు చూపే శ్రద్ధ తదుపరి వివరాలు అప్‌డేట్‌ చేయడంలో మనవారు ఎంతో వెనుకబడి వున్నారు. చాలా సులభమైన పద్ధతుల్లో ఇల్లు కదలకుండానే తాజా సమాచారాన్ని చేర్చే సదుపాయం ఇప్పుడు అందుబాటులో ఉంది.

నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌డిఎల్‌) ఆధ్వర్యంలో సేవలందిస్తున్న టాక్స్‌ ఇన్ఫర్మేషన్‌ నెట్‌వర్క్‌ (టిన్‌) అప్‌డేట్‌ సేవలందిస్తుంది. తాజా ఫొటోను చేర్చడం, చిరునామా, సంతకం మార్పు తదితర వివరాలను సులభంగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. పాన్‌ కార్డు మార్చుకుంటూ ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయవచ్చు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు

ఎన్‌ఎస్‌డిఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు పొంది పేరు, చిరునామా, తాజా ఫొటోగ్రాఫ్‌లను జత చేర్చి ఆన్‌లైన్‌లోనే సబ్‌మిట్‌ చేయడం ద్వారా 15 అంకెల యునీక్‌ నెంబర్‌ జనరేట్‌ అవుతుంది.

డిస్పాచ్‌ ద్వారా అయితే ఏఏ సమాచార మార్పు కోరుకుంటున్నారో ఆయా వివరాలను డాక్యుమెంట్లు సహా ఎన్‌ఎస్‌డిఎల్‌, థర్డ్‌ ఫ్లోర్‌, సఫైర్‌ చాంబర్స్‌, నియర్‌ బానెర్‌, పూనె - 411045, చిరునామాకు అకనాలెడ్జ్‌ సహా పంపాలి.

చెల్లింపుల పద్ధతి: మార్పులు కోరుకునే భారతీయులు 94 రూపాయలను, ఎన్‌ఆర్‌ఐలు 744 రూపాయలను ఆన్‌లైన్‌ ద్వారా లేదా ముంబాయిలో చెల్లుబాటయ్యే విధంగా డిడి, చెక్‌లనైనా పంపవచ్చు.

డెలివరీ అండ్‌ ట్రాకింగ్‌: కొత్త పాన్‌ కార్డు డెలివరీ పోస్టు ద్వారా అవుతుంది. ఈ బట్వాడా ఏ దశలో ఉందన్న విషయాన్ని ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

గుర్తుంచుకోవాల్సింది: ఆన్‌లైన్‌లో ముందుగా పాన్‌ కార్డుపై ఉన్న సమాచారాన్ని ఫీడ్‌ చేయాలి. ఆపై మార్పులు కోరుతున్న వివరాలు అందించాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసిన 15 రోజుల్లోగా ఆ సమాచారాన్ని సపోర్ట్‌ చేసే డాక్యుమెంట్లు ఎన్‌ఎస్‌డిఎల్‌ కార్యాలయానికి అందాలి.

పాన్‌ కార్డు పోయిన పక్షంలో కూడా ఇదే దరఖాస్తును వినియోగించి కొత్త కార్డు పొందవచ్చు.

పాన్‌ కార్డు పొందటం ...వివరాల అప్‌డేట్‌ చేయటం సులభమే

పాన్‌ కార్డు లేకుంటే ఇంతవరకు కొన్ని వ్యవహారాలు అందుబాటులోకి రాకుండా వున్నాయి. ఇక ముందు పాన్‌ కార్డు లేని వారిపై అధిక పన్నుల మోత కూడా వుంటుంది. పాన్‌ కార్డు లేని వారితో పాటు, తప్పుడు పాన్‌ నంబరు ఇచ్చే వారి వద్ద నుంచి పన్ను మినహాయింపు (టీడీఎస్‌)ను అధికంగా రాబట్టదలచినట్లు కేంద్రం కొత్త బడ్జెట్‌లో పేర్కొంది. ఇందుకు సంబంధించి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి నిబంధన వర్తించే విధంగా ఆదాయపు పన్ను చట్టంలో సవరణలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

ఇప్పటికే పలు రకాల వ్యవహారాలకు పాన్‌ను తప్పనిసరి చేశారు. ఆదాయపు పన్ను పరిథిలోకి రాని వారు వీటిని పొందక తప్పటం లేదు. పెట్టుబడి మార్కెట్‌లోని అన్ని రకాల లావాదేవీలకు పాన్‌ తప్పనిసరిగా వుండాలని ఇంతకు ముందే స్పష్టం చేశారు. ఇప్పుడు పాన్‌ లేకపోతే ఇక ఆయా వ్యక్తులపై భారాన్ని పెంచే చర్యలు చేపడతామని కేంద్రం కొత్త బడ్జెట్‌లో స్పష్టం చేసింది.

జీవితకాలం పాటు అమలులో వుండే పాన్‌ కార్డు ద్వారా వ్యక్తుల, సంస్థల ఆర్థిక లావాదేవీలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పన్ను ఎగవేతదారులను గుర్తించాలని ఆదాయపు పన్ను శాఖ భావిస్తోంది. అందుకే ఎన్నో రకాల ఆర్థిక లావాదేవీలకు దీన్ని విస్తరించుకొంటూ వెళుతోంది. రాష్ట్రంలో పాన్‌ కార్డు దరఖాస్తులను స్వీకరించేందుకు యుటీఐ, ఇతర సంస్థలతో ఆదాయపు పన్ను శాఖ పొత్తు కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈనాటి వరకు 45 లక్షల మందికి పాన్‌ కార్డులున్నట్లు తెలుస్తోంది.

ఒకరు ఒక పాన్‌ కార్డును మాత్రమే కలిగి వుండాలి. రెండో కార్డు వుంటే రూ. 10,000 వరకు జరిమానా విధించబడుతుంది. అయితే రాష్ట్రంలో దాదాపు 55,000 మంది వద్ద రెండు పాన్‌కార్డులు వున్నట్లు ఆదాయపు పన్ను (ఐటి) శాఖ గుర్తించి చాలా వాటిని రద్దు చేసింది. ఒకసారి కేటాయించిన పాన్‌లో ఇక మార్పులు చేయరు. కేవలం చిరునామాలో మార్పులను మాత్రమే నమోదు చేస్తారు. పాన్‌ను ఇవ్వటానికి గతంలో బాగా ఆలస్యం జరిగేది. ఇప్పుడు 15రోజుల వ్యవధిలోనే వస్తోంది. ఆన్‌లైన్‌ ద్వారా కూడా పాన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు అందజేశాక దాని పరిస్థితి ఏమిటనేది ఐటీ శాఖ వెబ్‌సైట్‌ సాయంతో తెలుసుకోవచ్చు.

తప్పనిసరి వేటికి?

ఏదైనా సంస్థ జీతాలు చెల్లించేటప్పుడు టీడీఎస్‌ను వసూలు చేసే వ్యక్తులకు సంబంధించిన పాన్‌ కార్డు నెంబరు తప్పనిసరి. ఐటీ రిటర్న్‌ దాఖలుకు, ఆ శాఖ అధికారితో జరిపే అన్ని రకాల ఉత్తర ప్రత్యుత్తరాలకు, అక్కడ చెల్లించే చలానాలకు పాన్‌ అవసరం వుంది.

వ్యాపారి వార్షిక టర్నోవర్‌ రూ. 5 లక్షలు దాటినప్పుడు, ఐటీ చట్టాలకింద పన్నులు, సుంకాలు చెల్లించే వారికి పాన్‌ అవసరం. కొనుగోలుదారుడైన వ్యాపారి నుంచి పన్నును వసూలు చేసేటప్పుడు అతని పాన్‌ను అమ్మకందారు పేర్కొనాలి. ఎగుమతిదారులు, దిగుమతిదారులు, పన్ను కట్టలేకపోయినా పాన్‌ వుండితీరాలి.

స్థిరాస్తి విలువ రూ.5లక్షలు దాటినప్పుడు వాటి కొనుగోలు, అమ్మకాలు, మోటారు వాహనాలు కొనుగోలు, హోటళ్లలో నగదు రూపేణా రూ. 25,000కు మించి చెల్లింపు, సెల్‌ఫోన్‌ సహా టెలీఫొన్‌ కనెక్షన్‌ పొందటానికి పాన్‌ అవసరం. బ్యాంకు, పోస్టాఫీసులో రూ.50,000కు మించిన డిపాజిట్లకు, ఫండ్లు సంబంధిత వ్యవహారాలకు, డీమ్యాట్‌ ఖాతా ప్రారంభించడానికి పాన్‌ కార్డు తప్పనిసరి.

పాన్‌ కార్డు వివరాల అప్‌డేట్‌ సులభమే

ఆదాయపు పన్ను శాఖ అధికారులు అందించే పర్మినెంట్‌ ఎకౌంట్‌ నెంబర్‌ (పాన్‌-శాశ్వత ఖాతా సంఖ్య) ఎంతో ముఖ్యమైన ప్రస్తుత తరుణంలో వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా చిరునామా మారిన పక్షంలో పాన్‌కార్డు వివరాల్లోని సమాచారం ఎంతో ఉపకరిస్తుంది. ఒకసారి పాన్‌కార్డు తీసుకునేటప్పుడు చూపే శ్రద్ధ తదుపరి వివరాలు అప్‌డేట్‌ చేయడంలో మనవారు ఎంతో వెనుకబడి వున్నారు. చాలా సులభమైన పద్ధతుల్లో ఇల్లు కదలకుండానే తాజా సమాచారాన్ని చేర్చే సదుపాయం ఇప్పుడు అందుబాటులో ఉంది.

నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌డిఎల్‌) ఆధ్వర్యంలో సేవలందిస్తున్న టాక్స్‌ ఇన్ఫర్మేషన్‌ నెట్‌వర్క్‌ (టిన్‌) అప్‌డేట్‌ సేవలందిస్తుంది. తాజా ఫొటోను చేర్చడం, చిరునామా, సంతకం మార్పు తదితర వివరాలను సులభంగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. పాన్‌ కార్డు మార్చుకుంటూ ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయవచ్చు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు

ఎన్‌ఎస్‌డిఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు పొంది పేరు, చిరునామా, తాజా ఫొటోగ్రాఫ్‌లను జత చేర్చి ఆన్‌లైన్‌లోనే సబ్‌మిట్‌ చేయడం ద్వారా 15 అంకెల యునీక్‌ నెంబర్‌ జనరేట్‌ అవుతుంది.

డిస్పాచ్‌ ద్వారా అయితే ఏఏ సమాచార మార్పు కోరుకుంటున్నారో ఆయా వివరాలను డాక్యుమెంట్లు సహా ఎన్‌ఎస్‌డిఎల్‌, థర్డ్‌ ఫ్లోర్‌, సఫైర్‌ చాంబర్స్‌, నియర్‌ బానెర్‌, పూనె - 411045, చిరునామాకు అకనాలెడ్జ్‌ సహా పంపాలి.

చెల్లింపుల పద్ధతి: మార్పులు కోరుకునే భారతీయులు 94 రూపాయలను, ఎన్‌ఆర్‌ఐలు 744 రూపాయలను ఆన్‌లైన్‌ ద్వారా లేదా ముంబాయిలో చెల్లుబాటయ్యే విధంగా డిడి, చెక్‌లనైనా పంపవచ్చు.

డెలివరీ అండ్‌ ట్రాకింగ్‌: కొత్త పాన్‌ కార్డు డెలివరీ పోస్టు ద్వారా అవుతుంది. ఈ బట్వాడా ఏ దశలో ఉందన్న విషయాన్ని ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

గుర్తుంచుకోవాల్సింది: ఆన్‌లైన్‌లో ముందుగా పాన్‌ కార్డుపై ఉన్న సమాచారాన్ని ఫీడ్‌ చేయాలి. ఆపై మార్పులు కోరుతున్న వివరాలు అందించాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసిన 15 రోజుల్లోగా ఆ సమాచారాన్ని సపోర్ట్‌ చేసే డాక్యుమెంట్లు ఎన్‌ఎస్‌డిఎల్‌ కార్యాలయానికి అందాలి.

పాన్‌ కార్డు పోయిన పక్షంలో కూడా ఇదే దరఖాస్తును వినియోగించి కొత్త కార్డు పొందవచ్చు.

టేలర్‌ అందగత్తా...నాన్‌సెన్స్‌!

హరిలాల్‌కు గాంధీగారంటే ఎనలేని అభిమానం. ఒకసారి లోహియాను గాంధీగారి వద్దకు తీసుకువెళ్ళాడు. ఆ తరువాత ఒకటికి రెండుసార్లు గాంధీగారిని కలిసే అవకాశం లోహియాకు కలిగింది. బాపూతో సాహచర్యం లోహియాకు ఒక కొత్త ఊపునిచ్చింది. స్వరాజ్య ఉద్యమం పట్ల అభిమానం ముమ్మరమైంది. గాంధీకి ఉన్న ఆధ్యాత్మిక ధోరణి, నిగ్రహ శక్తి చూసి లోహియా ఎంతగానో ఆకర్షితుడయ్యాడు. గాంధీ అడుగుజాడలలో నడిచే లోహియా తన పదవయేటనే సత్యాగ్రహ ఉద్యమంలో కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగాడు. 1921లో జవహర్లాల్‌ నెహ్రూతో లోహియాకు పరిచయమైంది. ఆ తరువాత కాలంలో ఆయనతో గాఢమైన స్నేహానుబంధం ఏర్పడింది. అయినా నెహ్రూతో రాజకీయంగా ఎప్పటికపðడు విభేదించే వాడు. ఆయన రాజకీయ ఆలోచనలు నచ్చేవి కావు. అందుకని కీలకమైన ఏ అంశంపైనైనా నెహ్రూను తూర్పారబట్టేందుకు వెనకాడేవాడు కాడు. సైమన్‌ కమిషన్‌ గోబ్యాక అంటూ నినదించి ఉద్యమాన్ని నడిపించాడు. స్వతంత్ర పోరాటాలలో ఇలా తలమునక లుగా ఉంటూనే ఇంటర్మీడియెట్‌, మెట్రిక్యులేషన్‌లలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై తన చదువులలో తన సత్తా చాటుకున్నాడు. 1929లో జర్మనీ వెళ్ళాడు. అక్కడి జాతీయ అసెంబ్లీలో మన దేశ ప్రతినిథిగా బికనూర్‌ రాజా ఉండేవాడు. తెల్లదొరల తొత్తుగా ఉన్న ఆయన నిర్వాహకాన్ని నిరసిస్తూ మన దేశానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపుతూ విజటర్స్‌ గ్యాలరీ నుంచే నినాదాలు చేశాడు. అక్కడి భారతీయులు ఒక సంఘంగా ఏర్పడేందుకు సాయం చేసి ఆ సంఘానికి కార్యదర్శిగా వ్యవహరించాడు. గాంధీగారి ఉపðసత్యా గ్రహం పై పరిశోధన చేసి పిహెచ్‌డి తీసుకున్నాడు. ఈ ప్రయత్నం సాక్షిగా ఆయన గాంధీగారి సామాజిక ఆర్థిక కోణాలను విపులంగా చర్చించి దేశ విదేశాలలో పెద్దయెత్తున చర్చకు దారి తీశాడు.

స్వదేశానికి తిరిగి వచ్చాక సోషలిజం వైపు మొగ్గుచూపి 1934లో సోషలిస్టు కాంగ్రెస్‌ పార్టీని ఏర్పాటు చేశాడు. 1936లో ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీకి ఎన్నికయ్యాక విదేశీ వ్యవహారాల కమిటీని ప్రారంభించాడు. నెహ్రూ ఈ కమిటీకి తొలి కార్యదర్శిగా నియమించాడు. అనేక సవాళ్ళకు తట్టుకుని బలంగా నిలిచిన మన విదేశాంగ విధానానికి శ్రీకారం చుట్టింది లోహియానే! సత్యాగ్రహించండి అంటూ గాంధీగారు నడిపే హరిజన్‌ పత్రికలో వారం రోజుల ధారావాహిక వ్యాసపరంపర రాశాడు.

దీన్ని తపðగా నిర్ణయించి తెల్ల మెజిస్ట్రేట్‌ రెండేళ్ళ జైలు శిక్ష విధించినా లోహియా గురించి వ్యాఖ్యానిస్తూ 'లోహియా టాప్‌క్లాస్‌ మేధావి. సంస్కారవంతుడు. స్వేచ్చా మయ భావాలున్నవాడు. గొప్ప నైతిక విలువలున్నవాడు' అని కీర్తించాడు. గాంధీగారు కూడా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో మాట్లాడుతూ లోహియా జైలులో ఉన్నంత కాలం నా మానాన నేను ఉండలేను.

ఆయన కన్నా సాహసవంతుడు, ఆయన కన్నా నిరాడంబరుడు మరొకడు ఇంత వరకు నా కంట పడలేదు. ఆయన ఎన్నడూ హింసావాదాన్ని రెచ్చగొట్టలేదు. ఆయన చేసిన పనులన్నీ ఆయన గౌరవ మర్యాదలను పెంచాయి' అన్నారు. లోహియాను జైలర్లు మానసికంగా, శారీరకంగా ఎంతగానో హింసించేవారు. వలస పాలకుల దాష్టీకం పోవాలంటే రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యం పోయి దేశాలు విముక్తం కావాలి. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా దేశాలలో స్వేచ్ఛ అవసరం ఎంతైనా ఉంది. ఈ దేశంలో రాష్ట్రాలు సర్వ సౌభాగ్యాలతో తులతూగాలి. పోలీసుల అవసరం రాకుండా జనజీవితం హాయిగా సాగిపోవాలి అని లోహియా మనసా కోరుకున్నాడు.

-డాక్టర్‌ వంగల రామకృష్ణ

బ్యాంకాక్‌లో 'నాకూ ఓ లవరుంది'


కృష్ణుడు తాజా చిత్రం 'నాకూ ఓ లవరుంది'. శ్రీ శివపార్వతి కంబైన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజన షూటింగ్‌ ప్రారంభించారు. అప్పటి నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగు తోంది. కృష్ణుడు, రితిక, అలీ, ఎమ్మెస్‌.నారాయణ తదితరులపై కొన్ని ముఖ్య సన్నివేశాలు. రెండు పాటలు చిత్రీకరించడం జరిగిందని నిర్మాత కె.సురేష్‌బాబు తెలిపారు

ఐదుగురు హీరోల 'శ్రీ జగద్గురు ఆదిశంకర'


'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'శ్రీమంజునాథ' చిత్రాల రచయిత జె.కె.భారవి స్వీయ దర్శకత్వంలో నిర్మించే 'శ్రీ జగద్గురు ఆదిశంకర' చిత్రం షూటింగ్‌ ఉగాది పర్వదినాన మొదలవుతుంది. గ్లోబల్‌ పీస్‌ క్రియేటర్స్‌ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం వివరాలను గురువారం ఫిలిం చాంబర్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో జె.కె.భారవి వెల్లడించారు. 'శంకరాచార్య జీవితత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సినిమా టైటిల్‌కు 'ఎ ఫిల్మ్‌ ఫర్‌ యూత్‌' అనే ఉపశీర్షిక ఉంటుంది. నేటితరానికి సనాతన ధర్మం గురించి తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 32 ఏళ్లకే తనువుచాలించిన శంకరాచార్య రాసినన్ని రచనలు మరెవరూ రాయలేదు. నాలుగు సార్లు కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశారు. ఈ చరిత్ర అంతా యువతరానికి కౌన్సిలింగ్‌లాగా ఉపయోగపడుతుంది ' అని భారవి పేర్కొన్నారు. 'ఈ చిత్రం గురించి చాలామంది స్వాములకు చెప్పడం జరిగింది. వారంతా బావుందని అభినందించారు. కథ గురించి, పాటల గురించి విన్న తారలు, సాంకేతిక నిపుణులు స్పందించారు. ఇప్పటికి ఐదుగురు హీరోలు నటించడానికి అంగీకరించారు. ఇతర తారల వివరాలు, సాంకేతికనిపుణుల గురించి ఉగాది రోజన వెల్లడిస్తాం. ఇందులో 16 పాటలున్నాయి. ప్రముఖ నేపథ్యగాయనీగాయకులు శంకర్‌మహదేవన్‌, హరిహరన్‌, మధుబాలకృష్ణ, మను, కార్తీక్‌, ఉన్నికృష్ణన్‌, రంజిత, శ్రీరామచంద్ర తదితరులు ఆలపించారు. బాలుగారు పాడాల్సిన పాట కూడా ఉంది. ఈ చిత్రం ద్వారా నాగ్‌శ్రీవత్స సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు' అని భారవి వివరించారు.

ప్రేమకావాలి సెన్సార్ కట్స్

మాక్స్‌ ఇండియా ప్రొడక్షన్‌ నిర్మించిన 'ప్రేమకావాలి' చిత్రం ద్వారా ఆది, ఇషా చావ్లా హీరో హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. బ్రహ్మానందం, దేవగిల్‌, సింధుతులాని, నాగబాబు, జయసుధ ముఖ్య తారాగణం.

ఛాయా గ్రహణం ఛోటా కె నాయుడు, సంగీతం అనూస్‌ రూబెన్స్‌, కూర్పు గౌతంరాజు నిర్వహించిన ఈ చిత్రానికి కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం కె. విజయ భాస్కర్‌ సమకూర్చారు. నిర్మాత కె. అచ్చిరెడ్డి.

అయిదుగురు సభ్యులతో కూడిన ఇసి ఈ చిత్రాన్ని చూసి ఏ విధమైన కట్స్‌ లేకుండా 'యూఎ' సర్టిఫికెట్‌ని 21-2-2011న జారీచేసింది.

16 రీళ్ల నిడివిగల 'ప్రేమకావాలి' చిత్రం 25-2-2011న విడుదలయింది.

కుదిరితే కప్పుకాఫీ సెన్సార్ కట్స్

కుదిరితే కప్పుకాఫీ చిత్రాన్ని శివా ప్రొడక్షన్స్‌, మూన్‌ వాటర్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. రమణ సాల్వ తొలిసారి దర్శకత్వం వహించి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే కూడా సమకూర్చారు. యోగీశ్వర శర్మ సంగీతాన్ని, సంతోష్‌రాయ్‌ ఛాయాగ్రహణాన్ని నిర్వహించారు. ఈ చిత్రానికి నిర్మాతలు శివ, మహి. వరుణ్‌ సందేశ్‌, సుమ భట్టాచార్య, తనికెళ్ళ భరణి, భీమనేని శ్రీనివాసరావు, శివనారాయణ, సుకుమారి ముఖ్య పాత్రధారులు.

అయిదుగురు సభ్యులతో కూడిన ఇసి 'కుదిరితే కప్పు కాఫీ'ని చూసి ఏ విధమైన కట్స్‌ లేకుండా 'యు' సర్టిఫికెట్‌ని 21-2-2011న జారీ చేసింది.

14 రీళ్ళ నిడివిగల ఈ చిత్రం 25-2-11న విడుదల అయింది.

సోనియా ఇంటి ముందు ధర్నా చేస్తాం

మరో తెలుగుదేశం శాసనసభ్యుడు దేవినేని ఉమ మాట్లాడుతూ, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలుగు ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటోందని, కేంద్రం రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయమే తీసుకుంటే సోనియాగాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.

శ్రీకృష్ణ నివేదికను స్వాగతిస్తున్నాం ...

శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ, ఈ 8వ అధ్యాయంలో తెలంగాణ, సీమాంధ్రలు కలిసి ఉండడం మినహా మరో మార్గం లేదని స్పష్టం చేసిందని, ఇది హర్షణీయమన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం మినహా కేంద్ర ప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయమే లేదన్నారు. ఈ నివేదికలోని కొన్ని అంశాలు మాత్రమే బయటకు వచ్చాయని, అన్ని అంశాలు బయటకు వస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయంలో పొందుపరిచిన అంశాలను తాము స్వాగతిస్తున్నామని,..8వ అధ్యాయాన్ని సంపూర్ణంగా బహిర్గత పరచాలని ఆయన సూచించారు.

శ్రీకృష్ణ కమిటీ దిష్టి బొమ్మల దగ్ధం

పలువురు తెలంగాణా ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాజకీయ జెఎసి పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా శ్రీకృష్ణ కమిటీ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు.

శ్రీకృష్ణ కమిటీ సభ్యులు శిక్షార్హులు

శ్రీకృష్ణ కమిటీ అంటే తమకు గౌరవం ఉందని, నివేదికలో తెలంగాణ అంటేనే నక్సలైట్లనే భావనను తీసుకురావడం సిగ్గుచేటన్నారు. కచ్చితంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేదిగా ఈ నివేదిక ఉందంటూ మండిపడ్డారు భారతీయ జనతాపార్టీ సీనియర్‌ నాయకుడు సి.హెచ్‌. విద్యాసాగర్‌రావు, ఈ కమిటీ నివేదికపై సామాన్యులకు అసహయం కలుగుతోందన్నారు. కమిటీ తన పరిధి దాటి చెప్పకూడని విషయాలను రహస్య నివేదికలో చేర్చి తెలంగాణను వ్యతిరేకించడం అప్రజాస్వామికం అన్నారు. అణచివేసేందుకు సూచనలు చేయడం దుర్మార్గమన్నారు. తెలంగాణ ప్రజల అవస్తలను, ఆత్మబలిదానాలను కనీసం చూపించకపోవడం తెలంగాణ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉందన్నారు. శ్రీకృష్ణ కమిటీ సభ్యులు శిక్షార్హులని ఆయన పేర్కొన్నారు.

'దొంగల ముఠా'గా..శ్రీకృష్ణ కమిటీ...

'దొంగల ముఠా'గా..శ్రీకృష్ణ కమిటీపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్‌ ఎంపి పొన్నం ప్రభాకర్‌ . శ్రీకృష్ణ కమిటీపై తెలంగాణ ప్రజల్లో నమ్మకం లేదని, ఐదో, పదో పైసల వంతు గౌరవం ఉండేదని, ఇప్పుడు శ్రీకృష్ణ 8వ అధ్యాయం ద్వారా ఆ గౌరవం కూడా పోయిందన్నారు. సీమాంధ్ర నాయకులు ఎవరిని ఎలా మేనేజ్‌ చేయాలో ప్రపంచానికి తెలియజేశారని, వారి కుటిల బుద్ధికి ఇదొక నిదర్శనంగా ఆయన అభివర్ణించారు. ఇంత అన్యాయంగా ఉద్యమాన్ని ఎలా మేనేజ్‌ చేయాలి, పత్రికలను ఎలా మేనేజ్‌ చేయాలి అనే విషయాలను సూచించి, మీడియాపై ఉన్న గౌరవాన్ని తగ్గించేదిగా ఉందంటూ ధ్వజమెత్తారు. విద్యలో, నీటి పారుదలలో, ఉద్యోగాలలో తెలంగాణాకు ఎంత అన్యాయం జరిగిందో కమిటీ ప్రస్తావించకపోవడం సిగ్గుచేటని, ఇది కేవలం సీమాంధ్రుల కన్సల్టెంట్‌ ఏజెన్సీగా వ్యవహరించినట్లుగా కమిటీ నివేదిక ఉండడం దౌర్భాగ్యమన్నారు

లగడపాటి ఎంత మొనగాడో ...

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేదిగా ఉన్న కమిటీ నివేదికలోని 8వ అధ్యాయం ఉందని, కమిటీ సీమాంధ్రులకు అమ్ముడుపోవడమే కారణమని సీనియర్‌ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి , ఆరోపించారు. కమిటీ సభ్యులను ప్రాసిక్యూట్‌ చేసి తప్పుడు నివేదిక ఇచ్చినందుకు కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి కమిటీని నియమిస్తే తెలంగాణలో జరిగిన ఆత్మ బలిదానాలపై కనీసం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

లగడపాటి రాజగోపాల్‌ రహస్యంగా ఇచ్చిన నివేదిక, శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయంలోని నివేదిక ఒక్కటే. అయితే లగడపాటి ఎంత మొనగాడో అర్థమవుతోందన్నారు. ఈ నివేదిక రూపొందించడంలో జరిగిన అవినీతిపై న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వం సక్రమంగా గమనిస్తే వీరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించే అవకాశం ఉంటుందని, వీలైతే వీరికి ఉరిశిక్ష వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

'ఆంధ్ర కసబ్‌' రాజగోపాల్‌

తెలుగుదేశం శాసన సభ్యుడు రేవంత్‌రెడ్డి, రాజగోపాల్‌ను 'ఆంధ్ర కసబ్‌'గా అభివర్ణించారు. ఆయన రాసిచ్చిన అంశాన్నే శ్రీకృష్ణ కమిటీకి ప్రభుత్వానికి ఇచ్చిందని ఆరోపించారు. ఈ 8వ అధ్యాయం తెలంగాణ ప్రజలను అగౌరపరిచేలా ఉందని, ఇందుకు బాధ్యుడైన జస్టిస్‌ శ్రీకృష్ణకు ఉరిశిక్ష వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. శ్రీకృష్ణ కమిటీకి అనువాదకులు సీమాంధ్రవాదులేనని, ఈ పరిస్థితుల్లో తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటీ సీమాంధ్ర పెట్టుబడిదారులు ఇచ్చిన కాసుల మూటలకు లొంగిపోయారని తెలంగాణ ప్రజలు ఆ మూటలు ఇవ్వలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకృష్ణను న్యాయమూర్తిగా పోల్చడం విచారకరమని కమిటీ నివేదిక న్యాయబద్ధంగా లేదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

చర్చలు జరపడం శుద్ధ దండగ

తెలంగాణ ప్రజల ఆత్మహత్యలపై, ఉద్యమాలపై ఎక్కడా ప్రస్తావించకపోవడం విడ్డూరమని, ఈ కమిటీ నివేదికపై అఖిలపక్షాలు ఏర్పాటు చేయడం, చర్చలు జరపడం శుద్ధ దండగని, వెంటనే పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ సారథ్య బృంద కో నిర్వాహకుడు జి.నిరంజన్‌ డిమాండ్‌ చేశారు. అందరిని మేనేజ్‌ చేయడంలో సీమాంధ్ర నాయకులు, పెట్టుబడిదారులు ఎంత సిద్ధహస్తులో దీంతో రుజువైందన్నారు. ఈ కమిటీని వదిలిపెట్టమని కమిటీ చైర్మన్‌తో సహా సభ్యులకు శిక్ష పడేంత వరకు న్యాయపోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను కమిటీ సభ్యులు నిర్లజ్జగా మోసగించారని ఆరోపించారు.

శ్రీకృష్ణ శకుని పాత్ర

శ్రీకృష్ణ కమిటీ నివేదిక న్యాయ వ్యవస్థపై విశ్వాసం కోల్పేయే విధంగా ఉందన్నారు హరీష్‌రావు. శ్రీకృష్ణుని పాత్ర పోషిస్తాడనుకున్న జస్టిస్‌ శ్రీకృష్ణ శకుని పాత్ర పోషించాడని కమిటీ తన రక్తదాహాన్ని చూపించిందన్నారు. శ్రీకృష్ణ కమిటీ సీమాంధ్ర నేతలకు అమ్ముడుపోయి వారు చెప్పిందే నివేదికలో పొందుపరిచారని ఆయన ఆరోపించారు. వీరి నిర్వాకం వల్ల కమిటీలపై ప్రజల్లో విశ్వసనీయత తగ్గి, ప్రజాస్వామ్యంపై విలువ కోల్పోయేదిగా ఉందన్నారు. లగడపాటి రాజగోపాల్‌ గతంలో చేసిన వ్యాఖ్యలు ఈ కమిటీ నివేదికలో ఉండడం గమనించాల్సిన విషయమన్నారు.

'8వ అధ్యాయం'పై నీరు-నిప్పు

రాష్ట్రంలోని పరిస్థితులను అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసిన శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయం మాత్రం రహస్యంగా ఉంచింది. ఈ రహస్య నివేదికపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కొన్ని అంశాలు వెల్లడయ్యాయి. దీంతో ఈ 8వ అధ్యాయం కలకలం రేపుతోంది. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకే ఈ విధంగా పరిధులు దాటి నివేదికలో కొన్ని అంశాలను పొందుపర్చిందంటూ తెలంగాణ వాదులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయగా, సమైక్యవాదులు శ్రీకృష్ణ కమిటీ నివేదిక రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఉందంటూ పలువురు నాయకులు స్వాగతిస్తున్నారు.

రహస్యంగా ప్రభుత్వానికి అందజేసిన శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయం రాష్ట్ర హైకోర్టు తీర్పు వల్ల కొంతమేర బయటపడింది. ఈ బయటపడిన అంశాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జరిగే పరిణామాలు, ఇబ్బందులకు గురిచేస్తాయని నక్సలిజం వ్యాప్తి చెందడంతో పాటు, మత ఘర్షణలు కూడా జరిగే అవకాశం ఉంటుందని నివేదికలో శ్రీకృష్ణ కమిటీ స్పష్టం చేసింది. తెలంగాణ ఉద్యమాన్ని నియంత్రించేందుకు తీసుకోవలసిన చర్యలపై కూడా కమిటీ కొన్ని సలహాలు సూచించింది. ఈ విషయాలన్నీ తెలంగాణాకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీల సభ్యులే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి మరొక అడుగు ముందుకేసి తీవ్రమైన ఆరోపణలు గుప్పించింది.

జగన్‌ అక్రమ ఆస్తులపై విచారణ జరిపించాలి

తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకునే వేలకోట్ల రూపాయల అక్రమ ఆస్తులు సంపాదించిన కడప మాజీ ఎంపీ వై.ఎస్‌.జగన్‌ ముఖ్యమంత్రి అయితే ఏకంగా రాష్ట్రాన్నే అమ్మేయడం ఖాయమని రాష్ట్రానికి చెందిన సీనియర్‌ కాం గ్రెస్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆరోపించారు. సొం త పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని ఉవ్విళ్లూరుతున్న జగన్‌ కూడబెట్టిన అక్రమ ఆస్తులపై విచారణ జరిపించాలని ఆయన గురువారంనాడిక్కడ ఏర్పాటు చేసిన పత్రికా గోష్ఠిలో డిమాండ్‌ చేశారు. దివంగత నేత వైఎస్‌ అధికారంలో ఉండగా దానిని అడ్డుపెట్టుకుని జగన్‌ రాష్ట్రాన్ని దోచుకొన్నట్లు ఈమధ్య కాలంలో వెలుగులోకి వస్తున్న అనేక విషయాలతో స్పష్టమౌతోందని ఆయన చెప్పారు. ప్రస్తుతం జగన్‌ వద్ద ఉన్నంత డబ్బు దేశంలోని ఏ ముఖ్యమంత్రి వద్ద కూడా లేదని, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న జగన్‌ తన విశ్వసనీయతను పెంచుకోవాలంటే కేవలం ఆరేళ్ల వ్యవధిలో ఇన్ని వేలకోట్ల ఆస్తులు ఎలా సమకూరాయో వెల్లడించాలని ఆయన డిమాండ్‌ చేశారు. జగన్‌ ఆస్తులపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని కోరినట్లు హనుమంతరావు వెల్లడించారు.

అయితే, వైఎస్‌ హయాంలోనే విపరీతమైన అవినీతి చోటుచేసుకున్నట్లు ప్రతిపక్ష తెలుగు దేశం చేసిన ఆరోపణలపై కాంగ్రెస్‌ పార్టీ గత ఆరేళ్లుగా ఎందుకు నోరుమెదపలేదన్న ప్రశ్నలకు సమాధానంగా ఆనాడు ప్రతిపక్షం కావాలనే కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిపై బురద జల్లుతున్నదనే అభిప్రాయం ఉండేదని, అయితే, ఆ తర్వాత వెలుగులోకి వస్తున్న అనేక కుంభకోణాలు, అవకతవకలను చూసిన తర్వాత తండ్రి అధికారంలో ఉండడాన్ని జగన్‌ అడ్వాంటేజ్‌గా తీసుకొన్నారని రుజువౌతున్నదని వివరించారు.

కృష్ణ... కృష్ణా...నిందలెందుకు?

అర్ధ శతాబ్దానికి పైగా వివిధ రూపాల్ని సంతరించుకున్న తెలంగాణ ఉద్యమం రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కూడా కాలరాచే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర విభజనాంశాలపై అధ్యయనం చేసి సిఫార్సులిచ్చే నిమిత్తం కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ సభ్యుల భావప్రకటనా స్వేచ్ఛను కూడా తప్పుబడుతోంది. కమిటీ సభ్యులు తమకనుకూలంగా సిఫార్సులివ్వలేదని, తమ మనోభావాల్ని గౌరవించలేదని, వారందరినీ ప్రాసిక్యూట్‌ చేసి జైలుపాలు చేయాలంటూ ఉద్యమాకారులు చేస్తున్న డిమాండ్‌లు ఉద్యమగతికి అద్దం పడుతున్నాయి. కేంద్రంపై విభజనవాదులు తెచ్చిన ఒత్తిడి కారణంగానే గత ఏడాది మార్చిలో యుపిఎ ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని నియమించింది. ఈ కమిటీ పది మాసాల పాటు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించింది. వివిధ వర్గాల ప్రజల మనోభావాల్ని తెలుసుకుంది. గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలు, సామాన్యుల నుంచి సంపన్నులు, నిరక్షరాస్యుల నుంచి విద్యాధికులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా సమాజంలోని అన్ని వర్గాల్లో విభజనపై నెలకొన్న అభిప్రాయాల్ని ఆరాతీసింది. తమ దృష్టికొచ్చిన అంశాలన్నింటితో ఒక నివేదికను రూపొందించి కేంద్రానికి అందజేసింది. అయితే సమస్య మూలాలు జటిలంగా ఉండడంతో ఏకపక్ష పరిష్కారం సాధ్యం కాదని తలచి కొన్ని సిఫార్సులు చేసింది. వీటిలో ప్రభుత్వానికి అనుకూలమైన ప్రతిపాదనలపై సానుకూల నిర్ణయం తీసుకోమని సూచించింది. వీరి సిఫార్సులేవీ తమకనుకూలంగా లేవన్నది తెలంగాణ వాదుల ఆరోపణ. తాజాగా ఎనిమిదో ప్రతిపాదనపై వీరు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రతిపాదనలన్నీ తమకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ సభ్యుల్ని దూషిస్తున్నారు.

ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ సభ్యుల్లో ఏ ఒక్కరికీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతో గాని, ఇక్కడి రాజకీయాలు లేదా ప్రాంతాలు, రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం లేదు. వీరిలో ఒక్కొక్కరు ఒక్కో రంగంలో నిష్ణాతులు. తమ తమ రంగాల్లో అనేక రకాల అధ్యయనాలు నిర్వహించి ప్రభుత్వానికి సమర్పించిన మేధావులు. రాష్ట్ర విభజన చేయాల్సొస్తే నైసర్గిక భౌగోళిక స్వరూపంతో పాటు ఖనిజాలు, జలవనరులు, విద్యుత్‌, సంపద ఇలా సంయుక్త వనరుల విభజనపై కూడా అధ్యయనం నిర్వహించి సిఫార్సులు చేస్తారన్న ఉద్దేశంతోనే వీరిని కమిటీ సభ్యులుగా కేంద్రం నియమించింది. వీరిలో ఒక మహిళ, ముస్లిం కూడా ఉన్నారు. ఇలా అన్ని వర్గాలకు ఈ కమిటీలో ప్రాతినిథ్యం కల్పించారు. కమిటీ సభ్య కార్యదర్శిగా వ్యవహరించిన వినోద్‌ కుమార్‌ దుగ్గల్‌ కేంద్ర హోమ్‌ శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు. 1968 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్‌ అధికారి ఆయన. తొలుత నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో కొంతకాలం సేవలందించారు. ఆ తర్వాత ఐఎఎస్‌కు ఎంపికయ్యారు. దీర్ఘకాలం పాటు జలవనరుల శాఖలో ఆయన పని చేశారు. దేశంలో జలవనరుల పంపిణీపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. అంతేకాదు కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాల్ని పునర్‌నిర్వచించే నిమిత్తం ఏర్పాటు చేసిన జస్టిస్‌ పూంచి కమిషన్‌లో కూడా ఆయన సభ్యుడిగా వ్యవహరించారు. డాక్టర్‌ రవీంద్రకౌర్‌ పంజాబీ మహిళ. ఢిల్లీ ఐఐటిలో సోషియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. భారత సమాజంలో సామాజిక వర్గాల మధ్య విభేదాలు, రిజర్వేషన్లపై ఆమె ప్రత్యేక అధ్యయనం నిర్వహించారు. దేశంలో పట్టణ, గ్రామీణ ప్రజల మధ్య సంబంధాలపై ఆమె పలు పుస్తకాలు వెలువరించారు. సామాజిక రంగంలో ఆమె విశేష కృషి చేశారు. వివిధ ప్రాంతాల ప్రజల మధ్య భావ ప్రకటన స్వేచ్ఛలో వ్యత్యాసాలు, జీవన విధానాలపై అధ్యయనాలు నిర్వహించారు. మరో సభ్యుడు అబుసలేషరీఫ్‌ ఇండియన్‌ ముస్లిం. మంచి ఆర్థికవేత్త. నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో చీఫ్‌ ఎకానమిస్ట్‌గా సేవలందించారు. ఆయన ఆహార విధానంపై పలు అధ్యయనాలు

నిర్వహించారు. ఆర్థిక వ్యత్యాసాలు, ఆహారం సమకూర్చుకోవడంలో అసమానతలు, తద్వారా ఒనగూరే నష్టాలపై అనేక పేపర్లను ప్రజెంట్‌ చేశారు. అమెరికాలోని ఎకనామిక్‌ గ్రోత్‌సెంటర్‌కు విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా సేవలందించారు. దేశంలోని ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యాపర వివరాలపై అధ్యయనం నిర్వహించి కేంద్రానికో నివేదిక సమర్పించారు. ఇటీవలె భారత్‌లో మానవ వనరుల అభివృద్ధిపై పుస్తకాన్ని వెలువరించారు. దీర్ఘకాలం పాటు కేంద్ర హోమ్‌ మంత్రిత్వ శాఖలో సభ్యుడిగా పనిచేశారు. ప్రతిష్టాత్మక ఇండియా టుడే మ్యాగజైన్‌ 2000 జనవరి నాటి సంచికలో ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నికగన్న మేధావుల జాబితాను ప్రచించింది. ఇందులోని 25 మందిలో షరీఫ్‌ స్థానం సంపాదించారు. ఇక రణబీర్‌సింగ్‌ నేషనల్‌ లా యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌గా వ్యవహరించారు. న్యాయ వ్యవస్థను పరిరక్షించే వేలాది మంది న్యాయ నిపుణుల్ని ఆయన తీర్చిదిద్దారు. కమిటీకి నాయకత్వం వహించిన జస్టిస్‌ బిఎన్‌ శ్రీకృష్ణ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారు.

1991--92లో ముంబయ్‌లో జరిగిన మతకల్లోలాలపై ప్రభుత్వం నియమించిన కమిషన్‌కు ఆయనే నేతృత్వం వహించారు. బాబ్రీ మసీదు విధ్వంసానంతరం జరిగిన ఈ అల్లర్లతో ముంబయ్‌ నగరం అతలాకుతలమైంది. ఆయనకు ముందు మరికొంత మంది న్యాయ నిపుణుల్ని కేంద్రం సంప్రదించినప్పటికీ ఆ కమిటీకి నాయకత్వం వహించేందుకెవరూ ముందుకురాలేదు. 1998 వరకు సాక్షుల్ని విచారించిన జస్టిస్‌ శ్రీకృష్ణ ముంబయ్‌ అల్లర్ల మూలకారకుల వివరాల్ని బట్టబయలు చేయడంతో ఒక్కసారిగా ఆయన పేరు దేశమంతా మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత మద్రాస్‌ హైకోర్టులో 2009 ఫిబ్రవరి 19న జరిగిన అల్లర్లకు సంబంధించి శ్రీకృష్ణ నేతృత్వంలోనే ఏకసభ్య కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఇందులో కూడా ఆయన ఇచ్చిన నివేదిక నిందితుల్ని బయటపెట్టింది. యుకెలోని ఇంటర్‌నేషనల్‌ బార్‌ అసోసియేషన్‌లో జీవితకాల సభ్యుడిగా ఉన్న శ్రీకృష్ణకు భారత్‌లోనేకాదు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.

ఇలా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని శ్రీకృష్ణ కమిటీ సభ్యులుగా కేంద్రం నియమించింది. తెలంగాణ ప్రాంతంలోని ముస్లింల సంఖ్యను దృష్టిలో పెట్టుకునే సభ్యుల్లో ఒక ముస్లింను కూడా చేర్చింది. తెలంగాణ , సీమాంధ్ర ప్రాంతాల మధ్య నెలకొన్న ఆర్థిక అసమానతలు, జీవన వైరుధ్యాలపై స్పష్టమైన నివేదికిచ్చే నిమిత్తమే ఆయన రంగాల్లో ప్రతిభావంతులకు కమిటీలో స్థానం కల్పించింది. వీరంతా తమకు నిర్దేశించిన విధుల్ని పూర్తి చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధికుల మనోభావాల్ని గౌరవించి తీరాల్సిందే. అలాగే ప్రతిఒక్కరికి స్పష్టమైన భావప్రకటనా స్వేచ్ఛ ఉంది. ఈరెండింటికి రాజ్యాంగం తగిన రక్షణ కల్పించింది. కానీ తెలంగాణ వాదులు తమకనుకూలంగా సిఫార్సులివ్వలేదన్న ఏకైక కారణంతో రాష్ట్రానికి సంబంధంలేని జాతీయ స్థాయి మేధావులైన కమిటీ సభ్యుల భావ ప్రకటనా స్వేచ్ఛను కూడా ప్రశ్నించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని పరిశీలకులు పేర్కొంటున్నారు. అయినా తెలంగాణ ఏర్పాటు అన్నది ఓ రాజకీయ ప్రక్రియ. ఇంత వరకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలేవీ దీనిపై ఇదమిత్ధంగా తమ విధానాల్ని స్పష్టం చేయలేదు. కాంగ్రెస్‌, తెలుగుదేశం రెండూ తకూడా దోబూచులాట లాడుతున్నాయి. తెలంగాణ వాదులు రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చిరాష్ట్ర విభజనపై ఏకాభిప్రాయ తీర్మానాన్ని అమోదింపజేయడం ద్వారానే తెలంగాణ ఏర్పాటు సాధ్యపడుతుందని వీరు సూచిస్తున్నారు. అంతేగాని ఓ గౌరవనీయ వృత్తి అయిన ప్రొఫెసర్‌ హోదాలో ఉన్న కోదండరామ్‌ కూడా శ్రీకృష్ణ కమిటీ సభ్యులపై విరుచుకుపడటం వారి రాజ్యాంగ హక్కులకు విరుద్ధంగా మాట్లాడటం తగదని వీరు పేర్కొంటున్నారు.

రాజీనామా చేస్తాం జగన్‌ పార్టీలో చేరతాం

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అభిమానులమైన తాము అవసరమైతే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీలో చేరతామని కాంగ్రెస్‌ సభ్యులు శ్రీకాంత్‌రెడ్డి, గురునాథ్‌రెడ్డి, ప్రజారాజ్యం ఎమ్మెల్యే శోభానాగిరెడ్డిలు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, తెదేపాలు కలిసి జగన్‌ను ఎదుర్కొనడానికే పనిచేస్తున్నాయని ఆయనను దెబ్బతీసేందుకు టార్గెట్‌ పెట్టుకున్నారని వారు ఆరోపించారు. జగన్‌ను గానీ, ఆయన కుటుంబాన్ని గానీ ఎవరైన కామెంట్‌ చేస్తే సహించబోమని వారు హెచ్చరించారు. జగన్‌ గురించి అనవసరమైన మాటలు మాట్లాడకుండా ప్రజల కోసం మాట్లాడితే మంచిదన్నారు. 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌, 30 సంవత్సరాల చరిత్ర కలిగిన తెదేపా నేతలకు నైతిక విలువలు ఉన్నాయా? అని వారు ప్రశ్నించారు.

వైఎస్సార్‌ కడప జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రమంత్రులు అధికారదుర్వినియోగానికి పాల్పడ్డారని, టిడిపి ఎంపిటిసిలతో లోపాయకారీ ఒప్పందం కుదుర్చుకున్నారని వారు ఆరోపించారు. కడపలో జగన్‌ తరఫున గెలిపొందిన ఎమ్మెల్సీ అభ్యర్థికి వైఎస్సార్‌ బొమ్మ చూసి ఓటర్లు ఓట్లు వేశారన్నారు. ఇదిలావుండగా, చంద్రబాబు తన హయాంలో చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీలో రోజు ఏదో గొడవ సృష్టిస్తున్నారని వారు ఆరోపించారు.

19, మార్చి 2011, శనివారం

కావాల్సిన చీఫ్ బట్టి రేటు ఫిక్స్...

అవినీతికి అలవాటు పడిన విద్యాశాఖ అధికారులకు పదో తరగతి పరీక్షలు కాసులు కురిపిస్తున్నాయి. ఆయా పరీక్ష కేంద్రాలకు చీఫ్ లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు (డీఓ), అసిస్టెంట్ డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ల(ఏడీఓ)ను నియమించే విషయంలో బేరసారాలు పెట్టారు. కాపీలు కొట్టించి, అధిక సంఖ్యలో విద్యార్థులను పాస్ అయ్యేలా చేసి ఉతీర్ణత పెంచుకునేందుకు కొన్ని పాఠశాలల యజమానులు సంబంధిత అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి కోరుకున్న అధికారులను చీఫ్‌లుగాను, డీఓ, ఏడీఓలుగా నియమించుకుంటున్నారని సమాచారం. పరీక్ష కేంద్రాలకు చీఫ్‌లు, డీఓలు, ఏడీఓల నియామకంలో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలే ఆరోపిస్తున్నాయి. సెంటర్ల కేటాయింపు మొదలుకుని ప్రతి పనినీ తప్పు పడుతున్నారని, తీరా మామూళ్లు ముట్టజెపితే నియమ, నిబంధనలను పట్టించుకోవడం లేదని చెబుతున్నాయి. ముడుపులు దండుకుని సౌకర్యాలున్న ప్రభుత్వ పాఠశాలలో పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్యను తగ్గించి, అరకొర సౌకర్యాలున్న ప్రైవేటు పాఠశాలలకు అధిక సంఖ్యలో విద్యార్థులను కేటాయించినట్లు తెల్సింది. ఏ పాఠశాలలో ఎంత మంది పరీక్షలు రాయాలో అధికారులు సంఖ్యను వేసి సెకెండరీ ఎడ్యుకేషన్ బోర్డుకు పంపుతారు. ముడుపులు దండుకున్న అధికారులు ఆ సమయంలోనే సంఖ్యను కోరుకున్న విధంగా వేసి పంపినట్లు సమాచారం. కోరుకున్న, కావాల్సిన చీఫ్ కావాలంటే పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్యను బట్టి రేటు ఫిక్స్ చేశారని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థుల సంఖ్య తక్కువ ఉంటే రూ. 1,500 నుంచి సంఖ్య ఎక్కువ ఉన్న పాఠశాలల నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేస్తున్నారని తెల్సింది.

జగన్‌ వర్గం ఎమ్మెల్యేల్లో చీలిక?

శాసనసభ్యుల కోటాలోని 10 ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని, ముఖ్యంగా ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డిని దెబ్బకొట్టడానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వేసిన పాచిక పారలేదు. సరికదా! తప్పుడు వ్యూహంతో అభాసుపాలయ్యారు. ఫలితంగా సొంత పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటువేసిన ఎమ్మెల్యేలు జగన్‌కు మద్దతుపై పునరాలోచనలో పడ్డారు. ఓటింగ్‌ విషయంలో జగన్‌ సరైన వ్యూహం రచించకపోవటం వల్లే తాము విమర్శలకు గురవుతున్నామని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఆత్మప్రబోధం మేరకు ఎమ్మెల్యేలు ఓటు వేస్తారని జగన్‌తో పాటు ఆ పార్టీ నేతలు కూడా ప్రకటించారు. ఓటింగ్‌ విషయమై తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల మధ్య విభేదాలు పొడచూపడంతో ఖిన్నుడైన జగన్‌ ఎంఐఎం అభ్యర్థులకు ఓటు విషయంలో అభ్యంతరం చెప్పకుండా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఓటింగ్‌ వ్యవహారంలో విభేదాలు తలెత్తటంతో జగన్‌కు మద్దతు ఇచ్చే విషయంలో కొందరు ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో సొంత పార్టీకి దూరమయ్యేందుకు వారు విముఖత చూపుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీకే జైకొట్టేందుకు నిర్ణయించుకున్నారు. కొద్ది రోజుల్లో వారు తమ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

భలే మొగుడు-భలే పెళ్ళాం సెన్సార్ కట్స్

భలే మొగుడు భలే పెళ్ళాం చిత్రం ఉషాకిరణ్‌ క్రియేషన్స్‌ పతాకాన నిర్మితమయింది. రాజేంద్రప్రసాద్‌, సహాసిని, నరేష్‌, కావేరిఝా, ఝాన్సీ, రఘబాబు, రజిత, రమ్యశ్రీ ముఖ్యపాతల్రు పోషించారు. గంగోత్రి విశ్వనాథ్‌ డైలాగ్స్‌, ఇ.ఎస్‌.మూర్తి సంగీతం, మురళి రామయ్య కూర్పు నిర్వహించిన ఈ చిత్రానికి దర్శకుడు దినేష్‌ బాబు. నిర్మాత జొన్నాడ రమణమూర్తి.

5 గురు సభ్యులతో కూడిన ఇసి ఈ చిత్రాన్ని చూసి 8 కట్స్‌తో 0.13 అడుగుల ఫిలిం కత్తిరించి 11-1-11న ‘యు’ సర్టిఫికెట్‌ జారీ చేసింది. 14 రీళ్ళ – ‘భలే మొగుడు భలే పెళ్ళాం’ చిత్రం 25-2-11 విడుదల అయింది.

1. ఒకటి రెండు రీళ్ళలో ‘దానికి బ్లౌజ్‌ ఎందుకు’ అని ఉన్న డైలాగ్‌లోని ‘బ్లౌజ్‌’ని కత్తిరించి శబ్దం వినబడకూడదన్నారు.

2. ఒకటి రెండు రీళ్ళలో ఒక దృశ్యంలో వచ్చిన టి.వి.9, టి.వి పదాలను సౌండ్‌తో సహా తొలగించారు.

3. ఒకటి రెండు రీళ్ళలో వున్న ‘ఆడంగి’ పదాన్ని శబ్దంతో సహ తొలగింప చేసారు.

4. ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అనేది చూపమన్నారు జనరల్‌గా.

5. మూడు నాలుగు రీళ్ళలో ‘కోర్టుకి అండర్‌వేర్‌’ లేకుండా వెళతావా’ అనే డైలాగ్‌లోని ‘అండర్‌ వేర్‌’ పదం తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.

6. మూడు నాలుగు రీళ్ళలో చిత్రీకరించిన సన్నివేశంలో గల ఏ వర్కన్నా ఎక్సట్రా చార్జి ఇస్తే చేస్తావా’ అనే డైలాగ్‌ని శబ్ధంతో సహా తొలగించారు.

7. అయిదు ఆరు రీళ్ళలో టీవీ నటి చేతులు పిరుదుల్ని రాజేంద్ర ప్రసాద్‌ తాకే దృశాలను ఫ్లాష్‌లా చూపమనడం ద్వారా 0.05 అడుగులు నిడివిగల ఫిలిం కత్తిరింపుకు గురి అయింది.

8. ఏడు ఎనిమిది రీళ్ళలో రాజేంద్రప్రసాద్‌, సుహాసిని ముద్దులిచ్చుకునే దృశ్యాలన్ని ఫ్లాష్‌లా చూపమనడం ద్వారా 0.08 అడుగుల ఫిలిం కత్తిర పాలయింది.

15, మార్చి 2011, మంగళవారం

పాటిల్ కాంగ్రెస్ అభ్యర్థా? కాదా?

తాను ఎన్నడూ పార్టీ వ్యతిరేక కార్యలాపాలకు పాల్పడలేదని పదే పదే ప్రకటిస్తున్న మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి.. ఇప్పుడు సరికొత్త రాగం అందుకున్నారు. ‘పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థా? కాదా? అన్నది పీసీసీ చీఫ్ డీఎస్, సీఎం కిరణ్‌లు తేల్చాలి పాటిల్ నిజమైన కాంగ్రెస్‌వాది కాదు..అందుకే మేం ఎన్నికలను బహిష్కరిస్తున్నాం’ అని స్పశ్తీకరిన్చారు.

ఒకవేళ జేసీ వర్గీయులు అందరూ ఎన్నికలను బహిష్కరించినా.. టీడీపీకి చెందిన 150 మందికిపైగా ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థికి బాహాటంగా మద్దతు ఇస్తున్నారని పాటిల్ విజయం సాధించడం తథ్యమనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది.

తెలంగాణ పేరుతో కేసీఆర్ దండుకున్నారు

తెలంగాణ ఉద్యమం పేరుతో కేసీఆర్ కుటుంబంతోపాటు ఆయన మేనల్లుడు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు కోట్లాది రూపాయల దండుకున్నారని తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి రఘువీరారెడ్డి తెలిపారు.రాజకీయ లబ్ధి కోసం టీఆర్ఎస్ విగ్రహాలను ధ్వంసం చేస్తుందని విమర్శించారు. తల్లితెలంగాణ విగ్రహం దహనం చేయడం చరిత్రలో పెద్ద తప్పిదమన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఈ సంఘటనలు చూస్తుంటే ఇక ముందు ఎలాంటి దౌర్జన్యాలైనా చేసేందుకు ఒడిగడుతుందని సందేహం వ్యక్తం చేశారు.

14, మార్చి 2011, సోమవారం

జగన్ అక్రమ ఆస్తులపై విచారణకు ప్రధాని సానుకూలం

మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన జగతి సంస్థలోకి అక్రమ ఆస్తులు భారీగా తరలివచ్చాయని వాటిపై వెంటనే విచారణ జరిపించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు సోమవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిసి విన్నవించారు.  వారు చేసిన డిమాండ్‌కు ప్రధాని సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది.

అనంతరంఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు, ఎంపీ మైసూరారెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ డిమాండ్‌పై ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు  చెప్పారు. జగన్‌కు చెందిన పార్టీని చూసి భయపడే స్థితిలో లేమని అన్నారు. జగన్ అక్రమ ఆస్తులపై తెలుగుదేశం పార్టీ ఎప్పటినుండో పోరాడుతుందని, జగతి పబ్లికేషన్స్ లో వాటాలు పూర్తిగా అక్రమమైనవని అన్నారు. అందులో ఎవరెవరు ఎంత పెట్టారో వారి వారి వాటాలు బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ అక్రమ ఆస్తులపై ఆదాయపన్ను శాఖ ద్వారా విచారణ జరిపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారని అన్నారు.

మళ్లీ ప్రతిష్టిస్తే... మేం ఒప్పుకోం..

ట్యాంక్‌బండ్‌పై కూల్చేసిన విగ్రహాలను పునఃప్రతిష్టించాలని ప్రభుత్వం చేసున్న హడావిడిని తామంతా కలసి కట్టుగా తిప్పి కొడతామని ప్రకటించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హెచ్చరించారు.

సోమవారం లోయర్ ట్యాంక్ బండలోని కట్టమైసమ్మ దేవాలయం నుండి పోతన విగ్రహం వరకు స్వాభిమాన్ యాత్ర జరిపిన ఆమె అనంతరం మీడియాలో మాట్లాడుతూ....తెలంగాణ వైతాలికుల విగ్రహాలు లేకుండా వేరే విగ్రహాలు ప్రతిష్టించకూడదని...కాదని సిద్దపడితే మరోమారు విధ్వంసం జరిగినా ఆశ్చర్యపోన్నఖ్ఖరేదని వ్యాఖ్యానించారు.

600 మంది తెలంగాణా కోసం ప్రాణ తాగాలు చేసే... కనీసం పలుకరించిన పాపాన పోని సీమాంధ్ర నేతలు జరిగిన విగ్రహాల విధ్వంసాన్ని మాత్రం అతిగా చూపుతున్నారని... తెలంగాణాకు వ్యతిరేకంగా పలు మీడియా సంస్ధలు చేసున్న వాఖ్యల వల్లే నాడు మీడియా ప్రతినిధులపై దాడి జరిగిందని... తాను భావిస్తున్నట్లు చెప్పారు

తెలంగాణా వ్యతిరేక నివేదిక నేనివ్వలే...

అయిదు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా తెలంగాణ అంశంపై అధిష్టానం మే వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితిలో లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం అయిన ఆయన తెలంగాణా అంశంపై నిర్ణయించాల్సింది పూరిగా కేంద్ర ప్రభుత్వమేనని... ఈ విషయం తెలిసి కూడా తెరాసతో కల్సి రాష్ట్ర ప్రభుత్వాని ఇబ్బంది పెట్టడం సరైనది కాదని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఉద్యమం బలంగా లేదని తాను నివేదిక పంపినట్లు కొందరు తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని... తాను ఈ విషయమై ఎలాంటి నివేధికనీ అధిష్టానానికి ఇవ్వలేదని స్పష్టం చేసారు.దృష్ట్యా పార్టీ విప్‌ని ఎవరు ధిక్కరించినా కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని... ఎన్నికల నాటికి ప్రాంతాలకతీతంగా కాంగ్రెస్‌ శాసనసబ్యులంతా సభకు హాజరై కాంగ్రెస్‌ అభ్యర్ధులతో పాటు మిత్ర పక్షాల అభ్యర్ధులను కూడా గెలిపించుకోవాలిన బాధ్యత ఉందని సిఎం తెలంగాణా సభ్యులతో చెపారు. కాగా తెలంగాణా ఉద్యమాన్నివిస్పష్టంగా కేంద్రానికి వినిపించేందుకే తాము అసెంబ్లీని బాయ్‌కాట్‌ చేస్తున్నామని... ఎమెల్సీ ఎన్నికల్లో పాలొనే విషయమై తామంతా కల్సి ఓ నిర్ణయం తీసుకుంటామని శాసనసభ్యులు చెప్పినట్లు సమాచారం.


13, మార్చి 2011, ఆదివారం

కేసీఆర్ తెలంగాణ ద్రోహి కాక ఏమవుతాడు

ఆనాడు ఎన్టీఆర్ హయాంలో ట్యాంక్‌బండ్‌పై మహనీయుల విగ్రహావిష్కరణ సమయంలో తెలంగాణ యోధుడు కొమరం భీమ్‌ను మరిచిన కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గంగాభవాని విరుచుకుపడ్డారు.
విగ్రహావిష్కరణ సమయంలో ఆ నాడు తెలుగు దేశంలో కీలక పదవిలో కేసీఆర్‌కు ఏ ఒక్క తెలంగాణ యోధుడు గుర్తుకురాలే దు... కాని, ఇపుడు తెలంగాణా కోసం కోసం చనిపొయిన కుటుంబాలపై తనకే సానుభూతి ఉన్నట్లు మాట్లాడుతున్నాడని ఎక్కడా లేని ప్రేమ నటిస్తూ యువతను , ప్రాంతీయతత్వాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.

మే నెలలో రాష్టప్రతి పాలన వచ్చేస్తోంది

మే నెలలో రాష్టప్రతి పాలన కిందకి రాష్ట్రం రానుందని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు జోస్యం చెప్పారు. ఆదివారం ఆయన హైదరాబాదులో మీడియాలో మాట్లా డుతూ... ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్‌ అధిష్టానంని మెప్పించి తన పదవిని కాపాడుకునేందుకే కుయుకులు పనుతున్నారని వైఎస్ జగన్‌ను ఎలా అణచాలనే విషయం గురించే ఎప్పుడూ ఆలోచిస్తున్నారని అందువల్లే రాష్ట్రంలో ఎలాంటి పెను విధ్వంసాలు జరుగుతున్నా పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఇప్పటికే గవర్నర్‌ ష్ట్ర పరిస్ధితిపై ఓ నివేదికని పంపించారని తనకు సమాచారముందని ఖచ్చితంగా మేనెలాఖరు నాటికి రాష్ట్రపతి పాలన విధించడం ఖాయమని రాష్ట్రంలో ప్రభుత్వం తగురీతిన పనిచేయట్లేదని... తెలుగుదేశం పార్టీ కూడా ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించడం లేదని విమర్శించారు.

తెలంగాణా ఉద్యమంలో భావ వ్యకీకరణని ఎవరూ తప్పు పట్టలేరని.. అయితే తెలుగుదజాతి మహోన్నతిని చాటిన వారికి ప్రాంతీయ భేదాలు అంటగట్టి వారి విహాలను ధ్వంసం చేయటం తగదని తెలంగాణా ఉద్యమం పేరు చెప్పి కొందరు నేతలు విద్యార్థుల జీవితాలతో ఆడుకోంటున్నారని ఇది హేయమైన చర్యఅని విమర్శించారు. విదార్ధులు కూడా ఆలోచనతో ఆ నాయకుల ఉచ్చులో పడకుాడదని విజ్ఞప్తి చేశారు.

'దొంగలముఠా 'ట్రైలర్స్‌ విడుదల


అందుబాటులోకి వచ్చిన అత్యంత ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 'దొంగలముఠా' చిత్రాన్ని తీశామని, ఈ విధానంలో సినిమాలు తీయడం ఎంతో శ్రేయస్కరమని దర్శకుడు రాంగోపాల్‌వర్మ స్పష్టంచేశారు. రవితేజ, చార్మి, ప్రకాష్‌రాజ్‌, లక్ష్మీప్రసన్న మంచు, బ్రహ్మానందం, సుబ్బరాజు ప్రధాన పాత్రధారులుగా శ్రేయ ప్రొడక్షన్స్‌ పతాకంపై కిరణ్‌కుమార్‌ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్స్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని సినీమాక్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా రాంగోపాల్‌వర్మ మాట్లాడుతూ, 'లోగడ వందరోజుల్లో కూడా సినిమా తీశాం. ఇప్పుడు ఈ సినిమాను ఐదురోజుల్లో తీస్తే ఎలా తీయగలుగుతున్నారని అడుగుతున్నారు.

ఈ నవీన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే మూడురోజుల్లో తీయవచ్చు. క్వాలిటీతో పాటు ఖర్చు కూడా ఎంతగానో కలిసొస్తుంది. అందుకే దీనిని ఉపయోగించి ముందు ముందు సినిమాలు తీయబోతున్నాను. హిందీలో కూడా ఈ పరిజ్ఞానంతో సినిమాలు తీస్తాను' అని అన్నారు.

ఉద్యమానికి తెలంగాణా ఉద్యోగ జెఎసి ద్రోహం

ప్రత్యేక తెలంగాణా రా ష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో భాగంగా ఏర్పాటైన ఉద్యోగ సంఘాల జెఎసి నిట్ట నిలువునా చీలింది. ఫిబ్రవరి 17 నుండి ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు కొందరు తమ స్వార్ద రాజకీయాల కోసం ఈనెల 4న ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఉద్యమాన్ని నీరుగార్చారని ఆరోపిస్తూ 32 సంఘాలకు చెందిన అధికార, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులు ప్రత్యేక సమాఖ్యను ఏర్పరుచుకున్నా రు. తమ స్వార్దం కోసం 4.5 లక్షల మంది ఉద్యోగులకు తీవ్ర ద్రోహం చేసారని, ఈ సందర్బంగా ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందస్తుగా నిర్ణయించిన అంశాలపై సంతకాలు చేసి ఉద్యమాన్ని విరమింప చేశారని ఆరోపిస్తున్నా రు. స్వామిగౌడ్‌, దేవినేని ప్రసాద్‌, శ్రీనివాసగౌడ్‌, విఠల్‌లు ఈ కుట్రలో భాగమని, వారిని పొలిటికల్‌ జెఎసి నుండి బహిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వంతో ఈ నాయకులు కుదుర్చుకున్న ఒ ప్పందంలోని 11వ అంశంలో చేర్చబడిన ఇకనుండి సమ్మె చేయబోమని, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములమై విధులు నిర్వహిస్తామని పేర్కొన్న విషయాన్ని కూడా చూడకుండా సంతకాలు చేస్తున్నారని ఆరోపించారు.

సహాయ నిరాకరణను నిలిపివేస్తూ ప్రభుత్వంతో ఒ ప్పందం కుదుర్చుకునే విషయంలో జెఎసి లోని ఇతర సంఘాలతో చర్చించకుండానే స్వయం నిర్ణయం చేశారని అంటున్నారు. మరో 15 నుండి 20 రోజుల పాటు సహాయ నిరాకరణ జరిగివుంటే ప్రభుత్వం సంక్షోభ స్థితికి చేరుకుని, రాష్ట్ర అవతరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సూచనలు చేసేదని అంటున్నారు. ఈ స్థితిలో వీరు ఉద్యమానికి ఎనలేని ద్రోహం చేశారని ఆరోపిస్తున్నారు.

స్వామిగౌడ్‌ ఎన్జీవోలకు గచ్చిబౌలిలో ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తామని చెప్పి కోట్లాది రూపాయలు దండుకున్నాడని, ఈ విషయమై ప్రభుత్వం వద్ద రికార్డులు ఉన్నాయని, దీన్ని ఆసరాగా చేసుకుని కేసులు బనాయిస్తామని ప్రభుత్వం చేసిన హెచ్చరికకు స్వామిగౌడ్‌ లాంటి నాయకులు లొంగిపోయారని తీవ్రఆరోపణలు చేస్తున్నారు.

మూరుమూల గ్రామాలకు బ్యాంకింగ్‌ సేవలు


గ్రామీణ ప్రజలకు కూడా బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులొకొస్తున్నాయి. మూరుమూల గ్రామాలకు కూడా బ్యాంకింగ్‌ సేవల్ని విస్తరింపజేస్తామని గతేడాది బడ్జెట్‌లో కేంద్రఆర్ధిక మంత్రి ప్రకటించారు. కాగా ఇవిప్పుడు కార్యరూపం దాలుస్తున్నాయి. ఏ బ్యాంక్‌ బ్రాంచ్‌లేని గ్రామాల్లో తొలుత సర్వీస్‌ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. ఇందుకు భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ ముందుకొచ్చింది. సర్వీస్‌పాయింట్లలో కలెక్టన్‌ ఏజెంట్లుగా నియామకాలకు ఇంటర్వ్యూలు ప్రారంభించింది. కనీసం 50వేలు పెట్టుబడి పెట్టగలిగి మరో 50వేలు బ్యాంక్‌కు డిపాజిట్‌ చేయగలిగిన నిరుద్యోగుల్ని ఈ సర్వీస్‌ సెంటర్లలో కలెక్టన్‌ ఏజెంట్లుగా ఎంపిక చేస్తున్నారు. గ్రామాల్లో ఒక చిన్న షాప్‌ను అద్దెకు తీసుకుని ఈ సర్వీస్‌పాయింట్లు నెలకొల్పుతారు. ఆయా గ్రామాల్లోని డ్వాక్రా మహిళల నుంచి వాయిదాలు కట్టించుకోవడం, అప్పులివ్వడం, గ్రామస్థులకు సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్లు తెరవడం వంటి చిన్న చిన్న పనుల్ని ఇక్కడ అప్పటికప్పుడు పూర్తిచేస్తారు. ఇందుకోసం సర్వీస్‌ సెంటర్ల నిర్వాహకులకు నిర్ణీత మొత్తంలో కమిషన్లు చెల్లిస్తారు. కనీసం ఇంటర్‌ పాసైన నిరుద్యోగుల్ని ఈ ఉద్యోగాలకు ఎంపికచేస్తున్నారు. శుక్రవారం నుంచి కాకినాడ స్టేట్‌బ్యాంక్‌ అడ్మినిస్ట్రేటీవ్‌ కార్యాలయంలో ఇంటర్వ్యూలు మొదలయ్యాయి. ఈ నెలాఖరులోగా ఎంపిక పూర్తి చేసి గ్రామాలకు బ్యాంక్‌ సేవల్ని విస్తరించనున్నారు.

చేసింది అపచారం.. పైగా సమర్దిoపు


తెలుగు జాతి కీర్తి కిరీటాలను ప్రపంచ వినువీధుల్లో చాటి చెప్పిన తెలుగు మాగాణి ముద్దు బిడ్డల విగ్రహాలను ప్రాంతీయ విధేష్వాల పేరుతో ధ్వంసం చేసి హుసేన్‌సాగర్‌లో పడేయటాన్ని గర్హిస్తు తెలుగు భాషాభిమానులు టాంకుబాండ్‌పై నిరసన దీక్షకి దిగారు. ఆదివారం పలువురు రాజకీయ నేతలు, స్వచ్చంద సంస్ధల ప్రతినిధులు ఈ నిరసనలో పాల్గొని పోతనామాత్యుని విగ్రహం ముందు కూర్చొని నిరసన తెలిపారు. కృష్ణ దేవరాయులు, బ్రహ్మనాయుడు విగ్రహాల ను చూసి కన్నీళుల పెటుకునారు. తెలుగుజాతి ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు జాతి కుల మత ప్రాంతీయ భేదాలకు అతీతంగా విదేశీయులైనా తెలుగువారికి మేలు చేకూర్చిన ప్రతి ఒక్కరినీ తెలువాళ్లంతా గుర్తుంచుకోవాలన్న ఒకే ఒక్క కాంక్షతో నాటి ముఖ్యమంత్రి వీటిని ఏర్పాటు చేస్తే .. విగహాలకు ప్రాంతీయ విధ్వేషాలు పులిమి కూల గొట్టడం... పైగా వారి ఔన్నత్యం తెలిసికూడా... విగ్రహాలే కదా? అన్న రీతిన మిలీయన్‌ మార్చ్‌ నిర్వాహకులు జరిగిన తప్పిందాన్ని సమరించుకోవటం శోచనీయమని ఈ నిరసనలో పాల్గొన్న పలువురు అభిపాయ పడ్డారు. అంతకు ముందు మహాత్ములారా! మన్నించండంటూ జనవిజాన వేదిక ఆధ్వర్యంలో టాంక్‌ బాండ్‌పై మౌన ప్రదర్శన జరిగింది.

ప్రతి హిందూవు ఇంటిపై కాషాయ ధ్వజo

రాబోయే ఉగాది పండుగ నూతన పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి హిందూవు ప్రతి ఇంటిపై, ప్రతి గ్రామ కూడలిలో కాషాయ ధ్వజాలు ఎగురవేయాలని విశ్వహిందూ పరిషత్‌ పిలుపునిచ్చింది.నగరంలో మార్చి 27న సామూహికంగా ఇతిచింతక్‌ నిర్వహించాలని, మే 8నుండి 23వరకు జరిగే విహెచ్‌పి శిక్షణ వర్గ్‌లో ప్రతి గ్రామం నుండి 5మంది చొప్పున పాల్గొనాలని, ఈ నెల 19 సందర్భంగా పౌర్ణమి ఉంటుందని, అందుకు మనం కాముని పౌర్ణమిగా ఆ రోజు రాత్రి 10గంటలకు కామదహన కార్యక్రమాన్ని నిర్వహించి హోలీ మహోత్సవాన్ని ఈనెల 20న ఆదివారం జరుపుకోవాలని విశ్వహిందూ పరిషత్‌ వెల్లడించింది.

పెరుగుతున్న ఎండలు .. భయాందోళనలో జనాలు

ప్రకృతి ధర్మంలో భాగంగా ప్రతి ఏడు ఎండ, వాన, చలి, గాలి వాటి వాటి పనులు తుచాతప్పకుండా ఎవరి ఆదేశాల కోసం వేచిచూడకుండా వారి తడువు రాగానే వారి వారి పనులు చేసి వెళ్ళిపోవడం ఆనవాయితి. ఇందులో భాగంగా చలి తనదైన శైలిలో విజృంభించి మానవాళిని గజగజ వణికించి తన పని పూర్తి చేసుకొని తరువాత వంతు ఎండకు అప్పగించి వెళ్లడంతో సూర్య ప్రతాపం క్రమం క్రమంగా పెరుగుతూ ఎండ వేడిని పుట్టిస్తున్నడంతో ప్రజలు ఎండలకు బెంబెలేత్తూ పరుగులు తీస్తున్నారు.


గతంలో ఈ సమయంలో ఎప్పుడు లేనంతా ఎండ ఉష్టోగ్రతను ప్రజలు చూస్తూ రాబోయే కాలంలో ఈ ఎండ ప్రభావం ఏ మేరకు ఉంటుందో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యువత, చిన్నారులు ఎండ వేడిని తట్టుకోలేక సమీపంలో ఉన్న నీటి బావుల వద్దకు చేరుకొని ఎండ వేడికి జలకాలటలే శరణ్యం అంటూ వేడి ప్రతాపం నుండి ఉపసమనం పొందుతూ సేదతీరుతున్నారు. పట్టణంలో ఎండ వేడి తట్టుకోలేక ప్రజలు చెట్ల నీడలకు, దుకాణాల ముందు భాగాలకు చేరుతూ ఎండ వేడితో తడారిపోయిన శరీరానికి చల్లని పానియాలు, పుచ్చకాయలు, మజ్జిగ తదితర ద్రవ ప దార్థాలను సేవిస్తూ శరీరంలో తగ్గుతున్న నీటి శాతాన్ని పెంచుకోనేందుకు వారి వారి స్తోమతబ ట్టి సేవిస్తున్నారు.

జగన్‌ని కాంగ్రెస్‌లోకి తేకుంటే రాజీనామా

పది రోజులు తనకు అధిష్టానం సమయమిసే... జగన్‌ని ఆయన వెనకున్న నేతల్నికాంగ్రెస్లోకి తెచ్చి పడేస్తానంటూ తన దైన శైలిలో వ్యాఖ్యలు చేసారు మంత్రి శంకరరావు. ఆదివారం ఆయన తన నివాసంలో మీడియాలో మాట్లాడుతూ.. జగన్‌ ప్రసుతం పార్టీ పెటినా త్వరలోనే తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరటం ఖాయమని జోస్యం చెప్పారు. వైఎస్‌ ఆశయాలో రాహుల్ని ప్రదానిని చేయాలన్న లక్ష్యం కూడా ఒకటని.. దానిన కాదని జగన్‌ ముందు కెళ్లగలరా? అని ప్రశ్నించారు. జగన్‌ని కాంగ్రెస్‌ పార్టీలోకి తాను రపించలేక పోతే తన పదవికి రాజీనామా కూడా చేస్తానని సవాల్‌ విసిరారు.

'విదేశీ' కన్నా మన స్వదేశీ 'మందే' బెటర్

రాష్ట్రంలో విదేశీ మద్యం మందుబాబులకు కిక్కివ్వడం లేదు. అమ్మకాలు ఆశాజనకంగా లేవు. ఐదు నెలల కాలంలో 10 కేసులే అమ్ముడు పోయాయంటే అమ్మకాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం 2010 అక్టోబర్ నుంచి విదేశీ మద్యాన్ని రిటైల్, బార్‌లో అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. దీంతో మందుబాబులు విదేశీ మద్యం తమ ముంగిట్లోకి వస్తుందని మురిసిపోయారు.

ఒక బాటిల్ రూ.1800 నుంచి రూ.3500 పైబడి ఉండడంతో మందుబాబులు వీటి జోలికి వెళ్లేందుకు కూడా సంకోచిస్తున్నారు. అదే ఇండియన్ మేడ్ లిక్కర్‌లో కొంత కాస్లీ అయినప్పటికీ టీచర్స్-50, టీచర్స్, బ్లాక్‌డాగ్, 100 పైపర్స్ రూ.1000 నుంచి రూ. 1500 లోపు ధర ఉండటంతో ఉన్నత శ్రేణి మద్యం ప్రియులు విదేశీ మద్యంపై మక్కువ చూపకుండా స్వదేశీ బ్రాండ్‌నే తాగుతున్నారు.

మన సంబంధికులెవరైనా విదేశీ మద్యం తీసుకొస్తే వారికి ఇండియా కరెన్సీలో రూ.1500 నుంచి రూ.2వేల వరకు అక్కడ లభిస్తుంది. ఇండియాకు తీసుకువచ్చిన తరువాత నామమాత్రంగా రూ.200 నుంచి రూ.300 వరకు ఒక్కొక్క బాటిల్‌పై కస్టమ్ డ్యూటీ పడుతుంది.అదే ప్రస్తుతం మనకు మార్కెట్లో లభిస్తున్న విదేశీ మద్యం సెల్స్‌ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ కలుపుకుంటే రేట్టింపు ధరతో మనకు లభిస్తోంది. బ్లాక్‌లెబుల్ ధర రూ.3,500, రెడ్‌లెబుల్ ధర రూ.1800, శివాస్ రిగల్ రూ.3,500 ధరతో లభిస్తోంది.

ఈ ధరలు అధికంగా ఉండడంతో మన మందుబాబులు వాటిని కొనేందుకు వెనుకంజ వేస్తున్నారు.

ఖజనాకి 'విదేశీ' కిక్కు నిల్లు

రాష్ట్రంలో విదేశీ మద్యం మందుబాబులకు కిక్కివ్వడం లేదు. అమ్మకాలు ఆశాజనకంగా లేవు. ఐదు నెలల కాలంలో 10 కేసులే అమ్ముడు పోయాయంటే అమ్మకాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం 2010 అక్టోబర్ నుంచి విదేశీ మద్యాన్ని రిటైల్, బార్‌లో అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. దీంతో మందుబాబులు విదేశీ మద్యం తమ ముంగిట్లోకి వస్తుందని మురిసిపోయారు.

ఒక బాటిల్ రూ.1800 నుంచి రూ.3500 పైబడి ఉండడంతో మందుబాబులు వీటి జోలికి వెళ్లేందుకు కూడా సంకోచిస్తున్నారు. అదే ఇండియన్ మేడ్ లిక్కర్‌లో కొంత కాస్లీ అయినప్పటికీ టీచర్స్-50, టీచర్స్, బ్లాక్‌డాగ్, 100 పైపర్స్ రూ.1000 నుంచి రూ. 1500 లోపు ధర ఉండటంతో ఉన్నత శ్రేణి మద్యం ప్రియులు విదేశీ మద్యంపై మక్కువ చూపకుండా స్వదేశీ బ్రాండ్‌నే తాగుతున్నారు.

మన సంబంధికులెవరైనా విదేశీ మద్యం తీసుకొస్తే వారికి ఇండియా కరెన్సీలో రూ.1500 నుంచి రూ.2వేల వరకు అక్కడ లభిస్తుంది. ఇండియాకు తీసుకువచ్చిన తరువాత నామమాత్రంగా రూ.200 నుంచి రూ.300 వరకు ఒక్కొక్క బాటిల్‌పై కస్టమ్ డ్యూటీ పడుతుంది.అదే ప్రస్తుతం మనకు మార్కెట్లో లభిస్తున్న విదేశీ మద్యం సెల్స్‌ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ కలుపుకుంటే రేట్టింపు ధరతో మనకు లభిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం జానీవాకర్, బ్లాక్ లెబుల్, రెడ్ లెబుల్ లో లభిస్తుంది. బ్లాక్‌లెబుల్ ధర రూ.3,500, రెడ్‌లెబుల్ ధర రూ.1800, శివాస్ రిగల్ రూ.3,500 ధరతో లభిస్తోంది.

ఈ ధరలు అధికంగా ఉండడంతో మన మందుబాబులు వాటిని కొనేందుకు వెనుకంజ వేస్తున్నారు.

మల్టీ స్టారర్ చిత్రాలకు ప్రాణం పోస్తున్న వెంకి, పవన్?

మన సినీ గత చరిత్రలో మల్టీ స్టారర్ చిత్రాలు బోలెడు దర్సనమిస్తాయి. 80 వ దశకంలో ఐతే.. మల్టీ స్టారర్ చిత్రాలు రాజ్యమేలేయి అనడంలో సందేహం లేదు. ఎన్టిఆర్ నాగేశ్వర రావు, కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు వీరంతా స్టార్ లుగా వెలుగొందు తూనే కలసి పని చేయడానికి ముందుకు వచ్చేవారు. దర్శక నిర్మాతలు కూడా ఆతరహ చిత్రాలు నిర్మించేందుకు తాపత్రయ పడేవారు. అందుకు తగ్గ కధలు సిద్దం చేయమని వత్తిడీ తెచ్చేవారు. కానీ కాలం మారింది.. ఇప్పటి హీరోలు సినిమా అంతా తామే అని వ్యవహరిస్తుండటం.. అందుకు తగ్గట్లు అభిమానులూ వికృత చేష్టలు చేస్తుండటంతో చేయాలని ఉన్నా.. మల్టీ స్టారర్ చిత్రాలకు మనహిరోలు భయపడి దూరమై పోయారు. 1990 తరువాత మల్టీ స్టారర్ చిత్రాలు కరువవ్వడం తో..ఈ పరిస్తితి నుంచి బైట పడే సాహసానికి రెడీ అవుతున్నారు వెంకటేష్, పవన్ కళ్యాణ్ లు. వీరి కాంబినేషన్లో శ్రీకాంత్ అద్దాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు గతంలో వచ్చిన వార్తలు ఇప్పుడు వాస్తవ రూపం దాల్చనుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత అవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి

12, మార్చి 2011, శనివారం

'దొంగల ముఠా' ఖర్చు ఆరున్నర లక్షలే నట

సంచలనాల రాంగోపాల్ వర్మ ఏం మాట్లాడినా సంచలనం అయి కూర్చోన్తోంది. ఇప్పుడు తను నిర్మిస్తున్న 'దొంగల ముఠా' చిత్రం కు తను పెట్టిన పెట్టుబడి కేవలం ఆరున్నర లక్షలే అంటూ కొత్త స్టేట్ మెంట్ తో అంత నివ్వెర పోయేలా చేసాడు. పైగా మా దొంగల ముఠా ఒక్క షో ఆడినా అది సూపర్ హిట్ అయినట్టే... కోట్ల లో సంపాదిన్చేయటం ఖయమంటున్నాడు.
అన్నట్లు . వర్మ దృష్టి లో సినిమా ఫ్లాపులు నాలుగు రకాలట అందులో మొదటిది, నిర్మాత పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోవడం. రెండోది, డిస్ట్రిబ్యుటార్ పెట్టిన డబ్బు తిరిగి రాకపోవడం. ప్రేక్షకులకు సినిమా నచ్చకపోవడం అన్నది మూడో రకం ఫ్లాపు. ఇక, విమర్శకులకు సినిమా నచ్చకపోవడం అన్నది నాలుగో రకం ఫ్లాపు.

వీటిలో మొదటి రకం ఫ్లాపును, నిర్మాత బడ్జెట్ ను తగ్గించుకోవడం ద్వారా అధిగమించవచ్చని తను చేసింది అదీ అంటున్నాడు వర్మ.మరి మిగిలిన మూడు ఫ్లాప్స్ గురించేమంటే చెప్పట్లే..

ఛార్మి, సాయి రామ్ శంకర్ ల వెడ్డింగ్

ఆ మధ్య సూపర్ హిట్ ఐన తను వెడ్స్ మను చిత్రాన్ని తెలుగులో అనువదించే హక్కుల కోసం పోటిబడ్డ నల్లమలపు బుజ్జి, దిల్ రాజులు చివరకి ఈ శిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాలని నిర్ణయించుకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఓ వైపు రేమకే హక్కులపై సంప్రదింపులు జరుపుతూనే మరో వైపు నటీనటులేవరన్న విషయమై చర్చ జరుపుతున్నారట. కాగా ఈ చిత్రంలో హీరో హీరొయిన్ లుగా నటించేందుకు ఛార్మి, సాయి రామ్ శంకర్ లని ఎంపిక చేసినట్లు సమాచారం. మను వెడ్స్ తను పేరు పెట్టాలన్న యోచన చేస్తుండగా వెడ్డింగ్ అన్నపేరు కోడా పరిశీలనలో ఉన్నట్లు మరో భోగట్టా.

రెండో మొగుడు.. రెండో పెళ్ళాం...సరిజోడీ


జి - బృందావన్ కాలనీ సినిమాలో సోనియా అగర్వాల్... ఆపై ఆ చిత్ర ద్రసకుడు సెల్వ రాఘవాన్ని ప్రేమినిచ్ పెళ్ళాడింది... వేరి పెళ్లి జరిగి, మూడేళ్ళు కాపురం వెలగ బెట్టినా ... అన్యోన్యత కొరవడి చివరకి విడాకులకి దారితీసిన విషయం తెలిసిందే... తాజాగా సెల్వ రాఘవన్ తన తన తోటి సహాయ దర్సకురాలిని రెండో పెళ్ళాడేసి ఎంచక్కా హప్ప్య్గా జీవతం సాగిస్తుంటే.. నేనేం తక్కువ తిన్నానా అని సోనూ కూడా సుదీప్ అనే కన్నడ హీరోని తగులు కుందట.. ఇప్పటికే సుదీప్ తన తొలి పెళ్ళాం కి గుడ్ బై చెప్పి చాన్నాళ్ళు అవుతుండటంతో దొరికిందే చాన్స్ అంటూ సోనూని వెంటేసుకొని కనిపించిన చోటుకల్లా తిప్పుతూ తెగ ఆనందిచేస్తున్నారు. వీరి చెట్టపట్టాలు చూసే వాళ్ళు రెండో మొగుడు.. రెండో పెళ్ళాం సరిజోడీ అంటూ సెటైర్స్ వేస్తున్నా పట్టించుకోకుండా .. మా మధ్య ఉన్నదే స్నేహం మాత్రమె అంటూ తెగ కోతలు కోసేస్తుంటే.. ముక్కున వేలేసుకోవటం మినహా మనమేం చేయగలం.

6, మార్చి 2011, ఆదివారం

ఉద్యమాలవల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది

వీధి పోరాటాల ద్వారా రాష్ట్ర విభజన జరగదని మాజీ సీఎం కె. రోశయ్య అన్నారు. స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఆయన విజయవాడ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ , సమైక్యాంధ్ర ఉద్యమాలవల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడడం మినహా జరిగేది ఏమీ ఉండదన్నారు. ప్రజాస్వామ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే విధంగా ఆందోళనలు చేయడం పౌర హక్కులకు విఘాతం కల్పించటమేనని రోశయ్య అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర విభజన అంశంపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక సూచించిన అంశాలను కేంద్ర ప్రభుత్వం కూలంకషంగా పరిశీలిస్తోందన్నారు. దీనిపై కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికైనా అందరూ కట్టుబడి ఉండాలని హితవు చెప్పారు.

Mutyalamuggu at andhrajyothy.com International News»  అపర కుబేరుడు ముబారక్

ప్రపంచంలోకెల్లా ధనవంతుడెవరు?.. ఈ ప్రశ్నకు సమాధానంగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మొదలుకొని ప్రముఖ వ్యాపారవేత్తలు పేర్లు చెప్పేందుకు మనం యత్నిస్తాం. అయితే.. ఇకపై మనం హోస్నీ ముబారక్ పేరు చెప్పాల్సి ఉంటుంది. ఈజిప్ట్‌లో.. గద్దె దిగిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు ముబారక్‌కు ప్రపంచవ్యాప్తంగా రూ. 31 లక్షల కోట్ల (70 బిలియన్ డాలర్లు) ఆస్తులున్నాయని.. బ్రిటిష్ పత్రిక 'ది గార్డియన్' శనివారం తెలిపింది.

ఇలా 70 బిలియన్ డాలర్ల సంపదతో.. ప్రపంచంలో ఇప్పటి వరకు అత్యధిక ధనవంతులైన మెక్సికన్ వ్యాపారవేత్త కార్లోస్ స్లిమ్ ( 53.5 బిలియన్ డాలర్లు), మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు (53 బిలియన్ డాలర్లు) బిల్ గేట్స్‌ను ముబారక్ వెనక్కు నెట్టారు.

బురఖాలు ధరించేవారికి ఫైన్

ఫ్రాన్స్‌లో ఇకనుంచి బురఖాలు ధరించేవారికి ఫైన్ వేయనున్నారు. బురఖాలు ధరించడాన్ని నిషేధిస్తూ గత ఏడాది ఫ్రాన్స్ నిర్ణయం తీసుకుంది. అది ప్రస్తుతం పూర్తి స్థాయిలో అమలులో లేదు. అయితే, వచ్చే నెల 11 నుంచి బురఖాలపై నిషేధాన్ని కఠినంగా అమలు చేయనున్నారు. ఒకవేళ్ల బురఖాలు ధరించినప్పటికీ, పోలీసులు అడిగినప్పుడు,

వాటిని తొలగించకపోతే వారిని జైలుకు తీసుకెళ్లి విచారణ చేపట్టొచ్చు లేదా వారికి సుమారు రూ.10 వేల (208 డాలర్లు) వరకు ఫైన్ వేయొచ్చు. అయితే, దీనిపై కొన్ని ముస్లిం సంస్థల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిని అలుసుగా తీసుకుని పోలీసులు అతిగా ప్రవర్తించే అవకాశం ఉందని అవి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

కిరణ్ పాలన రాక్షసపాలనను తలపిస్తోంది

ఎమ్మెల్సీ ఎన్నికలకు జగన్ వర్గం పోటీ చేయడంలేదని అంబటి రాంబాబు తెలిపారు. జగన్ పార్టీ ఏర్పాటుచేయకుండా ఎన్నికల్లో పోటీ చేయబోమని పేర్కొన్నారు. తమ వర్గంలో ఉన్నవారు మనస్సాక్షి ప్రకారం వ్యవహరించాలని చెప్పామన్నారు. టీఆర్ఎస్, జగన్ కుమ్మక్కయ్యారని వస్తున్న ఆరోపణల్లో నిజంలేదన్నారు. చంద్రబాబునాయుడు, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం కుమ్మక్కవుతున్నారని ఆయన ఆరోపించారు. కిరణ్ కుమార్ రెడ్డి 100 రోజుల పాలన రాక్షసపాలనను తలపిస్తోందని విమర్శించారు.

తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే 168 మంది ఎంపిల మద్దతు

: పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే ఎన్డీఎ తరపున 168 మంది ఎంపిల మద్దతు ఉంటుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. టిడిపివి ఊసరవెల్లి రాజకీయాలని ఆయన విమర్శించారు. ఒక్క బిజెపి మాత్రమే ఢీల్లీ నుంచి గల్లీ వరకు ఒకే విధానాన్ని అనుసరిస్తుందన్నారు.

బరిలో నుంచి తప్పుకున్నా : కుమార్‌రాజా

స్థానిక సంస్థల కోటాలో శాసన మండలికి జరగనున్న ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థిగా పోటీచేస్తున్న చిట్టాబత్తుల కుమార్‌రాజా బరిలో నుంచి తప్పుకున్నారు. ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యాక ఆదివారం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

మిలియన్ మార్చ్'పైనిర్ణయం తీసుకుంటా

తెలంగాణ జెఎసి హైదరాబాద్'లో ఈ నెల 10వ తేదీన చేయ తలపెట్టిన మిలియన్ మార్చ్'ని వాయిదా వేయాలని చాలామంది కోరుతున్నారని..జెఎసి నేతలతో మాట్లాడిన తరువాత దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చెప్పారు.

ఆస్తికోసమే కృష్ణవేణిని హతం చేశా

ఆస్తికోసమే కృష్ణవేణిని హతం చేశానని నిందితుడు, కృష్ణవేణి భర్త రవికుమార్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఆస్తికోసమే ప్రేమించి పెళ్లి చేసుకున్నానని నిందితుడు పోలీసుల ముందు అంగీకరించాడు. తన పేరు మీద ఆస్తిని రాయడానికి నిరాకరించడంతో తాను గొంతుకోసి కృష్ణవేణి హత్యకు పాల్పడ్డానని విశాఖ పోలీసుల ముందు రవికుమార్ నేరాన్ని అంగీకరించాడు.

ఒకరిద్దరిని మేధావులుగా గుర్తించడంలే...

మేధావుల సభకు తాము హాజరుకాలేదని ప్రొఫెసర్ కోదండరాం, మల్లెపల్లి లక్ష్మయ్యలు స్పష్టం చేశారు. ఒకరిద్దరిని తాము మేధావులగా గుర్తించడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజన మేధావులతో పరిష్కరించేది కాదని తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు మల్లెపల్లి లక్ష్మయ్య అన్నారు. ఆదివారం ఆంధ్ర, తెలంగాణకు సంబంధించిన మేధావులు కొందరు రహస్యంగా సమావేశమయ్యారు.

9 నుంచి అరసవల్లిలో అద్భుత కిరణస్పర్శ

: ఉత్తరాయణ, దక్షిణాయన మార్పుల్లో భాగంగా ఈ నెల 9, 10, 11, 12 తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి «ద్రువ మూర్తిని ఆదిత్యుని తొలికిరణాలు తాకే అద్భుత దృశ్యం ఆవిష్కాృతం కాబోతోంది. స్వామి పాదాలమీద మొదలై శిరో భాగం వరకు సూర్యకిరణాలు ప్రసరించే ఈ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు అరసవల్లి తరలివస్తారు. కిరణాలు తాకినప్పుడు మూలవిరాట్ బంగారు ఛాయలో మెరిసిపోయే కమనీయ దృశ్యం భక్తులకు కనువిందు చేస్తుంది. గత ఏడాది 9,10 తేదీల్లో సూర్యుడు మబ్బులు మధ్య దోబూచులాడడంతో ఈ అపురూప దృశ్యం తిలకించే అవకాశం 11న మాత్రమే భక్తులకు కలిగింది. ఇదిఇలా వుండగా, గతంలో అపురూప దృశ్యం ఆవిష్కరణ సమయంలో తలుపులు మూసివేయడంతో భక్తులు ఇబ్బంది పడిన విషయాన్ని ఆలయ ఈవో ఎన్.ముత్యాలరావుతో ఆదివారం 'ఆన్‌లైన్' ప్రస్తావించగా కిర ణస్పర్శ కొన్ని క్షణాలు మాత్రమే ఉండటంతో క్యూలైన్లలో పరిమిత సంఖ్యలో భక్తులు చూసేవీలుంటుందని, అందువల్ల ఆ రోజుల్లో సూర్యోదయ సమయానికి ముందే భక్తులు ఆలయానికి చేరుకోవాలని సూచించారు.

5, మార్చి 2011, శనివారం

12వ శతాబ్దంనాటి పాండవుల నిర్మిత ఆలయం

గోవాలోని మహాదేవాలయం 12వ శతాబ్దంనాటిది. దక్షిణ గోవాలోని తంబ్డెసుర్లాలోని అన్మోద్‌ ఘాట్‌ అడవులలో ఈ గుడి వుంది. ఈ ప్రాంతాన్ని భగవాన్‌ మహావీర్‌ అభయారణ్య ప్రాంతమంటారు. స్థానికుల కథనం ప్రకారం త్రాచుపాములు ఆ గుడిలో సంచరిస్తాయట. ఈ ప్రాంతంలో రబడానది పాయలుగా ప్రవహించి మాండోవీలో కలుస్తుంది. ఇక్కడ నెమళ్లు కానవస్తాయి. మహాదేవ ఆలయాన్ని 12వ శతాబ్దంలో కాదంబులు నిర్మించారట. శిల్ప నిర్మాణం యాదవ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఈ దేవాలయంలో గర్భగృహం, స్థంబాల మండపం వున్నాయి. తల లేని నంది విగ్రహం కానవస్తుంది. హోయసాల, జైనుల సంస్కృతి శిల్ప సంపదలో కానవస్తాయి. కాదంబరాణి కమలాదేవి ఈ ఆలయాన్ని నిర్మించారంటారు. పాండవులు వనవాసంలో వుండగా, తొందర పడి ఈ ఆలయ నిర్మాణం చేశారనే వాదన వుంది. ఒకే రాత్రిలో నిర్మించిన కారణాన అసంపూర్ణంగానే వుందట.

తమిళ్‌ వైపు తాప్సీ చూపు

'ఝుమ్మందినాదం' సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన అందాలతార తాప్సీ ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పరిచయం చేసిన నాయిక అంటే కొత్త సినిమాలు వెతుక్కుంటూ రావాలి కానీ తాప్సీకి మాత్రం దానికి భిన్నంగా జరుగుతోంది. మలి చిత్రం విష్ణుతో కలిసి నటించిన 'వస్తాడు నా రాజు' సైతం నిరాశపరిచింది. తాప్సీతో పాటుగానే చిత్రరంగానికి వచ్చిన రిచా గంగోపాధ్యాయ, దీక్షాసేథ్‌ మాత్రం అవకాశాలు తన్నుకుంటూ పోతుండడం తాప్సీకి ఆశ్చర్యం కలిగిస్తోందట. దీంతో తన దృష్టి కేవలం తెలుగు చిత్రాలకే కాకుండా తమిళ చిత్రాలవైపు మళ్ళించింది. తమిళ అగ్రనటుడు సూర్య సినిమాలో నటించే అవకాశం తాప్సీని వరించిందని సమాచారం.

వెంకటేష్‌తో బెల్లంకొండ చిత్రం

వెంకటేష్‌ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్‌ ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వెంకటేష్‌తో ఇటీవలనే 'నాగవల్లి' చిత్రాన్ని తీసిన బెల్లంకొండ ఆయనతోనే మరో చిత్రాన్ని చేస్తుండటం ఓ విశేషం. ఇక గోపీచంద్‌ మలినేనికి దర్శకుడిగా ఇది ద్వితీయ చిత్రం. రవితేజ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో 'డాన్‌ శీను' చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తొలి చిత్రంతోనే హిట్‌ను కొట్టిన ఆయన ద్వితీయ చిత్రాన్ని వెంకటేష్‌ వంటి ప్రముఖ హీరోతో చేస్తున్నారు. కాగా ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

'అహనాపెళ్లంట' విజయానందం

చిన్న సినిమాలు ఆదరణ పొందితే అది పరిశ్రమకే ఆనందం. చిన్న సినిమా బాగుంటేనే పరిశ్రమ బాగుంటుంది అని అంటారు. తాజాగా విడుదలైన అహనాపెళ్లంట చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. పాతికేళ్ల క్రితం వచ్చిన జంధ్యాల అహనాపెళ్లంట ఇప్పటికీ క్లాసికల్‌ చిత్రంగా ఆదరణ పొందుతూనే ఉంది. అదే టైటిల్‌తో వచ్చిన ఈ చిత్రం కూడా వినోదానికి పెద్దపీఠవేస్తూ రూపొందించారు. ఈ చిత్రానికి లభిస్తున్న ఆదరణ దృష్ట్యా శనివారం ఫిలిం ఛాంబర్‌లో యూనిట్‌ సక్సెస్‌మీట్‌ ఏర్పాటుచేసింది. శ్రీహరి, దర్శక, నిర్మాతలు వీరభద్ర, అనీల్‌, సంగీత దర్శకుడు కుంచె రఘు, మాటల రచయిత శ్రీధర్‌, నటుడు నాగినీడు, సహదర్శకుడు సాయినాథప్రసాద్‌, డ్రాగన్‌ ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అన్నిచోట్ల నుండి సూపర్‌హిట్‌ టాక్‌తో సినిమా ప్రదర్శింపబడుతోందని దర్శకుడు వీరభద్ర తెలిపారు. ఇంతటి విజయం సాధిస్తుందని శ్రీహరి ముందే చెప్పారు. నరేష్‌, బ్రహ్మానందం పాత్రలు సినిమాకు బలాన్నిచ్చాయి. ఇచ్చిన మాటకోసం నిర్మాత ఈ చిత్రాన్ని రూపొందించారని ఆయన పేర్కొన్నారు.
పాజిటివ్‌ ఎనర్జీతో ఈ చిత్రం తీసినట్టు నిర్మాత చెప్పారు. శనివారం నుండి యూనిట్‌ విజయయాత్రలో పాల్గొంటుంది. వైజాగ్‌, కాకినాడ, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, హైదరాబాద్‌లో ఈ యాత్ర జరుగుతుందన్నారు.
శ్రీహరి మాట్లాడుతూ వీరభద్రం వినిపించిన కథలో కొత్తదనం ఉంది. తొలుత అతడిపై నమ్మకం లేనప్పటికీ, కథ వివరించాక నమ్మకం కలిగింది. నిర్మాత చక్కగా ప్లాన్‌ చేసి చిత్రీకరణ జరిపారు. ఇతర యూనిట్‌ సభ్యులంతా పూర్తిసహకారాన్ని అందజేశారు. రీమిక్స్‌ పాటకు మంచి స్పందన లభిస్తోంది అన్నారు. ఈ సమావేశంలో మిగతా యూనిట్‌ సభ్యులంతా తమ స్పందన తెలియజేశారు.

'కారాలు... మిరియాలు' పాటలు

బ్లూరే ప్రొడక్షన్స్‌ నిర్మించిన 'కారాలు... మిరియాలు' పాటల విడుదల కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. ప్రముఖ నిర్మాత డాక్టర్‌ డి.రామానాయుడు, ప్రసాద్‌ ల్యాబ్‌ అధినేత రమేష్‌ ప్రసాద్‌ అతిథులుగా విచ్చేసి ఆడియో విడుదల చేశారు.
స్వీయదర్శకత్వంలో పసుపులేటి వెంకటరామారావు నిర్మించిన ఈ చిత్రానికి ప్రవీణ్‌కృష్ణమూర్తి, విద్యాధరణి సంగీతం అందించారు. ఆడియో విడుదల కార్యక్రమంలో ఇంకా సంగీత దర్శకుడు చక్రి, నటి రత్నసాగర్‌, ప్రసన్నకుమార్‌, శివచెన్ను, రవీంద్ర పెండ్యాల, చిత్రకథానాయకుడు నవకేశ్‌, మహేష్‌రాయల్‌, రాఘవయ్య, సునీల్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్‌ డి.రామానాయుడు మాట్లాడుతూ 'కొత్తవారితో, విదేశాల్లో తీసిన ఈ చిత్రం పేరు మాత్రం తెలుగుదనంతో ఉంది. రిస్క్‌తో సినిమా ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలి. కథబాగుంటేనే సినిమా ఆదరణ పొందుతుంది. ఇలాంటి చిన్న చిత్రాలు ఇంకా రావాలి' అన్నారు.
'ఈ సినిమా యూనిట్‌ అంతా యువకులే. వారిని చూస్తుంటే ముచ్చటేస్తోంది. వారిలో ఆత్మవిశ్వాసం ఉంది. ఇలాంటి చిన్న చిత్రాలను ప్రోత్సహంచాల్సిన బాధ్యత అందరిపై ఉంది' అని రమేష్‌ప్రసాద్‌ పేర్కొన్నారు.చక్రి మాట్లాడుతూ 'ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్న జంట మ్యూజిక్‌ డైరక్టర్లకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. పాటలు బావున్నాయి' అన్నారు.
దర్శక, నిర్మాత పసుపులేటి వెంకటరామారావు మాట్లాడుతూ 'ఈ చిత్రాన్ని విదేశాల్లో చిత్రీకరించాం. కొత్త ఆలోచనతో తీసిన ప్రేమకథా చిత్రమిది. నేటి ట్రెండ్‌కు అనుగుణంగా ఉంటుంది' అని చెప్పారు.
ఈ చిత్రంలో నవకేష్‌, మధుశాలిని, రత్నసాగర్‌, లండన్‌ సునీల్‌, హాలీవుడ్‌ నటుడు హ్యారీపోటర్‌ ఫేమ్‌ మైఖేల్‌గామన్‌ నటించారు.ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్‌కృష్ణమూర్తి, విద్యాధరణి, ఛాయాగ్రహణం: మహేష్‌రాయల్‌, పాటలు; రవీంద్రపెండ్యాల.

పోటీ పడి పెరుగుతున్న బంగారం,వెండి

న్యూఢిల్లిd: ఆల్‌టైం రికార్డు స్థాయి ధరలను కొనసాగించడంలో విలువైన లోహాలు పోటీ పడుతున్నాయి. గత కొద్ది వారాలుగా బంగారం, వెండి మధ్య జరుగుతున్న ధరల పెరుగుదల యుద్ధం మరింతకాలం కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. శనివారం నాటి బులియన్‌ సెషన్‌లో వెండి ధర ఏకంగా 1600 పెరిగి 53,200 రూపాయల సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరింది. స్టాండర్డ్‌ బంగారం ధర 10 గ్రాములకు క్రితం ముగింపుతో పోలిస్తే 175 రూపాయలు పెరిగి 21,220 రూపాయలకు చేరింది. ప్రస్తుతం కొనసాగుతున్న పెళ్ళిళ్ల సీజన్‌లో బంగారు ఆభరణాలు, వెండి వస్తువుల కొనుగోళ్ళు సంతృప్తికరంగా సాగుతున్నాయని, అందువల్లే విలువైన లోహాల ధరల పెరుగుదల కొనసాగుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. కాగా, వారాంతంలో డెలివరీ అయ్యే వెండి ధర కిలోకు 655 రూపాయలు పెరిగి 52,300 రూపాయలకు చేరగా, 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర 175 రూపాయలు పెరిగి 21,100 రూపాయలకు చేరింది. వంద వెండి నాణాల కొనుగోలు ధర 55,800, అమ్మకం ధర 56,300 రూపాయలుగా కొనసాగింది. అటు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి ధర 31 సంవత్సరాల గరిష్ఠస్థాయిలో 35 డాలర్లకు చేరింది. లిబియాలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతుండడం, ప్రత్యామ్నాయ పెట్టుబడులకు బులియన్‌ మార్కెట్‌ అవకాశాలను అందిస్తుండడంతో ఔన్సు బంగారం ధర 17.5 డాలర్లు పెరిగి 1432.80 డాలర్లకు పెరిగింది.

యునెస్కో గుర్తించిన దేవాలయం

వెయ్యి సంవత్సరాల క్రితం చోళుల వంశానికి చెందిన రాజరాజ చోళులు తమిళనాడులోని తాంజావూరు జిల్లాలోని పెరుఉడయార్‌ శివునిగుడిని నిర్మించారు. దీనినే బృహదీశ్వర ఆలయం అనికూడా పిలుస్తారు. ఈ మధ్య యునెస్కో ఈ దేవాలయాన్ని గొప్ప చోళదేవాలయం అని గుర్తించింది. తమిళ నాడు దేవాలయాలకు ప్రసిద్ధి. ప్రభుత్వ లోగోకూడా దేవాలయమే. గతంలో మొఖల్‌లు, భౌముని సుల్తానులు, తురుష్కులుదాడిచేసిన దేవాలయాలు చెక్కు చెదరలేదు. బృహదీశ్వరాలయం సంస్కృతి, చిత్రకళ, శిల్పసౌందర్యం, మతం, భాషలకు పెట్టింది పేరు. చోళుల వంశం సముద్రతీరంవరకు విస్తరించింది. ఈ దేవాలయం 1010లో నిర్మితమైంది. దీని ప్రత్యేకత ఏమనగా విమాన గోపురం 2016 అడుగుల ఎత్తున వుంటుంది. ఎనిమిది టన్నులు గల స్థూపాన్ని 100 అడుగుల్లో నిర్మించారు. దీనినే 'సారపళ్ళమ్‌' అంటారు. ఒకటవ రాజరాజచోళుడు 985 నుండి 1014 వరకు పాలన చేశారు. శివుని చెంతన శాంతిని గ్రహించాడు. రాజరాజచోళుడు మిలట్రీని విస్తరించడంలో, స్థానిక వ్యవస్థను కట్టుదిట్టం చేయడంలో నేర్పరి.
బృహదీశ్వర ఆలయంలో మరొక ప్రత్యేకత నంది విగ్రహం. ఇక్కడ బృహన్నాయకి, గణపతి, సుబ్రహ్మణ్య, దక్షిణామూర్తి, నటరాజ, విగ్రహాలను సుందరంగా తీర్చిదిద్దారు. ఇక్కడ పెయింటింగులు అందరినీ ఆకర్షిస్తాయి. 17వ శతాబ్దికి చెందిన ఈ కళాఖండాలు ఎంతో సుందరంగా వుండి ఏ మాత్రం చెక్కు చెదరలేదు. ఈ ఆలయంలోని మరొక గోడపై శ్వేత ఐరావతంపై సుందరమూర్తి నాయనార్‌, వెళ్లడం కానవస్తుంది. మరొక చోళరాజరాజ గురువైన కరువూర్‌ దేవర్‌ పెయింటింగ్‌ కానవస్తుంది.
శివుని 81 నాట్యభంగిమలను ఈ దేవాలయ ప్రాకారాలపై చూడవచ్చు. మొత్తం నాట్యశాస్త్రమే ఇక్కడ కళ్లకు కట్టినట్టు గోచరిస్తుంది. ఓ రోజు ప్రధాన స్తపతి నంది విగ్రహం తదేక దృష్టితో చెక్కుతుండగా రాజరాజ రాజువెళ్ళి ఆ స్తపతి పక్కనే నుంచొని చూస్తున్నాడు. స్తపతి తన సేవకుడే పక్కన వున్నాడని తలచి తనకు ఒక కిళ్లిdని కట్టి ఇవ్వమన్నాడు. రాజు ఇచ్చిన కిళ్లిdని స్తపతి చూడకుండానే నోట్లో వేసుకున్నాడు.
స్తపతి తన పక్కన వున్నది రాజని గుర్తించక ఈ గొప్ప నందివిగ్రహాన్ని చెక్కిస్తున్న రాజుగారిని ప్రశంసిం చాడు. తరువాత పాన్‌ తింటున్న కిళ్లిd ద్వారా వచ్చిన ఉమ్మిని ఉయ్యటానికి పాత్రను ఇవ్వమన్నాడు. రాజు ఆ పాత్రను అలాగే ఇచ్చాడు. స్తపతి దానిలో ఉమ్మివేసి రాజును చూసి నిర్ఘాంతపోయాడు. వెంటనే పాదాక్రాంతుడై క్షమాపణలు వేడుకున్నాడు. రాజు స్తపతిని లేవనెత్తి కౌగలించుకొని సప్తతికి సపర్యలు చేయడం తనకు ఎంతో ఆనందం కలిగించిందన్నాడు.
రాజరాజుకు ఇతరమతాలపై కూడా విశ్వాసం మెండు. నాగపట్నంలోని బౌద్ధుల విహారానికి ఒక గ్రామాన్నే కేటాయించాడు. బృహదీశ్వరాలయం తమిళ శైవ సిద్ధాంతానికి ప్రతీక. శివుడు సృష్టికర్త అలాగే రక్షకుడు, ధ్వంసకుడు కూడా. కర్మ నుండి విముక్తికై శివసాయుజ్యం పొందాలన్నాడు. శివునిలో అంతర్లీనం కాక పోయినా పాదాలవద్ద బిడ్డలుగానైనా ఉండాలన్నాడు. నటరాజ విగ్రహం శైవ సిద్ధాంతానికి ప్రతీక. శైవ సిద్ధాంతంలో దేవతారాధన ముఖ్యం.
నాయనార్‌ భక్తులు శివతత్వాన్ని ప్రచారం చేశారు. సంబంధర్‌, అప్పర్‌, సుందరమూర్తి, మాణిక్య వాసగర్‌, శైవాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. మాణిక్యవాసగర్‌ రాసిన తిరువాసగం ప్రసిద్ధిచెందింది.
రాజరాజచోళుడు సముద్రంలో ప్రయాణించేవాడు. అనేక ద్వీపాలను జయించాడు. యునెస్కో తంజా వూరులోని దేవాలయంకూడా హెరిటేజ్‌ సైట్‌గా గుర్తించడం ముదావహం.
తమిళనాడు సంస్కృతి పరిరక్షణలో తలమానికం వంటిది. ఈ దేవాలయ పరిరక్షణకు అందరూ నడుంబిగించాలి.
- దండు కృష్ణవర్మ

ఢిల్లీ నుండి కేసీఆర్‌ ఎందుకొచ్చేసాడో?

ప్రత్యేక తెలంగాణపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే సోనియా గాంధీని పార్లమెంట్‌లో నిలదీయాలని.. తెరాస అధినేత కేసీఆర్‌పై తెలుగుదేశం శాసనసభా పక్షం తీవ్ర స్ధాయిలో విరుచుకు పడింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర శనివారం మీడియాలో మాట్లాడుతూ....తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వంతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.

తెలంగాణా ఇచ్చేది కేంద్రమే అయినప్పుడు..అక్కడ నిలదీసి తెలంగాణా సాధించుకు వస్తానని ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌ సోనియా ఇంటి ముందు కూర్చొనకుండా ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా పోరాటాలు చేస్తాం అనియూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు లాలూచీపడి, కుమ్మక్కై కేసీఆర్ ఢిల్లీ తిరిగి వచ్చేయటం వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీసారు.

సహాయ ‘నిరాకరణ”కు మేం ఒప్పుకోం

ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందాల మేరకు సహాయ నిరాకరణని తాత్కాలికంగా నిలపి వేసున్న తెలంగాణా ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించడం పట్ల ఆదిలాబాద్‌ ఉద్యోగ సంఘాల నేతలు విరుచుకు పడుతున్నారు.
ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో ఏక పక్ష నిర్ణయాలు తీసుకుని జేఏసీ నేతలు లాలూచీ పడి సహాయ నిరాకరణని విరమింప చేసారని ఆరోపించారు. తెలంగాణా ఉద్యోగ జేఏసీతో సంబంధం లేకుండా తాము ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని... తెలంగాణా వచ్చే వరకు తమ జిల్లాలో సహాయ నిరాకరణ కొనసాగుతుందని తేల్పి చెప్పారు.

అబ్బే! నేను పోటీ చేయట్లే....

తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగేందుకు సిద్దమవుతున్నట్లు వసున్న కధనాలను ఖండించారు పిసిసి ఛీఫ్‌ డి.శ్రీనివాసరావు. శనివారం ఆయన మీడియాలో మాట్లాడుతూ...... ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కావాలని తాను అధిష్టానవర్గంని కోరలేదని, బరిలో తాను లేనని స్పష్టం చేశారు తన భవిష్యత్'ని ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా నిర్ణయిస్తారని చెప్పారు.
కడప జిల్లాలో తెలుగుదేశం పార్ధీకి చెందిన వారితో రాష్ట్ర మంత్రులు సమావేశమై విందు రాజకీయాలు నడపడం ఆశ్చర్యమేమీ లేదని... వారికి బలంలేదు... ఆ స్ధానంలో తమ అభ్యర్ధికి ఓటు వేయించాల్సింది కోరటంలో తప్పేముంది.రాజకీయాలలో శాశ్విత శత్రువులు, శాశ్విత మిత్రులు ఉండరని, ఎన్నికలలో గెలుపు కోసం ఎవరి సహాయమైనా కోరవచ్చునని..దీనిని కొందరు అనవసర రాధ్ధాంతం చేస్తున్నారని జగన్‌ వర్గాన్ని ఎత్తి పొడిచారు డి.శ్రీనివాస్‌.

కాంగ్రెస్‌ - డిఎంకెల మధ్య సీట్ల చిచ్చు

తమిళనాట కాంగ్రెస్‌ - డిఎంకెల మధ్య ఎన్నికల అవగాహన చిలికి చిలికి గాలి వానగా మారి చివరికి కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వానికి ఎసరు పెట్టినట్లు ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధిక సీట్లు కేటాయించాలనటం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు.

ఈనేపథ్యంలో కరుణానిధి శనివారం మీడియాతో మాట్లాడుతూ డీఎంకె-కాంగ్రెస్‌ల మధ్య ఇంకా సీట్ల సర్థుబాట్లు పూర్తి కాలేని..తగినంత బలం లేకుండా ఎక్కువ సీట్లు ఆశించడం న్యాయం కాదన్నారు. కాంగ్రెస్ వైఖరి ఇలాగే కొనసాగితే కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకుంటామని కరుణ హెచ్చరించారు. ఈరోజు సాయంత్రం జరిగే సమావేశంలో కాంగ్రెస్‌తో పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

అది శాసనసభ? సీమాంధ్ర సభ? : తెరాస

తెలంగాణ సభ్యులు లేకుండా శాసనసభా సమావేశాలను నిర్వహించుకుంటున్నారని, అది సీమాంధ్ర శాసనసభగా నడుస్తోందని తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు విమర్శించారు. ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డిని చంద్రబాబు కాపాడుతున్నారని..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి..సమైక్యాంధ్ర కుట్ర చేస్తున్నారని, ఇద్దరు కుమ్మక్కు కావడం వల్లనే చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

కుమ్మక్కులో భాగంగానే కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చంద్రబాబును కలిశారని, తెలుగుదేశం నాయకులు తమ ఎంపిటీసీ సభ్యులను కాంగ్రెసుకు అప్పగిస్తున్నారని, రాష్ట్ర మంత్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు వెళ్తున్నారని..ప్రజా ప్రయోజనాల కన్నా సొంత ప్రయోజనాలే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిరెడ్డికి ముఖ్యంగా మారాయని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు

నిన్న రాత్రి చంద్రబాబు నివాసంలో జరిగిన సీమంధ్ర, తెలంగాణా తెలుగుదేశం ఎమ్మెల్యే ల సమావేశం ఫలితాలనిచ్చింది. ప్రతిరోజూ అసెంబ్లీని స్తంభిపచేయటం ద్వార ప్రజల్లో చెడ్డపేరు రావటమే కాకుండా... అధికార పార్టీ తప్పిన్చుకొనేందుకు అవకాశం ఇస్తున్నామని, ఇప్పటికే ఉద్యోగులు సహాయ నిరాకరణను విరమించటంతో సమావేశాలు సజవుగాజరిగేల అంతా హాజరు కావాలని బాబు తేల్చి చెప్పడంతో నిన్నటి వరకు అసెంబ్లీని భహిష్కరించిన టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యేలు నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.

మిలియన్ మార్చ్ వాయిదా?

ఈ నెల పదవ తేదీన తెలంగాణ రాజకీయ జేఏసీ తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ మిలియన్ మార్చ్ ఆందోళనను వాయిదా వేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారమ రాత్రి వరకు పలుమార్లు సమావేశమైన నేతలు మోడి పట్టుదలకి పోయి విద్యార్థుల జీవితాలతో అడుకొంతున్నమన్న అపప్రద తెచ్చుకొనే కన్నా పరీక్షలు పూర్తయిన తర్వాత విద్యార్థులతో ‘చలో సెక్రటేరియట్’ నిర్వహించ డమే మంచిదని చెప్పడంతో. వాయిదా విషయాన్ని ఆలోచిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే యుద్యోగు లు సహాయనిరాకరణ విరమించుకోవటం, మిలియన్ మార్చ్ పై హై కోర్ట్ నోటీసులు జారీచేయటం కూడా జెఎసి పునరాలోచనలో పడ్డట్టు కనిపిస్తోంది.

4, మార్చి 2011, శుక్రవారం

వాళ్ళిద్దరికీ చెరొకటిస్తారట......

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసాక చిరంజీవి గ్యాంగ్‌కి మంచి ఛాన్సే దొరికింది. తాజాగా ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డితో చిరంజీవి జరిపిన చర్చలు ఫలించి పీఆర్పీకి ఓ ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. అలాగే ఎంఐఎంకి కూడా ఓ ఎమ్మెల్సీ సీటు ఖాయంగా కనిపి స్తోంది.

శాసన సభ్యుల కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యేందుకు ఆశావాహులు పదుల సంఖ్యలో క్యూలో ఉన్నప్పటికి తాజా రాజకీయ పరిణామాలలో పీఆర్పీ, ఎంఐఎంల ఎమ్మెల్యేల సహకారం అవసరం కావటంతో చెరో సీటు ఇచ్చేందుకు ఇప్పటికే కాంగ్రెస్‌ అధిష్టానం సూచించినా.. పీఆర్పీ రెండు సీట్ల కోసం పట్టుబట్టినా ఫలితం లేకపోయిందన్నది వాస్తవం.

మిలియన్‌ మార్చ్‌పై జెఏసీకి హైకోర్టు నోటీసులు

మిలియన్‌ మార్చ్‌ ప్రభావం ఇంటర్‌ విద్యార్ధుల పరీక్షలపై పడుతోందని... పరీక్ష జరుగుతుందని మంత్రి చెపుతుంటే, వాయిదా వేస్తూన్నట్లు ముఖ్యమంత్రి విపక్షాలకు హామీ ఇస్తూ అయోమయం సృష్టించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ... దాఖలైన పిటీషన్‌ని విచారణకు స్వీకరించింది.

వరంగల్‌ జిల్లాకు చెందిన సాంబరాజు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్‌లో మార్చ్‌ 10న తెలంగాణా ఐకాస ఆధ్వర్యంలో జరుగు మిలియన్‌ మార్చ్‌ కారణంగా ఇంటర్‌ పరీక్షని వాయిదా వేయాలని కోరటం సమంజసం కాదని.. ప్రస్తుత పరిస్ధితి కారణంగా లక్షలాది విదార్ధులు, వారి తల్లిదండ్రులు మానసికంగా ఆందోళన చెందుతున్నారని... పరీక్షలకు అడ్డకులు సృషించవద్దని ఆదేశాలివాలని కోరుకున్నారు.ఈ పిటీషన్‌ విచారణకు స్వీకరించిన కోర్టు తీవ్రంగా స్పందిస్తూ..రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై తీసుకున్న చర్యలని వివరించాలని ఆదేశాలివ్వటమే కాకుండా మిలియన్‌ మార్చ్‌ నిర్వహిసున్న తెలంగాణా ఐకాసకు, ఉద్యోగ జేఏసీకి కూడా నోటీసులు జారీ చేసింది.

సాక్షాలు లేక భోఫర్స్‌ కేసు మూసేసారు..

కాంగ్రెస్‌ అవినీతి భాగోతమంటూ దేశాన్ని ఓ కుదుపు కుదిపిన బోఫోర్స్ కేసుని మూసివేశాయడానికి ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. తాము విచారణ జరుపుతూ ఏళ్లు గడుస్తున్నా.. ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు లభించనందున కేసుని మూసివేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టుని సిబిఐ కోరింది.

సిబిఐ పిటీషన్‌ని పరిశీలించిన హైకోర్టు వారి విన్నపాన్ని మన్నిస్తూ.. కేసు ఉపసంహరణకు సూచన ప్రాయంగా అంగీకరించడంతో.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఖత్రోచిపై కేసుని వెనక్కి తీసుకునేందుకు రంగం సిద్దం చేస్తోంది.

ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదు

తెలంగాణపై రోజంతా పార్లమెంట్‌ను స్తంభింపజేసినా కేంద్రం నుంచి ఎటువంటి స్పందనాలేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం పార్లమెంట్ నుంచి వాకౌట్ చేసిన అనంతరం ఆయన ఢిల్లీలోని మీడియా సమావేశంలో మాట్లాడుతూ రోజంతా పార్లమెంట్‌ను స్తంభింపచేసినా కేంద్రంలో స్పందన కరువైందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో.. ప్రజలు రోడ్డుపైకి వచ్చినా, ఉద్యోగుల సహాయనిరాకరణ జరుగుతున్నా, రాష్ట్రంలో పరిపాలన స్తంభించినా..తెలంగాణ కోసం 600 మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదని పేర్కొన్నారు.ఉద్యోగులు సహాయనిరాకరణ చేస్తున్నా..ఉద్యమాలు, రాస్తారోకోలు, రైల్‌రోకోలు.. చేస్తున్నా కేంద్రం దున్నపోతు మీద వర్షం పడినట్లు వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు.

పార్లమెంట్ లో తెలంగాణపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా తమతో గొంతు కలిపారని,పార్లమెంట్ లో తెలంగాణపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా తమతో గొంతు కలిపారని, బీజేపీ, ఇతర పార్టీల విజ్ఞప్తి మేరకు సభకు అడ్డుతగలకుండా వాకౌట్ చేశామని ఇక ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని, కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదని హెచ్చరించారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై..తమ రాజీనామాలపై నిర్ణయాన్ని ప్రకటిస్తామని అన్నారు.

అధిష్టానం మా గొంతులు నొక్కేస్తోంది...

నిన్న లోక్'సభలో తెరాస సభ్యులతో కల్సి తెలంగాణ కోసం నినాదాలు చేసిన అరుపులు కేకలు వేసిన కాంగ్రెస్ పార్టీ ఎంపిలు నోటికి నల్ల గుడ్డలు అడ్డు పెట్టుకుని వచ్చి లోక్‌ సభలో నిరసన తెలిపారు. మరోవైపు తెలంగాణా కావాలంటూ ప్లే కార్డులు ప్రదర్శించడం పట్ల స్పీకర్‌ మీరాకుమార్‌ ఆ విధంగా వ్యవహరించకూడదని..అసహనం వ్యక్తం చేసినా... ఫలితం లేకపోయింది.

ఓ దశలో పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పినా వారు పట్టించుకోకపోవటం కాంగ్రెస్‌ నేతలకు మింగుడు పడలేదు. నిన్న రాత్రి ప్రణాబ్‌తో సమావేశమైన ఎంపీలు అధిష్టానం తమ గొంతు నొకేస్తోందన్న అభిప్రాయం సర్వ్‌త్రా వినిపిస్తుండటంతో పాటు నిన్న రాజీ నామాలకు రడీ అయిన వారు నేడు నిరసనకే పరిమితం కావటం వెనుక ఆంతర్యం అంతు పట్టకుండా ఉందని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి.

జీతాల చెల్లింపునకు అoగీకరించిన ప్రభుత్వం

జీతాలు చెల్లించాలని ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు ప్రభుత్వం దిగివచ్చింది. ఎట్టకేలకు జీతాల చెల్లింపుకు ప్రభుత్వం అంగీకరించింది. శుక్రవారం సచివాలయం ఉద్యోగులు జీతాల కోసం సీఎం కార్యాలయం 'సి'బ్లాక్‌ ఎదుట బైఠాయించారు. తమ జీతాలు వెంటనే చెల్లించాలని వారు నినాదాలు చేశారు. దీంతో సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి వచ్చి ఉద్యోగులతో చ ర్చలు జరిపారు. జీతాలు చెల్లించేందకు ప్రభుత్వం అగీకరించటంతో ఉద్యోగులు ఆందోళన విరమించారు.

ఇంటర్‌ పరీక్ష వాయిదా కుదరదు...

ఈనెల 10వ తేదీన మిలియన్ మార్చ్ సందర్భంగా ఇంటర్ పరీక్షను వాయిదా వేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్ పరీక్ష వాయిదాపై మాధ్యమిక విద్యా శాఖమంత్రి, ముఖ్యమంత్రి ఇంటర్ బోర్డు అధికారులతో చర్చించి.. లక్షలాది విద్యార్ధుల భవిష్యత్‌ని దృషిలో ఉంచుకుని ఎట్టి పరిస్ధితిలోనూ వాయిదా వేయకూడదని నిర్ణయించారు. ఈమేరకు ఇంటర్ పరీక్ష యథాతథంగా జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షల నిర్వాహణకు ఉద్యోగులు సహాయ నిరాకరణ పేరుతో సహకరించకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లుకు రంగం సిద్ధం చేస్తోంది.పరీక్షల నిర్వహణపై అఖిలపక్షంతో కూడా చర్చించాలని.. రిటైర్డ్ లెక్చరర్లతో పరీక్షలు నిర్వహించాలని.... నిర్ణయించినట్లు సమాచారం.

జగన్ బలపడడానికి కారణమని మెయిలీని పీకి పారేశారు....

తెలంగాణా ఏర్పాటుపై ఏదో ఓ నిర్ణయాన్ని అధిష్టానం ప్రకటిస్తుందని యావత్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఎదురు చూస్తుంటే... కాంగ్రెస్‌ అధిషానం మాత్రం పార్టీలో ప్రక్షాళన ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటివరకూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా చక్రం తిప్పిన వీరప్ప మొయిలీ.. వై.ఎస్.జగన్ పట్ల చాలా మెత్తగా వ్యవహరించడం వల్ల జగన్ బాగా బలపడడానికి పరోక్ష కారణం కావడం వంటి అంశాలవల్ల ఆయనను మార్చి ఆయన స్థానంలో గతంలో ఇన్‌ఛార్జిగా పనిచేసిన గులాంనబీ ఆజాద్‌ను నియమించారు. అలాగే ఇటీవల పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై నిప్పులు చెరిగి, ఆమె దేశీయతని ప్రశ్నించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యత్వం నుంచి జి. వెంకటస్వామికి ఉద్వసన చెప్పారు.

కాగా తెలంగాణా వాదాన్ని బలంగా వినిపిస్తునే... అధినేతికి విధేయుడిగా ఉన్న సైతం సిడబ్ల్యూసి నుండి కె. కేశవరావుని తొలగించడం ఆశ్చర్యకరం ...అలాగే సీమాంధ్ర ప్రాంతాల నుండి ఎంపీలుగా ఉండి ఎలాంటి వాదనలు వినిపించని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కిశోర్ చంద్రదేవ్ లను కూడా తొలగించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా బి. సంజీవరెడ్డిని, మరోవైపు అధిష్టానం ప్రసన్నం పొందిన సీనియర్ నాయకులు పొంగులేటి సుధాకర్‌ రెడ్డికి, అధినేత్రిపై ఈగ వాలనీయకుండా చూసే వి. హనుమంతరావుకు కార్యదర్శులుగా నియమించారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సి.డబ్ల్యు.సి.) శుక్రవారం విడుదల చేసిన జాబితాలో రాష్ట్రానికి ప్రాతినిథ్యం లేకపోవడం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు దిగ్భ్రాంతి కలిగించింది.

3, మార్చి 2011, గురువారం

'హెల్‌'చల్‌-సెల్‌

''ఏంట్రా... పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావ్‌. మర్యాదగా నేను చెప్పినట్లు వింటావా? కాళ్లూ చేతులూ విరగ్గొట్టమంటావా'' అని బస్సులో చివరి వరసలో మాటల తూటాలు పేలడం విని, ముందు వరసలో కూర్చున్న మీరు... అక్కడ ఏదో యుద్ధం ప్రారంభం కాబోతుందని కంగారు పడితే, ఖచ్చితంగా తప్పులో కాలేసినట్లే! అది సెల్‌ఫోన్‌ బాగోతమై ఉంటుంది!!

గంటల తరబడి తన ప్రియుడితో సెల్‌ఫోన్‌లో శృంగార సంభాషణ చేసే అమ్మాయికి గానీ, అప్పు వసూలుకు ఫోన్‌ ద్వారా భయంకర హెచ్చరికలు చేసే ఆసామీకి గాని -తాము తోటి ప్రయాణీకులకు ఈ తరహా శబ్దకాలుష్యం ద్వారా బోలెడంత అసౌకర్యం కలిగిస్తున్నామనే 'కనీస జ్ఞానం' కూడా ఈ రోజుల్లో ఉండడం లేదు. ఇలాంటి సందర్భాలలోనే టెలిఫోన్‌ను కనిపెట్టిన అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ మీద అనవసరంగా ఆగ్రహం కలుగుతుంది. ఆయన పుట్టినరోజు (3.3.1847) సందర్భంగా సంతోషించడానికి బదులు విచారం కలుగుతుంది!

తాజా బడ్జెట్‌ ప్రభావం వల్ల మొబైల్‌ ఫోన్ల ధరలు తగ్గే 'ప్రమాదం' ఉంది కాబట్టి, ఇక కొత్తగా కొనుక్కునే వాళ్లు రెచ్చిపోతే, పరిస్థితి ఎలా ఉంటుందో... ఏమో!

ఒక మిత్రుడు ఆ పరిస్థితిని ఇలా కూడా ఊహించాడు. బిచ్చగాళ్లు సెల్‌ఫోన్ల ద్వారా ఎవరు ఏయే ఏరియాలకు వెళ్లాలో మాట్లాడుకుని ముందస్తుగానే నిర్ణయాలు తీసుకుంటారట. ఎక్కడైనా పెళ్లి లేదా అలాంటి వేడుక సందర్భంగా భోజనాలు గట్రా ఉంటే, ఆ సంగతి తక్కిన వాళ్లకు 'సెల్‌' ద్వారా తెలియజేసేలా 'జెంటిల్‌మన్స్‌ అగ్రిమెంట్‌' చేసుకుంటారట!

సెల్‌ఫోన్‌ చేత్తో పట్టుకుని మాట్లాడడానికి కూడా బద్ధకించే పెద్దమనుషులకు ఓ సదుపాయం ఉంది. మెడకు వైర్లు లాంటివి చుట్టుకుని ఉన్నవాళ్లు రోడ్డుమీద -గట్టిగా మాట్లాడుకుంటూ, చేతులతో పిచ్చి పిచ్చి విన్యాసాలు చేస్తూ వెళ్తుంటే, ఇదంతా సెల్‌ఫోన్‌ సంభాషణ అని తెలియని అమాయకులు 'పాపం.. పిచ్చోడిలా ఉన్నాడు' అని సానుభూతి చూపడమూ కద్దు. ఈ సెల్‌ఫోన్లు సినిమాల్లో కామెడీ ట్రాక్‌లు (హాస్యం విడిగా రాసి, తీసి కలపడన్నమాట!) రాసేవాళ్లకి మంచిచేసే 'ప్రమాదమూ' ఉంది. ఉదాహరణకు ఒక చిత్రంలో ఋణదాత అప్పుతీసుకున్న వాణ్ణి చివాట్లు పెడుతూ వస్తుంటే, ''నేను ఊళ్లోలేను స్వామీ... రాగానే ఇచ్చేస్తానుగా అంటూ ఋణగ్రహీత సమాధానం చెబుతూ వస్తుంటే -ఇద్దరూ ఒకరి కొకరు ఎదురవుతారు!

ఇక టెలివిజన్‌ సీరియల్స్‌లో ప్రధానపాత్రధారులెవరైనా షూటింగ్స్‌కు హాజరు కాలేని పరిస్థితి ఏర్పడినప్పుడు -తప్పనిసరిగా 'ఎపిసోడ్‌' టెలికాస్ట్‌కు అందించాల్సి వచ్చినప్పుడు -రచయిత, దర్శకులను ఈ టెలిఫోనే కాపాడుతుంది!

ఇవతల ఉన్న పాత్రధారి టెలిఫోన్‌ పట్టుకుని -తన 'గోడు' వెళ్లబోసుకుంటూ, అవతలి పాత్రధారి తరఫున జరిగే కథను తానే చెబుతుంటాడు. ''ఏమిటి... అనసూయ నిన్ను అంతమాట అందా. దాంతో నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావా... దిలీప్‌ నువ్వేనా ఆమాట అంటున్నది. మనం టాంక్‌బండ్‌ మీద కూర్చుని, ఒకపక్కన హుసేన్‌సాగర్‌ కంపుకొడుతున్నా కూడా... భవిష్యత్తు గురించి ఎన్ని మాటలు మాట్లాడుకున్నాం... ఎన్ని పథకాలు వేసుకున్నాం... అవన్నీ ఆ హుసేన్‌సాగర్‌లో కలిసిపోవలసిందేనా... అన్నట్లు ఆ రోజు జరిగిన సంగతి నీకు గుర్తుంది కదూ... (ఇది వరకు ప్రసారమైన ఒకటి రెండు సీన్లు ఫ్లాష్‌బ్యాక్‌లా మళ్లీ వేసేస్తే, మరికాస్త సమయం కలిసొస్తుంది!.. మరి మన ఆశలు, ఆశయాలు ఫలించాలంటే నువ్వు బ్రతికి తీరాలి దిలీప్‌... బ్రతికి తీరాలి...'' అని అలా ఆ 'ఏకపాత్రాభినయం' సాగుతూనే ఉంటుంది!

ఆ విధంగా గ్రాహంబెల్‌ గారి టెలిఫోన్‌ వల్ల ఆ తర్వాత సోదరుడిగా వచ్చిన సెల్‌ఫోన్‌ వల్ల ఈ ప్రపంచానికి ఎంతమంచి జరిగిందో, దాన్ని దుర్వినియోగం చేస్తున్న వారివల్ల అంత చెడు కూడా జరుగుతోంది. సెల్‌ఫోన్‌లో ఇలా 'అధిక ప్రసంగం' చేస్తే తొందర్లోనే నరాలు దెబ్బతిని, తొందరగా చచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నా ఎవరూ వినడం లేదు! సెల్‌ ద్వారా 'హెల్‌'కు వెళ్దామనే వారి కోరిక కాబోలు!

మూగజీవాల పరిరక్షణలో ముద్దుగుమ్మలు

హాలీవుడ్‌ భామ పామెలా ఆండర్సన్‌ మూగజీవాల హక్కుల కోసం నడుంబిగించింది. వన్య ప్రాణుల సంరక్షణ కోసం శ్రమిస్తున్న సంస్థ పెటా తరపున ఆమె ఇప్పుడు మూగజీవాల కోసం ఢిల్లిdలోని అఖిల భారత విజ్ఞాన సంస్థ పై ఓ కన్నేసింది.

ఈ సంస్థ (ఎఐఐఎంఎస్‌) నిర్వహిస్తున్న పరిశోధన లపై తీసిన వీడియోను చేజిక్కించుకుంది. ఆవీడియోలో కోతులను ఏ విధంగా పరీక్ష లకు గురి చేసిందీ చూసి చకితురాలైంది. ఈ ఘోరమైన టెస్టులనుండి కోతులను మినహాయించాలని సంస్థ డైరెక్టర్‌ ఆర్‌.సి. దేశాయ్‌కు ఫిర్యాదు చేసింది.

అంతేకాకుండా సంస్థలో పరిశోధనలు మానవీయ కోణంలో జరగాలని మెడికల్‌ సర్వీస్‌ సంస్థకు సలహాలు ఇచ్చింది. ఇది వరకే జంతు పరి రక్షణ చట్టం 2011 ప్రకారం జంతువులను టెస్ట్‌లకు ఉపయో గించరాదని వుంది. ఆయా పరీక్షలలో అవి విపరీతమైన బాధకు, భయా నికి గురవుతాయని డ్రాఫ్ట్‌ బిల్లులో పేర్కొ న్నారు. సంస్థలు నిర్వహించే పరీక్షలలో వాటికి ఎటువంటి బాధ కలుగకుండా శ్రద్ధవహించా లని, ఎప్పటికప్పుడు పరిశీల నకై, ప్రభుత్వేతర సంస్థలు, కేంద్ర జంతు ప్రదర్శన శాల, పశువుల వైద్యులను ఎంపిక చేసింది.

పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత, జంతు వుల పరిశోధనలలో వాటికి తీవ్రమైన బాధ కల్గితే, ఆయా పరిశోధనలు జరిపేవారిపై తీవ్ర చర్యలుంటాయి. పామెలా ఆండర్సన్‌, ఆ వీడి యాలో కేవలం కోతులే కాకుండా కుందేళ్లు, చుంచులు, తదితర జం తువులను పరిశోధనలు చేసి, కొత్తమందు లను తయారు చేయనున్నారు. పామెలా, తక్షణమే ఆ పరిశో ధనలను నిలిపి వేయమన్నది.

కేంద్ర జంతువుల ఫెసిలిటీని ఆధుని కీకరించాలన్నది. అలాగే శిక్షణ పద్ధతులను మెరు గుపరచి, పరిశోధన లను మానవీయ కోణం లోనే చేయాలన్నది. హాలీ వుడ్‌ నటి భారతదేశంలోని మూగజీవాలపట్ల చూపి స్తున్న శ్రద్ధపట్ల, పలువురు మద్దతు అందిస్తున్నారు. పెటా సంస్థ, హాలీవుడ్‌ నటులకు మానవీయ థృక్కోణంపై ఆసక్తిని కల్పించడం ముదావహం.

పారిస్హిల్టన్నేస్తం బుల్లి వానరం

పారిస్‌ హిల్టన్‌కి మూగజీవాలంటే ఆసక్తి మెండు. ఈ మధ్య తన 30వ జన్మది నాన్ని ఉడుతలా వుండే బుల్లి వానరం తది తర వన్య జంతువులతో హాలీ వుడ్‌ హిల్స్‌లో ఘనంగా జరుపు కొంది. పెంపుడు జంతువుల ప్రదర్శ నశాలను తరచు సందర్శి స్తుంది. వాటి ఆరోగ్య పరిరక్షణ, ఆహారాన్ని సరిగా సమయా నికి అంద జేస్తున్నా రనే అంశా లపై శ్రద్ధ వహిస్తున్నది. పారిస్‌ హిల్టన్‌ తన జన్మదినం వేడుకలలో మూగ జీవాలకు కూడా ప్రాధాన్యత కల్పించటం పలువురిని ఆశ్చర్యపరిచింది.

కమలినీ ముఖర్జీ పుట్టినరోజు మార్చి 4.

కమలినీ ముఖర్జీకి చిన్నతనం నుంచీ నటనమీద ఆసక్తి ఏర్పడటంతో స్కూల్లో చదివేటప్పుడే నాటకాల్లో నటించేది. ఎక్కువగా పురుష పాత్రలు పోషించేది. అందుకే థియేటర్‌ ఆర్ట్‌ కోర్స్‌ కూడా చేసింది. కవిత్వం రాయడం, పెయింటింగ్‌ చేయడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం ఆమె హాబీలు. భరత నాట్యం కూడా నేర్చుకుంది. నటిగా కెరీర్‌ ప్రారంభించడానికి ముందు కవిత్వానికి సంబంధించిన ఓ వెబ్‌ సైట్‌తో ఆమె పొందుపరచిన థాట్స్‌, కన్ఫ్యూజన్‌, సాలిట్యూడ్‌ అనే టైటిల్స్‌తో రాసిన పద్యాలు వల్ల దలైలామా అధ్యక్షత వహించిన అమెరికాలోని వాషింగ్టన్‌ డిసి సభకి హాజరు కాగలిగింది. ముంబయిలో థియేటర్‌ ఆర్ట్‌ కోర్స్‌ చేసాక చాలా నాటకాల్లో నటించింది. అయితే ఈసారి స్త్రీ పాత్రలే పోషించింది. నీల్‌ కమల్‌, పారాచ్యూట్‌, ఫెయిర్‌ అండ్‌ లవ్లీ, ఆయుష్‌ వంటి ప్రకటనలకు మోడలింగ్‌ చేసింది.

యాడ్‌ మోడల్‌గా ఆకట్టుకోవడంతో రేవతి దర్శకత్వంలో రూపొందిన రెండో చిత్రం 'ఫిర్‌ మిలేంగీ' చిత్రంలో నటించగలిగింది. ఎయిడ్స్‌ ప్రధాన అంశంగా గల ఈ చిత్రంలో రేడియో జాకీగా ఆమె నటించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆ తరువాత శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'ఆనంద్‌' లో నటించే అవకాశం లభించింది. 2004లో విడుదలైన ఈ చిత్రానికి ఉత్తమనటిగా నంది అవార్డు స్వీకరించింది.

మీనాక్షి, స్టైల్‌, గోదావరి, క్లాస్‌మేట్స్‌, పెళ్ళయింది కానీ, హ్యేపీడేస్‌, గమ్యం, జల్సా, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, గోపి గోపిక గోదావరి, పోలీస్‌ పోలీస్‌, మా అన్నయ్య బంగారం, నాగవల్లి తెలుగు చిత్రాల్లో నటించింది. 'గోదావరి, హ్యాపీడేస్‌, గమ్యం, గోపి గోపిక గోదావరి చిత్రాల్లో చక్కన నటన ప్రదర్శించిందనే పేరు వచ్చింది. 'వెట్టయ్‌యాడు విలయ్‌ యాడు' తమిళ చిత్రంతో 2006లో తమిళరంగానికి పరిచయమై 'కాదలన్‌ సుమ్మ ఇల్లయ్‌' చిత్రంలో నటించింది. ఆ తరువాత తమిళంలో ఆఫర్లు రాలేదు. ఒక కన్నడ చిత్రం 'సావరి' చేసి ఊరుకుంది. మలయాళ చిత్రం కుట్టి ష్రాంకు చేసింది. మలయాళంలో ఆఫర్లు వస్తున్నా ఇంకా అంగీకరించని కమలినీ ముఖర్జీ తెలుగు చిత్రాల్లో మంచి నటిగా పేరొచ్చినా ప్రస్తుతం ఒక చిత్రంలోనే చేస్తూ ఇంకా అవకాశాలు ఎందుకు రావట్లేదా అనే ఆలోచనల్లో పడింది. కోల్‌కతాలో 1984లో జన్మించిన కమలినీ ముఖర్జీ పుట్టినరోజు మార్చి 4.