18, డిసెంబర్ 2011, ఆదివారం

దళిత రాజకీయాలకు దిక్సూచి ఎవరు?

దళితులకు రాజకీయ అధికారం ఒక్కటే అన్ని సామాజిక, ఆర్థిక సమస్యలకు పరిష్కారం అని భారత రాజ్యాంగపిత, ప్రముఖ రాజనీతిజ్ఞుడు డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ 1930లోనే చెప్పారు. నిమ్నజాతులు సొంతశక్తితోనే రాజకీయాధికారాన్ని చేపడితే తప్ప వారి సమస్యలు పరిష్కారం కావు అని కూడా ఆయన హెచ్చరించారు. ఎనిమిది దశాబ్దాల తర్వాత కూడా దళితుల సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదంటే రాజకీయాధికారం వారికి దక్కని కారణంగానే అన్నది డాక్టర్‌ అంబేద్కర్‌ హెచ్చరికతోనే రుజువవుతున్నది.
75 సంవత్సరాల దళిత రాజకీయాలు ఎటు వెళ్తున్నాయి? ఎటు వెళ్ళాలి అనే అంశంపై హైదరాబాద్‌ నడిబొడ్డున వివిధ ఎస్‌సి, ఎస్‌టి సంఘాలు, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో జరిగే జాతీయ స్థాయి సదస్సు దేశంలో నెలకొన్న సంకీర్ణ రాజకీయాల్లో దళితులు కీలక భూమికి పోషించే ఈ తరుణంలో ఆత్మపరిశీలన దిశగా దళిత రాజకీయ నాయకులు, ఉద్యమకారులు డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ మార్గంలో ఏ విధంగా రాజకీయ అధికారాన్ని సాధించాలో, సాధించవచ్చో తన జీవిత కాలంలోనే నిరూపించారు నిజమైన అంబేద్కర్‌ వారసుడు బహుజన పితామహుడు, రాజకీయ బుద్ధుడు అయిన కాన్షీరాం.
నేటి దళిత రాజకీయాలకు ఆయన మార్గం అత్యంత అనుసరణీయం. ఓట్లుమావా? సీట్లు మీవా? ఇకపై చెల్లదు? ఇకపై సాగదు అంటూ దేశంలో వేలాది సంవత్సరాలుగా కొనసాగుతున్న బ్రాహ్మణ వాద అగ్రకుల మనువాద రాజకీయాల్ని తలక్రిందులుచేసి, మినీ ఇండియాగా పిలువబడే బ్రాహ్మణాధిపత్య కేంద్రమైన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాన్ని తొలిసారిగా తన సొంత కాళ్ళమీద ఒక అంటరాని చమార్‌ అధికారాన్ని సాధించింది. అంటే దాని వెనుక మూడు ముఖ్యమైన అంశాలు కీలకంగా పనిచేశాయి. ఒకటి సొంత రాజకీయ పార్టీ, ఆ పార్టీ సిద్ధాంతం అంబేద్కరిజం, దాన్ని నడిపించే సమర్థవంతమైన అమ్ముడుపోని నాయకత్వం. ఈ మూడు అంశాలు దళితులు రాజకీయ అధికారాన్ని సాధించడానికి అత్యంత ఆవశ్యం. వీటికితోడు దళితులకు సొంత మీడియా, సొంత అంగబలం, ఆర్థిక బలం కావాలి.
కాన్షీరాం మాటల్లో చెప్పాలంటే, దళితులు అధికారంలోకి రాకుండా అడ్డుపడుతున్న ప్రధాన అంశాల్లో మనీ మాఫియా (అంగబలం) మీడియా (ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌), దళితుల్లో విపరీతంగా పెరిగిన చెంచాగిరి. వీటన్నింటిని ఏకకాలంలో ఎదుర్కొంటూ దళితుల సంఘటితం చేసి, ఓటు విలువను తెలియపరిచి పార్టీ ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో బుల్లెట్‌ కన్నా బ్యాలెట్‌కే అత్యంత శక్తి ఉందని గత 64 సంవత్సరాలు స్వతంత్ర రాజకీయ చరిత్ర నిరూపిస్తున్నది. అందుకే కాన్షీరాం డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ చూపించిన 'బ్యాలెట్‌' మార్గాన్ని ఎంచుకున్నారు. భారత రాజ్యాంగాన్ని నవంబర్‌ 26, 1949 లో పార్లమెంట్‌కు సమర్పిస్తూ ఒక హెచ్చరిక చేశారు. రాజ్యాధికార ప్రకారం, రాజకీయంగా అందరూ సమానమే. ఒక మనిషికి ఒక ఓటు, దానికి ఒకే విలువ కాని,సామాజికం, ఆర్థికంగా అసమానతలు కొన్నివేల సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. సామాజిక, ఆర్థిక సమానత్వం, రాకుండా రాజకీయ సమానత్వానికి అర్థం లేదు. సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని దళితులు సాధించాలంటే రాజకీయ అధికారం ద్వారా మాత్రమే సాధిస్తారని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 64 సంవత్సరాలు గడిచినా, భారత రాజ్యాంగం అమలు అయి 61 సంవత్సరాలు గడిచినా దళితులు, ఇతర వెనుకబడిన వర్గాలు, సాంఘిక, ఆర్థిక సమానత్వాన్ని సాధించకపోవడానికి ప్రధాన కారణం వారి చేతుల్లో పరిపాలన పగ్గాలు లేకపోవడాన్ని సాధించడానికి డాక్టర్‌ బాబా సాహెబ్‌ చాలా ప్రయత్నాలు చేశాడు.
1936లో ఇండిపెండెంట్‌ పార్టీని స్థాపించాక 1937లో జరిగిన లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ ఎన్నిక 18 మంది సభ్యులను గెలిపించాడు. 1942 లో అఖిల భారత షెడ్యూల్డు కులాల ఫెడరేషన్‌ పార్టీ ద్వారా 1952లో శాసన, లోక్‌సభ సభ్యులను గెలిపించారు. 1955 మారుతున్న, దేశ సామాజిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా మ్యానిఫెస్టో రూపొందించారు. 1956 లో ఆయన మరణించినా ఆమె కూడా ఆయన స్ఫూర్తితో 1957లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అనేక రాష్ట్రాల శాసన, లోక్‌సభ సభ్యులు ఆ పార్టీ నుండి గెలుపొందారు. తర్వాత కాలంలో మహారాష్ట్రలో ఆయన అనుచరులు డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ సిద్ధాంతం గొప్పదే కాని ఓట్లు రావు, సీట్లు రావు, అధికారం అసలే రాదు. స్వయంగా బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఓడిపోవడం ద్వారా అది రుజువైంది కాబట్టి దళితులు ఆర్‌పిఐ ని వదిలి కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసి కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఇతర ప్రముఖ పదవులు అనుభవించారు. ఇంకా అనుభవిస్తూ ఉన్నారు.
డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ కల్పించిన రోజు రిజర్వేషన్ల కారణంగా నేడు దళితులే కాక, ఇతర వెనుకబడిన, మైనారిటీ వర్గాలు సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంత్రులుగా, ఎంఎల్‌ఎ, ఎంపిలుగా కాక రాష్ట్రపతి, పార్లమెంట్‌, అసెంబ్లీ స్పీకర్‌లుగా అనేకమైన అత్యున్నత పదవులు పొందారు. దళిత అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండగా మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నవారికి సైతం ఆత్మగౌరవం దక్కడం లేదు. అందుకు ప్రధాన కారణం దళితులు తమ సొంత పార్టీ ద్వారా కాక, అగ్రకుల పార్టీల ద్వారా అవకాశాలు పొందుతుండడం వలన వారి చెప్పుచేతల్లో ఉండాల్సిన పరిస్థితి. అందుకే కాన్షీరాం సొంత కాళ్లపై నడువు అసెంబ్లీ, పార్లమెంటు మెట్లు ఎక్కు అని నినాదం ఇచ్చారు. తన ఆ నినాదం డా|| అంబేద్కర్‌ 1930 సంవత్సరాలుగా ఇచ్చిన నినాదమే. అందుకే ఆయన 1984లో బి.ఎస్‌.పి స్థాపించి 1989లోనే డాక్టర్‌ అంబేద్కర్‌ నినాదానికి ఓట్లే కాదు సీట్లు కూడా వస్తాయని నిరూపించారు.

చరిత్ర పునరావృతం చేస్తున్న కాంగ్రెస్‌

చరిత్ర పునరావృతం అవుతుంది' అనేది అరిగిపోయిన మాటే. కానీ రాజకీయాల్లో మాత్రం నిత్యనూతనం. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత వ్యవహారాలు, కుమ్ములాటలు పరిశీలిస్తున్నవారికి రాష్ట్రంలో మరోసారి చరిత్ర పునరావృతమవుతున్నదన్న భావన కలుగుతుంది. 1978 -82 మధ్య ఐదేళ్ళు; 1989 -94 మధ్య ఐదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత కలహాలు, నేతల కుమ్ములాటలు పతాకస్థాయికి చేరాయి. 1978 -82 మధ్య కాలంలో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన ప్రతిపక్షం లేదు. స్వపక్షంలోనే విపక్షం ఉండేది. ఆ ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలు నలుగురు ముఖ్యమంత్రుల్ని చూశారు. 1989 . 94 మధ్య కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఉంది. అయినా కాంగ్రెస్‌కు స్వపక్షంలో తప్పలేదు. ఆ ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు.
2009 ఎన్నికల తర్వాత వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణానంతరం ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన రోశయ్య ఎక్కువకాలం పరిపాలన సాగించలేక అర్థాంతరంగా తప్పుకోవలసి వచ్చింది. రాష్ట్ర సమస్యల పరిష్కారంలో రోశయ్య విఫలం చెందారనడం కంటే... సహచర కాంగ్రెస్‌ నేతల విశ్వాసం పొందలేకపోయారనడం సబబు. తనకు మంత్రులెవరూ సహకరించడం లేదని రోశయ్య ఢిల్లీ వెళ్ళి తమ అధిష్టానం ముందు మొరపెట్టుకున్న సందర్భాలున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలోని ఒక బలమైన సామాజిక వర్గం రోశయ్య పదవినుంచి తప్పుకొనే వరకూ నిద్రపోలేదు.
రోశయ్య ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పుకొన్న తర్వాత అనూహ్యంగా తెరపైకి వచ్చి ఆ పదవిని అధిష్టించిన నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ప్రస్తుతం పొసగడం లేదన్న వార్తలు కొట్టివేయదగినవేమీ కాదు. పిసిసి అధ్యక్షుడు కావడంలో విజయం సాధించి తొలిమెట్టు అధిరోహించి బొత్స సత్యనారాయణ మలిమెట్టు అధిష్టించడానికి ఆరాటపడుతున్నారు. రోజుకో కొత్త పథకంతో... ప్రతిష్టను పెంచుకోవాలని చూస్తున్న కిరణ్‌కుమార్‌ రెడ్డికి బొత్స కంట్లో నలుసుగా మారారు. ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్న 'రాజీవ్‌ యువకిరణాలు' పథకంపై పదునైన విమర్శలు చేసి బొత్స పిసిసి అధ్యక్షుడిగా తన పట్టు నిరూపించుకోవాలని ఆరాటపడ్డారు. కిరణ్‌కుమార్‌ రెడ్డి ఒంటెత్తు వ్యవహారశైలి 'బొత్స'కు బాగా ఉపయోగపడింది. కేబినెట్‌లో సీనియర్లయిన డిఎల్‌ రవీంద్రారెడ్డి, జానారెడ్డి వంటివారు కొన్ని పథకాలను బాహాటంగానే విమర్శిస్తున్నారు.
కొత్త పథకాల జోరుతో ప్రభుత్వంపై, పార్టీపై పట్టు సాధించాలని చూసిన కిరణ్‌కుమార్‌ రెడ్డిని సీనియర్‌ మంత్రుల విమర్శలు జీర్ణించుకోలేని విధంగా తయారయ్యాయి. కలెక్టర్ల సమావేశంలో సీనియర్‌ మంత్రులు పరిపాలనా లోపాల్ని ఎత్తిచూపుతూ చేసిన నిశిత వ్యాఖ్యలు... జవాబు చెప్పుకోలేని పరిస్థితిలో పడేసింది. సాధారణంగా కేబినెట్‌ సమిష్టిగా నిర్ణయాలు తీసుకొంటుంది. ప్రతి నిర్ణయాన్ని కేబినెట్‌ మంత్రులు సమర్థిస్తూ మాట్లాడుతుంటారు. కానీ, ఇపుడు ప్రభుత్వ నిర్ణయాలను మంత్రులే వ్యతిరేకిస్తున్నారు. అంటే అర్థం... చాలా నిర్ణయాల్లో వారికి ప్రమేయం లేదు. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌ రెడ్డి ఒక్కరే తీసుకొంటున్నారని చెప్పకనే చెప్పినట్లయింది. కిలో రూపాయి బియ్యం పథకంతో సహా ఇటీవల ప్రకటించిన చాలా స్కీమ్స్‌ ముఖ్యమంత్రి సొంతవి.
ప్రభుత్వ కీలక నిర్ణయాల్లో మంత్రుల భాగస్వామ్యం లేకపోవడం పార్లమెంటరీ డెమోక్రసీకి మచ్చ. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశం సందర్భంగా... శాంతిభద్రతలపై జరిగే సమీక్షా సమావేశేంలో ఒక్క హోంమంత్రి మినహా మిగతా మంత్రులందర్నీ సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లమని ముఖ్యమంత్రి ఆదేశించడం కిరణ్‌కుమార్‌ రెడ్డి వ్యవహారశైలిని గమనిస్తున్న వారికి ఆశ్చర్యం కలిగించదు. కాకపోతే... ఆయన అంత నిర్మొహమాటంగా మంత్రుల్ని బయటకు పంపించడమే ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది. మంత్రులతో సమన్వయం చేసుకోకుండా, టీమ్‌ వర్క్‌ లేకుండా ఆయన తన స్థానాన్ని ఎలా సుస్థిరం చేసుకోగలరో అర్థం కాదు.
పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి ముఖ్యమంత్రికి, మంత్రులకు మధ్య ఏ విధంగా సమన్వయం లేదో... పార్టీ వ్యవహారాలకు సంబంధించి సి.ఎం., పీసిసి అధ్యక్షుడి మధ్య కూడా సత్సంబంధాలు ఉన్నట్లు కన్పించడం లేదు. ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేసిన జగన్‌ వర్గ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలపై వేటువేయాలని బొత్స ఉత్సాహపడుతుండగా ఆ ప్రక్రియను వీలైనంతమేర వాయిదా వేయించాలని కిరణ్‌కుమార్‌ రెడ్డి భావిస్తున్నారు. వేటుపడ్డాక వచ్చే ఉప ఎన్నికల్ని ఎదుర్కోవడం ఇబ్బందికరమైనదని కిరణ్‌కుమార్‌ రెడ్డికి తెలుసు. ఉప ఎన్నికలు వచ్చి మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమి పాలైతే... కిరణ్‌కుమార్‌ రెడ్డికి పరిపాలించడం కష్టమవుతుందనే భావనతో... గీతదాటిన ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందేనంటూ పిసిసి అధ్యక్షుడు పట్టుబడుతున్నారు. రాజకీయంగా వీరిద్దరూ ఎత్తుకు పై ఎత్తులు వేసుకొంటుంటే... వీరిద్దరి మధ్య సమన్వయం చేయాల్సిన కాంగ్రెస్‌ అధిష్టానం మాత్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తూ తమకు అలవాటైన 'విభజించు -పాలించు' సూత్రాన్ని అమలు చేస్తోంది.
ముఖ్యమంత్రి పదవి నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డిని తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని... వాటికి బొత్స ప్రోత్సాహం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల శైలిని గమనించే వారికి... అది వార్త కానేకాదు... జోడు పదవులు నిర్వహిస్తున్న బొత్సను మంత్రిపదవి నుంచి తప్పించి పిసిసికి పరిమితం చేయాలని సి.ఎం. తమ అధిష్టానాన్ని కోరినట్లు వార్తలొచ్చాయి. అది నెరవేరకపోయేసరికి సిఎం తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. తాజాగా, ఉత్తరాంధ్ర మద్యం సిండికేట్లపై ఎసిబి దాడులు చేసి కీలక సమాచారం సేకరించినట్లు, ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే ఇవి జరిగినట్లు సాగుతున్న ప్రచారం నిజమైతే... రాష్ట్ర రాజకీయాలు మరోమలుపు తిరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడల్లా చరిత్ర పునరావృతం అవుతుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కేవాలి?

చీ'కట్‌'లో పరిశ్రమలు

ప్రకృతి చేసిన గాయం రాచపుండులా మారి యావత్‌ రాష్ట్రప్రజానికాన్ని కంటనీరుపెట్టిస్తోంది. తీవ్రవర్షాభావ పరిస్థితులు అన్నదాతల అంతుచూడగా... ఎడాపెడా విద్యుత్‌ కోతలు ఉపాధికి ఉరితాళ్లను పేనుతున్నాయి. గడిచిన నాలుగునెలల కాలంగా విద్యుత్‌ కోతలతో పారిశ్రామిక రంగం రూ.50వేల కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఫలితంగా పరిశ్రమల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో లక్షలాది మంది కార్మికులు ఉపాధిని కోల్పోయే ప్రదకర పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే లక్షఉద్యోగాలు మాట ఎలాఉన్నా, ఉన్న ఉద్యోగాలు ఊడి నిరుద్యోగ సమస్య జటిలం కానుంది. వేసవికి ముందుగానే విద్యుత్‌ లోటు భారీగా కనిపిస్తుండటంతో రబీసాగుపై కూడా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. వ్యవసాయానికి, పరిశ్రమలకు విద్యుత్‌ కోతలు లేకుండా చూడాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ విద్యుత్‌ కోత తీవ్రంగా వేధిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ ఆశయం నెరవేరే సూచనలు కనిపించడంలేదు. కష్టకాలంలో సాంకేతిక లోపాలతో మొరాయిస్తున్న
ధర్మల్‌ ప్రాజెక్టులు... విద్యుత్‌ కేటాయింపులో కేంద్రం మాట నిలబెట్టుకోకపోవడం... వెరసి రానున్న కాలంలో రాష్ట్రప్రజలు మరింత గడ్డుపరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాభావ పరిస్థితుల ప్రభావం రైతులతోపాటు పారిశ్రామిక రంగంపై కూడా పడింది. చినుకుజాడలేక ఎండిపోయిన ఖరీఫ్‌పంటచేలు పశువుల మేతకు బీళ్లుగా మారగా, పరిశ్రమలు సైతం పడకేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. సకలజనుల సమ్మె ప్రారంభమైన నాటినుండే పరిశ్రమలకు విద్యుత్‌ కోతలు ప్రారంభం కాగా, నానాటికీ కోతల సమయం పెరుగుతూ పోతుండటంతో వాటి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. దేశఆర్థిక వ్యవస్థకు గుండెకాయలా ఉండే పరిశ్రమలు ప్రస్తుతం సంక్షోభం దిశగా అడుగులు వేస్తుండటంతో ఆప్రభావం లక్షలాది మంది కార్మికులపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నాలుగునెలలుగా పవర్‌హాలిడే పేరుతో వారానికి రెండురోజుల చొప్పున పరిశ్రమలకు పూర్తిగా విద్యుత్‌ కోత విధిస్తుండటంతో పనులు సాగక కార్మికులు తమ ఉపాధిని కోల్పోవాల్సి వస్తోంది. పవర్‌హాలీడే పుణ్యమాని రాష్ట్రవ్యాప్తంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఇప్పటికే రూ.50వేల కోట్ల వరకూ నష్టపోయాయి. దీంతో బ్యాంకురుణాలు కూడా చెల్లించలేక పరిశ్రమల యజమానులు అప్పులపాలు కావాల్సి వస్తోంది. పవర్‌హాలీడేతోపాటు ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర నుండి రాత్రి పదిన్నర వరకు పరిశ్రమలకు విద్యుత్‌ కోతలు విధిస్తుండటం, అనధికారికంగా కూడా కోతలు సాగుతుండటంతో పరిశ్రమలు మూతపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫలితంగా పరిశ్రమల్లో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి వీదినపడే పరిస్థితులు గోచరిస్తున్నాయి.
అయితే వచ్చే ఏడాది జనవరి 1 నుండి పరిశ్రమలకు విధించిన పవర్‌హాలీడేను ఎత్తివేయనున్నట్లు రాష్ట్రప్రభుత్వం అధికారికంగా ప్రకటించినప్పటికీ విద్యుత్‌లోటు భారీగా కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇటు పరిశ్రమలకు , అటు వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా ఎలా చేస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వర్షాలు లేక రాష్ట్రంలో జలవిద్యుత్‌ ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. మరోవైపు కృష్ణ-గోదావరి (కెజీ)బేసిన్‌లో ఉత్పత్తి తగ్గిపోయిందన్న సాకుతో గ్యాస్‌ సరఫరా తగ్గించడం ఫలితంగా గ్యాస్‌ ఆధారిత ఉత్పత్తి కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం విద్యుత్‌ ఉత్పత్తి ధర్మల్‌ ప్రాజెక్టులే ఆధారం అయినప్పటికీ వరంగల్‌లోని 500 మెగావాట్ల కెటిపిపి, విశాఖలోని 500 మెగావాట్ల ఎన్‌టిపిసిల్లో నెలకొన్న సాంకేతిక లోపాలతో ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే ఏపిజన్‌కో ధర్మల్‌ ప్రాజెక్టుల సామర్థ్యం పెరగడంతో గతఏడాది 58 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను అందించిన ప్రాజెక్టులు ప్రస్తుతం 98 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండటం కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. అయితే రాష్ట్రంలో 10 నుండి 15శాతం వరకు మాత్రమే విద్యుత్‌ కొరతఉందని రాష్ట్రప్రభుత్వం చెబుతున్నప్పటికీ అంతకు రెట్టింపు స్థాయిలోనే కొరత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విద్యుత్‌ను కొనుగోలు చేయడం లేదా కేంద్ర సహకారాన్ని కోరడం మినహా పరిష్కార మార్గాలు కనిపించడం లేదు. చిన్న,మధ్యతరహా, భారీ పరిశ్రమల మాట అలాఉండగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజానీకాన్ని విద్యుత్‌ కోతలు తీవ్రంగా వేధిస్తున్నాయి.
రాష్ట్రరాజధాని హైద్రాబాద్‌లో సైతం రెండుగంటలు విద్యుత్‌ కోత ఉండగా, జిల్లాకేంద్రాల్లో ఆరు గంటలు, మండల కేంద్రాల్లో 8 గంటలు, పల్లెల్లో 10 గంటల విద్యుత్‌ కోత అమలవుతోంది. దీంతో పట్టణాలు, పల్లెల్లో జీవనోపాధి కోసం ఏర్పాటు చేసుకున్న మిల్లులు, జీరాక్స్‌ సెంటర్లు, పోటో స్టూడియోలు, రిపేరింగ్‌ దుకాణాలు, టైలరింగ్‌ తదితర యూనిట్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఆయా యూనిట్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది. మరోవైపు విద్యుత్‌ కొరతతో సినిమా ధియేటర్లు కూడా మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత విద్యుత్‌ ధర యూనిట్‌కు రూ.7 ఉండగా, జనరేటర్‌ ద్వారా ఒక్క యూనిట్‌కు రూ.14 వరకు ఖర్చు వస్తుండటంతో సినిమాలు ప్రదర్శించిన యజమానులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.మరోవైపు విద్యుత్‌ కోతలతో ఆసుపత్రుల్లో రోగులు, చిన్నారులు దోమలబెడదతో పడుతున్న బాధలు వర్ణనాతీతం. ప్రభుత్వాసుపత్రుల్లో జనరేటర్లు ఉన్నా కొన్ని చోట్ల వినియోగించకపోతుండటంతో రోగులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. మరోవైపు ఎక్స్‌రే , స్కానింగ్‌ రిపోర్టులకు సైతం రోజల్లా ఎదురుచూడాల్సిన పరిస్థితిలు కనిపిస్తున్నాయి.
గొల్లుమంటున్న పల్లెలు
విద్యుత్‌ కోతలు పల్లెప్రజానీకాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పట్టణాల్లో ఆరుగంటల కోతతో సరిపెడుతున్న అధికారులు పల్లెల్లో మాత్రం అధికారిక, అనధికారికంగా ఎడాపెడా విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. ప్రస్తుతం పల్లెల్లో పదిగంటల పాటు అధికారికంగా విద్యుత్‌ కోత విధిస్తుండగా, గత వారంరోజులుగా రాత్రి వేళల్లోనూ అనధికారికంగా కోతలు పెడుతున్నారు. ఓ వైపు విద్యుత్‌ కోత , మరోవైపు దోమల మోత వెరసి పల్లె ప్రజలునిద్రకు దూరమవుతున్నారు. మరోవైపు, విద్యుత్‌ కోతల కారణంగా పల్లెల్లో తాగునీటి పథకాలు పూర్తిగా పడకేస్తున్నాయి. ఉదయం ఆరు గంటలనుండి సాయంత్రం 6 గంటల వరకు విధిస్తున్న కోతతోపాటు అనధికారిక కోతలు కూడాతోడవుతుండటంతో రక్షిత మంచినీటిపథకాల మోటర్లు నడవక పల్లె ప్రజల గొంతులు ఎండుతున్నాయి. అదలాఉండగా వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోయి పీకల్లోతు కష్టాల్లో కూరకుపోయిన రైతులు రబీసాగుపై ఆశలు పెట్టుకోగా, విద్యుత్‌ కోతలతో రబీసాగుపై కూడా ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పల్లెల్లో రైతులు , ప్రజల కష్టాలు పగవాడికి కూడా రాకూడదన్నట్లుగా మారాయి.
సమ్మె... సాకే
సకలజనుల సమ్మె వల్లే విద్యుత్‌ కోతలు విధించాల్సి వసతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ బొగ్గు ఉత్పత్తి లెక్కలను చూస్తే వారి ప్రకటనలు వాస్తవ విరుద్ధాలుగా కనిపిస్తున్నాయి. సింగరేణిలో సమ్మె ప్రభావం కొంతమేరకు చూపిన మాట వాస్తవమే అయినా విద్యుత్‌ కోతలకు పూర్తి కారణం సమ్మె మాత్రమే కాదని తేటతెల్లమవుతోంది. ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ సింగరేణి ఏరియాల్లో సమ్మెసంపూర్ణంగా సాగినప్పటికీ ఖమ్మం జిల్లాలో మాత్రం కార్మికులు సమ్మెలో పాల్గొనలేదు. 35రోజుల సమ్మె కాలంలో 52లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి కావల్సి ఉండగా, ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, సత్తుపల్లి ఓసీల్లో 15లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. సమ్మె అనంతరం ఆ నష్టం భర్తీచేసుకోవడానికి సింగరేణి యాజమాన్యం తీసుకున్న చర్యలు ఫలించాయి. రాష్ట్రంలో 36భూగర్బ, 14ఓపెన్‌ కాస్టు గనులుండగా , గతంలో రోజుకు 1.20లక్షల టన్నుల బొగ్గుఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకునే వారు. అయితే సమ్మె ప్రభావం నుండి కోలుకోవడానికి ప్రస్తుతం 1.93లక్షల టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్న యాజమాన్యం ఈమేరకు ఇప్పటికే సఫలీకృతమైంది. కార్మికుల భోజన విరామ సమయాన్ని కూడా కుదించి బొగ్గు ఉత్పత్తిని కూడా పెంచడానికి యాజమాన్యం పకడ్బందీ చర్యలు చేపట్టింది.దీంతో సమ్మె ముగిసిన రెండవరోజు నుండే విద్యుత్‌ ప్లాంట్లకు తగ్గబొగ్గు తరలిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్‌ కోతలకు పూర్తిగా సమ్మేకారణం అని ప్రభుత్వం, అధికారులు చేస్తున్న ప్రకటనలు నమ్మశక్యంగా కనిపించడం లేదు.
మాటతప్పిన కేంద్రం
సకల జనుల సమ్మెతో రాష్ట్రంలో విద్యుత్‌ కొరత తీవ్రంగాఉన్న నేపథ్యంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలని ప్రభుత్వ విన్నపానికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. రాష్ట్రానికి 183 మెగావాట్ల విద్యుత్‌ను కేటాయిస్తున్నట్లు ప్రకటన కూడా చేసింది. అయితే విద్యుత్‌ కెటాయింపులో మాటతప్పిన కేంద్రం రాష్ట్రానికి ఇస్తానన్న కేంద్రం తమిళనాడు, కేరళలకు మరలించి మనకు మొండిచేయి చూపింది. అయితే కష్టకాలంలో తాను ఇచ్చిన మాటను కేంద్రం తప్పినా రాష్ట్రానికి చెందిన ఆపార్టీ ఎంపిలు గానీ , రాష్ట్రప్రభుత్వం గానీ ఒత్తిడితెచ్చి విద్యుత్‌ను తేవడంలో మాత్రం విఫలమయ్యారని చెప్పవచ్చు. గతంలో ఇచ్చిన మాట ఎలా ఉన్నా ప్రస్తుతం రాష్ట్రాన్ని చీకట్లు చుట్టుముడుతుండటం, విద్యుత్‌ కోతలతో పారిశ్రామిక రంగం సంక్షోభంలో కూరుకుపోతుండటం వంటి గడ్డుపరిస్థితులు నెలకొన్న తరుణంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చిగతంలో కేటాయించిన విద్యుత్‌తో పాటు అదనంగా రాష్ట్రానికి విద్యుత్‌ కేటాయింపులు చేయించుకోగలగితే కరెంటు కష్టాలు కొంతమేరకైనా గట్టెక్కవచ్చు.

భగవద్గీత తీవ్రవాద సాహిత్యం!

హిందువులు అమితంగా గౌరవించే ఆరాధించే భగవద్గీతను రష్యా ప్రభుత్వం నిషేధించేందుకు రంగం సిద్ధం చేసింది. టామ్‌స్క్‌ లోని న్యాయస్థానంలో భగవద్గీతను తీవ్రవాద సాహిత్యంగా గుర్తించి రష్యా ప్రభుత్వం నిషేధించిన వివిధ పుస్తకాల జాబితాలోకి దీన్ని చేర్చి ప్రచారంలో లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ యేడాది జూన్‌లో ఒక పిటిషన్‌ దాఖలైంది. దీన్ని ఎఫ్‌ఎస్‌బి, రష్యన్‌ ఆర్థోడాక్స్‌ చర్చి కలిసి దాఖలు చేశాయి. టామ్‌స్క్‌ ప్రాంతంలో హిందువులు సంఖ్యాపరమైన మైనార్టీలు. ఈ ప్రాంతంలో తమ మూలాలు పెంచుకోడానికి, చాప కింద నీరులా విస్తరించడానికి ఇస్కాన్‌ ప్రయత్నిస్తోందని అక్కడి సంప్రదాయవాద క్రైస్తవులు ఆరోపిస్తున్నారు. ఇస్కాన్‌ ఆటలు కట్టించేందుకు, విస్తరించకుండా అడ్డుకునేందుకు కేసు దాఖలు చేశారు. ఈ ఆరోపణలు వచ్చాక భగవద్గీతను నిపుణుల కమిటీకి పంపించారు. ఆ కమిటీని యూనివర్శిటీ ప్రొఫెసర్లతో ఏర్పాటు చేశారు. ఆ ప్రొఫెసర్లు గీతను చదివి ఈ గ్రంథం 'మత, లింగ, జాతి, జాతీయతా, భాషా ద్వేషాలను రెచ్చగొట్టేదిగా ఉందని అభిప్రాయపడింది. రష్యా ప్రభుత్వం ఆరోపించింది. ఈ పుస్తకాన్ని, అచ్చువేసినా, కలిగిఉన్నా, పట్టుకుతిరిగినా, పంచినా ప్రమాద కరమైన నేరంగా భావించి దారుణంగా శిక్షించాలని సిఫారసులు అందాయి. అందుకు అనుగుణంగా రష్యా
ప్రభుత్వం నిషేధపుటుత్తర్వులు జారీచేసేందుకు రంగంసిద్ధం చేస్తోంది.
మన న్యాయస్థానాలు అతిపవిత్రమైన గ్రంథంగా భావించి ప్రమాణ గ్రంధంగా గుర్తించి సాక్ష్యులతో ప్రమాణాలు చేయిస్తుంటే అది మత విద్వేషాలను రెచ్చగొట్టేదిగా ఉందని, మనుషుల మధ్య చిచ్చురేపేదిగా ఉందని రష్యా ప్రభుత్వం భావిస్తోంది. సార్వకాలీన సత్యాలకు ఆటపట్టుగా, మానవత్వాన్ని ప్రబోధించే పుస్తకంగా హిందువులు నమ్ముతుంటే అది జాతి విద్వేషాన్ని, భాషాద్వేషాలను పురికొల్పుతోందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఇస్కాన్‌ వాళ్ళు చేస్తున్న కృష్ణచైతన్య ప్రచారాలను అడ్డుకోవడానికి ఈ చర్య తోడ్పడుతుందని హిందువుల మనోభావాలను గాయపరిచేదిగా ఉందని ఇస్కాన్‌ కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందుతున్నారు. భారత ప్రభుత్వం త్వరగా మేలుకుని భగవద్గీతపై నిషేధం వేటుపడకముందే రష్యన్‌ ప్రభుత్వంతో మాట్లాడి దిద్దుబాటు, సర్దుబాటు చర్యలు చేపట్టాలని ఇస్కాన్‌ వారు కోరుతున్నారు. ప్రపంచదేశాలు రెండోమాటలేకుండా ఆదరించి అక్కున చేర్చుకున్న ఆ అద్భుత వ్యాఖ్యాన గ్రంథాన్ని ఇస్కాన్‌ వ్యవస్థాపక గురువు భక్తివేదాంత స్వామి ప్రభుపాద రచించారు. ఏ దేశంలో ఎవ్వరూ పెట్టని వంకలన్నీ రష్యన్లు ప్రభుపాద రచించిన గీతకు ఆపాదించారు. ఈ పుస్తకాన్ని అన్ని దేశాల నాయకులు కళ్ళకద్దుకుని మహాప్రసాదంగా స్వీకరిస్తుంటే రష్యా ప్రభుత్వం విపరీతంగా పరిగణించడం వివాదాస్పదమైంది. కృష్ణభక్తులను, ప్రపంచ వ్యాప్తంగా ఉండే హిందువుల మనోభావాలను గాయపరుస్తోంది. ఇటీవలే బ్రిటన్‌ ప్రధానమంత్రి డేవిడ్‌ కేమరాన్‌కు ఈ పుస్తకాన్ని బహుమానంగా అందిస్తే ఆయన ఎంతో సంతోషపడిపోయి దాన్ని తన ఆఫీసు లైబ్రరీలో దాచుకున్నారు. వేదవ్యాసముని రచించిన భగవద్గీతను రష్యా భాషలోకి అనువదించి ఇస్కాన్‌ అక్కడ గీతను ప్రచారం చేస్తోంది. 1989లో ఈ రష్యాభాషలో ఉన్న భగవద్గీత కాపీని అప్పటి ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీకి బహూకరించారు కూడా! ఆగస్ట్‌ లో ఈ కేసుపై తొలి విచారణ జరిగింది. ఫెడరల్‌ కోర్టు న్యాయమూర్తి గలీనా బటెన్కో ఈ వాదనలు విన్నారు. ఈ పుస్తకాన్ని నిషేధించాలని సిఫారసు చేసిన నిపుణుల కమిటీ చేసిన వాదనలో పసలేదని, దాన్ని నిషేధించాలనడానికి బలమైన సాక్ష్యాలు చూపలేకపోయారని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. కమిటీలోని నిపుణులు కూడా ఆ పుస్తకాన్ని పూర్తిగా చదవలేదని, అభ్యంతరాలు వ్యక్తం చేసిన పార్టీల వాదనలతో ఏకీభవించి సిఫారసులు చేశామని అంగీకరించారు. దాంతో న్యాయమూర్తి కామెరోవో వర్శిటీకి చెందిన ప్రొఫెసర్లతో నిపుణుల కమిటీని ఏర్పాటుచేసి భగవద్గీతయథాతథం పుస్తకంపై అభిప్రాయాన్ని ఇవ్వవలసిందిగా కోరారు.
ఈ కమిటీలో ఒక్క హిందువు కూడా లేకపోవడంతో ఇస్కాన్‌ ప్రతినిథులు ఆందోళన చెందుతున్నారు. ఈ కేసును సాకుగా తీసుకుని ఇస్కాన్‌ కార్యకలాపాలకు చెక్‌ చెబుతారేమోనని వారు భయపడుతున్నారు. నార్వేకు చెందిన మైనార్టీల మతహక్కుల పరిరక్షణ సంస్థ 'ఫోరమ్‌-18 తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. దీనిపై మన ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు విజ్ఞప్తులు అందాయి. దీనిపై సీరియస్‌గా స్పందించి రష్యా ప్రభుత్వంతో మాట్లాడి కేసు ఉపసంహరించుకోడానికి లేదా కేసు వీగిపోయేలా చేయడానికి అవసరమైన చర్యలు తీసుకునేలా చూడాలని మాస్కోలోని భారత రాయబారకార్యాలయానికి సూచించారు. ఈ కేసుపై సోమవారంనాడు తదుపరి విచారణ జరగనుంది.

తెలంగాణ ఉప ఎన్నికల ప్రచార సారథి దేవేందర్‌

తెలంగాణాలో త్వరలో జరిగే ఉపఎన్నికల ప్రచార నిర్వహణ బాధ్యతను పార్టీ సీనియర్‌ నాయకుడు టి.దేవందర్‌ గౌడ్‌కు అప్పగించాలని తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఉపఎన్నికలు జరిగే కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన పార్టీ నాయకులతో చంద్రబాబు సమీక్షలు నిర్వహించారు. అభ్యర్థుల పేర్లను కూడా దాదాపుగా ఖరారు చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎన్నికలు జరిగే నాగర్‌ కర్నూలు, కొల్లాపూర్‌, మహబూబ్‌నగర్‌ స్థానాలతో పాటు మిగిలిన జిల్లాల్లో ఎన్నికలు జరిగే స్థానాల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికలో దేవేందర్‌ గౌడ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ అభ్యర్థి ఎంపికపై పార్టీలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ ఎంపిక బాధ్యతను కూడా దేవేందర్‌ గౌడ్‌కే చంద్రబాబు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ప్రచారంలో దేవేందర్‌ గౌడ్‌తో పాటు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహుల, వేం నరేందర్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలకు కూడా ఇన్‌చార్జ్‌లుగా నియమించనున్నారు. ఉపఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ఒక్కో మండలానికి ఇద్దరు నుండి నలుగురు ఎమ్మెల్యేలను ఇన్‌చార్జ్‌లుగా నియమించే అవకాశాలు ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎల్‌.రమణ, విజయరమణారావు, గంగుల కమలాకర్‌లను నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి ఎన్నికల ఇన్‌చార్జ్‌లుగా నియమించనున్నారు. వరంగల్‌ జిల్లాలోని పరకాల నియోజకవర్గానికి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేం నరేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డిలను ఇన్‌చార్జ్‌లుగా నియమించనున్నారు. నాగర్‌కర్నూల్‌కు దేవేందర్‌ గౌడ్‌తో పాటు రేవంత్‌రెడ్డి, జైపాల్‌ యాదవ్‌, పి.రాములు, ఎర్ర చంద్రశేఖర్‌లను ఇన్‌చార్జ్‌లుగా నియమించనున్నారు. మహబూబ్‌నగర్‌ స్థానానికి ఎల్లారెడ్డి, దయాకర్‌రెడ్డి, సీతా దయాకర్‌రెడ్డిలను, కొల్లాపూర్‌కు రావుల చంద్రశేఖరరెడ్డితో పాటు నల్గొండ జిల్లాకు చెందిన ఉమా మాధవరెడ్డిని కూడా ఇన్‌చార్జ్‌లుగా నియమించనున్నారు

మనమే తాగిద్దాం

నూతన ఎక్సైజ్‌ సంవత్సరం నుంచే కొత్త అబ్కారీ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. నేరుగా ప్రభుత్వమే రిటైల్‌ ఔట్‌లెట్స్‌ను నిర్వహించడం ద్వారా రాష్ట్రంలో అక్రమ మద్య వ్యాపారం, పన్ను ఎగవేత, ధరల నియంత్రణలతోపాటు మద్యం మాఫియాను కట్టడి చేసే అవకాశాలుంటాయని ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే సిబిఐ, విజిలెన్స్‌ శాఖలు మద్యం సిండికేట్‌లపై దాడులు నిర్వహిస్తున్నాయి. రైస్‌ మాఫియా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని ప్రభావితం చేస్తోంది. తమకనుగుణంగా చట్టాల్ని మార్చుకుంటోంది. ప్రభుత్వ ఉత్తర్వుల్ని పొందుతోంది. ఇప్పుడు రైస్‌మాఫియాను కూడా మద్యం మాఫియా మించిపోతోంది. మద్యం అక్రమవ్యాపారంతో కొందరు కోట్లకు పడగలెత్తారు. వీరంతా రాజకీయాల్ని శాసిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు భారీగా ముడుపులిస్తున్నారు. గెలిచినవారిని తమకనుకూలంగా మలచుకుంటున్నారు. వారిని చేతుల్లో పెట్టుకుని ఆడిస్తున్నారు. పరోక్షంగా ప్రభుత్వంపై పెత్తనం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వారికీ, వీరికి పెట్టుబడి పెట్టడం కంటే తామే నేరుగా చట్టసభలకు పోటీ చేయాలన్న ఆలోచన పలువురు అక్రమ మద్యవ్యాపారుల్లో చోటు చేసుకుంది.తద్వారా ప్రభుత్వంపై ప్రత్యక్షంగా పెత్తనం చేసి తమ వ్యాపార ప్రయోజనాల్ని పరిరక్షించుకోవాలని వీరు ఆశిస్తున్నారు. ఇప్పట్లా కొందరు ప్రభుత్వ పెద్దలకు నెలనెలా మామూళ్ళివ్వడం, వ్యాపారాల్లో వాటాలివ్వడం, పదే పదే వారికి మొరపెట్టుకుని అధికారులపై ఒత్తిళ్ళు తేవడం కంటే నేరుగా తామే అధికారుల్ని ఆదేశించే స్థానంలోకెళ్ళడం వీరి లక్ష్యంగా తెలుస్తోంది. మాదకద్రవ్యాలు, మద్యం మాఫియా ఇంతవరకు సమాజానికి చేటుగా డవించేవారు. కానీ ఇప్పుడు వీరు ప్రజాస్వామ్య వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్నారు. వ్యవస్థ పునాదుల్ని కదిపేస్తున్నారు. గతంలోకూడా మద్యం మాఫియా దేశాన్ని అతలాకుతలం చేసింది. అనేక రాష్ట్రాల్లో తమ ప్రాబల్యం ప్రదర్శించింది. వీరిని అణచివేసేందుకే ప్రభుత్వాలు పలురకాల ఆలోచనల్ని అమలు చేశాయి. కొన్ని దశల్లో మద్య నిషేధాన్ని కూడా ప్రవేశపెట్టాయి. భారీగా సమకూరే అబ్కారీ ఆదాయాన్ని కూడా పక్కనపెట్టేసి సమాజాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ప్రయత్నించాయి. కానీ అధికారుల వైఫల్యంతో అనధికార మద్యం వెల్లువెత్తింది. కల్తీసారా విజృంభించింది. ఇది ప్రజల ప్రాణాలకు చేటుతెచ్చింది. మద్యం మాఫియా ఈ అవకాశాన్ని వినియోగించుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమమార్గాల్లో మద్యాన్ని స్మగ్లింగ్‌ చేసింది. కోట్లకు కోట్లు సంపాదించింది.
ఒక దశలో సమాంతర ప్రభుత్వాన్ని కూడా నడిపే స్థాయికి ఎదిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టిఆర్‌ మూడోసారి అధికారంలోకి రాగానే తొలి సంతకాన్ని మద్యనిషేధ దస్త్రంపైనే పెట్టారు. కానీ అది మూణ్ణాళ్ళ ముచ్చటగానే ముగిసింది. మరికొంతకాలం నిషేధం అమలైతే మద్యం మాఫియా శక్తికి ప్రభుత్వం కూడా తల వంచక తప్పదని చంద్రబాబు గుర్తించారు. అంచెలంచెలుగా నిషేధాన్ని తొలగించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే మద్యం టోకు వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. డిస్టిలరీల నుంచి మద్యాన్ని కొనుగోలు చేసి రిటైల్‌ వ్యాపారులకు అమ్ముతోంది. రాష్ట్రవ్యాప్తంగా 11,300కి పైగా మద్యం దుకాణాలకు బహిరంగ వేలం పద్ధతిలో అనుమతులిచ్చింది. వీటికి పదిరెట్లకు పైగా బెల్ట్‌షాపులు వెలిశాయి. మరోవైపు పక్క రాష్ట్రాల నుంచి మద్యాన్ని తెచ్చి జీరో బిజినెస్‌ నిర్వహిస్తున్నారు. వీటి అమ్మకాలపై పన్ను ఎగవేస్తున్నారు. మరోవైపు సిండికేట్‌గా ఏర్పడి ధరల్ని తమ అదుపులో పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు మద్యం వ్యాపారంలోకి దిగితే సమాజంలో చులకనౌతారని భావించేవారు. కాగా ఇప్పుడదే ప్రతిష్ఠాత్మక వ్యాపారంగా మారింది. కాంగ్రెస్‌, తెలుగుదేశం, బిజెపి ఇలా పార్టీలతో సంబంధంలేకుండా నేతలంతా ప్రత్యక్షంగానో, పరోక్షంగానే మద్యంవ్యాపారంలోకి ప్రవేశించారు. అందులోనే కాసులు గడిస్తున్నారు. దాన్నే రాజకీయాలకు పెట్టుబడిగా పెడుతున్నారు. మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు కూడా దీన్నే ప్రధాన ఆదాయమార్గంగా ఎంచుకున్నారు. ఈ పరిస్థితిని కట్టడి చేయక పోతే 2014ఎన్నికల్లో మద్యం సిండికేట్‌లు, వ్యాపారులతో పోటీకి దిగడం కష్టమని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోలేమన్న భయం కొందరు పాలకుల్లో ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 5వేలకోట్లకు పైగా షాపుల వేలం ద్వారా అబ్కారీ ఆదాయం లభిస్తోంది. మరో 7వేల కోట్లు హోల్‌సేల్‌ వ్యాపారం, ఎక్సైజ్‌ డ్యూటీ, అమ్మకపు పన్ను ద్వారా సమకూరుతోంది. బడ్జెట్‌లో సింహభాగాన్ని సంపాదించి పెడుతున్న అబ్కారీని నిర్లక్ష్యం చేయకుండానే క్రమబద్ధీకరించి తమ గుప్పెట్లో పెట్టుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఇందుకోసం గతంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన విధానాల్ని పాలకులు అధ్యయనం చేస్తున్నారు. గుజరాత్‌, నాగాలాండ్‌, మిజోరం రాష్ట్రాల్లో ఇప్పటికీ సంపూర్ణ మద్యనిషేధం అమలౌతోంది. రెండేళ్ళ క్రితం గుజరాత్‌లో కల్తీసారా మరణాలు జరగడంతో మద్యంప్రియుల కోసం పర్మిట్లు ఇవ్వాలన్న ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. కాగా గిరిజనుల్లో మద్యం వినియోగం అధికంగా ఉన్నప్పటికీ నాగాలాండ్‌, మిజోరం ప్రభుత్వాలు ఈ వ్యాపారాన్ని అనుమతించడంలేదు. ఢిల్లీలో టోకు, చిల్లర వ్యాపారాలన్నీ ఆ రాష్ట్రప్రభుత్వమే చేస్తోంది. ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేసి ప్రభుత్వ దుకాణాల ద్వారానే వినియోగదారులకు విక్రయిస్తోంది. పూర్తిగా ప్రభుత్వ అజమాయిషీలోనే ఈ వ్యాపారం సాగుతోంది. నిర్ణీత వేళలు, ధరల్ని ఖచ్చితంగా అమలు చేస్తోంది. కేరళలో మద్యం వినియోగం బాగా ఎక్కువ. ఆ రాష్ట్ర ఆదాయంలో 40శాతం అబ్కారీ ద్వారానే సమకూరుతోంది. ఒకప్పుడు అక్కడ ప్రైవేటు వ్యాపారులుండేవారు. వారంతా సమాంతర ప్రభుత్వాన్ని నడిపే స్థాయికి ఎదగడంతో మొత్తం మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తోంది. ప్రతి 80వేలమందికి ఒక దుకాణం చొప్పున 337షాపుల్ని ఆ రాష్ట్రంలో ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. వారానికి ఏడురోజులూ ఉదయం 8నుంచి రాత్రి 10గంటల వరకు అక్కడే అమ్మకాలు సాగిస్తున్నారు.దీంతో వ్యాపారం పెరగడమే కాకుండా ఆదాయం గణనీయంగా వృద్ధి అయింది. 1984లో ప్రభుత్వం చేపట్టే నాటికి కేరళలో అబ్కారీ ఆదాయం 60కోట్లుంటే 2010నాటికది 5వేలకోట్లకు చేరుకుంది. వీటన్నింటిని పరిశీలిస్తున్న పాలకులు ఇదే విధానాన్ని రాష్ట్రంలో కూడా ప్రవేశపెడితే మద్యం మాఫియా అక్రమాలకు, ఆగడాలకు అడ్డుకట్ట వేయగలమని భావిస్తున్నారు.

లేపాక్షి బసవయ్య నీకిదేం దుస్ధితి అయ్యా!

భారతావని కళలకు పుట్టినిల్లు.. శిల్పకళకు జీవగడ్డ. ఎందరో చక్రవర్తు లు, మహారాజులు, రాజులు, సరాజులు, సామంతులు తమ అభిరుచుల మేరకు కట్టించిన ఎన్నో కట్టడాలకు శిల్పకళా నైపుణ్యం తోడై నేటికి పర్యా టక కేంద్రాలుగా భాసిల్లుతునే ఉన్నాయి. ఆంధ్రదేశాన సైతం ఇలాంటి కళాసంపద అందర్నీ ఆకర్షిస్తూ ... అక్కున చేర్చుకుంటున్నాయి. వాటిలో అగ్ర భాగాన నిలచేది లేపాక్షి అనటంలో సందేహం లేదెవ్వరికీ... అద్భుత శిల్ప కళా నిలయంగా నిలచే లేపాక్షి అందాలు చూసేందుకు రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదేవెూ లేపాక్షి బసవయ్యా లేచి రావయ్య అంటూ అడవి బాపిరాజులాంటి అగ్ర కవి ఉత్తములే ఇక్కడి నందిని చూసి పరవశించి పోయారంటే చూసేవారికి కళా తృష్ణ ఉండాలే కానీ ఇక్కడి శిల్ప కళాఅందాలెలాంటివో ఇట్టే తెలుసుకోవచ్చు.
విజయనగర సామ్రాజ్యాన్ని క్రీ్ప్పశ 1530 నుండి 1542 వరకు పాలించిన అచ్యుత దేవ రాయులు కాలంలో ఇక్కడ వీరభద్ర ఆలయాన్ని నిర్మించడం జరిగిందని...ఏక శిలపై తెలుగుదనం ఉట్టి పడేలా నంది నిర్మాణం జరిగి నట్లు చరిత్రకారులు చెప్తారు. పెనుగొండగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం లో ఆంధ్రదేశాన హిందుపురానికి 18 కిలో మీటర్ల దూరంలో వెలసిన అద్భుత శిల్పకళా క్షేత్రం లేపాక్షి. రాయల కాలం అంతరించాక ఈ ప్రాం తాన్ని అనేక మంది ఆక్రమించుకున్నారు. ఆపై నవాబులపాలనలోకి వచ్చి తరువాత పాలెగాళ్లు...ఆపై మరాఠాల ఏలుబడిలో కొనసాగింది. మురారి రావు అనే మరాఠాయోధుడు తన తండ్రి హిందూరావు పేరుపై నిర్మించిన పట్టణం హిందూపురం. తరువాత టిపð సుల్తాన్‌ పాలనలోకి వెళ్లిన ఈ ప్రాంతాన్ని బ్రిటీష్‌ పాలకులు టిపð సుల్తాన్‌ని శ్రీరంగ పట్టణంలో వధించి తమ వశం చేసుకుని నైజాం పాలనలోకి తెచ్చారు. తదుపరి నైజాం తన రాజ్యంలోని కొంత భాగాన్ని బ్రిటీష్‌ వారికి దత్తత ఇవ్వటంతో ఈ ప్రాంతం కూడా ఆ దత్తమండలంలో భాగమై బ్రిటీష్‌ పాలనలోకి వచ్చింది. ఈ క్రమంలో జరిగిన అనేక దాడుల కారణంగా ఇక్కడి శిల్పకళా సంపద కొంత మేర నష్టం జరిగిందని చెపుతారు.
లేపాక్షికి ఆపేరెలా వచ్చిందంటే...
సీతాదేవిని చెరబట్టిన రావణుడు ఆమెని లంకకి తీసుకెళ్లే క్రమంలో తన వాయువాహనంపై ఈ ప్రాంతం నుండి వెళ్తుండగా... అడ్డగించి దాడి చేసి... సీతను కాపాడేందుకు ప్రయత్నించిన జఠాయువు రెక్కల్ని కత్తిం చగా. ఆపై రాముడు ఆ పక్షిని లే.. పక్షి అని తట్టి లేపగనే లేచి కూర్చొం దని.. ఆపై దాని...సేద తీర్చి విషయాన్ని తెలుసుకున్నాడని. .. అపðడు రాముడు నోటి నుండి వచ్చిన లే.. పక్షి అన్న మాటలే తరువాత కాలం లో లేపాక్షిగా స్ధిర పడినట్లు చెప్తారు. మరోవైపు అచ్యుత రాయల ఆస్ధానంలో కోశాధికారిగా పనిచేసే విరూపణ్ణ పరమ శివ భక్తుడు కావ టంతో శివాలయాన్ని నిర్మించాలని తలచి రాజు అనుమతి తీసు కోకుండానే దీనిని ప్రారంభించి ఖజానా ధనాన్ని ఖర్చు చేస్త్తూ... మండప నిర్మాణ దశకు ఆలయం చేరు కున్న దశలో విషయం తెల్సిన అచ్యుత రాయలు ఆగ్రహించి విరూపణ్ణ ని అంధుడుని చేయమ ని ఆజ్ఞాపిం చగా... ఆ శిక్ష ఆ శివాలయంలోనే తానే అమలుపరుచుకుని గోడకు తన కళ్లని కొట్టాడని... తదుపరి జరిగిన తపð తెలుసుకున్న అచ్యుత రాయు లు తన వల్ల అక్షువులను (కళ్ల)ను కోల్పోయిన ఈ ప్రాంతానికి (అక్షి లేమి ) లేపాక్షి అని పేరు పెట్టి ఆలయ నిర్మాణం పూర్తి చేసాడని మరో కధనం ప్రచారంలో ఉంది. ఇప్పటికీ విరూపణ్ణ కనులు విసిరిన ప్రాంతంలో ఆ ఆనవాళ్లుఆలయ గోడపై దర్శనమిస్తున్నాయి.
భారీ నంది విగ్రహం..
దాదాపు 8.1 మీటర్ల పొడుగు, 4 మీటర్ల ఎత్తుతో ఏకశిలతో రూపొందిన ఈ విగ్రహం ఇప్పటికే ప్రపంచంలో అరుదైన అతి పెద్దదైన విగ్రహంగా చోటు సంపాదించుకుంది. తెలుగుజాతి వ్యవసాయంలో కీలక భూమిక పోషించే వృషభజాతిరాజసాన్ని ఒలికిస్తూ. అనేక అలంకరణలతో మహా శివునిలింగం ముందు వెూకరిల్లి ఠీవిగా మనకి ఆహ్వానం పలుకుతూ ఉం టుంది. మన తెలుగు వాకిళ్లలో సంక్రాంతి పండగకు పశువులను అలం కరిం చుకోవటం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. ఆ క్రమంలోనే ఈ నందినిశిల్పులు చెక్కినట్లు కనిపిస్తుంది.మెడలో లోహపుపట్టిలు, గంట లు కు తోడుగా గరుడ పక్షులు రెండు ఏకంగా ఏనుగుల్ని తీసుకెళ్తున్న రూపాలు, కుడి ఎడమ పక్కల్లో నృసింహ స్వామి రూపాలు స్పష్టంగా కనిపిస్తాయి. నాటి రాయల వారి రాజసానికి ఇవి దర్పంగా.. సామ్రా జ్య పటిమకు ప్రతీకగా చెప్తారు.
వీరభద్ర ఆలయం...
అడుగుడుగునా శిల్పకళకు నిలువెత్తు రూపంగా నిలచే ఈ ఆల యం పరిసరాలలో ప్రశాంతత... ప్రతి అణువు చూస్తూ... మనసు ఉప్పోంగిపోతూ ఉండేలా చేస్తుంది. లోపలి, వెలుప లి ప్రాకారాలలో..ఖాళీప్రదేశాలలో సైతం అద్భుత కళాసంపద కనిప ిస్తుంది. కూర్మాకారంలో ఉన్న రాతి శిలపై విజయనగర సామ్రాజ్య ధీరోదాత్తతని, జీవన విధానాలకు ప్రతిబింబాలుగా ఇక్కడి శిల్ప కళ కనిపిస్తుంది. నలుదిశలా నిర్మించిన కళ్యాణమండపాలు కడుచక్కగా ఉన్నా..కొన్ని అసం పూర్ణంగా నిర్మాణమైనట్లు కనిపిస్తాయి.
పార్వతీపరమేశ్వరుల కళ్యాణ మండపంలో బ్రహ్మ,విష్ణు, దేవేంద్ర, యమ, వశిష్ట, అగ్ని, విశ్వామిత్ర తదితరులు ఈ పరిణయానికి వచ్చినట్లు మలచి న తీరు కట్టి పడేస్తుంది. అంతే కాదు పైకపðలపై రాయబడిన అనేక కుడ్య చిత్రాలు నేటికీ కనీసం రంగు కూడా వెలియ కుండా... చెక్కు చెదరకుండాఉన్నాయంటే నాటి కళాకారుల కళా నైపుణ్యా నికి ఆశ్చర్యం కలగక మానదు. అదే లేపాక్షిరంగులకున్న ప్రత్యేకత గా ఇక్కడి వారు చెప్తారు.
ఒకపðడుఏడు ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆల యం అనేక ఆక్రమణ

లకు గురికావటంతో నేడు మూడు ప్రాకారాలతో దర్శనమిస్తుంది. ఎక్కడై నా దేవాలయాన్ని దర్శించేపðడు ధ్వజ స్ధంభం నుండి నేేరుగా గర్భగుడిలో దేవుడు స్పష్టంగా కనిపిస్తాడు. కానీ ఈ దేవాలయంలో మాత్రం అందుకు భిన్నంగా ఆతని తీవ్ర దృష్టి పడకుండా మధ్యగా అడ్డు గోడ ఉండి ఉండ టం విశేషం. ఇక్కడి వీరభద్రుడు చిన్న చిన్న కళ్లతో అందంగా ఆకర్షణీ యంగా కనిపిస్తాడు. ఇక ఈ మండపంలో దర్శనమిచ్చే దుర్గాదేవి గాలిలో తేలుతు... ఓ మూలకు ముఖం పెట్టి ఉన్నట్లు కనిపించడం మరో విశేషం. సీతారామలక్ష్మణులు,హనుమాన్‌స్ధాపిత శివలింగం,నవగ్రహాలు ఉన్నాయి.
వేలాడే రాతి స్ధంభం
చాలావరకు మండపాలు కూలిపోతున్నట్లుగా విదారకరదృశ్యంని ఆవిష్క రించినా... నాట్య మండపానికి తూర్పున వేలాడే రీతిగా ఈ స్ధంభ నిర్మా ణం సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తుతుంది. పైకపðకు అంటి పెట్టుకుని భూమికి 2 అంగుళాల ఖాళీ కనిపిస్తుందంటే..నాటి శిల్పకారులు, స్ధపతు ల శిల్పకళా వైదుష్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ విచిత్రాన్ని తెలుసుకు న్న అప్పటి బ్రిటీష్‌ పాలకులు తమ ఇంజనీర్లను పంపించగా.ఈ స్ధంభాన్ని కదిపి చూడగా... ఓవైపు మాత్రం కాస్త కిందకి జారిందని.. గైడ్లు చెప్తారు
నాగేంద్రుడు..
ఆలయ తూర్పు చివరన నాగేంద్ర విగ్రహం ఉంది. ఆరడుగుల ఎత్తులో ఉన్న ఈ నాగేంద్రుడు తన చుట్టలతో శివలింగాన్ని కావలించుకుని ..ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది కూడా ఏక శిలతో తయారైన విగ్రహమే... ఈ పడగ వెనుక ఉన్న గోడపై చిన్న గోళీలంత సైజులో ఏర్పడ్డ రం ధ్రాలు... వాటిలో రక్తపు మరకలు కనిపిస్తాయి. ఇవి విరూపఫ్ణుని కళ్లుగా చెప్తారు.
శిల్ప కళ
నాటి ప్రజల జీవ నవిధి విధానాలను, కళాభిరుచులను ఇక్కడి కళా ఖండాలు అలనాటి అపురూప దృశ్యాలను సాక్షా త్కరింపచేస్తాయి.పాలకుల నిర్ల క్ష్యం వల్ల అక్కడక్కడా కొంత భాగం కూలిపోయినా..ప్రపంచానికి లేపాక్షి నంది పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నా సరైన ఆలనా పాలనా లేకపోవటం ఉన్నదాన్ని రక్షించకపోవటంతో చెత్తాచెదారం పేరుకు పోయి నేడు ఈ ప్రాంతమంతా దుర్గంధంలో కూరుకుపోతూ ఉండటం.. చాలా మేర ఆక్రమణల బారిన పడటం ఆందోళనకరం.పాలకులెపðడు పట్టించు కుంటారా అనిదీనంగా చూస్తున్నట్లు ఉంటుంది ఈ ఆలయ పరిస్ధితి,
లేపాక్షి దుస్తులు :
వస్త్ర పరిశ్రమలో లేపాక్షి వస్త్రాలకు ప్రత్యేక స్ధానం ఉంది. అయితే ఇక్కడ ఎలాంటి నేత పరిశ్రమ లేదని.. చుట్టుపక్కల ఉన్న నేత పనివారు విరూ పాక్షుని ఆలయం లోని వివిధ విగ్రహాలు, కుండ్య చిత్రాలను తాము నేసే వస్త్రాల పై వేసి లేపాక్షి వస్త్రాలుగా చలామణి చేస్తారని చెప్పడం ఆశ్చర్యం కలిగించే అంశమే...
నంది అవార్డులు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సినిమాలలో ఉత్తమంగా నిలచిన చిత్రాలకు.. నటీ నటులకు.. సాంకేతిక నిపుణులకు, టివి నటీనటులకు నంది అవార్డు లను ఏటా అందిస్తూ వస్తోంది. ఇందుకు అందించే ప్రతిమలను లేపాక్షి నంది నే ప్రాతిపదికగా తీసుకుని రూపొందించడం విశేషం.
తెలుగుజాతి వారసత్వ సంపదగా భాసిల్లుతున్న లేపాక్షి కళా కేంద్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో దీనిని మరింత ముందు కు తీసుకు పోయేందుకు హెరిటేజ్‌ లేపాక్షి పేరుతో ప్రత్యేక సంస్ధని ఏర్పాటు చేసారు. యునిస్కో గుర్తింపు కోసం కేంద్రం తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది కూడా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అద్భుత కళా సంపదను రక్షించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో పర్యాటకులను ఆకర్షించేలా ఇక్కడ వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్య త కూడా అంతే ఉంది.
ఎలా వెళ్లాలి...
బెంగుళూరు.హైదదాబాద్‌ హైవేకి కేవలం 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూపురం నుండి ఇక్కడి కి చేరుకునేందుకు ప్రతి గంటకు ఒక బస్సుని నడుపుతున్న ఆర్ట్టీసి. ఇవి కాక శివరాత్రి తదితర సందర్భాలలో మరిన్ని బస్సులు నడుపుతుంది. అయితే ఇక్కడకి వచ్చే యాత్రీకుల సౌక ర్యార్ధం కేవలం ఒక్క గెస్టుహౌజ్‌ని నిర్మించడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రాత్రుళ్లు బస చేయటం తలకు మించిన భారంమై చిన్నపాటి హౌటళ్లే యాత్రీకులకు ఆధారమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో మరిన్ని గదుల నిర్మాణం జరిగితే సౌకర్యవం తంగా ఉంటుందని యాత్రీ కులు కోరుతున్నారు.

16, డిసెంబర్ 2011, శుక్రవారం

చూపుల”మాయ”

చూపులతో గుచ్చిగుచ్చి చంపకే- అంటూ ఒక ప్రేమికుడు వాపోతాడు. ప్రియురాలి చూపు కోసం పరితపించే ప్రియుల గురించి విన్నాం. కోర చూపులు, ఓర చూపులు మహిళల సొంతం. భావాన్ని కళ్లలోనే పలికించగల నేర్పరులు వాళ్లు. అందమైన, ఆల్చిప్పల్లాంటి కళ్లతో వేలాది భావాలు చూపించే భామలు ఉన్నారు. ఇక్కడ స్టిల్స్‌లో కనిపిస్తున్న ఐదుగురు నాయికలు అనుష్క, తాప్సీ, స్నేహఉల్లాల్‌, తమన్నా, శ్రద్ధాదాస్‌లను చూస్తుంటే ఒక్కొక్కరూ ఒక్కొక్క విధమైన చూపుతో. భావాన్ని ఇట్టే పలికించే సామర్ధ్యం ఉన్న వాళ్లు. అనుష్క చిరునవ్వుతో, తాప్సీ ప్రశ్నార్థకంగా, కోర చూపులో స్నేహాఉల్లాల్‌, తమన్నా మత్తెక్కించే చూపుతో, ఓర చూపులో శ్రద్ధాదాస్‌ కనువిందు చేస్తున్నారు.

సమతా మమతల సృజనశీల మల్లెమాల

మట్టివాసనలకు అక్షరాకృతులు జాల్వా ర్చిన సృజన శీల మల్లెమాల. అలతి పదాలతో..కవితామాలికలల్లి... సమాజం లోనిఅసమానతల్ని అక్షరాస్త్రాలతో తెగ నాడిన అభినవ వేమన మల్లెమాల. భావుకతను సామాజిక స్పృహతో రంగ రించి, ఆధ్యాత్మికతలో జీవన సత్యాల ను ప్రభోదించి రామాయణ కావ్యంలో తెలుగుతియ్యదనాలు నింపిన మహిత గుణశీల మల్లెమాల.
నిర్మోహమాటస్ధుడిగా...ముక్కుసూటిగా,నిశ్చల, నిశ్చిత అభిప్రాయలను వెల్లడించే వ్యక్తిగా ఆయనదో విలక్షణ శైలి.
ప్రముఖ నిర్మాత, కవి, సాహితీవేత్త ఎం.ఎస్‌.రెడ్డి. కేవలం సినీ నిర్మాతగానే కాకుండా సాహితీ ప్రపంచంలోనూ తన కవితా గుబాళింపులని 'మల్లెమాల'గా విరజిమ్మిన సామాజిక చైతన్యానికి కూడా కృషి చేశారు.
సమాజాన్ని చదివిన విద్యావేత్త

విద్యాలయాల్లో...విశ్వవిద్యాలయాల్లో చదుకోలేని మల్లె మాల ఈ సమాజాన్ని అన్ని విధాలుగా చదువుకుని విద్యావేత్తగా ఎదిగారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి సమీపంలోని అలిమిలి గ్రామంలో రంగమ్మ, రామ స్వామి దంపతులకు 1924 ఆగష్టు 15న జన్మించిన మల్లెమాల సుందర రామిరెడ్డి (87) గత కొంతకాలం గా అనారోగ్యంలో బాధప డ్డారు. వ్యవసాయ కుటుం బం లో పుట్టినా... కష్టాల కడగళ్లులో మునిగి అర్ధాకలి తో అలమటించిన సందర్భాలూ ఉన్నాయి. సాధారణ రైతు కుటుంబంలోపుట్టినా..వీధిబడిలో...అందునా రచ్చబండలె పాఠశాలుగాచదువుసాగింది. ఉపాధ్యాయుడు చెప్పిన పద్యాన్ని అంతా రాసినాతను రాయకుం డానే ఏకబిగిన చెప్పి ఏకసంథాగ్రాహిగా అప్పచెప్పడంతో అంతా అవా క్కయి.మంచి విద్యార్ధిగా గుర్తిపు తెచ్చుకున్నా కుటుంబ ఆర్ధిక పరిస్ధితి సహకరించకపోవటంతో చదువు చుట్ట బడలై... ఉద్యోగ వేట వైపు పయన మైంది. తండ్రి చేసిన అప్పు లకు కోర్టుజప్తు కు భూమి పోగా వ్యవ సాయం చేయాలని నాగ లికి దరి చేరినా సొంతవారే పాలెగాడని చెప్తున్నప్పు డు బాధప డ్డారు. చిన్న ప్పుడు అప్ప చెప్పిన పద్యాలే ఆయన లో స్పూర్తి రగిలించి... పెద్దయ్యాక కవిత్వంపై మక్కువ పెంచుకుని.. మల్లె మాలగా..అనేక అంశాలపై తన దైనశైలిలో కవిత్వాన్ని వెల యిం చి సహజకవిగావినుతికె క్కారు.
ఉద్యోగం... వ్యాపారం

ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబ పరి స్ధితి గమనించి... 1941లో ఎనిమిది రూపాయల జీతా ని కి మైకా డిపోలో ఉద్యోగంలో చేరారు మల్లె మాల. మూడేళ్లు అక్కడ పనిచేసాక జీతం రెట్టింపు అయినా ఏదో తెలియని భావనలు వెం టాడుతుండటంతో... తన దగ్గరున్న ఇరవై రూపా యలనే పెట్టుబడి గా పెట్టి తాటి పీచు అమ్మకాన్ని ప్రారంభించారు. ఆపై ఆప్రాంతంలో లభించే మిను ములు, పెసలు, మామిడి, తంగేడు, కందులు ఇలా పలు వాటిని కొనటం... అమ్మటం చేస్తు కొద్ది రోజు ల్లోన అంచలంచెలుగాఎదిగితన కుటుంబం కోర్టు జప్తు కాబడ్డ భూములకు రెట్టింపు మొత్తంచెల్లించి స్వాధీన పరుచుకుని...పూరింటిస్ధానంలోచిన్నపాటి పెంకు టిల్లు కట్టించి పూర్వ వైభవాన్ని తేగలిగారంటే వ్యాపార దక్షత ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
సంఘ సంస్కర్తగా...

అతి చిన్న వయసులో 1936లో స్వాతంత్ర ఉద్యమ సమయంలో వెంకటగిరికి వచ్చిన గాంధీజీ ప్రసంగానికి ప్రభావితుడై...గాంధీజీ పాదాలను స్పృశించారు. నాటి నుండి ఆయన చూపినబాటలోఅంటరానితనాన్ని నిర్మూ లించాలని అహర్నిశలూ కృషి చేసిన దేశ భక్తుడు. సంఘ సంస్కర్తగా సమాజానికి సేవలందిస్తూ .. సమాజంలో ప్రతిఒక్కరితో ఆప్యాయత గా అందరి హితాన్ని కోరుకునే వారాయన.సమతా,మమతల భావ నతో ఎన్నో కవితలని అందారు. బెంగాల్‌ కరువు వచ్చి న ్పుడు 'కష్టజీవి' బుర్రకధని తోటి కుర్రాళ్లతో కల్సి ప్రదర్శించి సుమారు పదివేల రూపాయలు కమ్యూని స్టు పార్ట్తీకి పంపారు.
సినీ ప్రస్ధానం

తన జీవితగమనంలో అనేక వ్యాపారాలు నిర్వహించిన ఆయన సినిమాలపై మక్కువతో గూడూరులో సుందర్‌ సినీ ధియేటర్‌ పేరుతో చిత్రప్రదర్శనశాలను నిర్మించారు. ఆపైమరికొన్ని ధియేటర్లకు యజమాని అయ్యారు. డ బ్బింగ్‌ చిత్రాలతో తన సిని నిర్మాణాన్ని ప్రారం భించిన ఆయన కౌముది పిక్చర్స్‌ సంస్ధని స్దాపించి చిత్ర నిర్మాణ రంగంలోకి దిగారు. 'భార్య' చిత్రంలో మొదలైన ఆయన సినీ నిర్మాణ ప్రస్థానం శ్రీకృష్ణ విజయం, వూరికి ఉపకారి, కోడెనాగు, ముత్యాల పల్లకి, ఏకలవ్య, రామబాణం, పల్నాటిసింహం వంటి చిత్రాలతో కొనసాగింది. పూర్తిగా బాలలతో ఆయన నిర్మించిన రామాయణం రాష్ట్ర ప్రభు త్వనంది అవార్డుతో పాటు, జాతీయ పురస్కారాన్ని కూ డా అందుకోవటం విశేషం. ఈ చిత్రం ద్వారానే జూనియ ర్‌ ఎన్టీఆర్‌ చిత్ర పరిశ్రమకి పరిచయమయ్యాడు. అంకు శం, ఆగ్ర హం, అమ్మోరు, అంజి, అరుంధతి చిత్రాలను తన కుమారుడు శ్యాం ప్రసాద్‌ రెడ్డితో నిర్మిం పచేసారు. ఎప్పుడూ కధా బలాన్ని నమ్ముకుని చిత్రాలు తీసిన ఆయన పలు చిత్రాలు పరాజయం పాలైనా ఏ మాత్రం దిగులు చెందకుండా... మరింత పట్టుదల తో మరింత అద్భుత చిత్రాన్ని రూపొందించిన ఘనుడాయన.స్వయంగా నటు డిగా అంకుశం చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో కని పించిన ఆయన 'వెలుగు నీడలు' చిత్రంలో ప్రధాన భూమికని పోషించారు.

కవిగా...

మల్లెమాల చక్కని, చిక్కని భావుకుడు మా త్రమే కాదు సమాజం లోని అన్యాయాలను, దురాగతాలను చూసి చలించి పోయిన మాన వతా మూర్తి. అందుకే భావుకతతో అద్భు తమైన పాటల్ని అటు సిని మాలకు మల్లెపూల పరిమళాలు వెదజల్లే కవితల్ని ఇటు సాహితీ ప్రపంచానికి అందిచారు. అదే సమయంలో నిలు వెత్తు సామాజికి స్పృహతో విప్లవ గీతాల్ని, కవితల్ని వెలయించారు. అయితే ఏ రచన చేసినా అచ్చతెలుగులో అలతి పదాలతో మాత్రమే రచనలు చేయంటి మల్లెమాల ప్రత్యేకత. 'ప్రతిదినం ఒక గ్రంధ మైనా చదవందే అడుగు ముందుకు పడదు... ఒక పద్య మైనా రాయందే నిద్రరాదంటూ...' తన సాహిత్యాభిమా నాన్ని చాటుకుంటూ పద్యం తన ఆరోప్రాణంగా అనేక సందర్భాలలో చెప్పారు. సరస్వతీ మాతే తనని పెంచి పోషిస్తోందని... చెప్పుకుని తన ఇంటి పేరునే కలం పేరుగా మార్చుకుని...మల్లెమాలగా.. సినీ కవిగా పలు చిత్రాలకు సుమనోహ రమైన గీతాలు అందించిన ఆయన తన కంటూ ఓ ప్రత్యేకతని దక్కిం చుకున్న ఆయనసహజ కవి, ఆంధ్రా వాల్మీకి లాంటి బిరుదాంకితుడు కూడా... అందుకు తగ్గట్టే ఆతని రాసిన గ్రం ధాలు, రచనలు, పద కవితలు సహజ త్వానికి దగ్గరగా.సాధారణ పదజాలం తో ఉండటం విశేషం. తరాల అంత రాలను తెగనాడుతూ'వృషభ పురా ణం' అనే గ్రంధం ఆవిష్క్కరించారు. తన ప్రతిభాపాటవాలను చాటే విధం గా వాల్మీకి రామాయణాన్ని అనుస రి స్తునే ఆయన విరిచించిన 'మల్లె మాల రామయణం'లో సంస్కృత ఛందస్సుకు తెలుగుదనాన్ని కలగ లిపి ఎక్కడా కృత్రిమత్వానికి చోటి వ్వకుండా పాత్రోచితమైన కల్పనలు చేస్తూ... సుకుమార పద్యాలనుఅద్భుతంగా మల చి రుచి చూపించారు. ఆధునిక కవిత్వ పోకడలున్న కాలంలోనూ పద్య కవితలతో తన సత్తా చూపి కవి సమ్రాట్‌ విశ్వనాధ సత్యనారాయణ ప్రశంసలందుకున్నారాయన. తేనెటీ గలు, వాడనిమల్లెలు, భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్ర, నివేదన, భారతరత్నాలు వ ంటి రచ నలతో పాటు అనేక మంది సుప్ర సిద్దులను ప్రశంసిస్తూ ఆయన


రచించిన 'ఎంద రో మహాను భావు లు' అన్న గ్రంధం వేనోళ్ల ప్రశంసలందు కుంది. ఇటీవలే తను రాసిన 10 గ్రంధాలను ఆవిష్కరించారు.ఇటీవల ఆయన 'నా కధ' పేరుతో ఆయ న రచించిన ఆత్మకధలో తన సినీ ప్రస్దానంలో ఎదురైన అనేక ఒడిదుడుకులను ప్రస్తావిస్తూ.... పలు చిత్రాల నిర్మాణాల సమయంలో సొంత కుమారుడితో పాటు అనేక మంది సినీ ప్రముఖులపై తనదైన శైలిలో విమర్శ నాస్త్రాలు సంధించడంతో ఆ పుస్తకం వివాదాస్పదమైంది?
సత్కారాలు... పురస్కారాలు...

సాహితీ ప్రపంచానికి మల్లెమాల సేవల్ని గుర్తించిన అన్నామలై యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ పురస్కా రాన్ని అందించగా...'మహిత వినయశీల మల్లెమాల ' అన్న మకుటంతో రాసిన నిత్యసత్యాలకు గానూ అభినవవేమన బిరుదు లభించింది. జాతీయ అవార్డు,తో పాటు 2005లో రఘుపతి వెంకయ్య అవార్డు ఇటీవలే ఆత్రేయ పురస్కారాన్ని సైతం అందుకున్నారు. ఇక అనేక స్వఛ్ఛంధ సంస్ధలు అందించిన పురస్కారా లు లెక్కకు మిక్కిలి.
రాజకీయానుబంధాలు...
1957లో గ్రామపంచాయితీ ఎన్నికల్లో గెలిచి రాజకీ యాలలోకి వచ్చిన ఆయన సంజీవరెడ్డి హయాంలో సమితి అధ్యక్షుడిగా అవకాశం వచ్చినా దానిని వదులు కున్నాకాంగ్రెస్‌తో తన అనుబంధాన్ని చాటుకుంటూ... వచ్చి చివరకి మాజీ ముఖ్యమంత్రి విజయభాస్కర రెడ్డితో వియ్యమంది బంధుత్వంగా మార్చుకున్నారు.
ఎఫ్‌డిసి చైర్మన్‌గా...
ఆయన నిర్మించిన డాక్యుమెంటరీ 'కన్నీటి కెరటం' దివిసీమ కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించి అందరి ప్రశంసలు అందు కున్న క్రమంలో అప్పటి ముఖ్య మంత్రి మర్రి చెన్నారెడ్డి మల్లెమాల సేవలను గుర్తించి 1990లో చలనచిత్ర అభివృధ్ధి
మండలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి. సమస్యలతో సతమతమవుతున్నదానిని ఒక గాడీలో పెట్టారు.


ఆంధ్రప్రభతో అనుబంధం
అంధ్రప్రభతో మల్లెమాల అనుబంధం సుదీర్ఘం, అత్యంత బలీయం. ఆవిషయం ఆయనే వివిధ సాహితీ, సాంస్కృతిక సభల్లో చెప్పేవారు. ఒక్క రోజు ఆంధ్ర ప్రభ ప్ర్రతిక ఆయనకు రావటం ఆలస్యమైతే వెంటనే ఫోన్‌ చేసి ఫిర్యా దు చేసేవారు. ఎన్ని పేప ర్లు వచ్చినా... ముందు గా ఆంధ్రప్రభనే చదువు తానని దశాబ్దా లుగా ఇది తన అలవాట ని పేర్కొన్నారు. 'చివరి అంకం'లో కైడా ఆయన రచనలు చేసింది ఆంధ్ర ప్రభకే శరీరం సహక రించక పోయినా... ఒక లేఖకుని ఏర్పాటు చేసుకు ని రచనలు చేసి ఒకటికి నాలుగు సార్లు కరెక్షన్స్‌ చేయించి 'మల్లెమాల కాలమ్‌' కి పంపేవారు. 'కాలమ్‌' బావుండక పోతే.. ఆపేయ మని, మొహమాట పడవద్దని మధ్య మధ్యలో సంపాదకుడికి ఫోన్‌ చేసేవారు. అంధ్రప్రభ కార్యాల యంలో ఏప్రియల్‌ రెండవ తేదీన నిర్వహించిన ఉగాది కవితా విజేతల బహుమతీ ప్రధా నోత్సవ సభకు ప్రత్యేకంగా హాజరయ్యారు.
ఈ సంద ర్భంలో ఆయతీసుకు వెళ్లేందుకు చెయ్యి పట్టుకోగా ఒళ్లు పెనంలా కాలిపోతూ ఉంది. వాకరు తో నడుస్తున్న ఆయన్ని 'ఏమిటి సార్‌! ఒళ్లు ఇంత వేడిగా ఉంది? అని ప్రశ్ని స్తే... 'బాగా జ్వరం... కానీ ఆంధ్ర ప్రభ కార్య క్రమానికి రాకుండా ఎలా? అందుకే ఓపిక చేసుకుని జ్వరమైనా లెక్క చేయకుండా వచ్చాను' అన్నారు. తాను వ్యక్తుల్నిగానీ, వ్యవస్ధలని గానీ అభిమానిస్తే... ఆ అభి మానం అంత ప్రగాఢం గా ఉంటుందనటానికి ఇంతకు మించిన ఉదాహ రణ మరొకటి ఏముం టుంది. నిలువెత్తు వ్యక్తి త్వానికి, సాహితీ సేద్యాని కి, తెలుగు ఆత్మ గౌరవా నికీ ప్రతీకగా భాసిల్లే మల్లెమాల చివరి రోజుల్లో మృత్యువుని కూడా అంతే ధై ర్యంగా ఆహ్వానించారు. చావంటే తనకు భయం లేదని నిర్భయంగా వెల్ల డించేవారు.
అయితే తుది శ్వాస వరకు తన రచన కొనసాగాలన్న తన అభిలాషను వ్యక్తం చేసారు మల్లెమాల. అటు వంటి ఆయన కలానికి బ్రేకులు వేసింది కుటుంబ సభ్యులే కావటం అత్యంత విషాదం అంటారు ఆయన గురించి తెలిసిన వారు. ఏది ఏమైనా సహజ కవి మల్లె మాల సాహితీ ప్రపంచంలో ఒక సంచలనం.

వ్యధమిగిల్చిన 'ఇది నా కథ'
తను చనిపోయేలోగా 'ఇది నా కథ' గ్రంధం పూర్తి చేస్తానో లేదో అని యం.యస్‌.రెడ్డి తెగ బాధపడేవారు. ఇదే విషయాన్ని చాలా మంది ప్రముఖుల వద్ద, సాహితి, సంస్కృతి సభల్లో బహిరంగంగా వ్యక్తం చేసేవారు. అయితే ఆయనకు ఆ గ్రంధ రచన పూర్తిచేయడం ఆనందం కలిగించిందేమోకానీ, అంతకు మించి ఇబ్బంది కలిగించిందనే చెప్పాలి. 'ఇది నా కథ'లో కొంతమంది ప్రము ఖులపై ఆయన చేసిన వ్యాఖ్యానాలు పెద్ద దుమా రాన్ని లేపాయి. ఈ దుమారాన్ని చల్లార్చడానికి ఆయన కుటుంబసభ్యులు, హడావుడిగా మార్కెట్‌ నుండి కాపీలు వెనక్కి తెప్పించి, బహిరంగ మార్కెట్లో కాపీ దొరక్కుండా కట్టడి చేసినట్టు అప్పట్లో చెప్పుకున్నారు. అంతేకాకుండా సుప్రసిద్ధ నిర్మాతగా ఇమేజ్‌ సంపాదించుకుని, పరిశ్రమలో మంచి సంబంధబాంధవ్యాలు నెరపుతున్న ఆయన కుమారుడు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి తన ఈ వ్యవహారం తననెప్పిగా తయారైందని, ఆయన కుటుంబసభ్యులు భావించి, మల్లెమాల మీద ప్రత్యక్షంగా ఆగ్రహం వెలిబుచ్చారని, కొంతకాలం పాటు ఫోన్‌ సౌకర్యం కూడా అందుబాటులో లేకుండా చేశారని, ఆయన రచనలకు సహాయకుడిగా పనిచేసే వ్యక్తిని కూడా తీసివేసి, ఆయనకు దాదాపు బయటి వ్యక్తులతో సంబంధం లేకుండా ఒంటరిని చేశారని, చిత్రపరిశ్రమలో, సాహితీ రంగాల్లో చెప్పుకున్నారు.

ఆరోగ్యాన్నిచ్చే అందాల వంటిల్లు

తానెంత ఎదిగినా... ఇల్లాలుగా.. మాతృమూర్తి పదవులకే ప్రధమస్ధానం ఇచ్చే మహిళలు...
అన్ని బాధ్యతల్ని సరితూకం చేసుకుంటూ... నెగ్గుకు వస్తున్నా సతమతం తప్పట్లేదన్నది నిజం...
ఈ తరుణంలో ...నిమిషాలలో పనులు చేసి పెట్టే అద్భుత యంత్రాలతో పాటు..
కొత్త తరహా వంటిల్లులు అందుబాటుకిి వచ్చి కొంత సేద తీర్చేలా చేస్తున్నాయనే చెప్పాలి.
మహిళలు... మహరాణులూ... అంటూ కవితలల్లిం ది ఎవరో తెలియదు కానీ... నేటితరంలో అన్ని రంగాలలో దూసుకుపోతున్న యువతిని చూస్తుంటే.. వంటింటికే కాదు యావత్‌ ప్రపంచానికీ మహరాణు లమే అని నిరూపిస్తున్నా రనిపిస్తుంది. ఆర్కిటెక్చర్లు గా, డిజైనర్లుగా, ఇంజనీర్లుగా... రిసెప్షన్‌ నుండి... మేనేజింగ్‌ డైరెక్టర్ల వరకు, సామాన్య ఉద్యోగి నుండి దేశాధ్యక్షుని వరకు.. పైలట్‌ నుండి వ్యామ గామి వరకు ఎక్కడైనా తనకో ప్రత్యేకత నిరూపించుకుం టూ...సత్తా చూపిస్తూ..ఎన్నెన్నో కీర్తిప్రతిష్టల్ని సంపా దిస్తునే ఉన్నారు. అయినా ఆడవారికి అమ్మగా లాలింపు... పాలింపు తప్పనిసరి తన చేతివంటని ఆనందంగా తింటున్న బిడ్డల్ని చూసి ఆనందించని అమ్మ ఉండదు. ఈ క్రమంలోనే అమ్మ వంట చేసేం దుకు అనువుగా వంటిల్లు కూడా ఉండాల ని..ఆమెలోనూ నూతనోత్సాహం నింపా లన్న పలు వురి ఆర్కిటెక్చర్‌ల ఊహలలోంచి రూపు దాల్చినదే ఆధునిక వంటిల్లులు.
ఆధునిక పరికరాలు రాని రోజుల్లో కూడా మన ముం దు తరాలవారు ఉమ్మడి కుంటుంబాలలో ఆనందంగా వంట చేసుకుని హాయి, హాయిగా తిని ఆరోగ్యకంగానే ఉండే వారు.
నేడు అన్ని అందుబాటులోకి వచ్చినా. ఉమ్మడి కుటుంబాలు అవసరార్ధం విచ్చిన్నమైన క్రమంలో ఇంట్లో ఉన్న నలుగురికి వంట చేసేందుకే నానా హైరానా పడిపోతూ... చెమటలు పట్టేస్తూ... వంటెవడు కనిపెట్టా డురా భగవంతుడా అని విసుర్లు విసురుతున్న మహిళల్ని చూసి... నేడు వంటిల్లు తెల్లబోతోంది.అసలు దాని ముఖం చూసేందుకు కూడా నచ్చని నేటితరం అమ్మాయిల్లో చాలా వరకు వంట రాకపోవటం కూడా అదో కారణం కావచ్చు.
పూర్వంలో మన బామ్మలు, అమ్మమ్మలు...కాలంలో పిడక ల పొయ్యలు, కట్టెల పొయ్యలు, బొగ్గుల కుంపట్లు.. ఇలా నిత్యం ఇంట్లో అగ్నిహౌత్రం వెలుగుతూ ... ఇల్లంతా మసక బారు స్తున్నా... ఏం లేకు న్నా... అంత రుచి కరంగా అమ్మ చేసిన వంట నేడు లభించిన దాఖలాలే లేవన్న ది నిన్నటి తరం వారు చెప్పే మాట. రుబ్బురోళ్లలో నలిగిన పిండితో చేసిన అట్ల రుచి, రోకళ్లతో కొట్టిన పొడుల గుభాళింపులు, తిరగ ళ్లలో నలిగిన కందిపొడి.. బండలతో చితక్కొట్టిన పచ్చళ్లు, అప్పడాల కర్రలు ఇలా వేటికవే ప్రత్యేకత సంతరించు కునేవి. నాడు ఆ పొగ పొయ్యలపై కళ్లు మండుతున్నా... పిండి వంటలు, మిఠాయిలు చిటికెలో ఎలా చేసి పడేసే వారో నేటికీ అర్ధం కాని ప్రశ్నే...
కానీ నేడు గ్రేండర్లు, మిక్సీలు, స్టౌల్‌లు, ఒవెన్లు ఇలా అన్నీ అందుబాటులోకి వచ్చినా... మనం మాత్రం సమయా భావం పేరుతో ఏ స్వగృహా ఫుడ్స్‌పైనో, కర్రీ పాయింట్ల పై నో ఆధార పడి గడిపేస్తూ వంట ప్రాధా న్యతని తగ్గించేసు కుంటున్నాం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయటం నేడు పెరుగు తున్న ఆర్ధిక భారాల దృష్టా తప్పనిదే కావటం.... పిల్లలు చదువులు, ఇంట్లో ఉరుకులు, పరుగులతో పనులు చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్లేందుకు సమయం తక్కువ గా ఉన్న క్రమంలోనే దాదాపు ప్రధాననగరాలలో ప్రతి వీధిలో, గల్ల్లీ చివర్లలో కర్రీ పాయింట్లు పుట్టుకొచ్చాయి. స్వీట్‌ స్టాళ్లు మూడు పువ్వులుగా వర్ధిల్లుతున్నాయి.
కత్తి పీటల స్ధానంలోకి చాకులు, పీలర్లు వచ్చి పడ్డాయి. ఆ క్రమంలో నేడు కూరగాయలు క్షణాల్లో అన్నింటినీ కట్‌ చేసే యంత్రాలు, పపð వేస్తే చాలు క్షణాల్లో రుబ్బి పెట్టే గ్రేండర్లు, మంత్రం వేసినట్లు నిమిషాల్లో అన్నం, కూరలు, చేసి పడేసే ఎలక్ట్రానిక కుక్కర్లు, చపాతీలు, పుల్కాలకు రోస్టర్లు, టి, కాఫీలకూ ప్రత్యేకంగా మిషన్లు అందుబాటు లోకి వచ్చినా... చాలా మంది తమ వంటిళ్ల ని ఇష్టాను సారంగా వాడిపడేస్తుంటారు. దీంతో పని మనిషి కన్నా.. ఆ వస్తువులు పాడైతే బాగు చేయించడానికో.. తిరిగి కొను గోలు చేయటానికో ఎక్కువ అవుతుందని గమనిం చుకోండి.
మరి కొందరైతే అవసరం ఉన్నా లేకున్నా ఇష్ట్టానుసారం వస్తువుల్ని కొనేస్తుంటారు. దీంతో బైటకు కనిపిస్తే ఇబ్బంది అని అన్నీ వంటగదిలోనే చేరిపోతుండటంతో ఉన్న గది ఇరుకై ఇబ్బందులు... విసుగు తెప్పిస్తుంటాయి. అద్దె ఇళ్ల లో ఉన్న వాళ్లు ఎలానూ సర్ధుకు పోక తప్పదు... కానీ సొంత ఇళ్లు ఉన్నవారికోసం నేడు ఎన్నో హంగులతో అవసరాలకు తగ్గట్టు అధునాతనరీతిలో రూపొందిన వంట ిళ్లు వచ్చేసాయి.
వంటింటి ఓ వైపునే అన్ని ఉండేలా చూసుకునేవారు గతంలో.. కానీ నేడు రెండు వైపులా ర్యాకలుే, చిన్నపాటి రాతిపలకలు వేసి.. ఉన్న తక్కువ స్ధలాన్నే విశాలంగా చేస్తున్నారు. ఇందుకు ఎక్కువ శాతం లేత గ్రానైట్‌ వాడుతుం డటంతో ఆహ్లాద కరంగా ఉంటుంది. ఇక వంటిల్లు చిమ్మచీకట్లు చిందేలా కాకుండా వెలుగులతో ప్రతిబింబించేలా చేస్తూనే... వంటల నుండే వెలువడే ఆవిర్లు పోయేందుమార్గాలను ప్రత్యే కంగా ఏర్పాటు చేస్తారు. ఫ్రిజ్‌, ఒవెన్‌, గ్రేండర్‌, మిక్సీ ఇలా ప్రతి ఎలక్ట్రానిక వస్తు వు వినియోగానికి వీలు గా ప్లగ్‌పిన్‌లు ఏర్పాట్లు పాత్రలు శుభ్రపరుచుకునే షింక మొదలు, క్రిందన ఉండే మ్యాట్లు వరకు... అన్ని శుభ్రపరుచుకునే ఏర్పాట్లు గిన్నెలు ఉంచే స్టాండ్స్‌... వంటకు దినుసులు అందు బాటు లో ఉంచేలా నిర్మిస్తున్న అలమరాలు ఇలా అన్ని ఓ ఎత్తయితే... వంటింట్లో ఇండోర్‌ ప్లాంట్ల కు సైతం కాసింత చోటిచ్చి మరింత ఆహ్లాదపరి చేలా చేస్తున్నారు నేటి ఆర్కిటెక్చర్లు.
మరో వైపు ఆధునికంగా ఉన్న చిన్న పాటి స్ధలంలోనే గుండ్రని ఆకారంలో షింక, స్టౌవ్‌, సామాన్లు ఉంచేందుకు అలమరాలు, ఒవెన్‌, ఫ్రిజ్‌, ఇలా తదితరాలు పెట్టుకునేందుకు ప్రత్యేక అమరికల్ని ఏర్పాటు చేసి అందిస్తున్నారు. వీటిలో చాలా మేరకు గ్యాస్‌ సిలండర్లను ఇంటి బైటే ఉంచి ప్రత్యేక పైపు ద్వారా స్టౌకి గ్యాస్‌ పంపడం వల్ల ప్రమాదాలు చాలా తక్కువగా ఉండటంతో నేటి ఆధునిక మహిళలు పెద్ద పెద్ద వంటిల్లు స్ధానంలో చిన్నగా చూసేందుకు అందంగా కనిపి స్తున్న ఈ వంటిల్లు పట్ల మక్కువ చూపిస్తున్నారు.
ఈ క్రమంలోనే పాత వంటిల్లునే మీకు నచ్చిన రీతిలో రూపొందిం చేందుకు నిర్మాణ కంపెనీలు, ఆర్కిటెక్చర్లు ప్రత్యేక తరహాలో మీకు ఉన్న ప్రదేశానికి తగ్గట్లు వీటి నిర్మాణం చేస్తున్నారు. వంటింటికి సంబంధించిన వివిధ పరికరాలను అందిచే కంపెనీలు కూడా తమ తమ ఔట్‌లెట్ల లో ఇందుకు సంబంధించి అనేక రకాల డిజైన్లు అందిస్తున్నాయి.
ఇప్పటికే మార్కెట్‌లో అందమైన రంగుల్లో వివిధ రకాల డిజైన్లతో పలు షింకలుే, ట్యాప్‌లు, టేబుల్స్‌, ప్రొవిజన్‌ స్టాండ్స్‌, ఐటమ్‌ స్టాండ్స్‌, హ్యాంగింగ్‌ స్టాండ్స్‌, ఇలా అన ేకం లభిస్తున్నాయి... ప్రొవిజన్స్‌ స్టాండ్స్‌లలో ఏవి ఎక్కడు న్నాయని పేర్లు రాసుకునేందుకు ఉన్నవి కొన్నయితే... ఏకంగా పారదర్శకంగా కనిపించేలా అన్‌ బ్రేకబుేల్‌ ప్లాస్టికతోే తయారైన సీసాలతో కల్సి సెట్‌గా లభిస్తున్నవి మరి కొన్ని. ఇక వాష్‌ బేసిన్‌ పక్కన మిర్రర్లు,టవల్‌ స్టాండ్లు... పాత్రలు శుభ్రం చేసే సబ్బులు, పౌడర్లు, లిక్వి డ్లు ఉంచుకునేందుకు అక్కడే ప్రత్యేక అలమరాలు... అవి కడగటం పూర్తి కాగానే మీ చేతులు తుడుచుకునేందుకు తువ్వాలు పెట్టుకునే స్టాండ్లు, కాస్త ఖర్చెక్కువైనా పర్వాలే దని అనుకుంటే... పనిమనిషితో సంబంధంలేకుండా ఇంట్లో మీరు నిత్యం వాడుకునే పాత్రలు కడిగి పెట్టే డిష్‌ వాషర్లు సైతం వీటిలో ఏర్పాటు చేస్తారు. ఆధునిక వంట గదిలలో వచ్చి... ఏదీ కనిపించ డం లేదనేందుకు లేకుండా వచ్చి చేరాయి. మరెందుకు ఆల స్యం మీ ఇంటిని కూడా అందంగా చక్కదిద్ధుకోండి..

శత వసంతాల రాజధాని ఢిల్లీ

కౌరవ సామ్ర్రాజ్యానికి రాజధానిగా నిలచిన హస్తిన...
మొఘలాయీ చక్రవర్తుల మొదలు ఎందరి పాలనకో రాజధానిగా నిలచి...
ఆపై జార్జి వి చక్రవర్తి పాలనలో రెండో సారి రాజధానిగా ప్రకటించబడి...
దినదినాభివృద్ధి చెందుతూ... వందేళ్లు పూర్తి చేసుకుని...
ఏడాది పాటు శతవసంతాల సంబరాలు జరుపుకుంటోంది.
ఢిల్లీకి హస్తినగా దాదాపు మూడు వేల ఏళ్ల పైబడిన చరిత్ర ఉంది. పాండవుల కాలంలో ఇంద్రప్రస్ధంగా వెలిగిన మహానగరమే నేటి ఢిల్లీ ప్రాంతమని చరిత్ర కారులు చెపుతారు. మొఘల్‌ల కాలంలో షాజహాన్‌ చక్రవర్తి 1639 ప్రాంతంలో షాజహానాబాద్‌ పేరుతో ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిం చాడు. ఆపై భారతా వనిని పాలించిన అనేకమంది చక్రవర్తులు,రాజులు, సరాజులు రాజధానిగా పాలిం చినా...ఒక్కోక్కరు ఒక్కోప్రాంతాన్ని తమకు అనుకూలంగాభావించి అనే క కోటలు, దర్బారులు ఏర్పాటు చేసు కోవటం తో ఎనిమిది రాజ్యాలు ఢిల్లీ చుట్టు పక్కల ఏర్ప డ్డాయి. అలా ఏర్పడ్డ రాజ్యాలలో సుందర ప్రాంతాన్ని గుర్తించిననాటి బ్రిటీష్‌ పాలకులకుడైన జార్జి చక్రవర్తి-5 తన పాలనా సౌల భ్యం కోసం కోల్‌ కత్తా లోనిపరిపాలనా యంత్రా గాన్ని ఢిల్లీకి తరలిం చాల ని తలచి...1911 డిశంబ ర్‌ 11న తన సతీమణి మేరీ కింగ్స్‌ క్యాంప్‌తో కల్సి ఢిల్లీ దర్బారు స్ధలంలో పునాది వేసి 7 నగరాల ను కలిపి న్యూఢిల్లీగా మార్చి అదే పాలనా కేంద్రంగా తన పాలనని సాగించారు. నాటి నుండి మరోమారు ఢిల్లీ రాజధా ని నగరంగా వెలు గొందింది. బ్రిటీష్‌ పాలకుల నుండి మనదేశానికి స్వాతంత్రం వచ్చినా అనేక భవనాలు పాలనకు సౌలభ్యంగా ఉండటంతో మన పాలకులు కూడా న్యూఢిల్లీనే రాజధానిగా చేసుకున్నా రు. ఇప్పటికి న్యూఢిల్లీ రాజధానిగా ఏర్పడి వందేళ్లు పూర్తి కావటంతో అక్కడ శత వార్షికోత్సవ సంబరా లను ఏడాది పాటు నిర్వహిస్తోంది అక్కడి రాష్ట్ర ప్రభుత్వం.

అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని రాజధానిగా వెలుగొందుతున్న న్యూఢిల్లీ...చరిత్ర తరచి చూస్తే అనేక మార్పులు కనిపిస్తాయి. ఈ శతాబ్ధ కాలంలో అనేక కొత్త పోకడలకు నాంది పలికిందనే చెప్పాలి. ఢిల్లీ చుట్టు పక్కల ఉన్న నగరాలైన జహా నపాన, దినపానా, షేర్‌గఢ్‌, షా హజనానా బాద్‌, తుగ్గకాబాద్‌, సిరి ఇలా ఏడు నగరాలను న్యూఢిలీ ్లగా చేయాలని సంకల్పించిన నాటి నుండి పాండవుల కాలం నాటి ఇంద్ర ప్రస్ధ ప్రాంతంలో ున్న రైజినా గ్రామం వద్ద పాలనకోసం కావాల్సి న భవన నిర్మాణ పనులని ప్రారంభించారు. బ్రిటీష్‌ పాలకులు తమ పాలనాపట్ల ప్రజలకువినయ విదేయతలు కలిగేలా భవన నిర్మాణాలు ఉండాలని యోచించిన నాటి పాలకులు బ్రిటీష్‌ సామ్రాజ్య దర్పణం అందరికీ తెలియచేసేలా మహానగరాన్ని నిర్మించేందుకు ప్లాన్లు అనేక మంది ఆర్కిటెక్చర్లు రూపొందించారు. వీటిలో ఎడ్విన్‌ లాండ్‌ సీర్‌ లుటె న్స్‌, హెర్‌బెర్ట్‌ బాకెర్‌ అనే ఆర్కిటెక్చర్లు డిజైన్‌ చేసిన భవన ప్లానులకు జార్జి నుండి అనుమతి లభించ డంతో నాటి రాజరికపు ప్రతి బింబాలు గా నిలచే భవనాలు నిర్మాణం జరిగింది.నేడు ఢిల్లీలో కనిపించే రాష్ట్రపతి భవన్‌, సెక్రటేరియట్‌లు చూడవచ్చు.
ఆ క్రమంలో పాలనాయంత్రాంగం కోసం భవనాలు ఏర్పాటు చేసారు. 1922లో ఢిల్లీలో యూని వర్శిటీని ఏర్పాటు చేసినా భవన నిర్మాణాల విష యంలో పెద్దగా శ్రద్ద చూపక,తమ పారి పాలనకు అనువుగా వరుస భవనాలు నిర్మించు కుంటూ ... పోవటంతో ఆగ్రహం చెందిన విద్యార్ధులు, నాయ కులు పోరాటాలకు దిగాల్సి వచ్చిం ది కూడా. అయినా వెరవక కౌన్సిల్‌హౌజ్‌ నిర్మాణం పూర్తి చేసి ప్రారం భించడంతో అప్పటికే స్వాతంత్ర సమరంలో అనేక మంది త్యాగధనులు ప్రాణాలర్పించిన క్రమంలో వారి నుండి స్పూర్తి పొందిన భగత్‌సింగ్‌ లాంటి నేతలు దానిపె ౖకన్నేసి దానిని పేల్చేందుకు ప్రయత్నించారు. నాటి కౌన్సిల్‌ హౌజే నేడు మనకి పార్ల మెంట్‌గా మనం ఉపయోగిస్తున్నాం.
బ్రిటీష్‌ పాలకుల దాష్టికాలు రోజు రోజుకీ హెచ్చు మీరిపోతుండటంతో... విసిగి వేసారి న సామాన్య జనం కూడా బాపూ బాటలో నడిచి బ్రిటీష్‌ పాలకులకు తమ నిరసనల రుచి చూపించారు. ఊరూ వాడా ఏకమై...పల్లె పల్లె కదిలి... స్వాతంత్ర మహా సంగ్రామంలో పాల్గొనటంలో చివరికి ఎట్టకే లకు భారతావనికి దాస్య శృంఖలాలల నుండి విముక్తి చేస్తున్నట్లు ప్రక టించారు. దీంతో 1947 ఆగష్టు 14 అర్ధరాత్రి స్వాతంత్రం రాగా మన జాతీయ పతాకం ఢిల్లీ ఎర్రకోటపై వెల్లివిరిసింది. అయితే ... నాటి దేశ విభజన సమయంలో పాక నుండి వచ్చిన వారిని తనలో చోటిచ్చిన ఢిల్లీని పాలకులు సరిగా పట్టించుకోక పోవటంతో ఇష్టౄను సారం గా నిర్మాణాలు పెరిగి పోయాయి. 1957లో ఏర్పడ్డ ఢిల్లీ డవలప్‌ మెంట్‌ అధారిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌లు కలగల్సి రూపొందించిన మార్గదర్శకాలకు అను గుణంగా తిరిగి సుందర నగరంగా విస్తరణకు ప్రయత్నా లకు బీజం పడటంతో...నాటి ప్రధా ని నెహ్రూ సూచన లతో అనేక ఉద్యానవనాలు విశాలమైన రోడ్ల్లు నిర్మించారు.


విభిన్న సంస్కృతుల సమాహారం...

దేశ రాజధాని నగరంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు స్ధిరనివాసం ఏర్పాటు చేసుకోవటంతో నేడు ఢిల్లీ జనా భా రెండు కోట్ల 20 లక్షలు (2011 జనాభా లెక్కల ప్రకారం) వీరిలో అత్యధికు లు హిందువులే అయినా...
దాదాపు అన్ని మతాల ప్రజలు ఉండటంతో ప్రతి రోజు ఏ పండగ వాతావరణం కనిపిస్తుం ది. ఎవరు ఏ పండగ జరిపినా మిగిలిన మతాల వారు సైతం దానికి హాజరైతమ అను బం ధాలను చాటుకుంటారు. ఇక స్వాతంత్ర దినోత్స వం, గణతంత్ర వేడుకల్లో అయితే ఆ కోలాహలమే వేరు. నిత్యం కార్పోరేట్‌ కల్చర్‌ తో కళకళలాడుతూ ఉండే ఈ నగరం ఖరీదైన జీవనానికి ప్రతీకగా నిలుస్తు... నేటికీ తన దర్పాన్ని నిలబెట్టుకుంటూ ప్రపంచగుర్తింపు పొందుతోంది.




రాజరికం వెనక్కి...

బ్రిటీష్‌ రాజరిక స్మృతులు చెరిపి వేసే క్రమంలో అనేక మార్గాలకు మన భారత నాయకులు పేర్లు పెట్టారు. దీంతో యార్క్‌ రోడ్‌ వెూతీలాల్‌ నెహ్రూ మార్గ్‌గా... తీన్‌ మూర్తి మార్గ్‌ రాబర్ట్‌ రోడ్‌ గా, ఓల్‌ మిల్‌ రోడ్‌ని రఫీ మార్గ్‌గా, కింగ్స్‌ వేని జన్‌పథ్‌గా ఇలా పలు మార్పులుచోటుచేసుకున్నాయి
చూడాల్సినవీ
బోలెడు...

మూడు వేల సంవత్సరాలు రాజరికంలో ఉన్న ఢిల్లీ లో వారి నిర్మాణాలు , నాటి సాంప్ర
దాయాలు ఎక్కువగా కనిపిస్తాయి.ప్రస్తుతం పర్యాటకం గానూ అభివృద్ధి చెందిన ఢిల్లీలో చూడాల్సిన వాటిలో కన్నాట్‌ ప్లేస్‌, అక్షర్‌ధామ్‌, ప్రగతీమైదాన్‌లోని ఆటో ఎక్సపో, పార్లమెంట్‌, ఇండియాగేట్‌, ఎర్రకోట, జమా మసీదు, లెటస్‌టెంపుల్‌, ఇస్కాన్‌ టెంపల్‌ విజరు చౌక, వెూఘల్‌గార్డెన్‌, రాజ్‌ఘాట్‌, బాపూఘాట్‌, సెక్రటేరియట్‌, పురానా ఖిల్లా, లకిë నారాయ ణ టెంపుల్‌, రాష్ట్రపతి భవన్‌,అక్షరధామం, జంతర్‌ మంతర్‌, కుతుభ్‌ మినార్‌, ఇలా చాలానే చూసేందుకు ఉన్నాయి.

ఏడాది పాటు కార్యక్రమాలు...

దేశ రాజధాని నగర గత వైభవాన్ని ప్రజలకు తెలియ చేసేలా ఢిల్లీ సర్కారు ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయిుంచింది. ఏడాది పాటు జరిగే ఉత్సవాలను భారత సాంస్కృతిక మండలి సారధ్యం లో జరగనున్నాయి. ఇప్పటికే దస్తన్‌ ఎ ఢిల్లీ పేరుతో ఢిల్లీ నగర గత చరిత్రను ఏర్పాటుకు దారి తీసిన పరిస్ధితిని వివరిస్తూ... ఢిల్లీ ప్రభుత్వం రూపొం దించిన పుస్తకాన్ని విడుదల చేసారు. దీనిలో నగర సంస్కృతి, వారసత్వ సంపదల వివరాలు తో పాటు అనేక ఛాయా చిత్రాలను ప్రజలకు వివరింస్తూ శతాబ్ధి ఉత్సవాలను ప్రజలలోకి చొచ్చుకు పోయేలా మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నారు.
రానున్న జనవరి నుండి ప్రారంభం కాన ున్న ఈ కార్యక్రమాల కోసం వందలాది కళాకారులు సిద్దమవుతున్నారు. ముఖ్య మంత్రి షీలా దీక్షిత్‌, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తేజేంద్ర ఖన్నా... ఈ శతాబ్ధి ఉత్సవాలనుఎప్పటికపðడు పర్యవే క్షించేందుకు సిద్దమయ్యారు.
ఎవరెన్ని అవాంతరాలు చేస్తున్నా... పరమత చిహ్నానికి ప్రతీకగా నిలుస్తూ ... ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజధాని నగరం నిత్యం అనేక మందితో తెగ సందడి సందడి గా ఉంటుంది... ఇలాంటి నగరాన్ని ఒక్కసారైనా వీక్షించాలని అంద రి కీ ఉంటుంది.ఈ సారి సెలవుల్లో ఢిల్లీ వెళ్లి మీ వారందరితో అక్కడి ప్రద ేశా లు, నాటి మన చరిత్ర, సంప్రదాయాలను చూసి ఆనందంగా గడిపి రండి.. అదీ శతాబ్ధి ఉత్సవాలు ముగిసేలోగా అయితే మరీ మంచిది... ఇపðడైతే బోలుడు విషయా లు తెలుస్తాయి.

బాంబుల పేలుళ్లతో తల్లఃఢిల్లీః
మన దేశానికి స్వాతంత్ర వచ్చిన నాటి నుండి ఢిల్లీయే రాజధానిగా వెలుగొందు తున్నా.. పరమత సహనానికి ప్రతీకగా నిలు స్తున్నా... ముష్కరుల కళ్లనీ రాజధానీ మీదే ఉన్నాయి. గత రెండు దశాబ్ధాలలో 20కి పైగా పేలుళ్లు జరిపినా నిలదొక్కుకు వస్తోం ది...ఒక్క 1997లో వరుసగా ఏడ సార్లు పేలుళ్లు జరపారంటే మన భారతా వనిపై ఉగ్రవాదులు ఎంత గురిపెట్టారో అర్ధం చేసు కోవచ్చు. నేటికీ ఎక్కడో ఓచోట బాంబు పెట్టామంటూ బెదిరింపులకు దిగుతున్న సంద ర్భాలు అనేకం మనం చూడోచ్చు. ఇక గత 20 ఏళ్లలో జరిగిన పేలుళ్ల సంఘ టనల్ని అవలోకన చేసుకుంటే...
1993 మార్చి 12న పేలుళ్లలో 257 మంది మృత్యువాత పడ్డారు.
1997 జనవరి 9న ఢిల్లీ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ వద్ద పేలుళ్లు.
అక్టోబర్‌1న సర్ధార్‌బజార్‌లో పేలుళ్ళు
అక్టోబర్‌10న కౌరియా పూల్‌, కింగ్స్‌ వే క్యాం ప్‌, శాంతివనాలలో పేలుళ్లు10మంది మృతి.
అక్టోబర్‌ 10 రాణీ బాగ్‌లో ,,
నవంబర్‌ 30 ఎర్రకోట వద్ద జంట పేలుళ్లు.
డిశంబర్‌ 30న పంజాబీబాగ్‌లో బస్సు పేల్చివేత.
1998 జూలై 26న కాశ్మీరీ గేట్‌ వద్ద అంతర్జా తీయ బస్సు పేలుడు.
2000 జూన్‌ 18 ఎర్ర కోట వద్ద పేలుడు.
2001 అక్టోబర్‌ 1న పేలుళ్లలో 35 మంది మృత్యువాత పడ్డారు.
డిశంబర్‌ 13న పార్లమెంట్‌పై దాడి 5 గన్‌మాన్‌లతో సహా 12 మంది మృతి.
2005 మే 22 సినిమా హాళ్లలో పేలుళ్లు.
అక్టోబర్‌లో ఢిల్లీమార్కెట్‌లో పేలుడు 62 మంది మృత్యువాత.
2006 ఏప్రియల్‌ 14న జామా మసీద్‌ ప్రాంగ ణంలో బాంబు పేలుళ్లు..
2008 సెప్టెంబర్‌ 13న వరుస పేలుళ్లు.. 25 మంది చనిపోయారు.
ఏప్రియల్‌ 26 మొహ్రౌలీ ఫ్లవర్‌ మార్కెట్‌లో బాంబు పేలుడు.
ఏప్రియల్‌ 27 వెూహ్రౌలీ మార్కెట్‌లోపేలుడు.
2001 మే25న హైకోర్టు పార్కింగ్‌లో పేలుడు
2011 సెప్టెంబర్‌ 2న జరిగిన బాంబు పేలుళ్లలో 9 మంది చనిపోగా 45 మంది తీవ్ర గాయాల పాలయ్యారు.

మారియో! భళారే వి'చిత్రాలు'

రేఖాచిత్రాల నిలయంగా మార్చేసి... తన చెరగని చిరునామాగా తీర్చిదిద్దిన
మారియో... కళాభిమానుల హృదయ ఫలకాలపై చిరంజీవే ఎన్నటికీ....
మారియో మిరాండా కార్టూన్‌ చూస్తే గోవా వెళ్లినట్లే. అని గోవాని సందర్శించనివాని నుద్ధేశించి ఈ మాటలన్నది ఎవరో కాదు. గోవా ముఖ్యమంత్రి దిగంబర్‌ కామత్‌. ?
భారతదేశంలో కార్టూనీdస్టులలో ప్రముఖులు మారియో. వారు క్రైస్తవులైనా, వారి కోరిక మేరకు హిందూ స్మశాన వాటికలో సోమ వారంనాడు అంత్యక్రియలు జరిగాయంటే ఆయనలోని పరమత సహనం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
మారియో కార్టూన్లు సహజత్వానికి ప్రతీకలు. బొమ్మలో నీడలు తీసుకురావటం వారికే సాటి అన్నంతగా ప్రఖ్యాతి చెందారాయన. ప్రఖ్యాత ఆంగ్ల వార పత్రిక ఇలస్ట్రేటెడ్‌ వీక్లీలో కథలకు వేసిన బొమ్మలు చాలా ఆకర్షణీయంగా వుండేవి. పద విన్యాసాల కార్టూన్లు నిత్య నూతనత్వ హాస్యంతో అలరా రేవి. --

ఎసnd, ఈుషnషసాపn, nd ప ాుషస ాశసలో 'ౄశస' వాడ టం :ుషఠస షుnగష బదులు :షసdస షుnగషతో చురకలు వేసేవారు. మారియో పూర్తి పేరు మారియో జోవో కార్లోస్‌డో రోసారియో డె బ్రిట్టోమిరాండా, కార్టూన్లు పిన్న వయసులోనే ప్రారంభించిన ఆయన ముంబైలో డిగ్రీ చదివాక... తన కిష్టమైన ఆర్కిటెక్ట్‌ కోర్సులో చేరారు.
కార్టూనిస్ట్‌గా....

మారియో 1953లో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో కార్టూనిస్ట్‌గా చేరి పనిచేస్తూనే... తదుపరి ఇలస్ట్రేటెడ్‌ వీక్లీలో పనిచేసారు. 1960 తర్వాత లండన్‌లో ప్రముఖ పత్రికల్లో చేరి... ఆయన గీసిన కార్టూన్లు అన్ని దేశాల వారి అభిమానాన్ని చూడగొ న్నాయి. 22 దేశాలలో ఆయన కార్టున్లు, చిత్ర ప్రదర్శన జరిగింది. అమెరికా, జపాన్‌, బ్రెజిల్‌, ఆల్ట్రేలియా, ఫ్రాన్స్‌, సింగపూర్‌, యుగోస్లోవియా, పోర్చుగల్‌లో వారి కార్టూన్లు ప్రజాదరణ పొందాయి.
మారియో, విదేశాల నుండి తిరిగి వచ్చాక ఎకనామిక్‌ టైమ్స్‌లో చేరారు. ప్రముఖ వ్యాపార సంస్థల క్యాలెండర్లకు చిత్రాలు వేశారు. వారు వేసిన చిత్రాలలో 'మిస్‌ నింబు పాని', మిస్‌ ఫోన్సెకా ప్రాచుర్యం పొందాయి.
బిరుదులు...

భారత ప్రభుత్వం మారియో ను 1988లో పద్మశ్రీ, 2002లో పద్మ భూషణ్‌ బిరుదులతో సత్కరించింది. డబ్బు కోసం ఎప్పుడూ వెంప ర్లాడని ఆయన చిత్రాలను కళగానే భావించేవారు...గోవాలోనిలౌటోవిమ్‌లోని ఇంటి ని తనఅభిరుచికి తగ్గట్టు అభీష్టం మేరకే నిర్మిం చు ున్నారు. చుట్టూ అటవీ ప్రాంతం. చెట్లు, చేమలు, అనేక రకరకాల పక్షులు, జంతువులతో, సందర్శకుల దర్శనంతో ఎప్పుడూ కోలా హలం గా వుంటుంది. ఇక గోడలవైపు దృష్టి సారిస్తే, పేపర్‌ సైజుకంటే పెద్దగా కార్టూన్లతో అందరినీ అలరిస్తాయిదేశ విదేశాల నుండి సంద ర్శకులు వారి ఇంటిని చూడటానికి బారులు తీరుతారు.
దూరదృష్టిమెండు

మారియోకు దూరదృష్టిమెండు. ఒకసారి ముంబై రేడియోలో మోరార్జీదేశాయ్‌ ప్రధాని పదవిని చేపట్టనున్నారని వార్త రావడంతో, మిరాండా వెంటనే మొరాజ్జీ దేశాయ్‌, మద్యపాన నిషేధంపై కార్టూను వేశారు. మొరార్జీ దేశం కేవలం-10 నిమి షాలలోనే మద్యపానాన్ని నిషేధిం చారు.
ఇలస్ట్రేటెడ్‌ వీక్లీలో ఆయన కార్టూన్‌ చూసి కానీ, మిగతావి చూసే వారు కాదు. ఆయ న రేఖా చిత్రాలు జనం హుృద యా లను దోచుకునేవి. ముఖ్యంగా నిత్యం జరిగే సం ఘటన లతో, ఆమ్‌ ఆద్మీని తలపించేవి.
ఆయన చిత్రాలు చూడంగానే, తక్కువ పదాలతో, ఎక్కువ అర్థాన్ని ఇనుమడిం చేవారు. ధరల పెరుగుదల, అవినీతి, లంచగొండి తనం, కప్పల తక్కెడ రాజకీ యాలు, ఇలా ఒకటేమిటి? అన్ని కోణా లపై వారు చిత్రాలను వేసేవారు.
మారియో చిత్రాలు గోవాను ప్రతి బింబించేవి. ఇతర రాష్ట్రాలవారికి, వారు గోవాను పరిచయం చేసారనే చెప్పాలి. వారి కార్టూన్లు నిత్యం కొం గ్రొత్తగా వుండి అలరించేవి.
ఏదో ఒక గీతతో సంతృప్తిపడేవారు కాదాయన.. ముఖ్యంగా ఆఫీస్‌ బాస్‌, సెక్రటరీ, మధ్యతరగతి ఇళ్లలోని సంసారంలో సరిగమలు ఇలా ఎన్నో వైవిధ్య భరిత చిత్రాలు గీసి అందరినీ అలరించేవారు.

సర్వమత సమానత్వం...
తన 85వ ఏట నిద్రలో కన్ను మూసిన మారియో భార్య హబీబా చక్కటి ఉర్దూ మాట్లాడు తుంది. వారు జన్మత: క్రైస్తవులు. భార్యకు ముస్లిం సంప్ర దాయ ప్రభా


వం ఉండగా... ఆతని కుమారులు రఫద్‌, రావుల్‌పై హిందూ సంప్రదాయం ఆచరించేవారు. మారియో మరణానంతరం అంతిమదర్శనానికి వారి స్వగ్రామం లౌటోలి మ్‌లోని వరల్డ్‌ చర్చిలో వుంచారు. ఐరిష్‌, పోర్చుగీస్‌ పాటలను ఆలా పన చేశారు. వారి అంతిమ యాత్రలో సందర్శకు ల కళ్లు తడి ఆరలేదని ఓ ప్రముఖ రచయిత వ్యాఖ్యానిం చారు.
వివిధ రంగాల ప్రముఖులు పద్మశ్రీ మారియా ఆరోరా, సంగీత విద్వాంసుడు రెయోఫెర్నాండెజ్‌, ఆర్టిస్ట్‌, హెరిటేజ్‌ లవర్‌ విక్టర్‌ హ్యూగో గోమ్స్‌, కార్టూనిస్ట్‌ అలెగ్జ్‌, పారిశ్రామిక వేత్తలు దత్తరాజ్‌, శ్రీనివాస్‌ డెంపో, జడ్జి డి.సిల్వా ఫెర్డ్‌ నాండ్‌ రెబెల్లో, ప్రముఖ రచయిత విక్టర్‌, తదితరు లున్నారు.
ప్రముఖ కార్టూనిస్టులకు, రచయితలకు చావులేదు. వారు ఎప్పుడూ జీవిస్తూ వుంటారు. వారి రేఖలకు లక్ష్మణరేఖలు లేవు. అవి హద్దుల ను చెరిపేస్తాయి. లౌటోలియంలోని మారియో ఇల్లే దేవాలయం, అదే చిత్రాలయం, మూగజీవాలకు నిలయం, సందర్శకులకు చెరిగి పోని చిరునామా, అదే మారియో మిరాండా! తనువు వీడినా ఎందరో చిత్రాభి మానుల హుృదయాలలో తనకంటూ ఓ చోటు చేసుకున్నారు.
- దండు కృష్ణవర్మ

11, డిసెంబర్ 2011, ఆదివారం

ఆర్య, ద్రావిడుల సహజీవనం

ప్రాచీన భారతదేశచరిత్ర అంటే ఋగ్వేదం, సింధు నాగరికత, ఆర్యులదాడి, ద్రావిడులను దక్షిణాదికి తరిమి వయడం ఇవే ప్రధానాంశాలు కావనీ, ఋగ్వేద ఆర్యులు సింధునగరాల వాసులైన ప్రజలు సహజీవనం చేసారనీ వారితోపాటు పూర్వ ద్రావిడులు, ద్రావిడభాషా కుటుంబీ కులు కూడా కలిసి జీవించారనీ, వీరంతా ఒకరి వలన మరొకరు ప్రభావితులైనారని నిరూపించే అనేక అంశాలు వెలుగులోకి రావడంతో ఈ పరిశోధనలు క్రొత్త పుంతలు తొక్కసాగాయి అన్నారు పూర్ణచంద్‌.
అంతేగాక 'భారతదేశంలో ఆస్ట్రిక్‌ భాషా కుటుంబం ఇండో యూరోపియన్‌ భాషా కుటుంబం ద్రావిడ భాషా కుటుంబం మంగోలాయిడ్‌ భాషా కుటుంబం సమాహారంగా వుంటుంది. ఇక్కడి భాషలు నాగరికత, సంస్కృతుల ప్రభా వంలోనే ఋగ్వేద సంకలనం జరిగింది. ఋగ్వేద ఆర్యులు, వారికన్నా పూర్వీకులైన ముండా ప్రజలు పూర్వ ద్రావిడులైన ప్రజలతో సహజీవనం చేసారు. చరిత్ర కారులలో ఆర్యులదాడి జరిగిందనేవారు, జరగలేదనే వారు. ఇలా రెండు వర్గాలు వున్నాయి. జిమ్‌షాఫర్‌, టైనీ లిక్టెన్‌స్టీన్‌ (1999) అనే ఆర్కియాలజిస్టులు ఆర్యులదాడి అనేది జరగలేదని స్పష్టంగా పేర్కొన్నారు. 'ఆర్యన్‌ ఇనేవేజన్‌ థియరీలోని ఆర్యుల జన్మభూమి భారత దేశం కాదని, ఇండో యూరోపియన్‌ భాషా కుటుం బం కూడా భారతదేశంది కాదని బయట నుంచే వచ్చాయని నిరూపించడమే కొందరి లక్ష్యంకాగా వీరిలో ఆర్యులు ఆగంతకులుగా వచ్చారు. ఆర్యులు ఆశ్రితులుగా వచ్చారు అనే రెండు వర్గాల వాదనలు చేసే వారు ఉన్నారు. ఇందుకు భిన్నంగా ఆర్యులు ఇక్కడి వారేనని చెప్పాలని మేము అనుకుంటున్నా. ''ఈ రెండు సిద్ధాంతాలు రైలు పట్టాలాంటివి. ఏనాటికీ కలవలేవు. చరిత్రకు రాజకీయాల రంగు పులమటమే ఇక్కడ విచా రకరం అంటారు పూర్ణచంద్‌.
దక్షిణాసియా దేశాల మధ్య అనాదిగా నడిచిన పరస్పర సంబంధ బాంధవ్యాలన్నీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి లోనే కొనసాగాయి కాబట్టి మూల ద్రావిడులు వైదిక ఆర్యులు సమకాలీనంగా కలిసిమెలిసి జీవించారన్నదే ముఖ్యమైన విషయం అంటారు పూర్ణచంద్‌.
సుప్రసిద్ధ ఆర్కియాల జిస్ట్‌ ఎ.ఎస్‌.రావు సింధు నగ రాలలో వైదిక ఆర్యులు పూర్వ ద్రావిడులు సహజీవనం చేసా రని పేర్కొన్నారని పూర్ణచంద్‌ పేర్కొన్నారు. మైఖేల్‌ విట్జ్‌ల్‌ అన్న పరిశోధకులు కూడా వరి, నాగలి వంటి పదాల వ్యుత్ప త్తులను నిర్వచనాలను ఎత్తిచూపి ఆర్యులు, ద్రావిడుల సహ జీవనం చేసారన్నారు అని కూడా పూర్ణచంద్‌ చెప్పారు.
ఋగ్వేదకర్తలకన్నా భిన్నమైన సంస్కృతి కలిగిన ప్రజలు భారతదేశంలో అనాది నుంచి వుండేవారన్న పూర్ణచంద్‌ గారి మాటలను మేము ఇక్కడ ఒక విధంగా సమన్వ యంచేసి చూపుతున్నాం. వేదాలు మహాతపస్సంప న్నులైన ఋషులు విన్నవి కావున శ్రుతలైనవి. 'వేదాలను ఋషులు దర్శించారు కాబట్టి ఆ ఋషులు ద్రష్టలైనారు, కాబట్టి వేదాలు అపౌరుషేయములయ్యాయి. అయితే తాము వినిన వాటిని
దర్శించిన వాటిని, అప్పటికే వాడుకలో వున్న భాషలోనే వారు ప్రకటించి వుండాలి కదా! ఆనాటి వాడుక భాషలో వైదిక సంస్కృతభాషా జనంతో పాటు ఫ్రోటో ద్రావిడులైన వ్రాత్యులు కూడా సహజీవనం చేస్తున్నారు. కాబట్టి తాము వినినదాన్ని, ఋషులు తమ వాడుక భాషలో అంటే సంస్కృత బహుళమైన భాషలో ప్రకటించి వుంటారు. అట్టి ప్రకటనలో వ్రాత్యులు మాట్లాడే భాషా పదాలు కూడా వుండి ఉంటాయి కదా! కాబట్టి వేదాలలో ప్రక్షటో ద్రావిడియన్‌ పదాలు కూడా కలిసి వుండే ఆస్కా రం వుంది అన్నది మా సమన్వయవాదం.
ఎ.పి.కల్మార్కర్‌ వైదిక వ్రాత్యులనే నేడు మనం ద్రావి డులనుకుంటున్నాం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అందుకు వారు చూపించిన ప్రమాణాలలో పూర్ణచంద్‌ తమ గ్రంథంలో ప్రకటించిన ఋగ్వేదసూక్తాలు కూడా వున్నాయని మనం ఇచట గుర్తించుకోవాలి. (ఋగ్వేదం 1-15-8, ఋగ్వేదంలో 10-86-19)- ఋగ్వేదంలోని తొలిమండలాలలో ఆర్యుల, ఆర్యేతరులైన వారిని కూడా కలిపి (వ్రాత్యులు) అర్థదేవతలుగా పరిగణఙంచినట్లు సంస్కృత నిఘంటువు అమరకోశంలో చెప్పబడిందని మనం గమనించాలి. అమరకోశంలో అసురదైత్య దైతేయ, ధను, దానవ, దితిసు, ఈ
పదాలన్నీ సమానార్థకాలుగానే ఉన్నాయి. వీళ్లం దరూ ఆర్యుల ధర్మాన్ని గౌరవించి సఖ్యతతో వుండి ఉంటారు. కాబట్టి వీళ్లకి అర్ధదేవతలనే గౌరవం దక్కివుంటుంది. అంటే సగం ఆర్యులన్నమాట. ఆర్యులతో సంలీనం కాని వారు ఎలా అర్ధ దేవత లౌతారు? బహుశ వీరి మధ్య సాంస్కృ తిక, సామాజిక సంబంధాలతో పాటు, వైవాహిక సంబంధాలు కూడా ఎక్కువగా జరిగి వుండాలి అం టారు పూర్ణచంద్‌. తలపైన కొమ్ము,చుట్టుకొన్ని జంతు వులమధ్య యోగాసనంలో కూర్చుని ఒకదైవరూపం సింధు ముద్రికలలో దొరికిందికదా.
ఋగ్వేదంలో దాశరాజ్ఞ యుద్ధం ఒక సుప్రసిద్ధ చారి త్రక సంఘటనగా చెప్పబడింది. ఆ పదిమంది రాజులలో మాత్స్యుల, భక్తులు, భళానులు, ఆళీనులు, నిషానులు, అజులు, శివులు, శిగ్రులు, యక్షులు వంటి వారంతా వున్నారు. వారంతా సుదాసుడనే రాజునకు ఏదో ఒక సమయంలో వ్యతిరేకంగానో,అనుకూలంగానో, నిలబడిన వారేనని ఋగ్వేద ఆర్యులు అన్న పేరున గల తన గ్రంథంలో సుప్రసిద్ధ వైదిక పరిశోధకులు రాహులు సాంకుృత్యాయన్‌ చెప్పారని పూర్ణచంద్‌ తన రచనలో చెప్పారు. ఎ.పి.కల్మార్కర్‌ కూడా ఆ సంగతిని దాశరాజ్ఞ యుద్ధ వివరణలో చెప్పివున్నారని మనం ఇక్కడ గుర్తించాలి.
సమాజంలో వర్ణవ్యవస్థ, కులవ్యవస్థలు వేరువేరు అంశాలు. ఆర్యులది వర్ణవ్యవస్థ, ద్రావిడ తెగల వారిది కులవ్యవస్థ. కాలక్రమంలో ఈ రెండూ కలగలసి బ్రహ్మ క్షత్రియ వైశ్య శ్రూదులకు అదనంగా దళితులు హిందూ సమాజ వ్యవస్థలో చేర్చబడి అనాది నుంచి వస్తున్న నాలుగు వర్ణాలకుపైన పంచములు క్రొత్తగా చేర్చబడ్డారా అని కూడా వారు అడుగుతున్నారు.
ఆర్యేతరులైన వ్రాత్యులనుండే కులవ్యవస్థ హిందూసమాజంలో ఆరంభమయిందా? అన్న ప్రశ్నను

బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ కూడా అడిగారు. వైదికమైన పంచవింశ బ్రాహ్మణంలోను, అథర్వణవేదంలోను ఈ ప్రశ్నకు సమాధానం వున్నదన్నారు అంబేద్కర్‌.
వ్రాత్యులే అర్హంతులు, ¸°ధులుగా విభక్తులయ్యా రనీ, అధర్వణవేదంలో ఏకవ్రాత్యుల నుండి రాజస్య బ్రాహ్మణ వర్గాలు వచ్చినవంటారు అంబేద్కర్‌. పంచ వింశబ్రాహ్మణంలో హీనులు, గరాగిరులు, సమనీచ మేఢ్రులు, నిందితులు అన్న నాలుగు విభాగాలు ఏర్ప డినవి అంటూ,ఏవేవో కారణాంతరాల చేత వెలివేయ బడిన ప్రజావర్గాల నుండి పంచములు అన్న విభాగం కాలక్రమంలో ఏర్పడి ఉంటుందంటారు అంబేద్కర్‌.
ఆర్య భాష మాటాడిన ప్రజలకు అడుగడుగునా ద్రవి డయన్లు ఎదురయ్యారు. ఆర్యులు వారిని దాసులు, దస్యు లు ఇలా అనేక పేర్లతో పిలుచుకున్నారు. వీరు తమకన్నా అత్యున్నత నాగరికులని సంపన్నులని బలమైన నగరాలు కలిగిన వారిని ఆర్యులు వైదిక సాహిత్యంలో వర్ణించారు. కర్మార్కర్‌ కూడా తమ రచనలో ఇట్టి వర్ణనల వివరాలు ప్రకటించి వున్నారుకూడా. అయితే దాస, దస్యాది ఆర్యే తర ప్రజలు సుసంపన్నులుగా వున్నంత కాలం ఆర్యుల నుండి ఇట్టి ప్రశంసలు పొందుతూనే వున్నారు. సింధు నగరాల పతనం తర్వాత వర్తక, వాణిజ్యాదులు లేక ఈ దానవులు ఈ దస్యులే నల్లవారుగా, అస్పృశ్యులగా, బానిస లుగా నిందింపబడ్డారా? అంటూ ఒక సహజమైన సందే హం రేకెత్తించిన పూర్ణచంద్‌ అస్పృశ్యతా వివక్షలు ఆనాటి నుంచీ హిందూ సమాజంలో ప్రవేశించి పంచములుగా వెలియే యబడిన కొందరు బాధలకు లోనవుతున్నారని అంటారు పూర్ణచంద్‌. నిజంగా ఇది ఒక చర్చనీయాం శంగా పరిశీ లనాంశమే కదా.
బహుభాషా కోవిదులు తిరుమల రామచంద్ర తెలుగు, ప్రాకృత భాషల సంబంధాలను గురించి వ్రాస్తూ ప్రాకృ తం ప్రథమ భాష, ప్రజల నిత్య వ్యవహార భాష, ప్రజల ప్రేమ భాష, కష్టసుఖాల భాష, ఇదే ప్రకృతుల ప్రాకృతుల భాష అని తీర్మానించారు. మానవజాతి తొలి ఛందో రూపమైన ఋగ్వేదంలో ప్రాకృతభాషా రూపాలు కనిపిం చినందువల్ల ఋగ్వేదభాషకన్నా అతిభిన్నం అపరిష్కృతమైన ఒకభాష ఆనాడు వాడుకలోవుండేది. అది ప్రాకృతమూల మన్నారు. సంస్కృత వాఙ్మయచరిత్ర వ్రాసిన మల్లాది సూర్యనారాయణశాస్త్రి 'ఛందో' అనే వేదసంజ్ఞతో పిలువ బడిన సంస్కృతశబ్దాలు భాష అన్న సంజ్ఞతో పిలువబడిన లౌకిక శబ్దాలు తొలిదశలో ఒకేనని, కాలానుగుణంగా లౌకిక సంస్కృత భాషగా అది వికసించిందని అట్టి లౌకిక భాష విశృంఖలంగా వాడబడుతున్నపుడు 'పాణిని' దానిని సంస్క రించేందుకు పూనుకున్నారు.
- కె. ఘనశ్యామల ప్రసాదరావు

ఉసురు తీస్తున్న ఆసుపత్రులు

ప్రభుత్వాసుపత్రులు మురికి కూపాలుగా, మృత్యుముఖాలుగా తయారు కావడంతో డబ్బు ఖర్చయినా మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళ్తున్న సామాన్య ప్రజలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయనడానికి తరచుగా వస్తున్న వార్తలే నిదర్శనం. శరీరంలో వివిధ విభాగాలకు పరీక్షల పేరిట ప్రజల జేబులు కొల్లగొడుతున్న ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం మాట అటుంచి వారి ప్రాణాలకు భద్రత లేదనడానికి కోల్‌కతాలోని ఆమ్రి ఆస్పత్రిలో శుక్రవారం సంభవించిన ఘోర అగ్ని ప్రమాదాన్ని ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఆస్పత్రులకు, ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీలకు అనుమతులు ప్రస్తుత వ్యవస్థలో ఏ విధంగా లభిస్తున్నాయో మనందరికీ తెలుసు. నిబంధనలను ఉల్లంఘించని సంస్థల సంఖ్య వేళ్ళ మీద లెక్కించవచ్చు. ఆస్పత్రులను ఇరుకైన ప్రాంతాల్లో నెలకొల్పరాదనీ, స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణంలో ఉంటేనే వైద్య చికిత్సలు ఫలిస్తాయన్నది జనం నమ్మకం. అయితే, ఇప్పుడు గాలి ప్రవేశించని ఇరుకైన సందుల్లో సైతం కార్పొరేట్‌ ఆస్పత్రులు వెలుస్తున్నాయి. కార్పొరేట్‌ ఆస్పత్రులన్న పదంలోనే వ్యాపార సంస్కృతి నిబిడీకృతమై ఉంది కనుక, ప్రైవేట్‌ ఆస్పత్రులు పూర్తిగా వాణిజ్యపరంగానే నిర్వహించబడుతున్నాయని వేరే చెప్పనవసరంలేదు. అంతేకాక, బహుళ అంతస్థుల ఆకాశ హర్మ్యాల్లో ఆస్పత్రులు నెలకొల్పడం అనేది సర్వసాధారణమైంది. ఈ పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో ప్రమాదాలు సంభవించడం కూడా చాలా సహజమైన విషయంగానే భావించాల్సి ఉంటుంది.
భవన నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘన అనేది చాలా సహజమైన విషయం అయింది.ఆస్పత్రుల భవనాలే కాదు, అపార్టుమెంట్లు, ఇతర ప్రైవేట్‌ భవనాల నిర్మాణానికి నిబంధనలను తుంగలోకి తొక్కి నిర్మించడం అనేది ఒక్క కోల్‌కతాలోనే కాక, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌ వంటి మహానగరాల్లో సర్వసాధారణమైంది. చట్టాలు,నిబంధనలు మొదలైనవన్నీ మనం రూపొందించుకున్నవే. వాటిని రూపొందించే ప్రజాప్రతినిధులే ఉల్లంఘనకు పాల్పడుతున్నప్పుడు వాటి గురించి అసలు ఏమాత్రం తెలియని సామాన్య ప్రజలు వాటిని ఉల్లంఘించడం అబ్బురమూ కాదు, అసహజమూ కాదు. నగరపాలక,పురపాలక సంస్థల్లో ఉండే టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల్లో భవనాల ప్లాన్‌లను ఆమోదింపజేసుకోవడం ఎలాగో ఈరోజుల్లో ఎవరికీ చెప్పనవసరం లేదు.బిల్డర్ల వద్ద ఈ పనులు చేయడానికి ప్రత్యేక సిబ్బంది ఉంటారు. భవననిర్మాణ ఖర్చుల్లో ఈ అదనపు ఖర్చులను కూడా కలిపి బిల్డర్లు ఇండ్ల యజమానుల వద్ద వసూలు చేస్తూ ఉంటారు. కాకినాడ శ్యామలా నగర్‌లో ఇటీవల అపార్టుమెంటు కూలిన ఘటనలో ప్రాణనష్టం వాటిల్లకపోవడం నిజంగా అదృష్టమనే చెప్పాలి. అసలు అపార్టుమెంట్లు, ఆకాశహర్య్మాలు ఇరుకైన సందుల్లో, జనసమర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిర్మించకూడదన్న నిబంధనను కూడా ఇప్పుడు ఎవరూ పాటించడం లేదు. వాహనాలకూ ఇది వర్తిస్తుంది. పాత వాహనాల స్థానే కొత్త వాహనాలకు అనుమతి ఇవ్వాల్సి ఉండగా, పాతవి రోడ్ల మీద తిరుగుతుండగానే కొత్త వాహనాలకు అనుమతి ఇవ్వడం కూడా నిబంధనల ఉల్లంఘనే. భవన నిర్మాణాల్లో నిబంధనలు పాటించకపోవడం వల్ల అవి పేక మేడల్లా కూలిపోతుననట్టే, అడ్డు, అదుపు లేకుండా వాహనాల సంఖ్య పెరగడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి.
ఉద్యమాలు, ఆందోళనలు జరుగుతున్నప్పుడైతే ఇక చెప్పనవసరం లేదు. బంద్‌లకూ, రాస్తా,రైల్‌ రోకోలకు రాజకీయ పార్టీలు పిలుపు ఇవ్వడం సర్వసాధారణమైంది. వీటి వల్ల అంతిమంగా ప్రజలు నష్టపోతున్నారు. ఒక్కొక్కసారి ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు రోకో సంఘటనల కారణంగా ఇతర వాహనాలతో పాటు 'కుయ్‌ కుయ్‌' శబ్దంతో వేగంగా దూసుకుని వెళ్ళే అంబులెన్స్‌లు, 108 వాహనాలు కూడా ఆగిపోతున్నాయి. ఫలితంగా ఆ వాహనాల్లో అత్యవసర చికిత్స కోసం తీసుకుని వెళ్ళే రోగుల ప్రాణాలు హరీమంటున్నాయి. సమస్య ఎంత తీవ్రమైనది అయినా ప్రజలకు అసౌకర్యం కలిగించే రీతిలో ఆందోళనలు సాగించడం, నిబంధనలను ఉల్లంఘించడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదనీ, ఇలాంటి ఆందోళనలు నిర్వహించే వారిపై కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఇటీవల ఆదేశించింది. పౌరజీవనానికి ఆటంకం కలిగిస్తున్న వారి పట్ల అటు ప్రభుత్వమూ, ఇటు ప్రజలూ చూసీ చూడనట్టుగా వ్యవహరించుకోవడం వల్ల ప్రజలు అవస్థలు పడటమే కాక, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పొగొట్టుకుంటున్నారు.
అలాగే, ప్రజాప్రతినిధులు నిబంధనలనూ, సభా సంప్రదాయాలను ఉల్లంఘించడం వల్ల అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమవుతూ ఉంటాయి. మన రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన 16 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ఉప ఎన్నికల భారం ప్రజలపైనే పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. అటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా,వైద్య సంస్థలూ నిబంధనలను ఉల్లంఘించినప్పటికీ వారు కొద్ది పాటి జరిమానా, లేదాశిక్షలతో బయటపడుతుండగా, ఏ తప్పూ చేయని ప్రజలపై అదన పు ఆర్థిక భారం పడుతుండటం గమనార్హం. ఎవరో చేసిన తప్పునకు ఆర్థిక భారాన్ని మోయడం, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోగొట్టుకోవడం ప్రజల వంతు అవుతున్నది. కోల్‌కతా ప్రమాదం సంగతి తీసుకుంటే, శీతాకాలంలో అగ్ని ప్రమాదం సంభవించడం 'ఔరా' అని అనిపించే విషయమే. అయితే, విద్యుత్‌ వాడకం ఎక్కువగా ఉండే వాణిజ్య, వైద్య సంస్థలు, ఆస్పత్రుల్లో 'షార్ట్‌ సర్క్యూట్‌' వల్ల తరచుగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రమాదాలు నివారించదగినవే అయినా, సిబ్బంది నిర్లక్ష్యం, రోగుల తరపు బంధువుల అజాగ్రత్తల వల్ల ఎక్కువగా జరుగుతున్నాయి. ఉదాహరణకు రోగుల తరఫు బంధువులు ఆస్పత్రుల ఆవరణల్లోనే పొయ్యి రాజేసి వంటలు చేసుకోవడాన్ని మనం చూస్తూ ఉంటాం. అలాగే, ఆస్పత్రుల్లో నిబంధనల ప్రకారం ఉండాల్సిన వాటర్‌ స్టోరేజి ట్యాంకులు లేకపోవడం, బహుళ అంతస్థుల భవనాలకు ఉండాల్సిన సౌకర్యాలు లేకపోవడం రోగుల తరఫు బంధువులను పరిమితికి మించి ఆస్పత్రుల్లోకి అనుమతించడం వంటి కారణాల వల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. ప్రభుత్వాసుపత్రుల్లో చేరిన రోగుల పట్ల సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో వేరే చెప్పనవసరం లేదు. అలాగే, కార్పొరేట్‌ ఆస్పత్రులకు అవసరార్థం వచ్చే వారి పట్ల నిబంధనల పేరిట సిబ్బంది ఎంత దాష్టీకంగా వ్యవహరిస్తారో వేరే చెప్పనవసరం లేదు. ఆస్పత్రులకు, విద్యా సంస్థలకు ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన మౌలిక సదుపాయాలు ఉండకపోవడం ప్రమాదాలకు హేతువు అవుతున్నాయి. జీవితంలో వేగం పెరగడం వల్ల డబ్బు ఎర చూపి నిబంధనలను ఉల్లంఘించే ధోరణి ప్రజల్లో పెచ్చు పెరుగుతోంది.
ఫైవ్‌స్టార్‌ ఆస్పత్రులు ఇంటికన్నా గుడి పదిలం సామెతను గుర్తు చేస్తున్నాయి. ఆర్థిక నేరాలకు అరెస్టు అయి జైళ్ళలో ఉండాల్సిన ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులకు ఈ ఆస్పత్రులు స్వర్గధామాలు అవుతున్నాయి. వివిధ కుంభకోణాల్లో అరెస్టు అయిన ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు ఈ మధ్య ఆస్పత్రుల్లో చేరిన ఉదంతాలు కోకొల్లలు. అలాగే, అన్ని నిబంధనలు పాటించినప్పటికీ, కొన్ని సందర్భాల్లో జనం రద్దీ ఎక్కువ కావడం వల్ల ప్రమాదాలు తరచుజరుగుతున్నాయి. కోల్‌కతా ఆస్పత్రి ప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువ మంది దట్టమైన పొగ వల్ల ఊపిరి ఆడక మరణించిన వారే. అలాగే, జనం ఎక్కువ అయితే, తొక్కిసలాటలు సంభవించి ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనల గురించి కూడా మనకు తెలుసు.కనుక ఈ మాదిరి ప్రమాదాలకు ఆవలి వారు ఎంత బాధ్యులో ప్రజలు కూడా అంతే బాధ్యులు. పనులు త్వరగా ముగించుకుని పోవాలన్న తొందర, నిబంధనల పట్ల ఉదాసీనత, తనిఖీ యంత్రాంగం అవినీతి మయం కావడం ప్రమాద హేతువులు అవుతున్నాయి. ఇందుకు కోల్‌కతా సంఘటన గట్టి నిదర్శనం.

సోనియా జన్మదిన కానుకగా మద్యం

యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ జన్మదిన కానుకగా రాష్ట్ర ప్రభుత్వం 171 లక్షల లీటర్ల మద్యం ఉత్పత్తి పెంచేందుకు వీలుగా ఉత్తర్వులిచ్చే ఫైలుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంతకం చేసి మహిళలను అవమానపరచారని తెలుగుదేశం పార్టీ దుయ్యబట్టింది. సోనియా బర్త్‌డేకు మహిళలకు ఇచ్చే కానుక ఇదేనా, ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆయన అసమర్థకు అద్దం పడుతుందని ఆ పార్టీ మండిపడింది. ఆర్ధిక లావాదేవిలకు సంబంధించిన అన్ని ఫైళ్ళలో అవినీతి కుంభకోణాలు జరుగుతున్నాయని, అలాంటి ఫైళ్ళకు ప్రభుత్వం ఎక్కువ చొరవ చూపుతుందని శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు మోత్కుపల్లి నర్సింహులు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, శాసనమండలి సభ్యుడు యలమంచలి బాబూ రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.
ఉపాధి హామీ పథకాన్ని వంద నుంచి 200 రోజులకు పెంచుతామంటూ ముఖ్యమంత్రి హామీ ఇస్తూ పేదలను వంచిస్తున్నారని తెలుగుదేశం నాయకులు దుయ్యబట్టారు. వందరోజుల పని చూపించలేకపోవడమే గాక చేసిన పనులకు వేతనం కూడా చెల్లించడం లేదని వారు ఆరోపించారు. ఉపాధి హామీ పథకం నిధులు కాంగ్రెస్‌ పైరవీకారులు దోచు కుంటున్నారని, సోషల్‌ ఆడిట్‌లో కూడా నిధుల దుర్వినియోగం బయటపడిందని వారు చెప్పారు. కాంగ్రెస్‌ నేతల బొజ్జలు నింపేందుకే ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టారని, పేదల సొమ్ము దోచుకుంటున్నారని వారు ధ్వజమెత్తారు. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, వట్టి వసంతకుమార్‌లు ఉపాధి హామీ పథకం నిధులను తమ సొంత ఎస్టేట్‌లకు రోడ్లు వేయించుకునేందుకు దుర్వినియోగం చేశారని వారు ఆరోపించారు. రాజీవ్‌ యువకిరణాలు పేరుతో మరోసారి యువతను మోసం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు వస్తుందని వారు దుయ్యబట్టారు. గతంలో రాజీవ్‌గాంధీ పేరుమీద అనేక పథకాలు ప్రకటించి ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయకపోగా పాతవాటిని కొత్తవిగా చెప్పుకుంటూ యువతను మభ్యపెడుతున్నారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. మహిళలకు వడ్డీ లేని రుణాలిస్తామంటూ ఆర్బాట ప్రచారాలతో డ్వాక్రా మహిళలను ముఖ్యమంత్రి సభలకు రప్పిస్తున్నారని వారు చెప్పారు. డ్వాక్రా మహిళలు తమ సమస్యలను లేవనెత్తితే ముఖ్యమంత్రి వాటిని వినకుండా డ్రాప్‌బాక్స్‌లో వేయాలంటూ చెబుతున్నారని, ప్రభుత్వ హామీలకు, చేతలకు ఏ మాత్రం పొంతన లేదని వారు దుయ్యబట్టారు.

బాబు 'స్థానిక' శంఖారావం...

రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యం కలిగిన కృష్ణా జిల్లా నుండి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికల శంఖారావం పూరిస్తారని తెలుస్తోంది. ఈనెల మూడవ వారంలో ఆయన కృష్ణా జిల్లాలో పోరుబాట పేరుతో విస్తృతంగా పర్యటించనున్నారు. మైలవరం నుండి గాని, లేదా గుడివాడ నుండి గాని బాబు పర్యటన ప్రారంభమవుతుందని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. రైతు సమస్యలు ప్రధానంగా ఈ పోరుబాట సాగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ స్థానిక ఎన్నికల ప్రక్రియ త్వరోనే ప్రారంభం కానున్న నేపధ్యంలో చంద్రబాబు నాయుడు ఈ పోరుబాటనే స్థానిక ఎన్నికల పోరాట బాటగా ఎంచుకుంటారని తెలుస్తోంది. ఈ పర్యటన ద్వారా పార్టీ కేడర్లో నూతన జవసత్వాలు నింపేందుకు బాబు ప్రయత్నించనున్నారు. స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే సందేశాన్ని ప్రజలకు చంద్రబాబు ఇవ్వనున్నారు. ఇదివరకు జిల్లాలో వైఎస్‌ జగన్‌ ఓదార్పు యాత్రసాగింది. ఆ యాత్ర ద్వారా జగన్‌ జిల్లా అంతటా పర్యటించి మత పార్టీ వైపు ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నించారు. అప్పుడు సైతం జగన్‌ పేరుకు ఓదార్పు యాత్రే అయినా ఆయన యాత్ర రైతు సమస్యల పైనే సాగిన విషయం తెలిసిందే. చివరకు ఆయన తన ఓదార్పు యాత్ర చివరి రోజు విజయవాడ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుటు రైతు మహా ధర్నా నిర్వహించి రైతులను ఆకట్టుకునే ప్రయత్నంచేశారు. అయితే అదే తరుణంలో అనివినీతిని అంతం చేయాలంటూ అన్నా హజారే స్పూర్తితో చంద్రబాబు నాయుడుకూడా జిల్లాలో పర్యటించారు. అయితే ఇప్పుడు స్థానిక సమరానికి దాదాపు పార్టీలన్నీ సర్వసన్నద్ధమ వుతున్నాయి. ఈ తరుణంలో చద్రబాబు నాయుడు పోరు బాట రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీకి స్వర్గీయ ఎన్‌టీ రామారావు కాలంనుండి కృష్ణాజిల్లా పెట్టని కోటగా వస్తోంది. అయితే ఎన్టీఆర్‌ మరణానంత రం పార్టీ కొంత దెబ్బతిని కాంగ్రెస్‌ పార్టీకి కూడా బలమైన జిల్లాగా మారింది. ఇప్పటికీ జిల్లాలో టిడిపికి బలమైన కేడర్‌ ఉంది, నాయకత్వం ఉంది. గత స్థానిక ఎన్నికల సమయంలో వైఎస్‌ఆర్‌ అభివృద్ధి మంత్రం బాగా పనిచేసిందనే వాదన ఉంది. అయితే ఈసారి జరగ బోయే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ అండ కాంగ్రెస్‌కు ఉండే అవకాశాలు లేవు. పైగా అదే వైఎస్‌ ఆర్‌ తనయుడు సొంత పార్టీని గెలిపించుకునేందుకు కాంగ్రెస్‌ ఓట్లను భారీగా చీల్చే అవకాశం ఉంది. ఈ పరిణామాలను తెలుగుదేశం పార్టీ తమ పార్టీ విజయానికి ఎలా ఉపయోగించుకోవాలనే విషయంపై ముందస్తు వ్యూహ రచన చేస్తోంది. అదే సందర్భంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులను స్థానిక ఎన్నికలకు సమాయత్తం చేస్తోంది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నరహర శెట్టి నరసింహారావు ఇప్పటికే విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌, మంత్రి పార్ధ సారధిల సూచనలతో జిల్లాలో పర్యటిస్తున్నారు. మండల కాంగ్రెస్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుల నియామకాలను సైతం చేప డుతున్నారు. పార్టీ కేడర్‌ను బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరో పక్క యూత్‌ కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా జరుపుతున్నారు. ఇక వామపక్ష పార్టీలు కూడా తమ పార్టీ క్యాడర్ను సన్నద్దంచేస్తున్నాయి. గత స్థానిక ఎన్నికల్లో కృష్ణాజిల్లాలో కాంగ్రెస్‌ విజయఢంకా మోగించింది. మెజారిటీ జడ్పీటీసీ లను గెలుచుకుని జిల్లా పరిషత్‌ను గెలుచుకుంది. మెజారిటీ ఎంపీపీ స్థానాలను గెలుచుకుంది. అదే విధంగా గ్రామ పంచాయతీల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారే మెజారిటీ స్థానాల్లో సర్పంచులుగా గెలిచారు. జిల్లాలో మొత్తం 49 మండలాలకు గాను 25 ఎంపీపీ స్థానాలను కాంగ్రెస్‌ గెలవగా, టీడీపీ 23 స్థానాలను దక్కించుకుంది. కాగా మిగిలినవి వామ పక్ష పార్టీలు గెలుచుకున్నాయి. అదే విధంగా జడ్పీటీసీ స్థానాలు 49 లో 32 కాంగ్రెస్‌ గెలవగా, 13 స్థానాల్లో మాత్రమే టిడిపి గెలుచుకుంది. ఇక మిగిలినవి ఇతరులు గెలచుకున్నారు. జిల్లాలో మొత్తం 972 గ్రామ పంచాయితీల్లో మెజారిటీ పంచా యితీలను కాంగ్రెస్‌ గెలుచుకుంది. ఈ ఫలితాలు వైఎస్‌ రాజశె ఖర్‌రెడ్డి అభివృద్ది పధకాలు పెట్టి అభివృద్ది మంత్రంతో సాధిం చనవి. అయితే ఈసారి జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓట్లను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ భారీగా చీల్చే అవకాశం ఉంది. జిల్లాలో టీడీపీ, కాంగ్రెస్‌లకు గట్టి పోటీనిచ్చే అవకాశాలున్నాయి. అంటే ప్రతి చోట త్రిముఖ పోటీ ఉంటుంది. ఈ పోటీలో ప్రధానంగా కాంగ్రెస్‌ ఓట్లు భారీగా చీలిపోతే అది టిడిపి లాభిస్తుందని పరిశీలకు విశ్లేషిస్తున్నారు. టిడిపి కూడా ఇదే నమ్మకంతో ఈ సారి కృష్ణాజిల్లాలో పసుపు జెండా రెపరెపలాడడం ఖాయమ నే అభిప్రాయంతో ఉంది. అందుకే ముందస్తుగానే పార్టీ అధినే తను జిల్లా పర్యటనకు జిల్లా పార్టీ రప్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మూడంచెల పంచాయతీరాజ్‌పై పార్టీల్లో చర్చ
ఇటీవల ముఖ్యమంత్రి అసెంబ్లిdలో మూడంచల పంచాయ తీరాజ్‌ వ్యవస్థను తెరమీదకు తెస్తున్నట్లు ప్రకటించారు. ఈ విధానంలో ఎంపిటిసి, జడ్పిటిసిలుండరు. గ్రామ పంచాయితీ సర్పంచులే మండల పరిషత్‌ అధ్యక్షుని ఎన్నుకుంటారు. అదే విధంగా ఎంపిపిలంతా కలసి జిల్లా పరిషత్‌ అధ్యక్షులను ఎన్నుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ మార్పువల్ల రాజకీయంగా కలిగే మార్పులేమిటనే విషయంపై కూడా పార్టీల్లో చర్చ జరుగుతోంది. ఎంపిటిసిలు, జడ్పిటిసిల ను రద్దు చేయడంతో జిల్లాలో దాదాపు వందల సం ఖ ్యలో ఎంపిటిసి, 49 మంది జడ్పిటిసిలు పదవులు కోల్పోతారు. ఈ విధానంపై పార్లమెంటులో చట్టం తేవాల్సిన అవసరం ఉ ంటుంది. అయితే తక్షణమే దీన్ని అమలు చేసేందుకు కార్యనిర్వహక ఉత్తర్వులను ఉపయోగించుకో వచ్చునని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఇప్పటికే మన రాష్ట్రం ఈ మూడంచల విధానంకోసం కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.

'ఆధార్‌' భవితవ్యం ప్రశ్నార్థకం

కేంద్ర హోంమ ంత్రిత్వ శాఖ సందేహాలు వ్యక్తం చేయడం తో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత ్మకంగా చేపట్టిన 'ఏకీకృత గుర్తింపు కార్డు (యుఐడి) పథకం' భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. 'యుఐడి' స్థానంలో కొత్త బిల్లును తీసుకు రావాలని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సూచిం చింది. అయితే అధికార వర్గాలు మాత్ర ం, యుపిఎ ప్రభుత్వం చేపట్టిన ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ పథకాన్ని కాపాడేం దుకు చివరి ప్రయత్నాలు జరుగుతున్నా యి. పార్లమెంటరీ స్థాయీ సంఘం, హోం మంత్రిత్వ శాఖ సందేహాలు త్రోసి రాజని ఈ ప్రాజెక్ట్‌ కొనసాగించేందుకు ప్రణాళికా సంఘం, కేబినెట్‌కు ఓ ముసాయిదాను సమర్పిం చినట్లు సమాచా రం. 'యుఐడిఎఐ' ప్రాజెక్ట్‌ను భారత రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆమోదించే విధంగా నిబంధనలను సవరించాలని ప్రణాళికా సంఘం తన ముసాయిదాలో సూచించి నట్లు తెలిసింది. బయో మెట్రిక్‌ విధానం లేకుండానే జన గణన ప్రక్రియ పూర్తయిందని ప్రణాళికా సంఘం పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం.
అయితే కోస్తా తీర ప్రాంతాల్లో బయో మెట్రిక్‌ విధానం ద్వారా జన గణన ప్రక్రి య సగభాగం పూర్తయిందని చెబుతున్న హోంశాఖ, 'ఆధార్‌' పథకం ఖర్చును కూడా ప్రశ్నిస్తోంది. దేశ వ్యాప్తంగా జాతీయ జనాభా రిజిస్ట్రార్‌ ఆధ్వర్యంలో రూ.6650 కోట్ల ఖర్చుతో జన గణన పూర్తి చేస్తుండగా, ఆధార్‌ ప్రాజెక్ట్‌కు రూ.18 వేల కోట్లు అవసరమ వుతాయని హోంశాఖ వాదిస్తోంది.

అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆమరణ దీక్ష : బాబా రామ్‌దేవ్‌

గోవాలో అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటానికి యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలకు కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం తక్షణమే తగుచర్యలు తీసుకుని అడ్డుకట్ట వేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆమరణ నిరాహారదీక్ష చేపడతానని రామ్‌దేవ్‌ గోవా ప్రభుత్వాన్ని హెచ్చరిం చారు. ''వచ్చే సంవత్సరంలో జరుగను న్న ఎన్నికలకు ముందు అక్రమ మైనింగ్‌ వ్యతిరేకంగా తామంతా ప్రచారం చేయను న్నాం, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా, అసెంబ్లిdకి దోపిడీదారులు ఎన్నిక కావడాన్ని అనుమతించం'' అని రామ్‌దేవ్‌ బాబా పేర్కొన్నారు. అక్రమ మైనింగ్‌ కు వ్యతిరేకంగా 'గోవా బచావో సమ్మేళన్‌' పేరుతో నిర్వహించిన సభలో బాబా రాందేవ్‌ పాల్గొని ప్రసంగి ంచారు. ఈ సందర్బ éంగా రామ్‌దేవ్‌ మాట్లాడుతూ అక్రమ మైనింగ్‌ కార్యకలా పాలకు వ్యతిరేకంగా గోవా రాష్ట్ర వ్యాప్తం గా పర్యటించనున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నట్లు రాందేవ్‌ బాబా వెల్లడించారు.
చైనా ఉత్పత్తులను బహిష్కరించండి
ఆర్థిక రంగంలో భారత్‌కు పోటీగా తయా రవుతున్న చైనాను అడ్డుకోవాల్సిన అవస రం ఎంతైనా ఉందని, ఇందులో భాగంగా చైనా ఉత్పత్తులను బహిష్క రించాలని యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా పిలుపునిచ్చారు. ప్రతి భారతీయుడు ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలని ఆయన కోరారు.

యుపిఎ కూటమిలో అజిత్‌సింగ్‌

కేంద్రంలో అధికారంలో ఉన్న యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలియన్స్‌(యుపిఎ) కూటమిలోకి అజిత్‌ సింగ్‌ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌దల్‌ చేరింది. రానున్న ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ఆర్‌ఎల్‌డి పోటీచేయాలని నిర్ణయిం చాయి. శనివారం నాడు యుపిఎ చైర్‌పర్సన్‌, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఆమె నివాసంలో ఆర్‌ఎల్‌డి అధినేత అజిత్‌ సింగ్‌ కలుసుకుని యుపిఎ కూటమిలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారు. అజిత్‌సింగ్‌ నిర్ణయాన్ని సోనియాగాంధీ స్వాగతించారు. ఆర్‌ఎల్‌డికి లోక్‌సభలో ఐదుగురు పార్లమెంట్‌ సభ్యులున్నారు. యుపిఎ కూటిమిలోకి చేరినందున ఆర్‌ఎల్‌డికి కేంద్ర కేబినెట్‌లో చోటు కల్పించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రీయ లోక్‌దల్‌ పార్టీని యుపిఎ కూటమిలోకి తీసుకురావడానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మోహన్‌ ప్రకాష్‌ విశేషంగా కృషి చేశారు. శనివారంనాడు సోనియాగాంధీతో అజిత్‌సింగ్‌ భేటీలో కూడా మోహన్‌ ప్రకాష్‌ ఉన్నారు.
భేటీ అనంతరం మోహన్‌ ప్రకాష్‌ మీడియాతో మాట్లాడుతూ ఆర్‌ఎల్‌డి అధినేత అజిత్‌ సింగ్‌ త్వరలో ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ను కలుసుకుంటారు.
కేబినెట్‌లో బెర్త్‌కు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆర్‌ఎల్‌డికి చోటు కల్పించడం జరుగుతుందని, యుపిఎ భాగస్వామి అయినందున ఆర్‌ఎల్‌డికి అధికారాన్ని పంచుకునే అర్హత ఉందని ప్రకాష్‌ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లిd ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌- ఆర్‌ఎల్‌డి కలిసి పోటీచేస్తాయని తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి రషీద్‌ మసూద్‌తో పాటు పలువురు సీనియర్‌ నాయకులు త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారని మోహన్‌ప్రకాష్‌ వెల్లడించారు.

మన సైన్యం అంటే హడల్‌!

భారత సైన్యం శత్రువును పిప్పి చేసే శక్తిగా, ఎక్కడికంటే అక్కడికి కదలి వెళ్లగల చిన్నచిన్న గ్రూపులతో కూడిన పటాలంగా భారత సైన్యం రూపాంతరం చెందుతోం దని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వి.కె.సింగ్‌ కొనియాడారు. యుద్ధ సమ యాల్లో త్రివిధ దళాల సమన్వయంతో, అత్యాధునిక సాంకే తిక పరిజ్ఞానంతో త్వరగా ముందుకు దూసుకువెళ్లే సైన్యం అవసరమని ఆయన అన్నారు. పోరాటం చేసే చిన్నచిన్న గ్రూప్‌లు, గాలింపు యుద్ధ ట్యాంకులు, యాంత్రీకృత పదాతి దళం, వైమానిక దాడులకు అనుగుణ ంగా వెళ్లే పదాతిద ళాలు, మానవరహిత వైమానిక సేవలు, 120 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించే ఫిరంగిదళాలపై రాజస్థాన్‌ లోని సుదర్శన శక్తి విన్యాసాల్లో దృష్టి పెట్టామని అన్నారు. 'మనకు భారీ సైన్యం ఉంది. పరీక్షించకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో ఎలాంటి మార్పులు చేయలేం. దీని కోసం అనేకసార్లు పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. పరీక్షించిన నివేదికను ఆర్మీ ఛీఫ్‌ పరిశీలించిన తర్వాత ఆఖరు గా భారత సైన్యంలో మార్పులకు ఆయన ఆమోదిస్తారు' అని దక్షిణ కమాండ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎ.కె.సింగ్‌ తెలిపారు.

పుతిన్‌ పాలన ఇక చాలంటున్న రష్యన్లు

రష్యా ప్రధాని వ్లాదిమిర్‌ పుతిన్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ రష్యా పార్టీ పార్లమెంటులో 238 స్థానాలను సంపాదించినప్పటికీ, ఆయన పట్ల ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంది. శనివారంనాడు మాస్కోలోనూ, దేశంలోని వివిధ నగరాల్లోనూ వేలాది మంది ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మాస్కోలో క్రెవ్లిున్‌కి సమీపంలోని స్క్వేర్‌ వద్ద వేలాది మంది గుమిగూడి “పుతిన్‌ పాలన ఇక చాలు’ అంటూ నినాదాలు చేశారు. డ్యూమా ఎన్నికల్లో అక్రమాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయని ప్రదర్శకులు ఆరోపించారు. రేవు నగరమైన వ్లాదివోస్టోక్‌లో గత ఆదివారం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పుతిన్‌ పార్టీ అయిన యునైటెడ్‌ రష్యా కమ్యూనిస్టుల చేతిలో ఓటమి పాలైంది.అలాగే,ఖాబారోవస్క్‌ నగరంలో జరిగిన నిరసన ప్రదర్శనలో వేలాది మంది పాల్గొన్నారు. మాస్కోలో జరిగిన ప్రదర్శకులు పుతిన్‌,మెద్వెదెవ్‌లు తప్పుకోవల్సిందే నన్న నినాదాలు గల అట్టలు చేత పుచ్చుకున్నారు.
కాగా, నిరసన ప్రదర్శన కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాస్కోలో 50 వేల మంది భద్రతా సిబ్బందితో పటిష్ఠమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.ఈ ప్రదర్శనల్లో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది కమ్యూనిస్టులు ఉన్నారు. అయితే, పుతిన్‌ ఈ ప్రదర్శనలు జరిపిన వారికి ఆ హక్కు ఉందంటూ వ్యాఖ్యానించారు. ఈ ప్రదర్శకులకు అమెరికా మద్దతు ఉందని అధికార పార్టీ నాయకులు ఆరోపించారు.

పాత పథకాలకు కొత్త లేబుళ్లు

ముఖ్యమంత్రిగా ఏడాది పరిపాలన పూర్తి చేసుకొన్న కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రయాణం నల్లేరుమీద బండిలా సాఫీగా సాగిపోతున్నదన్న భావన చాలామందిలో ఉంది. కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీల అధినేతలపై హైకోర్టుల్లో నడుస్తున్న కేసుల వల్ల... వారేదో సమస్యల్లో కూరుకొని ఉండగా... తను మాత్రం కొత్త కొత్త పథకాలు ప్రకటించుకుపోతూ ధీమాగా ఉన్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కన్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయనకు చాలావరకు పరిస్థితులు అనుకూలించి... రాష్ట్ర ప్రధాన సమస్యలు తాత్కాలికంగా వెనక్కుపోయాయి. ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమం, సకల జనుల సమ్మె, ఆ తర్వాత గాలి జనార్థనరెడ్డి అరెస్ట్‌, వైయస్సార్‌ పార్టీ అధినేత జగన్‌పై అక్రమాస్తుల కేసు దర్యాప్తు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వై.ఎస్‌. విజయ దాఖలు చేసిన అఫిడవిట్‌పై సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశం... అసెంబ్లీ సమావేశాల రభస, అవిశ్వాస తీర్మానం .. తదితర పరిణామాలు మీడియా పతాక శీర్షికలకు ఎక్కుతున్నాయి. మధ్యలో పార్లమెంట్‌ సమావేశాలు, ఎఫ్‌డిఐపై విపక్షాల రగడ మొదలైన అంశాలు ప్రజల దృష్టిని అటువైపు మళ్లించేలా చేశాయి.
కారణాలు ఏవైనా కిరణ్‌కుమార్‌ రెడ్డికి ఓ ఏడాది కాలం సజావుగా సాగిపోయుండచ్చు. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. నిజం చెప్పాలంటే... ఆయనకిది ఎంతో గడ్డుకాలం... రానున్న నాలుగైదు నెలలు మరింత క్లిష్ట సమయం. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగి ఉంటే కిరణ్‌ కష్టాలు ప్రజలకు తెలిసేవి. కానీ... ప్రభుత్వం ప్రతిపక్షాలకు ఆ అవకాశం ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా లేవనెత్తిన అంశాలకు, చేసిన ఆరోపణలకు కిరణ్‌కుమార్‌ రెడ్డి సమాధానం ఇవ్వకుండా తాను చెప్పదలచుకున్నదేదో చెప్పేసి సరిపెట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్‌, హరీష్‌రావులు తెలంగాణాపై అనర్గళంగా, ఆవేదనతో మాట్లాడిన అంశాలలో ఏ ఒక్కదానికీ బదులు ఇవ్వకుండా 'తెలంగాణ అంశం కేంద్రం పరిధిలోనిది' అనే ఏకవాక్య సమాధానంతో సరిపెట్టారు.
అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంఎ్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదికపై చర్చ జరిగి ఉంటే ప్రభుత్వం ఇరుకునపడేది. కాగ్‌ నివేదికలో ప్రభుత్వ వైఫల్యాలెన్నో కొట్టొచ్చినట్లు కన్పిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక స్వరూపాన్ని కాగ్‌ ఎండగట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చెప్పుకొనే లక్ష కోట్లు దాటిన బడ్జెట్‌ డొల్లతనాన్ని ఎత్తిచూపింది. 2009 -10 ఆర్థిక సంవత్సరంలో లక్షా 11 వేల కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్‌ చివరికొచ్చేసరికి 87 వేల కోట్ల రూపాయలు దాటలేకపోయిన వైనాన్ని 'కాగ్‌' చూపింది. కాగ్‌ నివేదికలో ఇంకా అనేక చేదు నిజాలు వెల్లడయ్యాయి. జలయజ్ఞం చతికిలపడిన తీరుతెన్నులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భారీగా పెరిగిన అంచనాలు, అధిక చెల్లింపులు, నాణ్యతా లోపాలు, కేంద్రం నుంచి అందిన నిధులకు లెక్కలు లేకపోవడం, మద్యం అమ్మకాలు పెరుగుతున్న తీరు లాంటి ఎన్నో లోపాల్ని 'కాగ్‌' బహిర్గతం చేసింది.
'కాగ్‌' నివేదికపై ప్రతిపక్షాలు విమర్శించినా ప్రభుత్వం నోరు మెదపలేదు. మెజారిటీ ప్రజలకు గణాంకాలు అక్కర్లేదు కనుక ప్రభుత్వానికి 'కాగ్‌' వల్ల కలిగిన తలనొప్పులు లేకపోవచ్చు. కానీ... ప్రజలు ప్రత్యక్షంగా ఎదుర్కొనే సమస్యలు కిరణ్‌కుమార్‌ రెడ్డిని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేసే క్షణాలు సమీపిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకొనే డిసెంబర్‌ నెలలోనే విద్యుత్‌ కొరత ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. గత 15 సంవత్సరాల కాలంలో ఎన్నడూ చూడని విద్యుత్‌ సంక్షోభం రాష్ట్రంలో నెలకొని ఉంది. తమకు సక్రమంగా విద్యుత్‌ సరఫరా జరుగుతున్నదా? లేదా? అన్న అంశాన్నే ప్రజలు పరిగణనలోకి తీసుకొంటారు తప్ప కొరతకు ప్రభుత్వం చెప్పే కారణాలను విశ్వసించరు. వాటిని సాకులుగానే చూస్తారు. విద్యుత్‌ కోతల వల్ల రాష్ట్ర పారిశ్రామిక రంగం రూ.12,000 కోట్ల మేర నష్టపోయినట్లు ఫ్యాప్సీ వెల్లడించింది. వారానికి రెండు రోజులపాటు కరెంట్‌ లేకపోతే పరిశ్రమలు ఏం సాధిస్తాయి? ఉత్పత్తిని కుదించుకొన్న పరిశ్రమలు వేలాదిమంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. శీతాకాలంలోనే విద్యుత్‌ కొరత నెలల తరబడి ఉంటే మండువేసవిలో పరిస్థితి ఎలా ఉంటుంది? ఊహించడానికి కూడా భయం వేస్తుంది. గృహావసరాలకు సరఫరా చేసే విద్యుత్‌లో గ్రామాలకు, మండల కేంద్రాలకు 8 నుంచి 12 గంటలు; నగరాలకు 6 గంటలు కోత కోస్తుంటే ఈ వేసవిలో విద్యుత్‌ సరఫరా ఎలా ఉండబోతోంది? రబీలో వేసే పంటలు సక్రమంగా చేతికొస్తాయా? అన్నది అనుమానమే. ఇప్పటికే కరెంట్‌ కోతలను నిరసిస్తూ వివిధ ప్రాంతాలలో రైతులు విద్యుత్‌ సబ్‌ స్టేషన్లను ముట్టడిస్తున్నారన్న వార్తలొస్తున్నాయి. కళ్లముందే పంటలు ఎండుతున్న దృశ్యాలను చూసి రైతాంగం నిర్లిప్తంగా ఎలా ఉండగలదు?
ప్రజా సమస్యలెలా ఉన్నా కొత్త పథకాలు ప్రకటించడంపైనే కిరణ్‌కుమార్‌ రెడ్డి ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఆయనకు తెలిసి చేస్తున్నారో లేక అధికారులు ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారో తెలియదుగానీ... పాత పథకాలకే కొత్త ముసుగులు తొడిగి వాటినే కొత్త పథకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఉదాహరణకు ఎస్‌సి, ఎస్‌టి కాలనీల్లో మౌలిక సదుపాయల కల్పన అంటూ కొత్త పథకాన్ని ప్రారంభించారు. నిజానికిది 2005లో డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆదర్శ గ్రామాలు అనే కాన్సెప్ట్‌ తెచ్చారు. ప్రతి రెండేళ్లకు 1/3 వంతు ఎస్‌సి, ఎస్‌టి కాలనీల్లో మౌలిక సదుపాయాలు ఏర్పరిచి 2011 నాటికల్లా అన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. 2011 పూర్తికావస్తున్న తరుణంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇప్పుడా పథకం చేపట్టి కొత్తదిగా చెపుతున్నారు. మీసేవ, రాజీవ్‌ యువకిరణాలు, స్త్రీశక్తి... ఇవన్నీ కొత్త లేబుల్స్‌తో వచ్చిన పాత పథకాలే. ఇది కిరణ్‌మార్కు జిమ్మిక్కు... ఇలాంటి జిమ్మిక్కులతో ముఖ్యమంత్రి ప్రజల మన్ననలు పొందగలరా?

పాపం పెద్దోళ్లది - భారం ప్రజలది

ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించిన పాపం ఒకరిదైతే భారం మరొకరిపై పడుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా శ్రామిక వర్గం ఈ పాప ఫలితాన్ని అనుభవిస్తున్నది. సుమారు 5 కోట్ల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. అంతర్జాతీయ కార్మిక సంఘం లెక్కల ప్రకారం సాధారణ స్థితి రావడానికి మరో 3-4 ఏళ్లు పడుతుంది. అభివృద్ధి చెందిన దేశాల కార్మికులపై భారం మరీ తీవ్రంగా పడింది. ఐఎల్‌ఓ తన నివేదికలో ఇలా పేర్కొన్నది. 'సమాచారం లభ్యమవుతున్న 35 దేశాల్లో, సుమారు 40 శాతం ఉద్యోగస్తులు గత సంవత్సర కాలం నుండి ఉపాధి దొరకక తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఎంతోమంది యువకులకు ఉద్యోగాలు దొరకడం లేదు. ఉద్యోగం దొరికినా అది ఎక్కువ కాలం నిలుస్తుందన్న నమ్మకం లేదు. తమ నైపుణ్యానికి తగిన ఉద్యోగం దొరకడం లేదని చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. 2009 నాటికి సుమారు 40 లక్షల మంది ఉద్యోగార్థులు ఇక ఉద్యోగం కోసం వెదకడం దండుగని విరమించుకున్నారు. పెట్టుబడిదారీ సంక్షోభం కోట్లాది శ్రామిక జనుల బ్రతుకులను చిన్నాభిన్నం చేసింది.
దివాళా తీసిన బ్యాంకులను గట్టెక్కించడానికి పెట్టుబడిదారీ దేశాలు కోట్లాది డాలర్లను వెచ్చించాయి. సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలో భాగంగా ఎన్నో పొదుపు చర్యలను చేపట్టారు. సంక్షేమ పథకాలకు అందించే నిధులను పూర్తిగా తగ్గించారు. ప్రభుత్వరంగ ఉద్యోగుల జీతభత్యాల్లో కోత విధించారు. ఒకవైపు రిటైర్మెంట్‌ వయసును పెంచేసి మరోవైపు పెన్షన్‌ సదుపాయాలను తగ్గించారు. 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను రద్దుచేసిన బ్రిటన్‌ ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్‌ అర్హతా వయస్సును పెంచేసింది. పోర్చుగీసు ప్రభుత్వం ఉద్యోగుల వేతనాల్లో 5 శాతం కోత విధించింది. జర్మనీ సంక్షేమ పథకాల నిధులను తగ్గించింది. ఫ్రెంచి ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసును 60 నుంచి 62 కి పెంచి, పెన్షన్‌ అర్హత వయస్సు 65 నుండి 67 మార్చింది.
ఈ పరిణామాలను నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా కార్మికవర్గం ఉవ్వెత్తున ఉద్యమించింది. సంక్షోభానికి కారకులయిన వారు పాప ఫలితం అనుభవించాలి తప్ప కార్మికులపై భారాలు మోపితే సహించమంటూ కార్మికులు నినదించారు. కార్మిక సంఘాల సభ్యత్వం ఒక్కసారిగా పెరిగింది. సమరశీల పోరాటాలు చేపట్టిన కార్మికులు ప్రభుత్వాల విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2010 అక్టోబర్‌ 2న అమెరికా కార్మికులు వాషింగ్టన్‌ వీధుల్లో పెద్ద ప్రదర్శన నిర్వహించారు. సుమారు 3 కోట్లుగా వున్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, నైపుణ్యానికి తగిన ఉద్యోగాలను కల్పించాలని ప్రదర్శనకారులు డిమాండ్‌ చేశారు. ఈమధ్య కాలంలో అమెరికాలో జరిగిన అతిపెద్ద కార్మిక ప్రదర్శనగా విశ్లేషకులు దీన్ని పేర్కొన్నారు.
యూరప్‌లో కూడా నిప్పు రాజుకుంది. సమ్మెలు, ప్రదర్శనలు అక్కడ నిత్యకృత్యమయ్యాయి. తమ జీవన ప్రమాణాలపై జరుగుతున్న దాడిని తిప్పికొట్టడానికి గ్రీకు కార్మికవర్గం వీరోచిత పోరాటాలకు పూనుకున్నది. పోలీసు కాల్పుల్లో ముగ్గురు కార్మికులు అమరులయ్యారు. నిరుద్యోగిత 20 శాతానికి చేరుకున్న స్పెయిన్‌లో కార్మిక ఉద్యమాలు వెల్లువలా చెలరేగాయి. పారిశ్రామిక సమ్మెలు ఫ్రాన్స్‌ ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలకు అంటుకున్నాయి. విమానాశ్రయాలు, రైల్వే, పోస్టల్‌, ఆస్పత్రులు, రిఫైనరీలు అన్ని రంగాలు సమ్మెలతో స్థంభించిపోయాయి. సర్కోజీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్మికులకు విద్యార్థులు, ఇతర వర్గాల నుండి అనూహ్య మద్దత్తు లభిస్తుంది. బ్రిటన్‌, ఇటలీల్లోనూ కార్మిక ఉద్యమాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద కార్మిక సమ్మె 2010 సెప్టెంబర్‌ 29న యూరప్‌లో జరిగింది. 35 దేశాల్లోని లక్షలాది మంది కార్మికులు ఆ రోజున సమ్మె చేశారు. మన దేశంలో స్వాతంత్య్రానంతరం అతిపెద్ద కార్మిక సమ్మె 2010, సెప్టెంబర్‌ 7న జరిగింది. ఆ రోజున సుమారు 10 కోట్ల మంది కార్మికులు సమ్మెబాట పట్టారు.
నయా ఉదారవాదం ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవితాలను ధ్వంసం చేసింది. అమెరికా నిర్దేశకత్వంలో ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకులను సాధనాలుగా చేసుకొని ఈ నయా ఉదారవాద విధానాలను వర్థమాన దేశాలపై అప్రజాస్వామికంగా రుద్దారు. వ్యాపారంపై నున్న అన్ని ఆంక్షలను తొలగించాలని, ప్రభుత్వ ప్రమేయాన్ని తగ్గించాలని ఈ విధానాల సారాంశం. ఈ విధానాలకు నేడు ప్రతిచోట వ్యతిరేకత ఎదురవుతున్నది. నియంత్రణలు పూర్తిగా ఎత్తివేయాలనే విధానం ఇక చెల్లుబాటు కాదని 2009 లో జరిగిన జి-20 సమావేశంలోనే బ్రిటన్‌ ప్రధాని గార్డన్‌ బ్రౌన్‌ తేల్చి చెప్పారు. మన సమాజంలో శృంఖలాలు ఉండకూడదు నిజమే కాని, విశృంఖలత్వానికి కూడా తావులేదని బ్రౌన్‌ స్పష్టీకరించాడు. ఇదే అభిప్రాయాన్ని ఆస్ట్రేలియా ప్రధాని కెవిన్‌ రన్‌ కూడా వ్యక్తీకరించాడు. ''నియంత్రణ లేని మార్కెట్లే అన్ని సమస్యలను పరిష్కరించగలిగే దేవతలను కొందరు కొలుస్తున్నారు. అవి క్షుద్ర దేవతలని నేడు తేలింది.'' నయా ఉదారవాదాన్ని వేనోళ్లా పొగిడిన వారే ఇప్పుడు దాన్ని ఈసడించుకుంటున్నారనడానికి ఇవి ప్రబల నిదర్శనాలు.
విధాన నిర్ణయాల్లో తమకు కూడా పాత్ర ఉండాలని నేడు వర్థమాన దేశాలు గట్టిగా నిలబడుతున్నాయి. సమస్త మానవజాతి భవిష్యత్తును నిర్ణయించే అధికారం ధనిక దేశాల కెక్కడిదనే ప్రశ్నలు నేడు ఉత్పన్నమవుతున్నాయి. ఐక్యరాజ్యసమితిలోని 196 దేశాలు ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ప్రజల జీవన స్థితిగతుల్లో మెరుగుదల తీసుకురాలేని అభివృద్ధికి అర్థంలేదని తేల్చిచెప్పాయి. అమెరికా ఆధిపత్యాన్ని కూడా నేటి ప్రపంచం ప్రశ్నిస్తున్నది. ఆర్థిక సంక్షోభానికి తోడు అఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌లలో తగిలిన ఎదురుదెబ్బలు అమెరికా సామ్రాజ్యవాదాన్ని మరింత బలహీనపరిచాయి.
తమ జీవన ప్రమాణాలు నానాటికీ దిగజారడం చూస్తున్న ప్రజలు తమ ప్రభుత్వాలపై నమ్మకం కోల్పోతున్నారు. ఐఎల్‌ఓ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ఆయా దేశాల్లోని మెజారిటీ ప్రజలు పెట్టుబడిదారీ విధానంపై తమకు నమ్మకంలేదని తేల్చిచెప్పారు. నయాఉదారవాద ఆర్థిక నమూనా నేడు సవాళ్లను ఎదుర్కొంటున్నది. లాటిన్‌ అమెరికా ఖండం ప్రత్యామ్నాయ విధానాలతో అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నది. మౌలిక వసతుల కల్పనలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టి అంతర్గత డిమాండ్‌ను సృష్టించిన చైనా ప్రపంచ ఆర్థిక సంక్షోభ ప్రభావం నుండి సునాయాసంగా తప్పించుకోగలిగింది. నేటివరకు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలపై పున: సమీక్ష జరిపి ఆర్థిక వ్యవస్థను సక్రమ మార్గంవైపు మళ్లించడానికి భారత దేశానికిదే సరైన సమయం.