30, నవంబర్ 2012, శుక్రవారం

 అందుకే.. ఆంగ్లం....

ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి.. బెంగళూరులో ఆదివారం జరిగిన సన్నాహక సమావేశ ఆహ్వాన పత్రికను తెలుగులోనే ముద్రించామని తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎ.రాధాకృష్ణరాజు పేర్కొన్నారు. తెలుగు రాని మీడియా కోసం, స్థానిక ప్రజాప్రతినిధుల కోసం కొన్ని ఆహ్వానపత్రికలను ప్రత్యేకంగా ఆంగ్లంలో ముద్రించామని, మిగతా వారికి తెలుగులో ముద్రించిన ఆహ్వానపత్రికలే పంపామని ఆయన వివరించారు. ఈ ఆహ్వానపత్రికపై 'తెలుగు ముక్క ఉంటే ఒట్టు..!' అంటూ ఆంధ్రజ్యోతిలో గురువారం ప్రచురితమైన కథనానికి ఆయన వివరణ లేఖను పంపారు.