19, జనవరి 2011, బుధవారం

తెలంగాణ కోసం సీపీఐ మరో ప్రత్యేక పోరాటం

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ పోరాటానికి సీపీఐ ప్రత్యేక కార్యచరణతో సిద్ధమవుతోం దని ఆ పార్టీ జాతీయ సమితి సభ్యుడు, శాసనసభా పక్షనేత గుండా మల్లేశ్ చెప్పారు.
వచ్చే పార్లమెం ట్ బడ్జెట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 20వ తేదీన తె లంగాణ వ్యాప్తంగా అన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల ఎదుట సామూహిక నిరాహార దీక్షలు, 24న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్‌ల ఎదు ట సామూహిక ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

నేను జగన్ వెంటే అంటున్న కాటసాని

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రిమండలిలో మంత్రి పదవి ఆశించినా దక్కని కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ఆపై రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల క్యాబినేట్లలోను స్థానం దక్కకపోవడంతో తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని చెప్తూనే... తాజా రాజకీయ పరిణామాలతో జగన్ వెంట నడవాలని నిర్ణ ఇంచు కొన్నారు .

కాంగ్రెస్ పార్టీ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొం దినా క్రియాశీల స్థానం లేదన్నారు. రెకమెండేషన్లు నడిపేవారికే ఈ ప్రభుత్వంలో పదవులు దక్కుతాయన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకు ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెంట వెళ్లాలని భావిస్తున్నట్లు చెప్పారు.

ఉస్మానియా మళ్లీ ఉద్రిక్త0

రేపటి నుంచి జరగవలసిన ఓయు పిజి పరీక్షలు యథాతథంగా జరిపేందుకు రేపటి నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఓయు పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించారు.
ఐతే ఓయూ పీజీ పరీక్షలను వాయిదా వేయాలంటూ విద్యార్థులు వీసీ ఛాంబర్‌ వద్ద ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అక్కడినుంచి తరిమేసే ప్రయత్నం చేశారు. విద్యార్థులు రాళ్ల దాడికి దిగారు. దీంతో . పోలీసులు లాఠిచార్జి చేసి బాష్పవాయువు ప్రయోగించారు. తెలంగాణ వచ్చేవరకు పరీక్షలు రాయమని విద్యార్థులు ఆందోళనకు దిగటంతో
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఎఐఎడిఎంకెలో నటుడు కార్తీక్

నటుడు కార్తీక్ ఎఐఎడిఎంకె పార్టీ అధ్యక్షురాలు జయలలిత సమక్షంలో కార్తీక్ ఈరోజు ఎఐఎడిఎంకెలో చేరారు. ఈ సందర్భంగా రాజకీయాల్లో అనివార్య పరిస్తుతులని సమర్థవంతంగా ఎదుర్కోగలనన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఏడున భారత్ బంద్


మేం మళ్ళి వచ్చేసాం ...

ఇన్నాళ్ళు దీక్షా ప్రపంచంలో ఉన్న మేం మళ్ళి వచ్చేసాం ... ఎప్పటిలనీ ఆదరిస్తారని ఆసిస్తూ...
సత్య, గోపాల్