29, జనవరి 2011, శనివారం

"మిరపకాయ్"2 వీక్స్ కలెక్షన్స్

యెల్లో ఫ్లవర్స్ పతాకంపై, సెన్సేషనల్ హీరో మాస్ రాజా రవితేజ హీరోగా నటించగా, రీచా గంగోపాథ్యాయ, దీక్షాసేథ్ హీరోయిన్లుగా, "షాక్"ఫేం హరీష్ శంకర్ దర్శకత్వంలో, రమేష్ పుప్పాల అనే నూతన నిర్మాత నిర్మించిన పక్కా మాస్ ఎంటర్ టైనర్ చిత్రం "మిరపకాయ్".ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించి,హీరో రవితేజ సినీ కెరీర్‍ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందనీ, అందుకు రుజువుగా ఈ చిత్రం రెండు వారాల కలెక్షన్లను నిర్మాత మీడియాకు అందజేశారు.

ఆ వివరాలు మీకోసం.
నైజాం - 6,75,23,000
సీడెడ్ - 4,30,04,000
కృష్ణా - 1,40,00,000
గుంటూరు - 2,01,00,000
నెల్లూరు - 92,00,000
వైజాగ్ - 2,10,08,000
ఈస్ట్ - 1,60,20,000
వెస్ట్ - 1,30,15,000
ఓవర్సీస్ - 2,40,60,000
కర్ణాటక - 1,64,25,000
ఒరిస్సా - 28,85,000
తమిళనాడు - 32,00,000
ఈ విధంగా "మిరపకాయ్" చిత్రం రెండు వారాలకు గాను 25 కోట్ల,నాలుగు లక్షల,నలభై వేలు వసూలుచేసిందని ఈ చిత్ర నిర్మాత రమేష్ పుప్పాల తెలియజేస్తూ, ఇమతటి ఘనవిజయం అందించిన ఆంధ్ర ప్రేక్షకులకూ, తమ హీరో రవితేజకూ, దర్శకుడు హరీష్ శంకర్ కూ తమ కృతజ్ఞతలు తెలియజేశారు.

బొడ్డులో చీమ సుందరికి మొగుడు కావాలట

సింహాద్రిలో జూనియర్ ఎన్టీయార్ చేత బొడ్డులో గండు చీమల్ని తోలించుకున్న రస్నా బేబి అంకితకు మొగుడు కావాలంట. కెరీర్ మొత్తం చేజేతులా సర్వనాశనం చేసుకున్న అంకిత గత కొద్ది కాలంగా అమెరికాలో స్థిర పడింది అంటూ వస్తున్న వార్తలు ఇప్పుడు నిజం అయ్యాయి.

న్యూ యార్క్ లోని ఓ లోకల్ చానల్ నడుపుతున్న మ్యాట్రిమోనియల్ ప్రోగ్రాములో ఓ జ్యూయిష్ కోటీశ్వరున్ని పడగొట్టేందుకు అంకిత ఆడుతున్న అబద్ధాలు యౌ ట్యూబ్ సాక్షిగా బయటపడ్డాయి. తనకు తాను ఓ పాపులర్ బాలివుడ్ నటినని కోటీశ్వరుడైన మొగుడి కోసం గొప్పలు బొంకిన అంకిత మగాన్నైతే పట్టిందో లేదో గాని అక్కడున్న తెలుగు వారికి మాత్రం అడ్డంగా బుక్కయి పోయింది.

ఇంతకీ ఈమె హిందీ సినిమాల్లో ఎప్పుడు నటించింది అని అందరు బుర్రలు గోక్కుంటుంటే, అంకిత పెద్ద అబద్దాలకోరు అని ఏనాడు హీరో నవదీప్ చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి. అమెరికా మొగుడేనా లేక ఇండియా వాడయినా సరిపోతుందా రస్నా పిల్లా?

తుపాకి నుంచి సేకరణ

ఈమె కూడా గర్భవతే

ఓయబ్బో ఒకప్పటి హీరోయిన్ ఆంటీలకు గర్భం సీజన్ వచ్చిపడింది. అందుకే ఒకరి వెంట ఒకరు క్యూ కట్టి మరీ ప్రెగ్నెంట్ అవుతున్నారు లేదా పిల్లలనే కనేస్తున్నారు. మొన్నే మీనా, రంభల పేర్లు వినబడితే నిన్న బాలివుడ్ పేర్లు మాన్యత, మందిరా బేడి ఇప్పుడు ప్రీతి ఝాంగియాని కూడా లిస్టులో చేరిపోయింది.

ఇంతకీ ఈ ప్రీతి ఎవరంటే పవన్ కళ్యాణ్ 'తమ్ముడు'లో డీసెంట్ యాక్టింగ్ చేసి తర్వాత బాలకృష్ణ, మోహన్ బాబు చేతుల్లో నలిగిపోయిన బ్యూటి. పర్వీన్ దబాస్ అనే వ్యాపారవేత్తను వివాహమాడిన ప్రీతికి ఇది మొదటి కాన్పు కావటంతో జాగ్రత్తగా ఉన్నానని, అందుకే డెలివరి డేట్ ఎవరికీ చెప్పటం లేదని మీడియాకి ఒప్పుకుంది. ఒకనాడు హీరోయిన్లుగా నటించిన అందగత్తెలందరికీ ఈ మధ్య అమ్మాయిలే పుడుతుండడం ఇంకో కొసమెరుపు.

బికినీకి రెడీ అవాల్సిందే

ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులు అన్నట్టు ఉత్తరాది హీరోయిన్ల మీద ఆధార పడ్డందుకు మనకు వాచిపోతుంది. మోడలింగ్ రంగం నుండి డైరెక్టుగా దిగుమతవుతున్న ముద్దుగుమ్మలు ఒడ్డు పొడుగు ఉన్నా అసలు యాక్టింగ్ స్పెలింగ్ కూడా వచ్చినట్టు అనిపించటం లేదు.

మొన్నే ఫ్రెష్షుగా దిగిన దీక్ష సేథ్ కూడా ఈ పనికిరాని లిస్టులో చేరిపోయింది. వేదం, మిరపకాయలలో చిన్న పాత్రల్లో చిట్టి పొట్టి డ్రెస్సుల్లో కనపడేసరికి విషయం ఉందని పొరపాటు పడ్డ దర్శక నిర్మాతలకు తాను కూడా 'బెబ్బే'నన్న సంగతి 'వాంటెడ్'తో చెప్పేసింది. ముఖంలో ఏ భావమూ పలకని హీరోయిన్లు అందుకునే పాత పాట స్కిన్ షో. దీక్షా సేథ్ కూడా అంగాంగ ప్రదర్శనకు మొహమాటం చెప్పే అడ్డంకులు ఏమీ పెట్టుకోవట్లేదు.

'మా అమ్మకి డబ్బులు కట్టుకోండి. నాకు బికిని చుట్టుకోండి' అంటూ అప్పుడే ఆఫర్లు మొదలెట్టేసింది. 'వేదం'లో చూపిన దానికన్నా మిగిలినవి ఏమైనా ఉంటె దర్శకులు ట్రై చేసుకోవచ్చు.

తుపాకి నుంచి సేకరణ

ఇలియానాను నానపెడుతున్నారు

అప్పుడెప్పుడో 'సలీం'లో చూసిన ఇలియానా అందాలు మళ్ళీ వీక్షించడానికి ఇంత టైం పడుతుందని ఎవరూ అనుకోలేదు. ఏడాది గ్యాప్ తీసుకున్న ఈ గ్రీకు శిల్పం మళ్ళీ రానా చేతిలో పూరీ ఉలితో చెక్కుతున్న 'నేను నా రాక్షసి'తో బయటకు రాబోతోంది. అదిగో వస్తోంది ఇదిగో వస్తోంది అంటూ రెండు నెలలుగా వెయిట్ చేస్తున్న ప్రేక్షకులకు పూరీ కనీసం ఓ ఝలక్ కూడా ఇవ్వటంలేదు.

అప్పుడో ఇప్పుడో వర్మానే ఇలియానాను గోకుతుంటే ఊహించుకోవడం తప్ప సరైన పోస్టర్ ఒక్కటి కూడా బయటకి వదల్లేదు అంటే పూరీ ఏదో పెద్ద ప్లాన్ మీదే ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. వేసవిలో విడుదల అంటూ ఇప్పటికైతే చెప్పారు గానీ మళ్ళీ ఏం తేడా చేస్తారో అని ప్రేక్షకులు అనుమానిస్తుంటే, మీకు ఇలియానాను చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవంటూ యూనిట్ సభ్యులు కూడా తమ వంతు డప్పేస్తున్నారు.

ఇంతలా ఊరిస్తూ, నానపెడుతుంటే ఇలియానా మాత్రం నాకేమి తెలియదన్నట్లుగా నవ్వేసి ఊరుకుంటోంది.

తుపాకి నుంచి సేకరణ

పవన్ కళ్యాణ్ భజన మండలి

ఫీల్డులో సీనియర్ మోస్ట్ అయినా టేస్టులో పక్కా సిల్లీ, నాటు ఫెలో అనిపించుకున్న దర్శకుడు హరీష్ శంకర్ 'మిరపకాయ'తో ఇంత పెద్ద హిట్టు కొడతానని కల్లో కూడా అనుకోలేదు. 'అసలు నేను తీసింది ఎంత. మీరు చూపిస్తున్న ఆదరణ ఎంత?' అంటూ తన సినిమాతో తనకే షాకు కొట్టినట్టు ఫీలవుతున్నాడు.

'సినిమాలో నేను చేసింది ఏమీ లేదు అంతా అన్నయ్య (చిరంజీవి అనుకునేరు కాదు రవితేజ అన్నయ్య) ఎనర్జీ మహిమే. అసలు మా అన్నయ్య అంటే. ......' అంటూ ఎక్కడ దొరికితే అక్కడ రవితేజను ఆకాశానికి ఎత్తుకుంటున్న హరీష్ దగ్గర దర్శకత్వం ఏమో గానీ తనని తాను మార్కెట్ చేసుకునే తెలివితేటలు ఎక్కువేనట. ఎప్పుడు లేనిది రవితేజకు కూడా ఓ భజన మండలిని స్థాపించిన హరీష్, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్న పవన్ కళ్యాణ్ భజన మండలిలో మొన్నే సభ్యత్వం పుచ్చుకున్నాడట.

ఒక్కసారి షూటింగ్ ముహూర్తం పెట్టారంటే అక్కడి నుండి ప్రతిరోజు సామూహిక భజనలు, హరికథలు, బుర్రకథలు రెగ్యులర్ గా నిర్వహించి 'గబ్బర్ సింగ్' అయిపోయేలోపు ఎలాగైనా భజన మండలి చైర్మన్ పోస్టు కొట్టేసి అక్కడి నుండి మెగా భజన మండలిలో ప్రవేశం కోసం దరఖాస్తు పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకున్నాడట. అంటే మిరపకాయ పబ్లిసిటిలో భాగంగా ఆల్రెడీ చాలా చోట్ల మెగా కీర్తనలు పాడేసాడు అనుకోండి.

తుపాకి నుంచి సేకరణ

గోపీచంద్, కృష్ణవంశీ - ఎవరు ఎవరిని మారుస్తారో?

ఖాళీగా కూర్చుంటే ఎంతటి వారినైనా లోకం లోకువగానే చూస్తుంది. కానీ కృష్ణవంశీ విషయంలో ఈ ఫార్ములా పని చేయదు. క్రియేటివిటి అన్న పదానికి కమర్షియల్ హంగులను జోడించడంలో తనకంటూ ఓ ముద్రను ఏర్పరుచుకున్న కృష్ణవంశీ గత కొద్దికాలంగా గడ్డు పరిస్థితినే కల్లజూసాడు.

మహాత్మా, శశిరేఖా పరిణయంలాంటి సినిమాలు తీసి ఎటూ కొరగాకుండా పోయాడు. కుటుంబ కథా చిత్రాలను, యువతను ఆకట్టుకునే చిత్రాలను, సమాజాన్ని ఆలోచింపజేసే చిత్రాలను...ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని జోనర్లలోను తన మార్క్ చూపించుకున్న కృష్ణవంశీ ఇప్పుడు ఏ కథనైనా ఒకే యాక్షన్ కథలా ఫీలయ్యే గోపీచంద్ తో సినిమా ఒప్పుకున్నాడంటే ఎలా ఉండబోతుందో అన్న ఉత్సూకత స్టార్ట్ అయ్యింది.

'వాంటెడ్'తో మోస్ట్ అన్ వాంటెడ్ హీరోల జాబితాలో చేరిపోయిన గోపీచంద్ మరి కృష్ణవంశీనే మారుస్తాడో లేక రివర్స్ జరిగే చాన్సులు ఏమైనా ఉన్నాయో మరి కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.

తుపాకి నుంచి సేకరణ

జూనియర్ ఎన్టీయార్ గుడ్డి వాడయ్యాడా?

సింహాలో నటన చూసిన తర్వాత ఒక్క బాలయ్యను చూడడానికే రెండు కళ్ళు సరిపోలేదు. అటువంటిది పరమవీరచక్రలో బాబాయ్ రావణబ్రహ్మగా పదితలకాయలు చూడడానికి ఎన్ని కళ్ళైనా చాలవు' అని పరమవీరచక్ర పబ్లిసిటి కోసం జూనియర్ ఎన్టీయార్ అన్న మాటలు నిజం అయినట్టే ఉన్నాయి.

ఎన్ని కళ్ళైనా సరిపోవు అన్న మా బుడ్డోడికి బాలయ్య దెబ్బతో ఉన్న ఆ రెండు కళ్ళూ పోయినట్టున్నాయి అంటు అభిమానులు భయపడిపోతున్నారు. అవును మరి, ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ ఉండే జూనియర్ 'పరమవీరచక్ర' విడుదలకు కొద్ది రోజుల ముందు నుండి సుమారు నెల రోజులుగా కనపడుటలేదు. అభిమానులను కనీసం బాబాయ్ సినిమా రిపోర్టు అడగడానికైనా వస్తాడనుకుంటే ఆ ధైర్యం కూడా లేకుండా పోయింది.

ఇంతకీ జూనియర్ ఎన్టీయార్ ఎక్కడున్నట్టు, అసలు కళ్లున్నాయా లేక దాసరి ధాటికి....? ఇక్కడ అంతా కుషలమే. నీ వైపు నుండి అంతా కుషలమైతే వెంటనే ట్విట్టర్ ద్వారా యోగక్షేమాలు తెలపగలవు...ఇట్లు నీ అభిమానులు. సరిపోతుందిగా బ్రదర్స్. ఎనీ డౌట్స్?

తుపాకి నుంచి సేకరణ

ఆంటీ కొత్త బిజినెస్ మొదలెట్టింది

ఆమె వయసు నలభై మూడేళ్ళు. కానీ చీర చెంగును బొడ్డులో చెక్కి ఒక్కసారి డ్యాన్సు కట్టిందంటే దద్దరిల్లాల్సిందే. ఆమే మాధురి దీక్షిత్. ఇండియన్ సినిమా చరిత్రలో ఈమె అంతటి గొప్ప డ్యాన్సర్ రాలేదు ఇక రాబోదు అన్న వాక్కు అక్షరాలా నిజం.

ఇద్దరు పిల్లల తల్లైనా ఫీల్దుని వదిలి ఉండలేక అమెరికా నుండి ముంబైలో ఊడిపడ్డ మాధురి సినిమాలను అటుంచి బుల్లి తెర మీద మాత్రం రాణించే సూచనలు కనపడుతున్నాయి. వచ్చీరాగానే ఓ రియాలిటీ షోలో ఈమె చేసిన నృత్యం మేటి కొరియోగ్రాఫర్లను సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది.

మాధురి అంతటి అల్టిమేట్ డ్యాన్సర్ లేదు అన్నది కన్ఫర్మ్ అయిపొయింది కాబట్టి ఇక రానున్న కొత్తతరాలకి మన నృత్యం పట్ల అవగాహన కలిగించేందుకు వరల్డ్ వైడ్ డ్యాన్సు స్కూళ్ళను స్టార్ట్ చేసి దీన్ని కొత్త రకం బిజినెస్ లాగా రూపొందించాలని పక్కా ప్రణాళికతో ముంబైలో వర్క్ మొదలెట్టింది. మల్లెతీగ లాంటి నడుమును మెరుపుతీగ లాగా ఊపడం చూసిన అభిమానులు ఇక మున్ముందు మాధురిలో ఓ టీచరమ్మను చూస్తారు.

సిద్ధార్థ బావ బుద్ది మారదా?

యంగ్ హీరోల్లో సిద్ధార్థది ఓ వింత స్టైల్. కొత్త దర్శకులను పరిచయం చేయటంలో అందరు హీరోలకన్నా ముందుండే ఈ బావకు ఈ మధ్య ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా తను నమ్ముకున్న సూత్రాన్ని మాత్రం వదలను అంటున్నాడు.

'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'తో ప్రభుదేవాను దర్శకుడిగా పరిచయం చేసింది మొదలు చుక్కల్లో చంద్రుడు, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్, బావ, అనగనగా ఓ ధీరుడు వరకు హిట్టైనా ఫట్టైనా కొత్త దర్శకుడు ఫార్ములా మాత్రం వదలలేదు. ఇకనైనా బుద్ది తెచ్చుకొని సీనియర్లకు కూడా చాన్సులివ్వు అని ఎందరు చెప్పినా వినకుండా '180'కి జయేంద్రని, 'ఓ మై ఫ్రెండ్'తో వేణు శ్రీరాం అనే ఇద్దరు దర్శకులని తెరకు పరిచయం చేయబోతున్నాడు.

జయాపజయాలు ఎలాగున్నా సిద్ధార్థ్ అనుసరిస్తున్న వైఖరి మాత్రం కొందరికి ఇబ్బందిగా ఉన్నా కొత్తవారికి మాత్రం ఉత్సాహంగా ఉంది. మణిరత్నం, శంకర్ బడి నుండి వచ్చాడు కాబట్టి కొత్త వారిలో ఉండే కసి పైన సిద్ధార్థకు మంచి గురి ఉంది.
తుపాకి నుంచి సేకరణ

పబ్లిక్ గా నవనీత్ కౌర్ వివాహం

2011 జనగణన గాలికొదిలేసి స్తానిక ఎన్నికలకు సిద్దమవుతున్న ప్రభుత్వం

జూన్, జూలై నెలల్లో జిల్లాపరిషత్తు, మండలపరిషత్తు, గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసిపోనున్న నేపథ్యంలో ఎన్నికలను సకాలంలోనే నిర్వహించే ఉద్దేశంతో పంచాయతీరాజ్ శాఖ సన్నద్ధమౌతోంది. ఐతే 2011 జనగణన చివరి దశకు చేరుకొన్నప్పటికీ .. పట్టించుకోకుండా 2001 గణాంకాలనే పరిగణనలోకి తీసుకొని 'స్థానిక సంస్థల' ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమౌ తుండటమే చర్చనీయంసమవుతోంది .
బీసీ, మహిళలకు రిజర్వేషన్ల శాతం పెంచాలన్న డిమాండ్‌తో పాటు జనగణన పూర్తి అయితే తమకు తప్పక ప్రాతినిథ్యం పెరుగుతుందని వివిధ వర్గాలు పెట్టుకొన్న ఆశలు ప్రభుత్వ యోచనతో అడియాశలయ్యే పరిస్థితి ఏర్పడింది. మునిసిపల్ ఎన్నికలనే ప్రభుత్వం ఎప్పుడు నిర్వహిస్తుందో తెలియని పరిస్థితి కొనసాగుతుండగా పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలకు ఆ శాఖ ఉత్సాహం చూపు తూ... 2006 రిజర్వేషన్లనే ప్రాతిపదికగా తీసుకొంటూ సన్నద్ధం అవుతుండటం విమర్శలకు దారి తీస్తోంది.

కాంగ్రెస్ ప్రతినిధులే సవాళ్ళు, ప్రతిసవాళ్ళు చేసుకోవడం పద్దతి కాదు

సోనియాను, పార్టీని వ్యతిరేకిస్తున్న జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులేనని, అవిశ్వాస తీర్మానం పెట్టాలని సవాళ్ళు, ప్రతిసవాళ్ళు చేసుకోవడం ప్రజాస్వామ్య సంప్రదాయం కాదన్నారు మాజీ మంత్రి గాదె వెంకటరెద్ది.
రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే తాను మొదటి నుంచి కోరుకుంటున్నట్లు, శ్రీకృష్ణ కమిటీ సూచించిన ఆరు ప్రతిపాదనలు కాక మరో ప్రతిపాదన లేదni, తెలంగాణపై ఏ నిర్ణయమైన కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

తెలంగాణపై కాంగ్రెస్ కొత్త నాటకం

తెలంగాణపై కేంద్రంలో కాంగ్రెస్ తెలంగాణకు అనుకూలంగా ఉంది కానీ యూపీఏ వ్యతిరేకిస్తోందని, మరో కొత్త నాటకాన్ని కాంగ్రెస్ నేతలు తెరపైకి తెస్తున్నారని టీఆర్ఎస్ శాసన సభ పక్ష ఉపనేత హరీష్‌రావు అన్నారు. వచ్చే ఫిబ్రవరి నెలలో తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతమవుతోందని, ఇందు కోసం జేఏసీ ప్రణాళికలు సిద్దం చేసిందని.. వచ్చేపార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ... సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు అన్ని రంగాల్లో అన్యాయానికి గురయ్యారని, తెలంగాణ రాష్ట్రంతోనే ఇక్కడి ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.

వసూళ్ల పార్టీగా మారిన టీఆర్ఎస్

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించేందుకు వెలసిన టీఆర్ఎస్ పూర్తి గా వసూళ్ల పార్టీగా మారిపోయిందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజు యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రతినిధులంతా రాజీనామాలు చేస్తే ప్రభుత్వం దిగివస్తుందని, తెలుగుదేశం ప్రతినిధులు రాజీనామాలు చేస్తే ఎన్నికలు తప్ప తెలంగాణ రాదని గుర్తించుకోవాలని హితవు పలికారు ఉద్యమించేది పోయి ఉద్యమాలు చేపట్టకుండా కేసీఆర్ కాంగ్రెస్ నేతలతో కుమ్ముక్కవుతూ ఉద్యమాన్ని నీరు గారుస్తున్నారని విమర్శించారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక పూర్తిగా బహిర్గతం చేయాలనీ హై కోర్టుకు

శ్రీకృష్ణ కమిటీ నివేదిక , చాప్టర్-8లో శాంతి భద్రతలకు సంబందించిన అంశాలపై సీల్డ్ కవర్‌లో ఇచ్చిన అంశాలను బహిర్గతం చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ హైకోర్టులో శుక్రవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. నిజామాబాద్‌కు చెందిన మాజీ ఎంపీ, న్యాయవాది ఎం.నారాయణరెడ్డి ఈ పిల్‌ను దాఖలు చేశారు.
శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఒక భాగాన్ని రహస్యంగా ఉంచడం సమంజసం కాదని, ఇది రాజ్యాంగంలోని అధికరణం 21కి వ్యతిరేకమని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.