14, ఏప్రిల్ 2011, గురువారం

‘అంకుశం’ రామిరెడ్డి మరిక లేరు

గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సినీ నటుడు రామిరెడ్డి గురువారం కన్నుమూశారు. . సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆయన మరణిం చినట్లు విదులు చెప్పారు.
 ‘అంకుశం’ సినిమాలో విలన్ గా అశేష ఆంధ్ర ప్రేక్షకుల మన్నన పొందిన రామిరెడ్డి ప్రతి నాయకుడిగా
 అమ్మోరు, అనగనగా ఒకరోజు, జగదేక వీరుడు అతిలోక సుందరి, క్షణక్షణం, పెద్దరికం, గాయం,  ఓసేయ్ రాములమ్మ సినిమాల్లో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. రామిరెడ్డి మృతి పట్ల తెలుగు చిత్రసీమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.

మాస్ సినిమా డైరెక్ట్ చేస్తానంటున్న సిమ్రాన్

లుగు, తమిళ భాషల్లో కొన్నేళ్ల పాటు నెంబర్ వన్ కథానాయికగా రాణించిన సిమ్రాన్ సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సస్స్ కాకపోవటంతో దర్శకురాలిగా మారుతోంది. పనిలో పనిగా తనే నిర్మాతగా కూడా మరి ఇటీవల హిందీలో హిట్ అయిన చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయాలనుకుంటోంది. అయితే, దీనికి వేరే దర్శకుడిని ఎంపిక చేయలనుకొంటూంది

అలాగే, మరో సినిమాకి తనే దర్శకత్వం వహిం చేందుకు సన్నాహాలు శేస్తున్న ఈ అమ్మడు ఇన్నాళ్లూ కమర్షియల్ చిత్రాలలో తను పోషించిన మాస్ పాత్రలే ప్రధానంగా మాస్ ప్రేక్షకుల టేస్ట్ తనకు తెలుసనీ, తన సినిమా కూడా కమర్షియల్ పంథాలోనే ఉంటుందనీ సిమ్రాన్ చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కథ రెడీ అవుతోందట ఎనీ హౌ సిమ్రాన్ సక్సస్స్ ని కోరుకొండ మనం కూడా ...

రీమేక్ ల 'రాణి' గా మారుతున్నా త్రిష

చెన్నయ్ ముద్దుగుమ్మ త్రిషకు ఈమధ్య రీమేక్ ల కథానాయికగా పేరు వస్తోంది. ఎందుకంటే, ఇప్పుడు తనెక్కువగా రీమేక్ సినిమాలలోనే నటిస్తోంది. ఈ రోజు రిలీజ్ అవుతున్న 'తీన్ మార్' హిందీలో వచ్చిన 'లవ్ ఆజ్ కల్' సినిమాకు రీమేక్ కాగా, ప్రస్తుతం తను వెంకటేష్ తో చేస్తున్న సినిమా మలయాళంలో వచ్చిన 'బాడీగార్డ్' సినిమాకు రీమేక్. ఇదిలా ఉంచితే, తమిళంలో తాజాగా మరో రీమేక్ సినిమా ఆఫర్ కూడా త్రిషకు వచ్చింది. ఇటీవల హిందీలో వచ్చిన 'బ్యాండ్ బాజా బారత్' హిట్ సినిమాను యూటీవీ మోషన్ పిక్చర్స్ సంస్థ తమిళంలో రీమేక్ చేస్తోంది. ఒరిజినల్ లో అనుష్క శర్మ పోషించిన శృతి కక్కర్ పాత్రను త్రిషకు ఆఫర్ చేశారట. త్రిష కూడా ఇందులో నటించడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది.

కృష్ణ వంశీ ట్రేడ్ మార్క్ సినిమా 'మొగుడు'

ప్రేక్షకుల్ని ఆకర్షించడంలో ఈ మద్య కృష్ణ వంశీ బాగా వెనిక బడి పోయాడు. ఇంతకు ముందు మాస్ ని దృష్టిలో పెట్టుకొని తీసిన 'మహాత్మ' చిత్రం కమర్షియల్ గా సక్సెస్ కా క పోవటంతో మళ్ళి తన ఫ్యామిలీ డ్రామాలకు తెర లేపాడు.. అందులో భాగంగానే గోపీచంద్ హీరోగా ఈసారైనా హిట్ మూవీ అందించాలని ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా 'మొగుడు' చిత్రాన్ని రూపొందిస్తున్నాడట.

గతంలో తానుఅందించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్.. నిన్నే పెళ్లాడతా, మురారి, చందమామ, సూపర్ హిట్ అయ్యాయి అలా ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తీయడంలో వున్న తన అనుభవాన్ని ఇక్కడ కూడా ఉపయోగించి, హిట్ కొట్టాలనుకుంటున్నాడని టాలీవుడ్ సమాచారం!

ఎయిర్ పోర్టులో ప్రీతి బూతు పురాణం

వెంకి, ప్రిన్స్ మహేష్ సరసన నటించి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందిన సొట్టబుగ్గల భామ బాలీవుడ్ తార ప్రీతిజింటాను చంఢిఘర్ ఎయిర్పోర్ట్లో అధికారులు అడ్డుకొన్నారు. . కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ భాగస్వామి కూడా ఐన అమ్మడు ఎవరో తమకు తెలియదనడంతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ గుర్తించక పోగా అడ్డగించి ఐడీ కార్డును చూపించాలనికోరడంతో జింటాకు, ఎక్కడో చిర్రెక్కింది. అంతే.. ఐడీ కార్డును చూపడానికి జింటా మొండికేసి.. నోటికొచ్చిన బూతులతో సీఐఎస్ఎఫ్ అధికారుల తో వాగ్వాదం కి దిగింది. విషయం ముదిరి వివాదస్పదమౌతుందని గ్రహించిన ఉన్నతాధికారులు కలుగచేసికొని పరిస్థితిని చక్కదిద్దుతూ.. సెలబ్రిటిలకు, సాధారణ ప్రజలకు నియమాలు వేర్వేరుగా వుండవని కాస్త జింతాకూ క్లాసు పీకారు. దీంతో ఐడీ కార్డును చూపీ విమానం ఎక్కేయడంతో అక్కడ ప్రీతి బూతు పురాణానికి తెరపడింది.