13, ఆగస్టు 2012, సోమవారం

వీధిబాలల్లోవెలుగునింపుతున్నపోలీస్‌'క్యాప్‌'

సరైన ఆలనా పాలనా లేక.... కన్నవారి ప్రేమ కరువై... ఆరుబయళ్లలో...
వీధి బాలలలుగా బతుకు వెళ్లదీస్తూ... ఆకలి తీర్చుకునే క్రమంలో పెడమార్గం పడుతూ...
పసివయసులో మసిబారుతున్న వారి జీవితాలకు ఆపన్నహస్తం అందిస్తే...
రేపటి దేశ భవిష్యత్‌ని నిర్ణయించే వారిగా.. చరిత్రని తిరగరాసే మేధావులుగా....
తయారు చేయవచ్చన్న దృఢసంకల్పంతో... ఓ మహాయజ్ఞానికి చుట్టిన శ్రీకారం ఇది....
మానవత్వానికి ప్రతిరూపంగా నిలుస్తూ... ఖాకీ దుస్తుల వెనుక
కరడు కట్టిన కాఠిన్యమే కాదు... మంచి మనసుంటుందని నిరూపిస్తూ...
దేశానికే ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నారు సింహపురి పోలీస్‌ అన్నలు...
సాధారణంగా పోలీస్‌ను చూస్తే పెద్దవాళ్ళే కొంత భయపడతారు. ఇక చిన్నపిల్లలు అయితే పారిపోతారు. అటువంటిది నిరాదరణకు గురైన చిన్నారులు ఎస్పీని పోలీస్‌ అన్నయ్యా...! అని ఆప్యాయంగా చిరునవ్వులతో పలకరిస్తూ ఆయన దగ్గరకు పరుగు తీస్తున్నారంటే ఎస్పీ ఆ చిన్నా రుల పట్ల చూపుతున్న శ్రద్ద ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. దేశంలో ఎక్కడాలేని విధంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లాలో మొట్టమొదటి సారిగా ఛైల్డ్‌ అండ్‌ పోలీస్‌ ప్రాజెక్ట్‌ (క్యాప్‌) స్ధాపించి ఎందరో నిరుపేద చిన్నారులకు జీవితపాఠాలు నేర్పుతూ వారి భవిష్యతు ్తకు బలమైన పునాదులు వేస్తున్నారు. ఇదే క్రమంలో వారికి జీవితలక్ష్యాలను ఎంచుకునేలా విద్యా భోధన, క్రీడల పట్ల మక్కువ కలిగేలా వారికి సకల సౌకర్యాలు కల్పిస్తూ మరోసారి వారు గత ప్రపంచం వైపు వెనక్కు తిరిగి చూడకుండా ఉండేలా వారిపట్ల అభిమానం చూపుతున్నారు.
పనిచేసే తత్వం.. పని పట్ల విశ్వాసం.. విజయానికి మూల కార ణాలు.. విశ్వాసం అదృష్టంకంటే గొప్ప ది.. పట్టుదల మనిషి అదృష్టం కంటే మరింత గొప్పది.అదే పట్టుదలతో మీ భవి ష్యత్తుకు మా భరోసా.. అంటూ నెల్లూరు జిల్లా ఎస్పీ బివి. రమణ కుమార్‌ నిరాదరణకు గురైన చిన్నారు లను ఆదరిస్తూ శభాష్‌.. ఎస్పీ అనిపిం చుకుంటున్నారు. దాతలకు ప్రసిద్థి చెందిన నెల్లూరు జిల్లా లో పెరిగి పోతు న్న మురికి వాడ లు.. అంతకు మించి అక్కడి చిన్నారులు ఎలాంటి చదువు సంధ్యలకు నోచు కోక పోవటం... వెనుక వారి పట్ల సమాజం నిర్లిప్త ధోరణులతో వ్యవవహరించడం వల్ల చిన్నారి బాల్యం చిదిమేయటమే కాకుండా... వారు ఇతర ప్రభావాలకు లోనై... అసాంఘిక శక్తుల చేతిలో కీలుబొమ్మలుగా మారి ఏ ఉగ్రవాదు లుగానో... తీవ్రవాదులుగానో మారక ముందే వారికి అండగా నిలచి, చదువు సంధ్యలు నేర్పిస్తే.. రేపటి సమాజంలో మంచి పౌరులుగా తయా రవుతారన్న భావనతో శ్రీకారం చుట్టిన ప్రోజక్టే క్యాప్‌....
ఆదర్శంగా.... ముందుకు...
నేటి సమాజంలో శాంతి భధ్రతలపైనే పూర్తిస్ధాయిలో పట్టు సాధిం చేందుకు ప్రయత్నిస్తు... విఫలమవుతున్న పోలీసు అధికారుల్లో అందుకు భిన్నంగా నెల్లూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి తనదైన శైలిలో అరాచకాలను ఉక్కుపాదంతో అణచి వేస్తున్న బివి. రమణ కుమార్‌ శాంతిభధ్రతలను పరిరక్షణలో పూర్తిగా పట్టు సాధించా రనే చెప్పాలి... ఓవైపు రాజీలేని ధోరణిలో పోలీస్‌ ఉద్యోగానికి వన్నె తెస్తున్న ఆయన మరోవైపు నిరాదరణకు గురైన చిన్నారులని ఆదరించ డం మనిషిగా తన బాధ్యతగా చెప్తూ.... వారి జీవితాలకు బంగారుబాట వేస్తు జాతీయ స్ధాయిలో అందరికీ ఆదర్శం గా నిలుస్తు న్నారనటంలో సందేహం లేదెవ్వరికీ...
సమాజంలో నిరాదరణకు గురై తల్లి దండ్రుల ప్రేమానురాగాల ను కూడా పూర్తిస్ధాయిలో పొందలేక వీధుల్లో... శివార్ల లో... స్మశానాల్లో... జులా యిలుగా తిరుగుతూ భవిష్యత్‌ని పాడు చేసుకుంటున్న చిన్నారులని గుర్తించి.. “మీభవిష్యత్‌కి మా భరోసా.. అన్న నినా దంతో... పోలీసులు ఏర్పాటు చేసిన క్యాప్‌ పాఠశా లలో చేరుస్తూ.. వారికి కొత్త ప్రపంచం చూపిస్తున్నా రాయన... తాను ఏ జిల్లాలో పనిచేసినా నిరాదరణకు గురైన చిన్నా రులను ఆదరించి తనవంతు చేయూతను అందిస్తు ముందుకు సాగుతు న్న ఎస్పీ... నెల్లూరు జిల్లాలో కూడా బాధ్యతలు చేపట్టాక 12 మంది అంధులకు కంటి ఆపరేషన్లను చేయించి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఓరోజు అనుకోకుండా ఆయన నెల్లూరు పట్టణ పరిధిలోని పెన్నా నది ఒడ్డున ఉన్న బోడిగాడితోటకు వెళ్ళారు. అక్కడి స్మశానాల మద్య చింపిరి జుట్టు, చిరిగిపోయిన బట్ట లు,మాసిన శరీరం సాంప్రదాయానికి భిన్నంగా నిరాదరణకు గురై జీవి తమంటే తెలియనిచిన్నారులు గడపడాన్ని చూసి చలించి వారి జీవితా లను మార్చేసి వారిని ఉన్నత మార్గం వైపు నడిపించాలని ఇందుకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా... వెనక్కి తగ్గకూడదని .. వారి జీవితాల్లో వెలుగులు ప్రసరిం ప చేయాలని...నిర్ణయం తీసుకున్నారు.
చేయి...చేయి...కలిపి...
తాను చేసే బృహత్తరకార్యక్రమానికి అధికారికంగాఎలాంటి నిధులు కేటాయించలేమని భావించి... తనకి వచ్చిన ఆలోచనని తోలి సిబ్బంది తో పంచుకున్నారు. ఎస్పీ సార్‌ వినూత్న ఆశయానికి వాస్తవ రూపం కల్పించే క్రమంలో అధికారులు చేయూత ఇచ్చేందుకు సిద్దం కావటం.. పోలీస్‌ సిబ్బంది ఒక్కరోజువేతనం అందించడంతో... దేశం లో ఎక్కడా లేని విధంగా క్యాప్‌ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు క్షణాల్లో జరిగి పోయాయి... పోలీస్‌లని చూస్తే పేదలు భయపడతారని భావించి... స్థానిక వసంతలక్ష్మీ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సహకారంతో పోలీసులను సివిల్‌ డ్రెస్‌లో బోడిగాడితోటకు పంపి వారితో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించి... జులాయిలుగా తిరుగు తున్న చిన్నారులకు మంచి జీవితాన్ని అందిస్తా మని ఓప్పించ గలిగా రు... దశలవారిగా 59 మంది చిన్నారులను గత ఏడాది అక్టోబర్‌ 3వ తేది క్యాప్‌కు తీసుకొచ్చి.. వారికి భరోసా కలిపించే లా సన్నిహితంగా మెలుగుతూ... వారిలో భయాన్ని పోగట్టగలిగారు.
మారిన జీవితాలు....
నవంబర్‌ 14వ తేది బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ చిన్నా రులను స్కూల్‌లో చేర్పించేసి అందరిలా చేతులు దులుపుకుని సద రు కార్యక్రమాన్ని ఆపేయలే... నిత్యం ఆ చిన్నారులకు అండగా నిలుస్తూ... ఉదయంనిద్రలేచింది మొదలు వారికి కావాల్సిన సకల సౌక ర్యాలు కల్పించారు. క్యాప్‌ ప్రాంగణానికి పూర్తి భధ్రతను కల్పించ డం తో పాటు చిన్నారులకు రుచికరమైన ఆహారాన్ని అందించే ఏర్పాట్లు చేసారు. చదువు పట్ల మరింత శ్రద్ద చూపేలా ఆరుగురు బిఇడి టీచర్స్‌ ను, వ్యాయామ ఉపాధ్యాయులను నియమించారు. అన్ని రకాల క్రీడా పరికరాలను సమకూర్చి...ఎప్పటికప్పుడు వారి తల్లిదండ్రులతో సమావే శాలు ఏర్పా టు చేస్తూ... క్యాప్‌ ప్రాజెక్ట్‌ ద్వారా కొత్త జీవితాన్ని ప్రసా దించేందుకు సహకరించాలని కోరు తున్నారు. నిన్నటి వరకు కనీస సంస్కా రం తెలియనివారు నేడు ఆ ప్రాంగణా నికి ఎవరొచ్చినా... నమస్కారాలతో స్వాగతం పలుకు తున్నారంటే... వారిలో వచ్చిన మార్పుకు చక్కని నిదర్శనం. ఉన్నతమైన ఆశయంతో ముంద డుగు వేస్తూ ఉన్నతాధికారుల మన్ననలు అందు కుంటున్నారు.
సమయం దొరికితే చిన్నారులతోనే...
నిత్యం శాంతిభధ్రతల పరిరక్షణలో బిజీ బిజాగా ఉండే తాను ఏ మాత్రం సమయం చిక్కినా... కాప్‌లోని చిన్నారులతో గడుపుతుంటాన ని లైఫ్‌తో చెప్పారు ఎస్పీ బివి.రమణకుమార్‌. ఇంత చిన్న వయసులో తగిన ప్రేమ అందక పోవటం వల్ల ఆర్థిక భరోసా లేక వారిని తప్పుడు మార్గం వపు అడుగువేయిస్తోంది. వారిని గుర్తించి మార్పు తీసుకువస్తే నేరాలు తగ్గడంతోపాటు వారికి మంచి జీవితాన్ని అందిం చినవారమ వు తామనిఅన్నారు. చిన్నారులని ఆదుకోవాలన్న ఆలోచన రాగానే వారి తల్లిదండ్రులని సంప్రదిస్తే....పోలీసులమన్న భావనతో మొదట వారు సహకరించలేదని ఆ తరువాత సివిల్‌ డ్రెస్‌లో వెళ్ళి వారికి నచ్చచెప్పాక కొంత ఫలితం లభించిందని... ప్రస్తుతం 59 మంది చిన్నారుల్ని అక్కు న చేర్చుకున్నా మని త్వరలోనే జులాయిలుగా తిరిగే మరింత మంది చిన్నారులను గుర్తించి క్యాప్‌ ద్వారా మంచి జీవితాన్ని అందిస్తామ న్నారు. భవిష్య త్తులో ఈ ప్రాజెక్టును మరింత పటిష్టంగా నిర్వహిం చేందుకు ఫౌండేషన్‌ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించాలనే ఆలోచన కూడా ఉందని అందుకు డిజిపి అనుమతి కూడా కోరామన్నారు.రానున్న రోజుల్లోనూ ఈ ఖాకీ బాస్‌ సదాశయానికి అందరి సహ కారం లభించాలని మనమూ ఆశిద్దాం.


మర్చిపోలేను ఎన్నటికీ...
అమ్మా, నాన్న చిత్తుకాగితాలు ఏరుకుని జీవితాన్ని వెల్లబుచ్చు తుంటారు. నన్ను పట్టించుకునే తీరిక, చదివించాలన్న ఆలోచన వారికి లేదు. ఆర్ధిక ఇబ్బందుల నడుమ జులాయిగా తిరుగుతు అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఓచేతిని కోల్పో యి వికలాంగుడిగా మారి నన్ను ఎస్పీ బివి. రమణ కుమార్‌ దేవుడిలా ఆదుకున్నారు... చేతిని బాగు చేయి స్తా... నాతో వస్తావా.. అంటూ ఆప్యాయంగా పలకరిం చి క్యాప్‌ ప్రాజెక్టుకు తీసుకువచ్చి, కృత్రిమ అవయవం అమర్చి ఈ పాఠశాలలో చేర్చారు. ఇది నాకు మరుపు రాని సంఘటన. సార్‌ను జీవితంలో మరచిపోలేను.
- మణి
(వికలాంగబాలుడు)


పోలీస్‌ను అవుతా...
బోడిగాడితోట స్మశానంలో అనా ధలుగా తిరుగుతున్న తన లాంటి చిన్నారులను గుర్తించి ఎస్పీ సార్‌. .. మా బాల్యాన్ని చిదిమేస్తున్న జీవితాల నుండి మమ్మల్ని కాపా డటమే కాకుండా మా భవిష్యత్‌పై భరోసా కలిపించేలా క్యాప్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఓనమాలు కూడా తెలియని తమ చేత ఇంగ్లీష్‌ చదు వులు చదివిస్తున్నారు. ఎస్పీ సార్‌నే ఆదర్శంగా తీసు కుని పోలీస్‌ అధికారిని అవుతా.. అందుకోసం క్యాప్‌నే వేదికగా చేసుకుని ఇప్పటి నుంచే ముందడుగు వేస్తు న్నా.. అందుకు అందరి ప్రోత్సాహం లభిస్తోంది కూడా.
- జ్యోతి
విద్యార్థిని

హాస్యచక్రవర్తి రేలంగి జయంతి

తెలుగునాట సినిమా రంగం పురుడుపోసుకున్న వేళ...వెం డితెరకు నటీమణులను పరిచయం చేసే బాధ్యతను నిర్విఘ్నంగా నిర్వహిస్తూ... మరోవైపు పౌరాణిక, జానపద, సాంఘీక చలన చిత్రాల్లో అద్వితీయమైన నటనతో హస్యాన్ని పండిస్తూ తెలుగు చార్లీచాపీన్‌గా, హాస్యకుటుంబానికి ఆదిపురుషుడుగా పేరుగాంచారు రేలంగి వెంకటరామయ్య. ఇల్లరికంలో ఉన్న మజా అంటూ తెలుగింటి అల్లుళ్లకు కొత్తభాస్యం నేర్పిన ఆయన హాస్యాన్ని పండిస్తూ, ఆనాటి అగ్రకథానాయకుల తో సమానంగా పారి తోషికం తీసుకుంటూ, మనస్సున మనిషిగా అటు పరిశ్రమలోనూ, ఆపద్భాందవుడిగా ఇటు బంధువర్గంలోనూ, హాస్యచక్రవర్తిగా ప్రేక్షకుల్లోనూ పేరుగాంచారు. రేలంగిగా అందరికీ సుపరిచిత మయ్యారు. ఆయ పెంచిన మంచిని అనుసరిస్తూ, నేర్పిన క్రమశిక్షణను పాటిస్తూ నేటికి చిత్రరంగ పరిశ్రమ నుంచి ఆప్యాయతను అందుకుంటున్న రేలంగి ఏకైక కుమారుడు రేలంగి సత్యనారాయణ బాబు తో ఆంధ్రప్రభ లైఫ్‌ ఇంటర్వ్యూ...
రేలంగి! తెలుగు సినిమాకు నవ్వులద్దిన హాస్య నటుడు. ఆయన నడిచినా, నవ్వినా, నటించినా, నాట్యం చేసినా...ప్రేక్షకులకు నవ్వులే నవ్వులు! మాయా బజార్‌లో ఉత్తరకుమారుడిగా 'సుందరి నీవంటి దివ్య స్వరూపం .... 'అంటూ సావిత్రికి సరిజోడుగా ఆయన పం డించిన హావభావాలు ఎవరు మర్చిపోగలరు. అలాగే తండ్రి, మామ, అల్లుడు...లాంటి పాత్రల్లో అందరికీ ఆప్తుడైన ఒక భోళా మనిషి.
హాస్యరంగంలో పద్మశ్రీ తీసుకున్న మొదటి నటుడు ఆయన. హరికథా భాగవతార్‌ , హార్మోనియం షాపు నిర్వహించే రేలంగి రామస్వామి కుమారుడిగా ఆగష్టు13, 1910లో తూర్పు గోదావరి జిల్లా, రావులపాడులో జ న్మించారు. నాలుగుదశాబ్దాల పాటు తెలుగుచిత్రసీమలో హాస్యనటుడిగా ప్రేక్షకులను తన హావభావాలతోనే క డుపుబ్బ నవ్వించిన ఆయన సెప్టెంబర్‌27, 1975లో మరణించారు. హాస్యకుటుంబానికి మార్గదర్శిగా అందరి హృదయాలలో నిలిచారు. మూడు దశా బ్దాల క్రితం ఆయన భౌతికంగా ఈ లోకం నుంచి దూరమైనా, శ్రీకృష్ణతులాభారంలో వసంతుడిగా, ఇల్లరికం అల్లుడిగా ఎన్నో హాస్యపాత్రల ద్వారా ఆయన పంచిన ఆనందాన్ని తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ ఆస్వాదిస్తున్నారు. నేటికీ తెలుగువారికి హాస్యమంటే ముందు గుర్తొచ్చేది రేలంగి పేరే.
మీ చిన్నతనం గురించి చెప్పండి?
చిన్నతనంలోనే నాన్నగారి కుటుంబం కాకినాడకు వచ్చి అక్కడే స్థిరపడ్డాం. ఆయన విద్యాభ్యాసం కూడా అక్కడే జరిగింది. నాన్నగారు సినిమాల్లో నటించడం మొదలుపెట్టిన తరువాత చాలా రోజుల వరకు మేమంతా కాకినాడలోనే ఉండేవాళ్లం. కొద్దిగా సినిమాల్లో పేరు రావడంతో మా మకాం మద్రాస్‌కు మారింది.
అప్పుడప్పుడు నాన్నతో పాటు నేను, అమ్మ పుల్లయ్యగారి ఇంటికి వెళ్లేవాళ్లం. ఎంతో ఆప్యాయంగా చూసేవారు. కొత్త కథానాయికగా సినీరంగానికి ఎవ్వరినైనా పరిచయం చేయాలంటే పుల్లయ్య తరపున నాన్నగారు ఆ అమ్మా యి ఇంటికి వెళ్లి వారిని ఒప్పించి నటించడానికి అంగీ కరింపచేసేవారు. అలా నా చిన్నతనంలో అంజలి అత్త మా ఇంటి కి తరుచు వచ్చేవారు. కొద్దిరోజులు మాతోనే కలిసి ఉన్నారు. నాన్నగారు సభ్యుడిగా ఉన్న కాకినాడ యంగ్‌మెన్స్‌ హ్యాపీ క్లబ్‌ నుంచి వచ్చిన వారే దాదాపు25మంది సినిమారంగంలో మంచిస్థాయికి ఎదిగారు. ఆయనకు నేను ఒక్కడినే కుమారుడిని అయినా, మా ఇంట్లో మాత్రం ప్రతిరోజూ కనీసం ముఫ్పై నుంచి నలభై మంది భోజనం చేసేవారు. బంధువుల పిల్లలందరూ మా ఇం ట్లోనే ఉండేవారు. వారికి విద్యాబుద్ధులు చెప్పించడంతో పాటు వివాహాలు కూడా మా అమ్మనాన్న చేతుల మీదుగానే జరిగాయి.
మీరు ఎంతవరకు చదువుకున్నారు? సినిమాల్లో నటిం చే ప్రయత్నం చేశారా?
నాకు పెద్దగా చదువు అబ్బలేదు. పదవ తరగతి వరకు మాత్రమే చదివాను. చిన్నతనంలోనే కె.ఎస్‌ ప్రకాష్‌రావు (రాఘవేంద్రరావు తండ్రి)డైరెక్షన్‌లో బాలానందం (1950)పిల్లల సినిమాలో హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేశాను. కాని ఆ సినిమా విజయవంతం కాలేదు. హీరో పాత్రలో నేను సరైన నటనను చేయలేకపోయాను అన్న ఫీలింగ్‌తో ఆ తరువాత సిని మా రంగం వైపు వెళ్లలేదు.
కాలేజీ చదువులకు ఎందుకు స్వస్తి పలికారు?
సినీరంగంలో ఏర్పడే చెడుస్నేహాల వల్ల ఎక్కడ చేతికి అందకుండా పోతానో అన్న భయంతో నాన్నగారు నాకు చిన్నతనంలోనే వి వాహం చేశారు. మాది మేనరికం. నాన్నగారి మంచితనానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. మా మామగారు బాగా బతికిన మనిషి. మా ఆర్థికపరిస్థితి అంతంత మాత్రమే ఉన్నరోజుల్లో మేము కాకినాడలో ఉన్నప్పుడే ఆయన తన కూతురిని నేను చేసుకోవాలని నాన్నగారితో మాట తీసు కున్నారట. కాని నాన్నగారు సినిమాల్లో సక్సెస్స్‌ కావడంతో మా స్థితి పెరిగింది. విధివశాత్తు మా మామగారు ఆర్థికంగా చితి కిపోయారు. కాని నాన్నగారు అవి ఏమి పట్టించుకోలేదు. ఇచ్చిన మాటకు కట్టుబడి మేనరికమే చేశారు. ఆయన దృష్టిలో డబ్బు కన్నా మాట విలువైనది. ఎస్‌ఎస్సీ కాగానే నాకు పెళ్లి చేసి, నన్ను ఇంటికే పరిమితం చేశారు. నేనే ఏకైక సంతానం కావడంతో, కనీసం నాకు అయినా ఎక్కువ మంది సంతానం ఉండాలని అనేవారు. అలా ఆరుగురు పిల్లలకు తండ్రిని అయ్యాను. ఇద్దరు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు. అందరూ జీవితంలో స్థిరపడ్డారు.
మీ పిల్లలు సినిమా రంగంలోకి వచ్చారా?
నేను సినిమారంగంలో ఇమిడలేను అని నాన్నగారు గ్రహించారు. నమ్మకం లేని వ్యాపారం సినిమా అని తరచుగా అంటుండే వారు. ఆయన ప్రభావం వల్లనేమో నాకు సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదు. ఇక మా పెద్దాబ్బాయి తిరుమలబాబు కొన్ని సినిమాల్లో నటించాడు. చిన్నబ్బాయి హేమంత్‌బాబు కనకాల ఫిలిమ్‌ ఇనిస్టి ట్యూట్‌లో మూడు సంవత్సరాలు శిక్షణ తీసుకున్నా ఫలితం లేదు. కొన్ని పాత్రలు వేసాడు కాని పెద్దగా పేరు రాలేదు.
మీ నాన్నగారు మీతో ఎలా ఉండేవారు?
ఎంతో క్రమశిక్షణతో ఉండే ఆయన సంతోషాన్ని, కోపాన్ని తట్టుకునేవారు కాదు. తెలియక ఎంత పెద్ద పొర పాటు చేసినా క్షమించే వారు కాని తెలిసి చిన్న తప్పు చేసినా సహించేవారు కాదు. చాలా కోపిష్టి. కోపం వచ్చిందంటే చాలు చేతిలో ఏది ఉంటే అది విసిరేసేవారు. బండబూతులు అలవోకగా వచ్చేవి. అయితే ఆయన కోపం పాల నుర గలాంటింది. ఆ ఉగ్రరూపం కొద్ది నిమిషాలే. ఆ తరువాత శాం తమూర్తిగా మారిపోయేవారు. భోళామనిషి. అబద్ధం తెలియని మనిషి. ఆయన కోపం గురించి చెప్పాలంటే ఒక సంఘటన చెప్పాలి. మా భవిష్యత్‌ ఆలోచించి ఆయన తాడేపల్లి గూడెంలో ఏక్లాస్‌ థియేటర్‌ కట్టించేందుకు సమాయత్తం అయ్యారు. థియేటర్‌ పక్కన, ఓ మూల చిన్నగా షెడ్‌ కట్టించమని చెప్పి ఆయన మద్రాస్‌ వెళ్లిపోయారు. షెడ్‌ ఎందుకు అంటూ థియేటర్‌ కట్టాక మిగిలిన మెటీరియల్‌తో నేను చిన్న ఇల్లు కట్టిం చాను. అంతా పూర్తి అయిన తరువాత వచ్చిన నాన్నగారు ఆ ఇంటిని చూసి తిట్లభారతం మొదలుపెట్టారు. మేనేజర్‌, ఇతర పనివాళ్లముందు. చాలా బాధకలిగింది. అది కొద్ది నిమిషాలే. రైలు ఎక్కేముందు భోరున ఏడుస్తూ... 'ఎందుకు రా చెప్పిన పనిచేయకుండా నాతో అందరి ముందు తిట్లు తింటావు ' అంటూ బాధపడ్డారు. ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం. కోపం, బాధ, సంతోషం ఏది మనస్సులో దాచుకునే వ్యక్తికాదు.
మీతో ఎలా ఉండేవారు?
నేను, నాన్నగారు స్నేహితుల్లా ఉండేవాళ్లం. ఆయన చేసిన మంచిపనులు చెప్పేవారు కాదు, కాని తప్పులు మాత్రం చెప్పేవారు. ఎందుకు నాన్న ఎప్పుడో జరిగినవి చెబుతారు అంటే అదికాదురా... నీవు తప్పులు చేయకు...తప్పులు చెెస్తే వాటి ఫలితం చాలా బాధకరంగా ఉంటుంది. అందుకే నీవు తప్పులు చేయకు అంటూ మందలించేవారు. స్నేహితుల ప్రభావంతో డ్రింక్‌ చేసేవాడిని. మానేయమని నాన్న ఎంతో నచ్చచెప్పారు. నాకు బాగా గుర్తు ఆయనకు ఆరోగ్యం దెబ్బతిన్న తరువాత ఒక రోజు ఏడుస్తూ 'తాగుడు మానేయిరా... నీ పిల్లలంతా వీధిన పడ్డతారని నాకు భయంగా ఉందిరా ' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన చనిపోయిన తరువాత పదేపదే ఆయన పడిన ఆవేదన గుర్తుకు వచ్చి, నేను ఆ వ్యసనం నుంచి బయటపడ్డాను.
అగ్రహీరోలతో సమానంగా మీ నాన్నగారి పారితోషికం ఉండేద ట? మరి ప్రస్తుతం మీ ఆర్థిక పరిస్థితిని చూస్తుంటే వారితో సమానంగా ఉన్నట్లు లేదే?
నిజమే...ఆ రోజుల్లోఎన్టీఆర్‌, ఎఎన్‌ఆర్‌తో సమానంగా నాన్నగారికి పారితోషకం ఉండేది. వీరి ముగ్గురి పారితోషికాలు 40, 39,38వేలరూపాయలుగా ఉండేవి. కాని నాన్నగారు ఎప్పుడు 38వేలే తనకు ఇవ్వమని చెప్పేవారు. అలా ఎందుకు అని ఎప్పుడైనా అడిగితే 'మనదేశం హీరోకు ప్రాధాన్యత ఇచ్చే దేశం' అనే వారు. ఆయనకు అసలు అహంకారం అనేది ఉండేది కాదు. అయితే ఎప్పుుడు ఒక మాట అనేవారు. 'రాళ్లు తిని కరిగించుకునే వయస్సులో తిందామంటే రాళ్ళు కూడా దొరకలేదు. ఇప్పుడు రత్నాలు ఉన్నా తి నే శక్తి లేదు.'
సహాయం కోరి ఇంటికి వచ్చిన ప్రతిఒక్కరికీ ఎదో ఒక సహాయం చేసేవారు. డబ్బుకన్నా స్నేహానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. మా బంధువుల కుటుంబాలలోనే కాకుండా తెలిసినవారి కుటుంబాల్లో దాదాపు రెండువందల జంటలకు పెళ్లిళ్లు చేశారు. ఇక మా అమ్మగారు ఆయనకు తగ్గ ఇల్లాలు. ఎవరింట్లో శుభకార్యం ఉన్నా ఆవిడ హాజరు కావల్సిందే. ఇలా ఇద్దరూ కలిసి ధనం కన్నా మర్యాద, మంచితనం గొప్పవి అని భావించేవారు. అందుకే ఆయన సంపాదన అధికంగానే ఉన్నా చాలా వరకు ఇతరులకు సహాయపడడానికే ఖర్చు అయ్యింది. మరో కారణం... నేను స్వతహాగా ఏ వ్యాపారం చేయకపోవడంతో తాడేపల్లిగూడెంలో థియేటర్‌ చూసుకుంటూ ఉండేవాడిని. చిన్న పట్టణమైన ఆ ఊరిలో ఏ క్లాస్‌ థియేటర్‌ కట్టడం వల్ల నష్టాలు చవిచూశాం. అయితే వారిలా మేం లేమే అన్న బాధ మాకు లేదు.
మీకు ప్రస్తుతం సినీరంగంలో ఎలాంటి ఆదరణ ఉంది?
మా నాన్నగారు చనిపోయి 37సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ అంతా మమ్ముల్ని ఎంతో ఆప్యాయంగా పలుకరిస్తారు.
మా పిల్లల అందరి పెళ్ళిళ్లకు సినీప్రముఖులంతా వచ్చారు. ఆఖరి అమ్మాయి పెళ్లికి అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విచ్చేసి, ఆశీస్సులు అందించారు. అక్కినేని గారు, అంజలి గారు ఇప్పటికీ ఎక్కడ కనిపించినా ఎంతో ఆప్యాయంగా పలుకరిస్తారు. మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల వారు ఈ లోకంలో లేకపోయినా, వారి మంచితనంతో అంతా సంతోషంగా ఉన్నాం.
మీకు సంబంధించిన విజయగార్డెన్స్‌ వ్యవహారం కోర్టులో ఉంది కదా? ఎంతవరకు వచ్చింది?
మా నాన్నగారు వాణీ స్టూడియో ఎదురుగా ఉన్న విజయగార్డెన్స్‌లో కొబ్బరి, మామిడి తోట ఉన్న పదిఎకరాల స్థలం కొన్నారు. వందల ఎకరాల విజయగార్డెన్స్‌ లో మాది పదిఎకరాల స్థలం. ఆ తరువాత నాగిరెడ్డి గారు మిగతా స్థలం కొన్నారు. మా స్థలం అమ్మమని అడిగితే నాన్నగారు కాదు కుదరదు అన్నారు. నాగిరెడ్డిగారి అబ్బాయి నేను స్నేహితులం. అలా నేను నాన్నగారిపై ఒత్తిడి తీసుకువచ్చాను. మేం కొన్నస్థలం మధ్యలో ఉన్నందున వారు మాపై ఒత్తిడి తీసుకువచ్చారు. చివరికి నాన్నగారు లీజుకు ఇవ్వడానికి అంగీకరించారు. అయితే లీజు గడువు ముగిసినా మా స్థలం మాకు ఇవ్వనందున మా పిల్లలు కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు కోర్టులో ఉంది. న్యాయం మా పక్షాన ఉంది కాబట్టి మాకు అనుకూలంగా కొద్ది రోజుల్లో తీర్పు వస్తుందన్న ఆశ ఉంది.
రేలంగి కొడుకుగా మీ తండ్రిపేరు నిలిచేలా ఏదైనా చేయాలనుకుంటున్నారా?
ప్రతి ఒక్కరిలో నటించే సత్తా ఉంటుంది. కాని వారిని కెమెరా ముందు ఎలా ప్రజెంట్‌ చేస్తున్నాం అనేది ముఖ్యం. 40సంవత్సరాల నుంచి థియేటర్‌ నిర్వహిస్తున్నాను. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో తెలుసు. మా చిన్నాబ్బాయి హీరోగా, మా నాన్నగారి పేరు నిలిచేలా, జనం మెచ్చేలా ఒక్క చిత్రం తీస్తాను. కోర్టు వ్యవహారం తేలిన తరువాత నాన్నగారి పేరుపై ఒక్క స్వచ్ఛంద సంస్థను స్థాపించాలన్న ఆలోచన ఉందంటూ తండ్రితో తన అనుబంధాన్ని, ఆయన పేరు నిలిచేలా చేయాలనుకుంటున్న కార్యక్రమాలను వివరించారు.

9, ఆగస్టు 2012, గురువారం

అక్షరాభిషేకం

 పదిహేను దశాబ్దాల విద్యావనంలో విశిష్ట చరిత్ర...
    రాష్ట్రపతి నుంచి స్పీకర్‌ వరకు ఇక్కడి విద్యార్థులే...

రేపటి ప్రపంచం తయ్యారయ్యేది తరగతిగదుల్లోనే అని చెప్పిన మహాత్ముడి మాటల్ని నిజం చేస్తూ... ప్రయివేటు పాఠశాలలు, వ్యాపార దృక్పధంతో సాగుతున్న ఈ రోజుల్లో కూడా తన చెంతకు వచ్చిన ప్రతి విద్యార్థినీ అక్కున చేర్చుకుని, భావితరాలకు బాటలు వేస్తూ.. ప్రయోజకులైన విద్యా ర్థులుగా తీర్చిది ద్దటమే కాక వారిని సమాజంలో ఆదర్శవంతమైన పౌరు లు గా...నిలుపుతూ... కార్పొ రేట్‌ కల్చర్‌ని తలదన్నే రీతిలో ఫలితాలు సాధిస్తూ... గత 150 వసంతాలుగా రాష్ట్ర చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకతని నిలుపుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది శ్రీకాకుళం జిల్లా, టెక్కలిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఒడ్రాజుల కాలంలో ప్రారంభించబడి... రాష్ట్రంలో తొలి హయ్యర్‌ సెకెండరీ పాఠశాలగా వాసికెక్కి, దేశానికి రాష్ట్రపతిని అందించిన ఘనత దక్కించుకుందీ పాఠశాల.

నేడు ఉద్దానంగా పిలవబడుతూ... ఈ ప్రాంతానికి జీవంలా ఉన్న వంశధార కాల్వలు లేని రోజుల్లో... విరిసిన విద్యావనానికి ప్రతీక నిలుస్తోంది టెక్కలి ఉన్నత పాఠశాల. మెట్ట భూముల్లో... అక్కరకు రాని పంటలతో... కాలం వెల్లదీస్తున్న క్రమంలో తమ భవిష్యతరం బాగుండాలన్న కాంక్షలతో... ప్రతి కుటుంబంలోనూ అక్కడ 'అక్షరాల' మొలకలేసాయి. నేర్చుకోవాలన్న తపన అనే సాగు విస్తారమై... ఉపాధ్యాయుల నిర్దేశకత్వంలో మొక్కవోని దీక్షతో చదివి, అంచెలం చెలుగా ఎదిగిన విద్యార్థులెందరినో... అనేక ఉన్నత స్థానాలు దక్కించుకు నేలా చేసిందీ పాఠశాల... దేశ ప్రధమ పౌరుడిని సైతం అందించి... నేటికీ అదే స్థాయిలో విద్యాబోధనలతో ఆదర్శంగా ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది.

తమ భాషా ఉన్నతికోసమే నాటి రాజులు కృషి చేస్తున్న కాలంలో... నేడు ఒరిస్సాలో ఉన్న పర్లాఖి మిడి సంస్థానాన్ని పాలి స్తున్న గజపతులలో శ్రీలక్ష్మీనారాయణ జగద్దేవ్‌ రాజ్యాధికారాన్ని వహిస్తున్న రోజుల్లో టెక్కలి ప్రాంతంలోని తెలుగు వారికోసం 1961లో ప్రాధమిక పాఠశాలగా ప్రారం భమై ఎందరో విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించింది. బ్రిటీష్‌ వారి పాలన లోనూ ఉత్తమ పాఠశాలగా వెల్లివిరిసిన ఈ పాఠశాలలో పెరుగుతున్న విద్యా ర్థులు, వారి ప్రతిభాపాటవాలను చూసి అచ్చెరువొందిన నాటి పర్లాఖిమిడి సంస్థానా ధీసుడైన రాజామధుసూధనదేవ్‌ ఈ పాఠశాలను ఉన్నత పాఠశాల స్థాయికి తీసుకువెళ్లేందుకు కృషి సల్పారు.

ఆపై శ్రీకాకుళం జిల్లా ఏర్పాటు తరువాత ఇదే పాఠశాలలో చదువుకుని జిల్లాపరిషత్‌ చైర్మన్‌గా ఎన్నికైన బెండి కూర్మన్న హయాంలో పాఠశాలలో మౌళిక వసతులు ఏర్పాటయ్యాయి. ఇకిదే పాఠశాలలో చదువుకుని టెక్కలి శాసనసభ స్థానం నుండి రెండు సార్లు అసెంబ్లీకి ఎన్నికై... స్పీకర్‌గా పనిచేసిన రొక్కం లక్షీ ్మనరసిం హదొర ఈ పాఠశాల అభివృద్దికి, భవన నిర్మాణాలకు కృషిచేసారు. శాసనసభ స్పీకరుగా ఎన్నికైన ఆయన పాఠశాల బోర్డు స్కూల్‌ చేయటంలో కీలక భూమిక వహించడంతో పాటు నిధుల వరదపారించి భవనాలు, లాబరేటరీ, లైబ్రరీ తదితర సౌకర్యాలు కల్పించారు. నేడు సెకండరీ విద్యను దాటి 'హయ్యర్‌' విద్యాకళాశాలపై నాటి రాష్ట్ర ప్రభుత్వం నియమిం చిన 'లక్ష్మణదాస్‌ మొడలియర్‌ కమిటీ ఈ పాఠశాలను సందర్శించి... నిబద్ధతతో పనిచేస్తున్న ఉపాధ్యాయ వర్గం, అంతకు మించి రెట్టింపు ఉత్సాహంతో చదువుతున్న విద్యార్థుల ను చూసి ఆశ్చర్యచకితులై... 'హయ్యర్‌సెకెండరీ' పై నివేదిక ఇస్తూ... దాన్ని ప్రారంభిం చందుకు టెక్కటి పాఠశాలను ఎంపిక చేసింది. అలా రాష్ట్రంలోనే తొలి హయ్యర్‌ సెకెండరీ పాఠశాలగా నిలిచి పోయిందీ పాఠశాల.

ఓ విద్యార్థి సమాజంలో అత్యున్నత పౌరుడిగా తీర్చిదిద్ద పడాలంటే... కేవలం చదువే కాదు నియమం, నిబద్ధతగల జీవితం...దానికి క్రమశిక్షణ తొడవ్వాలని నమ్మిన ఎల్లాపంతు కృష్ణమూర్తి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పని చేస్తూ... విద్యార్థిలోకానికి కొత్తవెలుగులు ఇచ్చే దిశగా కృషిచేసారు. పాఠశాల పేరు ప్రఖ్యాతులు వినుతికెక్కేలా ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆచరించిన పద్ధతులు నేటికీ ఉపాధ్యాయ వర్గాలకు అనుసరణీయమే...

స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా సత్యాగ్రహ పిలుపు నిచ్చిన గాంధీజీకి ఈ నిర్ణ యానికిది సరైన సమయం కాదు కదా? అన్న వైవి మాష్టారి ప్రశ్నకు బాపూజీ కూ డా అవునని సమాధానం ఇచ్చారంటే... కాల మాన పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలన్న భావల్ని విద్యా ర్థుల్లోకూడా ఆయన ఎంతలా పెంపొం దించారో తెలిపే ఘట నే. దేశ ప్రధమ పౌరుడిగా జన నీరాజనాలందుకున్న వి.వి.గిరి ఈ పాఠశాల విద్యార్థి కావటం నేటికీ ఇక్కడి విద్యార్థిలోకం గర్వంగా చెప్పుకుని... స్పూర్తిగా తీసుకుంటారు.

ఇక ఆధునికాంధ్ర చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న కవిపండితుడు ఆచార్య రోణంకి అప్పలస్వామి ఇదే పాఠశాల విద్యార్థి. దేశం విడచి ఎక్కడికి వెళ్లకుండానే 14 యూ రోపియన్‌ భాషల్లో విశేష ప్రావిణ్యతని దక్కించుకున్న ఘను డీయన.. దీనివెనుక ఉన్న రహస్యమేంటని ప్రశ్నించే వారికి నా తండ్రి తెలుగుభాషని ఉగ్గుపాలతో రంగరించి నాకు పట్టిస్తే... దానికి నా పాఠశాల ఉపా ధ్యాయులు మరిన్ని పరి మళాలు అందేలా చూసారు... అందుకే ఆయా భాషలు నేర్చుకోవటం నాకు చాలా సులభతరమైందంటూ... తెలుగు భాషలోని మాతృ మాధుర్యాన్ని చాటి చెప్పి... తెలుగు 'వాడి'ని ప్రద ర్శించారు.

అలాగే ఇంగ్లీష్‌ గ్రామర్‌ అంటే భయపడిపోతున్న ఆరోజుల్లో దానికి గ్లామర్‌ తెచ్చిన ఘనత మంత్రి ప్రగడ శేషగిరిరావు మాష్టారిది.విద్యార్థిని ఉన్నత శిఖరాల వైపు నడిపించాలంటే మాతృభాషతో పాటు ఇంగ్లీషు రావాలని భావించి పాఠశాల లో చదివే ప్రతివిధ్యార్థిని ఇంగ్లీష్‌ నేర్చుకోవాలని కుతూహలం కలిగేలా పాఠాలు చెప్పేవారాయన. ఆయన చెప్పిన పాఠాలు నేటికీ నాటి శిష్యులు వల్లెవేసుకుం టారంటే... ఎంతలా హత్తుకు పోయాయో చెప్పకనే చెప్పొచ్చు. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారిగా ఎదిగిన సత్తారు ఉమాపతి, టెక్కలి నియోజకవర్గ కేంద్రంగా శాసనసబ్యులుగా ఎన్నికై... శాసనసభల్లో కీలక భూమికలు పోషించిన హనుమంతు అ ప్పయ్యదొర, సత్తారు లోకనాధం, ప్రముఖ గజల్‌ గాయకుడు ప్రధాన ఆదినారా యణ ఇలా చాలా మంది మాష్టారి శిష్యగణంలో సభ్యులే... మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావుతో ప్రత్యేక అనుబంమున్న రాష్ట్ర డిజిపిగా పనిచేసిన హెచ్‌.జే. దొర సైతం ఈ పాఠశాల విద్యార్థే కావటం విశేషం. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయు డి గా పురస్కారాన్ని అందుకున్న హనుమంతు వీరన్న, తెన్నేటి సత్యన్నారాయణ, స్వతంత్ర సమరయోధుడు, ప్రముఖ పాత్రికేయుడుగా వినుతుకెక్కిన జంధ్యాల లక్షి ్మ నారాయణ, ప్రజాపోరాటలకే తన జీవితా న్ని అంకితం చేసిన అట్లరాములు ఇలా ఎందరో ఈ పాఠశాలలో చదువుకున్న వారే... ఇక్కడే చదువుకుని ఉపాధ్యా యు లుగా... ప్రధానోపాధ్యాయులుగా పని చేసి... ఎందరో విద్యార్థులకు విద్యాదా నం చేసిన వారే... నిబద్దతతో చదువుకున్న విద్యార్థులకు ప్రతిసందర్భంలో ప్రోత్సాహకంగా నిలచిన వారే.. ప్రస్తుతం అధునాతన భవనాలతో... తెలుగు, ఒరియా, ఇంగ్లీష్‌ మీడియంలతో... ఈ పాఠశాల నడుస్తోంది. ప్రయివేటు పాఠశాల లకు ధీటుగా కంప్యూటర్‌ ల్యాబ్‌, రసాయనిక, భౌతికశాస్త్ర పరికరాలతో పాటు ఒరి యా, తెలుగు మీడియంలకు ప్రత్యేకం గా గ్రంధాలయాలు కలిగి ఉండటం గమ నార్హం. గత ఐదుతరాలుగా వేలాది మంది విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పి స్తూ... భావితరాలను ఉన్నతంగా ఉండే లా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయగణం నేటికీ అదే స్పూర్తి కొనసాగిస్తుండటం ఈ పాఠశా ల ప్రత్యేకం. బాలల్లో తెలుగు భాష పట్ల ఆసక్తి పెంపొందించేందుకు వారికి కవితల పోటీలు పెట్టడం విశేషమిక్కడ.

శోధించి మరీ...

నాటి తరంలో విద్యార్థులు అడిగే ప్రశ్నలు వారికి వివిధ అంశాలపై ఉన్న శ్రద్ధాశక్తుల్ని ప్రతిబింపచేసేలా ఉండేవని... వాటికి జవాబిచ్చే క్రమంలో ఒకటికి రెండు సార్లు పరిశీలించుకుని, తెలియని విషమాన్ని తెలుసుకుని, గ్రంధాలు శోధించి మరీ జవాబులు ఇచ్చి విద్యార్థులు ప్రగతికి కృషి చేసేవారని ఓల్డు స్టూడెం ట్స్‌ అసోషియేషన్‌ సబ్యులు లైఫ్‌తో చెప్పారు. అప్పట్లో తమ పాఠశాల ఉదయం 7 గంటలకే ప్రారం భమ య్యదని... తమ ఉపాధ్యాయులు నిర్విరామంగా రాత్రుళ్లు కూడా తమని చదివించేందుకు... తమకు వచ్చే సంశయాలు తీర్చేందుకు మిక్కిలి కృషి చేసేవారని... చెప్పారు. నాటి విద్యార్థుల కృషి ఫలితమే... నేడు దేశ విదేశాల్లో అనేక ఉన్నత స్థానాల్లో టెక్కలి విద్యార్థులు ఉన్నారని.. ఇది తమ ప్రాంతానికి ఎంతో గర్వకారణమని చెప్పారు.

అంతెందుకు ఓసారి రాష్ట్రముఖ్యమంత్రిగా ఉన్న దామో దరం సంజీవయ్య ఈ పాఠశాలని సందర్శించేం దుకు లోనకు వస్తున్న సమయంలో 'విద్యాపరి మళాలు గుభాళించాల్సిన చోట... సిగార్‌ వాసనలు వస్తు న్నాయంటూ... సున్నితంగా చెప్పిన వైకె మాస్టారికి 'సారి' చెప్పి మీరు చెప్పింది అక్షరాలా నిజం పంతులు గారూ! అంటూ తన హుందాతనాన్ని చాటి చెప్పుకుని ప్రదర్శించిన విజ్ఞతకు నిలువెత్తు నిదర్శనం. ఈ సన్నివేశం అసెంబ్లీ ప్రాంగ ణాలలో... నిండు కొలువుల్లో ... నిషేధిత ప్రాంతాలలో సైతం సిగరెట్లు వెలిగించి రింగు ల పొగలొదులుతున్న నేటి మన శాసనసభ్యులకు నిజంగా చెంప పెట్టులాంటిదే...

విదేశీయులూ ఉపాధ్యాయులుగా...

బ్రిటన్‌లో న్యాయకోవిదుడిగా ఉన్న ప్రెంట్‌ కామ్లీ, అమెరికా నుండి వచ్చిన షెటల్‌ సుల్తాన్‌లు ఈ పాఠశాల వాతావర ణానికి ముచ్చటపడి ఇక్కడ ఉపాధ్యాయు లుగా పనిచేసారు. తరువాత కాలంలో తిరిగి సొంత దేశానికి వెళ్లినా ఈ పాఠశాల పై మమకారాన్ని వదులు కోలేదు... 2006లో ప్రెంట్‌ కామ్లీ ఈ పాఠశాలని తన కుటుంబంతో సహా సందర్శించి... అప్పటి జ్ఞాపకాలని నెమరేసుకోవటం పెద్దవిశేషం.

పూర్వవిద్యార్థి సంఘం...

1964లో ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన పప్పు హనుమంతరావు మాష్టారికీ ఈ పాఠశాలలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. 1971 వరకు ఇక్కడ ఉపాధ్యాయుడిగా... ఆపై ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన క్రమశిక్షణ, నిశిత అధ్యయనం విద్యార్థులకు అలవరిస్తే... వారిని అత్యున్నత స్థానాలు అందుకునేలా తీర్చి దిద్దవచ్చని నిరూపించారు. కులమతాలకు అతీతంగా విద్యార్థులని చేరదీసి, సొంత మనుష్యులుగా వారిని భావించి తన ఇంటిలోనే ఆశ్రయమిచ్చి, ఆర్థికంగా... హార్థికంగా ఆదుకున్న మాష్టారి దగ్గర చదువుకున్న వారిలో ఉన్నత శిఖరాలు అందుకున్న వారు ఎక్కువే. గురువుకి తగ్గ శిష్యులుగా వారంతా ఈ పాఠశాలలో పూర్వ విద్యార్థి సంఘంగా ఏర్పడి సేకరించిన నిధులని స్రకమంగా వినియోగిస్తూ.నేటా గురుపూజోత్సవం రోజున శ్రీకాకుళం జిల్లాలో, టెక్కలి కేంద్రంలో ఏడో తరగతి, పదోతరగతి, ఇంటర్‌లలో ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు ప్రత్యేక పురస్కారాలు అందిస్తున్నారు.

ఉపాధ్యాయుడిదే ఉన్నత స్థానం

సమాజంలో ఉపాధ్యాయు డికే ఉన్నత స్థానం ఉంది... నా తండ్రి ప్రేరణతో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించిన నాకు నాటి సామాజిక పరిస్థితుల నడుమ చదువుకోవా లన్న తపనతో వచ్చే విద్యార్థులకి బాసటగా నిలచి, వారిలో ప్రతిభని వెలికి తీసి, ప్రయోజకుల్ని చేయటం వృత్తి ధర్మంగా, విధినిర్వహణలో భాగంగా చేసాను. నాదగ్గర చదువుకున్న విద్యార్థులు నేనూహించిన దాని కన్నా మిన్న గా ఎదగటం హర్షించదగ్గ పరిణామం. చాలా మంది ఈ సమాజానికి సేవలందించే అనేక ఉన్నత స్థానాల్లో ఉండటం నాకు గర్వం గా ఉంది.
- పప్పు హనుమంతరావు, పూర్వ ప్రధానోపాధ్యాయులు, టెక్కలి ఉన్నత పాఠశాల

వారి స్పూర్తినే ముందుకు...

ఎందరో ప్రముఖులు చదవిని చోట పనిచేయ టం నిజంగా నా అదృష్టం నేటికీ నిన్నటి తరం అందించిన స్పూర్తిని విద్యార్థు లకు అందించడంలో ఉపాధ్యాయ సిబ్బంది ఎన లేని కృషి చేస్తోంది. మారిన పరిస్థితుల కు అనుగుణంగా ప్రయివేటు పాఠశాలకు ధీటు గా ప్రచారం చేయలేక పోయినా వాటికి మిం చి న ఫలితాలు సాధించడంలో మాస్కూల్‌ ముందుంటోంది. ఎందరో ఈ పాఠశాలలో చదువుకుని దేశం లోనూ, విదేశాలలోనూ ఉన్నత పద వులు అలంకరించిన తీరుతెన్ను లు నేటి తరం విద్యార్థులకు ఆదర్శంగా నిలచే లా ఇక్కడ విద్యాబోధన జరుగు తోంది. స్థానికంగా ఉన్న అధికారులు, పూర్వ విద్యార్థుల సంఘ సభ్యులతో పాటు పాఠశాలకు కావాల్సిన సౌకర్యాల విషయం లో స్థానిక ప్రజా ప్రతినిధు లు చొరవ తీసుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది ఈ పాఠశాల విద్యార్థులు కావటం మాకు ఆనందదాయకం.
- సిహెచ్‌. రాజేశ్వరరావు ఆచారి, ప్రధానోపాధ్యాయులు,
టెక్కలి ఉన్నత పాఠశాల

గురుపూజోత్సవం మాకు పండగే

కౌన్సిలింగ్‌ అంటే తెలియని ఆరోజు ల్లోనే విద్యార్థుల పరిశీలనా శక్తి సామ ర్థ్యా లను అంచనా వేసి ఎవరు ఏఏ అంశాలలో ప్రతిభాపాటవాలు ప్రదర్శి స్తుంటారో వారి కి ఆసక్తి ఉన్న అంశాలనే ఆలంబనగా చేసు కుని... జీవితాన్ని ముందుకు సాగేలా అనె క సూచనలు చేసేవారు. దీని వల్లే అనేక మంది ఉన్నత శిఖరాలు అందుకోగలి గారు. మేమంతా కల్సి పప్పు హనుమంత రావు మాష్టారి పూర్వవిద్యార్థుల సంఘం పెట్టుకుని... మాగురువులందర్నీ గుర్తుంచుకునేలా ప్రతి ఏటా సెప్టెంబర్‌5 గురుపూజోత్సవాన్ని పండు గలా జరుపుకుంటాం... విద్యాసేవలందించి ప్రతిప్ట గడించిన ఉపాధ్యాయుల్ని సన్మానించుకుంటాం. ప్రతిభా అవార్డుల పేరుతో విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. ఈ కార్య్‌క్రమానికి ఏపూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరవుతునే ఉంటారు.

- ఆకుల ప్రకాష్‌, కరస్పాండె ంట్‌, ట్రెజరర్‌,
పూర్వవిద్యార్థుల సంఘం, టెక్కలి ఉన్నత పాఠశాల.

-యం.రాంగోపాల్‌, ఫొటోలు : కృష్ణారావు,టెక్కలి

8, ఆగస్టు 2012, బుధవారం

దొరకునా...ఇటువంటిసేవ

శ్రీవారి పుష్పఆలంకరణలో పులకితుల మనోగతం
మంగళాకారుడు... మా కులదైవం వెంకటేశుడంటూ కోట్లాదిగా తరలివస్తూ... ఏడుకొండలూ నడచి మరీ ఆ కోనేటిరాయుడి దివ్య మంగళ రూపాన్ని కళ్లారా వీక్షిస్తూ.... తన్మయత్వంలో మునిగిపోయే భక్తజనం ఎందరో? పద... పద మంటూ కాపలాదార్లు, కైంకర్య నిర్వాకులు ఎవరెంతలా నెట్టేస్తున్నా.... గోవిందా... గోవిందా... అంటూ హరినామస్మరణతో ఇహలోకాన్ని వీడి అదో అద్భుత ప్రపంచం లో విహరించడం స్వామిభక్తులకే చెల్లింది. అందునా శ్రీవారికి తోమాల సేవా సంబరం జరిగినప్పుడు చూడాలని కోట్లాది భక్తగణం ఆశించడం సర్వసాధారణ విషయం. మరి తిరుమల శ్రీవెంకటేశ్వరుని మూల విరాట్టుకు జరిగే ఈ తోమాలసేవలో పూలదే ప్రధాన పాత్ర... పూల మొక్కల పెంపకం నుంచిఈ పూలని హారాలుగా కూర్చి స్వామివారికి చేర్చే క్రమంలో ఎందరో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వ హిస్తు... శ్రీవారి పుష్ప సోయగాలను నయనానంద భరితం చేసేలా చేస్తున్న వారిని ఆంధ్రప్రభ లైఫ్‌ పలకరించింది. ఆ వివరాలు ఇవి..
క లియుగ ప్రత్యక్షదైవంగా విశ్వవ్యాప్తంగా భక్తజనులతో కీర్తించ బడుతున్న శ్రీనివాసుడు అలంకార ప్రియుడు. అందునా తులసి మాలంటే ఆతనికి మరింత ప్రీతి. అందుకే తిరుమలలోని వెంక న్న సన్నిథిలోని మూల విరాట మూర్తులకు ఉదయం, సాయంత్రం రెండు పూటలా తోమాల సేవ ఘనంగా నిర్వహించడం తర తరాలుగా ఆనవాయితీగా వస్తోంది. భక్త జనులలో చాలా మంది తోమాల సేవ పదం వినటమే కాని చాలా వరకు అక్కడతంతులు, దాని వెనుక వంద లాది మంది చేస్తున్న కృషి గురించి తెలిసేది తక్కువే... ఇంతకీ తోమాల సేవంటే తోటల నుండి సేక రించిన మాలలతో స్వామి వారి ని సేవించడం అని అర్థం. ఈ సేవ కోసం పూదోటల నుండి అనేక రకాల పూలతో పాటు తులసిని సేకరించి మాలలుగా గుచ్చి... శ్రీనివాసునికి అలంకరించే సేవయే తోమాల సేవ.
తిరుమల క్షేత్రం కొలువై ఉన్న ఏడుకొండలలో సుగంధ పరిమళాలు వెదజల్లే పుష్ప జాతులకు,పత్రాలకు కొదువే లేదు.. అందునా ఆ దివ్యమంగళ మూర్తికి అతి ఇష్ట మైన తులసి, చామం తులు, గన్నేరు, సన్నజాజులు, మొల్లలు, మొగిలి, కమలం (తామర), కలువ పూలు, గులాబీలు, సంపెంగలు, సుంగంధాలు, కనకాంబ రం,లాంటి పుష్ప జాతులే కాదు... మరువం, మాచీపత్రం, దవనం, బిలువం పత్రా లు... స్వామి వారి కైంక ర్యాలలో అవసరమ య్య మామిడా కు లు, తమలపాకు లు, పచ్చి పసుపు చెట్లు కోకొల్లలు. ఈ గిరులలో స్వామి వారి తోమాల సేవ కోసం ప్రత్యేకంగా ఓ నర్సరీని ఏర్పాటు చేసి మొక్కల్ని పెంచుతూ... నిత్యం ఇక్కడ నుండి సేకరించిన అనేక రంగు రంగుల పుష్పాలతో పుష్పకైంకర్యం చేస్తున్నారు.
తోమాల సేవ జరిగే తీరిది...
రోజూ క్రమం తప్పకుండా రెండు పూటలా శ్రీవారికి పుష్ప కైంకర్యంలో వివిధ పుష్ప జాతులతో అలంకరించిన పూల మాలలను జియ్యంగార్లు తలపై పెట్టుకుని, వేదమంత్రోచ్ఛారణలతో మంగ ళ వాయి ద్యాలతో... ఊరేగింప ుగా బయలుదేరి ధ్వజ స్తంభానికి ప్రదక్షిణంగా వచ్చి, విమాన ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి సన్నిధిలో సమ ర్పిస్తారు. ఆలా జియ్యంగా ర్లు సమర్పించి ఆదివ్యమంగళా కారుడికి అలం కరిస్తారు. ప్రతి రోజు జరిగే పుష్ప కైంకర్య కార్య క్రమానికి సగటున 250 కిలోల పు ష్పాలను వినియోగిస్తుండటం పెద్దవిశేషం. అలా గే ప్రతి గురువారం శ్రీవారి మూల విరాట్‌కి ఉన్న బంగారు ఆభరణాలు తీసివేసి పూలమాలలతో విశేషంగా అలంకరిస్తారు. అందుకేఆ కొండల రాయుడు ప్రతి గురువారం భక్తులకు కొంగ్రొత్త రూపంతో కనువిందు చేసేలా కనిపిస్తాడు. ప్రతి రోజు మూల విరాట్‌ అలంకరణకు సుమారు 275 అడుగుల పూల మాలలను అలంక రిం పడుతున్నాయి. .
పూలంగిసేవ
ప్రతి గురువారం రాత్రి స్వామి వారికి నివేదన ముందు పూలంగి సేవను నిర్వహిస్తారు. సుగంధ పరిమాళిక లతో శ్రీవారికి వస్త్ర రూపముగాను, ఉత్తరీయ రూపముగాను, కిరీట రూపముగాను, శంఖు చక్ర రూపములుగాను, తిరు మేను అంతయూ పుష్ప మయమగునటుల అలంకరి స్తారు. సూర్య కరాటి అను ఆసమయంలో పుష్పాలంకృతు డైన స్వామి వారి దివ్యమంగళ స్పరూపం చూచి భక్తులు తన్మయత్వం చెందుతున్నారు. ఈ పూలంగి సేవను, సేవగానే కాకుండా దర్శనంగాను టిటిడి ఏర్పాటు చేసింది.
పూల తోటలు - నందన వనాలు
ఎంతో విశిష్టత కలిగిన స్వామి వారి తోమాల సేవ కోసం టిటిడి 175ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో నందన వనం పూల తోటలను పెంచుతోంది. దీనిని 1959 లో ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేసింది . 1961లో కేవలం 15 మంది కార్మికులతో ప్రారంభమైన ఈ పూదోట లు ప్రస్తుతం 825 మంది కార్మికులు స్థాయికి చేరుకుంది. తిరుమల కొండల్లో నారాయణగిరి గార్డెన్‌, టిబి గార్డెన్‌, శంఖుమిట్ట, పద్మావతిపురం, మాధవరం, ఆలపాటి తోట, దివ్వారామం పూలతోట ఇలా పలు చోట్ల గార్డెన్లు ఏర్పాటు చేయిటమే కాక పుష్పవర్ధిని పథకంలో 60 ఎకరాలలో సుగంధ పుష్పాల పెంచుతున్నారు.

టన్నుల కొలది పూలు...
టిటిడికి సాలీనా 40 టన్నుల పుష్పా లు అవసరమవు తాయి. వీటి లో తిరుమలలోని ఆలయా లకు 1,34,578 కేజీలు కాగా, తిరుపతి పరిసర ఆలయాలకు 2,71,000 కేజీల పుష్పాలు అవస మవుతా యి. ఇందులో 60 శాతం విరాళాల ద్వారా, 30 శాతం, ఉత్పత్తి ద్వారా పది శాతం కొనుగోలు ద్వారా టిటి డి సమకూర్చుకుంటోంది. సాలీనా 40 లక్షల రూపాయల విలువ గల పుష్పా లను టిటిడి కొనుగోలు చేస్తు న్నట్లు తెలుస్తోంది. తులసిని నందన వనంలో పండిస్తారు.
శ్రీవారికి పుష్పాలు సమర్పించి చరిత్రకెక్కిన భక్తులు
శ్రీవారికి అనేక మంది భక్తులు పుష్పాలు సమర్పించి మోక్షమార్గం పొందినట్లు భక్తుల విశ్వాసం. ఆ కోవలో తిరుమలనంబి తొలి సారి గా శ్రీవారి సేవలకు కావాల్సిన పుష్పా ల కోసం ఉద్యా నవనాలు పెంచి మోక్ష సిద్ధి పొందారు. అలాగే అనంతాళ్వారు శ్రీ వారి కోసం తను పెంచిన పూతోటలో పూసిన పూలనుమాలలుగా కట్టి తీసుకొచ్చి స్వామివారికి అలంకరించే వారు.ఈ ఉద్యానవనాన్ని నిరంతరాయంగా అభివృద్ధి చేసిన ఆయన పూల మొక్కలకు కావాల్సిన నీటి కోసం తవ్వించిన చెరువు నేటికీ అనంతాళ్వారు ట్యాంక్‌గా భాసి ల్లు తోంది. 1053లో జన్మించిన ఆయన 84 ఏళ్లు తిరుమలలో ఉండి స్వామి సన్నిధిలో పరమపదించారు. నేటికీ స్వామివారి 'యమునాతురై' పుష్పం కైంకర్యం ఆయన పేరు మీదే జరుగుతుండటం విశేషం. ఇక భక్తాగ్రేసర శిఖామణి తరి గొండ వెంగమాంబశ్రీవారిని సేవించేందుకు తులసి వనం పెంచి, తులసి మాలలు సమర్పించి భక్తిని చాటు కొంది.
అన్నింటా పుష్పాలంకరణ...
తిరుమలలో శ్రీవారికి జరిగే కళ్యా ణోత్సవం, ఊంజల్‌ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, వసంతోత్స వం, పద్మా వతి పరిణ యం, అణి వార ఆస్థానంలో పుష్పపల్లకీ ఇలా అన్నింటా పుష్పాలంకరణకే పెద్ద పీట. ఇది కాక ఏటా శ్రీ వారికి జరిగే పుష్ప యాగం కోసం 7 టన్నుల పుష్పాలను నివేదిస్తారు. ఇందులో 18 రకాల ప్రధాన సాంప్రదాయ పుష్పాలను శ్రీవారు హృదయాన్ని తాకేవరకునివేదన చేసిస్వామి వారిని పూ లతో ముంచెత్తుతారు. అటు పిమ్మట వాటిని తొలగించి మళ్లిd పుష్పార్చన చేస్తారు. ఇలా మలయ ప్ప స్వామికి 20 పర్యాయాలు నివేదన జరుగుతుంది.
పూలబావి....
శ్రీవారి మూల విరాట్టుకు అలంకరింపచేసే పుష్పాలని తొలగించిన తర్వాత వాటిని ఆలయంలో ఉన్న పూల బావి లో వేస్తారు. భక్తులకు ఇవ్వరు. తిరుచానూరు శ్రీ పద్మావతీ దేవి పంచమి ఉత్సవాలలో శ్రీవారికి అలంకరించిన పు ష్పాలను సారెగా పంపుతారు. ఆ ఒక్క రోజు స్వామివారికి అలంకరణ పుష్పాలు బయటకు వస్తాయి. ఇందుకు ఇతిహాస చరిత్ర ఉంది. శ్రీరంగదాసు అనే భక్తుడు బావిని త్రవ్వి ఆ బావిలోని నీటిని వాడుతూ శ్రీమహావిష్ణువుని పూజకై సంపెంగ, చామంతులను తోటలో పెంచి పూజ చేసేవారు. అతని మరణానంతరం మరుజన్మలో తొండమాన్‌ చక్రవర్తిగా జన్మించగా ఆతనికి వేంకటేశ్వరుడు కలలో కనిపించి గతజన్మలో నిర్మించిన బావి నేడు శిథి లమై పోయిందని... ఈ బావిని మళ్లిd పునరుద్ధరించమని ఆదేశించాడని... దీంతో తొండమానుడు రాతితో బావిని పునరుద్ధరించి దానిద్వారా ఒక రహస్య బిలం ఏర్పాటు చేసి తిరుమలకు వచ్చి శ్రీనివాసుని దర్శించి వెళ్తు..శ్రీ స్వామివారికి ప్రీతి పాత్రుడైనట్లు చెప్తారు. ఒకనాటి యుద్ధంలో శత్రువులచే తరమబడుతూ తప్పించు కొన్న తొండమానుడు ఏకాంత సమయంలో ఆలయ ప్రవేశం చేశాడని ఆసమయం లో శ్రీదేవి సిగ్గుతో శ్రీనివాసుని వక్ష స్థలంలో భూదేవి బావిలో దాక్కుందని వేంకటా చల మహాత్యంలో తెలియచేస్తుంది. శ్రీ రామానుజుల వారు తిరుమల సందర్శించినపుడు తొలగించిన పూలను భూదేవి నివసిస్తున్న బావిలో వేయమని ఆదేశిం చారు. అప్పటి నుంచి శ్రీవారికి అలంకరించిన పూలను బావిలో వేస్తారు. అందుకే ఆ బావికి పూల బావి అని పేరు వచ్చింది. తిరుమలలో పూచిన పుష్పాలన్నీ స్వామి వారి కైంకర్యాలకే. అందుకే తిరుమలలో పూలు పెట్టుకోరాదు అని టిటిడి ప్రకటనలను గుప్పిస్తుంది. తిరుమల క్షేత్రం ఫల పుష్పాలతో నందనవనంగా విరాజిల్లుతుంది.
పూలని కట్టడం కూడా ఓ కళే...
గత జన్మలో పుణ్యఫలం నేటికి శుభప్రదం అవుతోందన్నది పూలు కట్టే ప్రతి ఒక్కరి సమాధానం... ఇంతకంటే భాగ్యం మరొకటి లేదన్న ఆత్మ సంతృప్తి అందరి కళ్లలో కనిపిస్తుంది. ఇక ఉత్సవ సమయంలో నిపుణులు ఆకృతులలో పూల ను అమర్చి అవి వాడిపోకుండా శ్రద్ద వహిస్తారు. అత్యంత సువాస నలు వెదజల్లే 'మసిలం' పుష్పాలు అలంకరణలో ఓ ప్రత్యేక ఆకర్షణ.

అంతా స్వామి వారిదే
తిరుమలలో ఉన్న పశుక్షాదులు, వృక్షసంపద, లతలు అన్నీ కూడా స్వామి వారికి చెందుతాయి.
పుష్పాలన్నీ స్వామి వారికైంకర్యానికే నివేదింప బడాలి అంచేత తిరుమలలో తలలో పూలు పెట్టుకోరాదని తిరుమలలో వివా హం చేసుకొనే వధూవరులకు పూలమాలలు అలంకరింప చేయ రని, దానికి ప్రత్నామ్నాయంగా ఇతర దండలు వినియోగిస్తారు. తిరుమలను సుందర నందన వనంగా రూపు దిద్దేందుకు పూల తోటలలోని పూలని స్వామి వారికి అలంకరణకు , కైంకర్యాలకు మాత్రమే వినియోగించాలి. భక్తులు ఈ విషయంతో దేవస్థానంతో సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..
- రమణ దీక్షితులు ప్రధానర్చకులు,తిరుమల తిరుపతి దేవస్థానం


శ్రీ వారికి అలంకరించే పూలు కట్టడం మా అదృష్టం
ప్రతి నిత్యం చెన్నయ్‌, శ్రీరంగం, గోవా, ఉడిపి, బెంగళూ రు నుంచి తిరుమలకు పూలు చేరుకుంటాయి. 40 మంది కార్మికులు స్వామివారికి మాలలు అలంకరించడంలో నిమగ్నమైపోతారు. స్వామివారికి వివిధ కొలతలలో పూ ల మాలలను సిద్ధం చేస్తారు. వాటిని బుట్టలలో నింపి ఆల యానికి పంపుతాం. స్వామి వారి సన్నిధిలో పనిచేయడం ఒక వరమైతే, పూలు కట్టడం, కట్టిన పూలమాలలు స్వామి వారికి సమర్పించడం పూర్వజన్మ సుకృతంశ్రీవారి కరసేవ కులు కట్టిన మాలలు కొలతలకు తగ్గట్టు సరిచేసి పంపడం తమ బాధ్యత డోనర్‌ల నుంచి వచ్చిన పూల మాలలు సిబ్బందిచే జాగ్రత్తగా పరిశీలించి, వాటిని కొలతల ప్రకారం సరి చేయించి నిర్ణీత సమయానికి శ్రీవారి సన్నిధికి పంపడం తమ బాధ్యత.
రామమూర్తి, పూల మాలల పర్యవేక్షకుడు


శ్రీవారికి అలంకరింపబడే మాలలు ఇవి
శిఖామణి : కిరీటం మీద నుంచి రెండు భుజాల మీద వరకు అలంకరింపబడే ఒకే దండను శిఖామణి అని పిలుస్తారు. ఇది ఎనిమిది మూరల దండ.
సాలిగ్రామ మాల : శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతున్న సాలిగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన మాలలు. ఇవి రెండు మాలలు, ఒక్కొక్కటి నాలుగు మూరలు.
కంఠసరి : మెడలో రెండు భుజాల మీదికి అలంకరింపబడే దండ. ఒకటి మూడున్నర మూరలు.
వక్షస్థల లక్ష్మీ : శ్రీవారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి, భూదేవిలకు రెండు దండలు. ఒక్కొక్కటి ఒకటిన్నర మూర.
శంఖుచక్రం : శంఖు చక్రాలకు రెండు దండలు ఒక్కొక్కటి ఒక మూర.
కఠారి సరం : శ్రీవారి బొడ్డున వున్న నందక ఖడ్గానికి అలంకరింపబడే దండ. ఒకటి రెండు మూరలు.
తావళములు : రెండు మోచేతుల క్రింద, నడుము నుండి మోకాళ్ల పై హారాలుగా మోకాళ్ల నుంచి పాదాల వరకు జీరాడుతూ వ్రేలాడదీసే మూడు దండలు. ఇవి అన్ని కలిపి పది మూరలు.
తిరువది దండలు : శ్రీ స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలు. ఒక్కొక్కటి ఒక్క మూర.
ఇవిగాక ఉత్సవ మూర్తులు, భోగ శ్రీనివాసమూర్తి, కొలువ శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి, మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి సహిత ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీ సీతా రామ లక్ష్మణులు, శ్రీ రుక్మిణీ కృష్ణులకు, చక్రత్తాళ్వారులకు, అనంత, గరుడ, విశ్వక్సేనులకు, సుగ్రీవ, హనుమంతు, ఆగంధులకు ఆలయంలో ఉన్న ద్వార పాలకులు, పరివార దేవతలకు, తిరుమలలో వేంచేసి ఉన్న బేఢీ ఆంజనేయస్వామి, వరాహ స్వామితోపాటు ఇతర ఆలయాలకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పుష్ప కైంకర్యం జరుగుతుంది.


ఇంతటి భాగ్యం ఎందరికి దక్కుతుంది?
నేను కట్టిన పూలు స్వామి పూలు వారికి అలంకరించడం గత జన్మలో నేను చేసుకున్న పుణ్య ఫలమనే నానమ్మకం... ప్రతి రోజు ఉదయం 8.00గంటలు నుండి సాయంత్రం 4.00 గంటల వరకు స్వామి వారికి పూల మాలలు కూర్చటంలో నిమగ్నమైపోతా.. మాలలు కట్టే సమయంలో శ్రమ తెలియడం లేదని, ఇది స్వామి వారి కృపే... ఇంతటి మహత్‌ భాగ్యం ఎందరికి దక్కుతుంది?
- వై. రామసుబ్బమ్మ, టిటిడి ఉద్యోగిని


బ్రహ్మోత్సవాలలో పుష్ప నివేదనలే
స్వామివారికి జరిగే ఏటా బ్రహ్మోత్సవాల కోసం 40 టన్నులకు పైగా పుష్పాలను వినియోగిస్తారు. ఇందులో 16 నుంచి 18 రకాల పుష్పాలను స్వామివారి అలంకరణకు వాడుతున్నట్లు ఉద్యా నవన శాఖ అధికారులు చెప్పారు. ఇందులో కృత, త్రేత, ద్వాపర యుగాలలో స్వామివారి అవతా రాలను, సప్తద్వారాలు, ఉత్సవాలలో ప్రతిరూపాలను పు ష్పాలతో అలంకరించి భక్తులకు కన్నుల పండుగ గావిస్తుంది. ఇందుకోసం నాలుగు వందల మంది గార్డెన్‌ సిబ్బంది ఎంతో శ్రమించి తమ కళానైపుణ్యాన్ని చాటు కుంటారు. ఇక ఏటా శ్రీవారికి మూడు రోజుల పాటు జరిగే పద్మావతీ పరిణయానికి పుష్ప సోయగాలే ప్రధాన ఆకర్షణ.

ఒక్కక్లిక్‌చాలు ప్రాణాలుకాపాడేందుకు...

  • క్షణాల్లో క్షతగాత్రుల చెంతకు చేరుస్తూ....
  • ఆన్‌లైన్‌లో రక్తదానం చేయిస్తూ...
  • పైసా ఖర్చులేకుండా అందరికీ బాసటగా నిలుస్తూ....

వివిధ సందర్భాలలో క్షతగాత్రులైన వారికి.. అనేక ఆప రేషన్‌లప్పుడు అవసరమయ్యే రక్తం కోసం ఉరుకులు.. పరుగులు తీసే పని లేకుండా కేవలం క్లిక్‌ ద్వారా రక్తదాత మన చెంతకు చేరే విధంగా అం తర్జాలం ద్వారా రక్తదా తలకు సమాచారం అందించి ఇప్పటికి యాభైవేలమందికి పైగా ప్రాణాలను కాపాడి.. రక్తదానాన్ని ఓ మహొద్యమంగా ... జనచైతన్య కల్గించే దూసుకుపోతున్నారు ఆ యు వకులు. తాము ఏర్పాటు చేసుకున్న ూూూ.ౌస|nd2షూూుసష.ుసగ -వబ్‌ సైట్‌ ద్వారా వాడవాడలా విస్తరిస్తూ... అందరి ప్రశంసలూ పొందుతున్నారు.
ఈ సమాజానికి మనం ఏం చేస్తున్నాం... అని ఆలోచించడం మానేసి...ఈ సమాజం నాకేమిచ్చిందన్న భావన ఎక్కువై పోవ టంతో సామాజిక పరంగా అనేక సమస్యలు వస్తునే ఉన్నాయి. ఎవరెలా పోతే మాకేం... నేను... నాకుటుంబం... బాగుంటే చాలు అనుకునేవారే ఎక్కువ ఈరోజుల్లో ... సాటి మనిషి ప్రమాదానికి గు రైతే... చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే... ఆదుకోవాల్సిన బాధ్యత మనదన్న భావననుండి మనకేమైపోతుందో అన్న భావ నతో మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నారు కొందరు.
అలాగని ఈ సమాజంలో అందర్నీ ఒకే గాటాన కట్టేయలేం... నన్నీ స్థితికి తీసుకువచ్చిన సమాజానికి ఎంతో కొంత మంచి చేయాలని ఆలోచించే వారూ ఉన్నారు. అయితే యువతరంలో ఈ సమా జానికి ఏదో ఒకటి చేయాలన్న తపన చాలానే ఉంది. అయితే చిన్న పాటి నిర్లిప్తతలతో చేయాలనుకున్న పనిని ముందుకు తీసుకుపోలేని వారు కొందరైతే....నలుగురూ మెచ్చేలా సేవ చేయాలి అని నిర్ణ యించు కున్నా... దానికి ఓ కార్యరూపం ఎలా ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడేవారు మరికొందరు. రంధ్రా ణ్వష ణలు జరిపి దాని ద్వారా లబ్దిపొందుతున్నట్లు జరిగే దుష్ప్రచారానికి భయపడి సేవలం దించేం దుకు వెనుకడుగు వేసేవారు మరికొందరు. కొంత మంది యువకులు... భావన, నవజీవన నిర్మాతలు... అంటూ మహాకవి శ్రీశ్రీ చేసిన ప్రశంసలు నిజంగా ఆయువకులకు వర్తిస్తాయి. సమయా నుకూలంగా రక్తం అందక ప్రాణాలు అనంత వాయువుల్లో కల్సిపో తున్న వారిని కాపాడేందుకు ఐదుగురు యువకులు చేసి చిరు ప్రయత్నం నింగికెగిసింది.
కృషి, పట్టుదల, కార్యధీక్ష, ఉంటే సమాజానికి తమ వంతు సహా యం చేయగలం అని నిరూపించారు ఈ ఐదుగురు యువకులు. ూూూ.ౌసnd2షూూుసష.ుసగ వెబ్‌సైట్‌ ద్వారా అవసరమైన అన్ని ప్రాంతాలలో సామాన్యులే కాదు... అన్ని తరగతుల ప్రజలు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా రక్తాన్ని పొందేందుకు గానీ... దాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ... ఎందరి ప్రాణా లనో కాపాడేందుకు వారు చేస్తున్న ప్రయత్నం అందరి మన్నలను పొందుతోంది.
గుంటూరు జిల్లాకు చెందిన సాప్ట్‌వేర్‌ ఉద్యోగులు 2005 సంవత్స రంలో వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. షరీఫ్‌, నవీన్‌, ఫణీ, కోటేశ్వ రరావు, మురళీకృష్ణ మిత్ర బృందం ఆలోచనల నుండి పుట్టిన ఈ అంతర్జాలం ఎందరి ప్రాణాలనో నిలుపుతోంది. ప్రారంభించిన తొలినాళ్లలో ఈ సైట్‌ పై సన్నిహితులకు, స్నేహితులకు, తమ కుటుం బ సభ్యులకు బంధుమిత్రులకు ఇలా అందిరికీ సమాచారం అందిస్తే... అందులో బ్ల్లడ్‌ డోనర్స్‌గా చేరింది కేవలం 250 మంది మాత్రమే... అయినా వారు నిరుత్సాహపడిపోలేదు... తాము అనుకున్న లక్ష్యాలను చేరేందుకు సమయం చిక్కినప్పుడల్లా... ఆన్‌లై న్‌లో రక్తదానం చేయటం ఎలాగో... కావాల్సిన రక్తాన్ని పొందటం ఎలాగో అవగాహన కల్పిస్తు ముందుకు సాగారు. దీంతో నేడు ఈ వెబ్‌ సైట్‌లో రక్తదాతల సంఖ్య లక్ష పైచిలుకు దాటడం వారి నిర్విరామకృషికి నిదర్శనంగా చెప్పాలి.
విదేశాల్లో సాప్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పని చేస్తున్న తన స్నేహితులతో కల్సి హైదరా బాద్‌ వెబ్‌సైట్‌ డిజైనర్‌గా పని చేస్తున్న షరీఫ్‌ రక్తదానంపై అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఆన్లైన్‌ బ్లడ్‌ డొనేషన్‌ సైట్‌ దేశ వ్యాప్తంగా విస్తరించి... ఎందరో సభ్యుల్ని చేర్పించేలా చేసింది.
దేశ వ్యాప్తంగా...వాలంటీర్లు
వెబ్‌సైట్‌ ద్వారా స్వచ్ఛంద రక్తదాన సేవలందిస్తున్న ఈ సంస్ధకు మన రాష్ట్రంలో 30వేల పై చిలుకు సభ్యులున్నారు. ఈ ఫ్రెండ్సు 2 సపోర్ట్‌ వెబ్‌సైట్‌ సేవలు ఆంధ్ర ప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. వినేందుకు వింత గొలుపుతున్నా... జరు గుతున్న వాస్తవాన్ని గమనించి స్వచ్చంధంగా రక్తాన్ని ఇచ్చేందుకు ముందు కొచ్చేవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుండటంతో షరీఫ్‌ ఆతని మిత్ర బృందంలో ఎనలేని ఉత్సాహాన్ని నింపింది. ఈ క్రమంలోనే తమి ళనాడు, కర్నా టక, మహారాష్ట్ర, కేరళా, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా, ఉత్తర్రపదేశ్‌, గుజరాత్‌, రాజ స్థాన్‌లకి విస్తరించి అక్కడ సభ్యులతో... వెబ్‌సైట్‌పై అవగాహన కల్పించేందుకు, రక్తదాన అవసరంపై పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలలో వాలంటీర్లుగా సీనియర్‌ సిటిజన్స్‌, డాక్టర్లు, సాప్ట్‌వేర్‌ ఉద్యోగులు, కళాశాల విద్యార్ధులు ఇలా సమా జంలో ప్రతి ఒక్కరినీ భాగస్వా మ్యం చేసింది. వీరంతా ఆయా ప్రాంతాల్లో వారు రక్తదానం పై అవేర్‌నెస్‌ క్యాంప్స్‌ నిర్వహిస్తూ, సైట్‌ద్వారా బ్లడ్‌ డోనర్స్‌, సభ్యులుగా చేర్పిెంచే ప్రయ త్నాలు చేస్తున్నారు.
రక్తదానం ఇలా....
నిజానికి శరీరం నుండి తీసిన రక్తం 21 రోజులు మాత్రమే నిలవ చేయగలం తరు వాత దానిని పయోగించడం ప్రమాదకరమన్నది వైద్యనిపుణుల హెచ్చరికలే త మ వెబ్‌సైట్‌లో రక్తదానం ఇచ్చే వారికి ఉపయోగపడుతున్నట్లు చెప్తున్నారు నిర్వా హకులు. ఈ వెబ్‌ సైట్‌లో ఎవరైనా, ఎక్కడివారైనా.. ఇందులో సభ్యుడిగా చేరి, తానున్న చోట ఎవరికై, ఎక్కడైనా రక్తం అవసరమైన వారికి రక్తదానం చేసే అవకాశాన్ని కల్పించడం ఇక్కడి విశేషం. దాతలు నివసించే ప్రాంతం, జిల్లా వివరాలు, బ్లడ్‌ గ్రూఫ్‌, ఫోన్‌ నంబర్‌ వివరాల పొందపరుస్తారు... ఇక రక్తం కావాల్సిన వారు ఈ వెబ్‌ సైట్‌లో ఆయా ప్రాంతాలు, బ్లడ్‌ గ్రూప్‌ వారిగా ఉండే బటన్‌ని క్లిక్‌చేస్తే చాలు సమీప ప్రాంతలలోని దాతల వివరాలు ఫోన్‌, నెంబర్లు క నిపిస్తాయి. దీని ఆధారంగా రక్తదాతలని పిలుచుకుని బాధితుల ప్రాణాలను కాపాడుకునే వీలుంటుంది. అంతే కాదు.... రక్తం కావాలనుకునేవారు ఈ వెబ్‌సైట్‌లో తామున్న ప్రాంతం, కావాల్సిన రక్తం గ్రూప్‌ తదితర వివరాలు అ భ్యర్ధన చేస్తే చాలు... సంబంధిత బ్లడ్‌ గ్రూప్‌, అందుబాటులో ఉండే దాతలకు సమాచారం అందించి రక్తాన్ని ఇచ్చేలా చూస్తారు.
అవార్డులు, రివార్డులు...
ఫ్రెండ్స్‌ టూ సపోర్ట్‌ డాట్‌కామ్‌ ద్వారా యువకులు చేస్తున్న కృషి అం తర్జాతీయ స్ధాయిలో గుర్తింపు వచ్చింది. ఇంటర్నెట్‌ ద్వారా సమాజ సేవలో వినూత్న కలిగి ఉండడం, అధికంగా డోనర్లు నమోదు కావడంపై యూనిసెఫ్‌ నిర్వహించిన యూత్‌ వరల్డ్‌ సమ్మిట్‌లో అవార్డు పొంది ంది. లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కింది.
తొంభై వేలకు పైగా సభ్యులు..
ప్రస్తుతం 90 వేల డోనర్లు, దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల నుంచి దాతలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రతి రోజు 10నుండి 20 మంది వెబ్‌సైట్‌ ద్వారా రోగులు దాతలు నుండి రక్తాన్ని పొందుతున్నారు. రక్తాన్ని ఇచ్చిన సదరు దాత పేరు 90 రోజుల వరకు సైట్‌లో కనిసించవు. మూడు నెలల తరువాత ఎస్‌ఎంఎస్‌ ద్వారా సభ్యుడు పేరును నమాెెదు చేసుకోవాలని గుర్తుకు చేస్తూ, సందేశాన్ని కూడా పంపిస్తుంది.
రక్త వ్యాపారం చూడలేక...
బ్లడ్‌ బ్యాంకులంటే రక్తాన్ని వ్యాపారంగా మార్చేసి... వేలల్లో నిర్వహణ ఖర్చు లంటూ వసూలు చేస్తున్నారు. అసలే కష్టా ల్లో ఉన్న వారు... వారు అడిగినంత ఇచ్చు కుని తమ వారి ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్న ఘటనలు... నేను చూసాను ఆ కోణంలోనే మిత్రులతో ఆలోచించి ఈ తరహాలో వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసాం....
కోటేశ్వరరావు, యు.ఎస్‌.ఎ.

అవసరమైన రక్తం దొరక్క
మన చుట్టూ ఉన్న వారిలో కొందరు ఊహిం చని విధంగా క్షతగాత్రులైనప్పుడు అవ సరం అయిన రక్తం తగిన మోతాదులో దొరక్క మర ణాల పాలవుతున్న వారి సంఖ్య పెరు గుతున్న ట్లు వచ్చిన కథనాలు మా మీద తీవ్ర ప్రభావం చూపాయి. ఆ క్రమంలోనే రూపొం దించిన వెబ్‌సైట్‌ మంచి ఫలితాలు అందివ్వటం ఆనందంగా ఉంది.
- మురళీకృష్ణ , మలేషియా
సరిగా అందుతుందో లేదో

రక్తదానం చేయాలని ఉన్నా... అది నిజమైన బాధితులకు సరిగా అందుతుందో లేదో అన్న ఆం దోళన చాలా మందిలో ఉం టుంది. ఎం దు కంటే సేకరిం చిన రక్తం సకాలంలో వాడక కొం త, అవగాహన లేమితో మ రికొం త పా డవుతోంది. ఇలాంటి పరి ణామాలనుంచి త ప్పించి కా వాల్సిన గ్రూప్‌ రక్తాన్ని నేరుగా దాతే వచ్చి అందిస్తే... ఎలా ఉంటుందన్న ఆ లోచనలోంచి పుట్టిన వెబ్‌సైట్‌ నేడు దశ దిశలా వ్యాప్తి చెందిన ఆనందానికి మించి ఎందరి ప్రాణాలో కాపా డగలుగుతున్నామన్న ఆనందం మాకు ఎక్కువగా ఉంటోంది.
- నవీన్‌ రెడ్డి, ఫణీ సుందర్‌, యుఎస్‌ఏ

సామాజిక బాధ్యతగా
దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ ఘటనల్లో క్షతగాత్రులకు, వివిధ చికిత్సల కోసం ప్రతి రో జు సగటున రెండు కోట్ల యూనిట్ల రక్తం అవసమవుతోంది. అయితే కేవలం నలభై లక్షల యూనిట్ల రక్తం మాత్రమే అందు బాటులో ఉంటోంది... దీంతో రక్తం అందక చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోం ది. అం దువల్లే సామాజిక బాధ్యతగా వెబ్‌సైట్‌ ద్వారా స్వచ్ఛంద రక్తదానాన్ని చేయడం ప్రారంభించాం.. ప్రతి ఒక్కరూ ప్రెండ్స్‌టూ సఫోర్ట్‌ ఆర్గనైజేషనలో డోనర్‌ సభ్యుడుగా నమోదయితే మరిందరికి ప్రాణదానం చేసినవారమవుతాం.
- షరీఫ్‌, వెబ్‌సైట్‌ నిర్వాహకులు, హైదరాబాద్‌