19, మార్చి 2011, శనివారం
కావాల్సిన చీఫ్ బట్టి రేటు ఫిక్స్...
జగన్ వర్గం ఎమ్మెల్యేల్లో చీలిక?
భలే మొగుడు-భలే పెళ్ళాం సెన్సార్ కట్స్
భలే మొగుడు భలే పెళ్ళాం చిత్రం ఉషాకిరణ్ క్రియేషన్స్ పతాకాన నిర్మితమయింది. రాజేంద్రప్రసాద్, సహాసిని, నరేష్, కావేరిఝా, ఝాన్సీ, రఘబాబు, రజిత, రమ్యశ్రీ ముఖ్యపాతల్రు పోషించారు. గంగోత్రి విశ్వనాథ్ డైలాగ్స్, ఇ.ఎస్.మూర్తి సంగీతం, మురళి రామయ్య కూర్పు నిర్వహించిన ఈ చిత్రానికి దర్శకుడు దినేష్ బాబు. నిర్మాత జొన్నాడ రమణమూర్తి.
5 గురు సభ్యులతో కూడిన ఇసి ఈ చిత్రాన్ని చూసి 8 కట్స్తో 0.13 అడుగుల ఫిలిం కత్తిరించి 11-1-11న ‘యు’ సర్టిఫికెట్ జారీ చేసింది. 14 రీళ్ళ – ‘భలే మొగుడు భలే పెళ్ళాం’ చిత్రం 25-2-11 విడుదల అయింది.
1. ఒకటి రెండు రీళ్ళలో ‘దానికి బ్లౌజ్ ఎందుకు’ అని ఉన్న డైలాగ్లోని ‘బ్లౌజ్’ని కత్తిరించి శబ్దం వినబడకూడదన్నారు.
2. ఒకటి రెండు రీళ్ళలో ఒక దృశ్యంలో వచ్చిన టి.వి.9, టి.వి పదాలను సౌండ్తో సహా తొలగించారు.
3. ఒకటి రెండు రీళ్ళలో వున్న ‘ఆడంగి’ పదాన్ని శబ్దంతో సహ తొలగింప చేసారు.
4. ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అనేది చూపమన్నారు జనరల్గా.
5. మూడు నాలుగు రీళ్ళలో ‘కోర్టుకి అండర్వేర్’ లేకుండా వెళతావా’ అనే డైలాగ్లోని ‘అండర్ వేర్’ పదం తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.
6. మూడు నాలుగు రీళ్ళలో చిత్రీకరించిన సన్నివేశంలో గల ఏ వర్కన్నా ఎక్సట్రా చార్జి ఇస్తే చేస్తావా’ అనే డైలాగ్ని శబ్ధంతో సహా తొలగించారు.
7. అయిదు ఆరు రీళ్ళలో టీవీ నటి చేతులు పిరుదుల్ని రాజేంద్ర ప్రసాద్ తాకే దృశాలను ఫ్లాష్లా చూపమనడం ద్వారా 0.05 అడుగులు నిడివిగల ఫిలిం కత్తిరింపుకు గురి అయింది.
8. ఏడు ఎనిమిది రీళ్ళలో రాజేంద్రప్రసాద్, సుహాసిని ముద్దులిచ్చుకునే దృశ్యాలన్ని ఫ్లాష్లా చూపమనడం ద్వారా 0.08 అడుగుల ఫిలిం కత్తిర పాలయింది.
15, మార్చి 2011, మంగళవారం
పాటిల్ కాంగ్రెస్ అభ్యర్థా? కాదా?
ఒకవేళ జేసీ వర్గీయులు అందరూ ఎన్నికలను బహిష్కరించినా.. టీడీపీకి చెందిన 150 మందికిపైగా ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థికి బాహాటంగా మద్దతు ఇస్తున్నారని పాటిల్ విజయం సాధించడం తథ్యమనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది.
తెలంగాణ పేరుతో కేసీఆర్ దండుకున్నారు
14, మార్చి 2011, సోమవారం
జగన్ అక్రమ ఆస్తులపై విచారణకు ప్రధాని సానుకూలం
అనంతరంఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు, ఎంపీ మైసూరారెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ డిమాండ్పై ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. జగన్కు చెందిన పార్టీని చూసి భయపడే స్థితిలో లేమని అన్నారు. జగన్ అక్రమ ఆస్తులపై తెలుగుదేశం పార్టీ ఎప్పటినుండో పోరాడుతుందని, జగతి పబ్లికేషన్స్ లో వాటాలు పూర్తిగా అక్రమమైనవని అన్నారు. అందులో ఎవరెవరు ఎంత పెట్టారో వారి వారి వాటాలు బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ అక్రమ ఆస్తులపై ఆదాయపన్ను శాఖ ద్వారా విచారణ జరిపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారని అన్నారు.
మళ్లీ ప్రతిష్టిస్తే... మేం ఒప్పుకోం..
సోమవారం లోయర్ ట్యాంక్ బండలోని కట్టమైసమ్మ దేవాలయం నుండి పోతన విగ్రహం వరకు స్వాభిమాన్ యాత్ర జరిపిన ఆమె అనంతరం మీడియాలో మాట్లాడుతూ....తెలంగాణ వైతాలికుల విగ్రహాలు లేకుండా వేరే విగ్రహాలు ప్రతిష్టించకూడదని...కాదని సిద్దపడితే మరోమారు విధ్వంసం జరిగినా ఆశ్చర్యపోన్నఖ్ఖరేదని వ్యాఖ్యానించారు.
600 మంది తెలంగాణా కోసం ప్రాణ తాగాలు చేసే... కనీసం పలుకరించిన పాపాన పోని సీమాంధ్ర నేతలు జరిగిన విగ్రహాల విధ్వంసాన్ని మాత్రం అతిగా చూపుతున్నారని... తెలంగాణాకు వ్యతిరేకంగా పలు మీడియా సంస్ధలు చేసున్న వాఖ్యల వల్లే నాడు మీడియా ప్రతినిధులపై దాడి జరిగిందని... తాను భావిస్తున్నట్లు చెప్పారు