30, జనవరి 2011, ఆదివారం

పరిహారం ...ఫలహారంగా .. ఆపై పరిహాసం...

వరదలు, నిషా, జల్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు అందాల్సిన ప రిహారం అనర్హులకు ఫలహారంగా .. పరిహాసంగా మారిం ది. ఆదర్శ రైతులు, గ్రామ స్థా యి అధికారులు, అధికారపార్టీ నేతలు సూచించిన వారికే పరిహారం అందడంతో అర్హులకు రిక్తహస్తం ఎదురయ్యింది. దీంతో నిజంగా నష్టపోయిన రైతులు పరిహారం అందక లబోదిబోమంటున్నారు.

నిషా, లైలా, జల్ తుపాన్ల వల్ల రైతులు తీవ్రంగా న ష్టపోయారు. పంటతో పాటు, పెట్టుబ డి మొత్తం నీటిపాలయ్యింది. ప్రభుత్వం స్పందించి ఇ న్‌పుట్ సబ్సిడీ కింద ఒక్క నంద్యాల వ్యవసాయ సబ్ డివిజన్‌కు 5,035.1 హెక్టార్ల పంట నష్టానికిగాను రూ. 1.97 కోట్ల నష్టపరిహారం మంజూరు చేసింది. అయితే నష్టపరిహా రం మంజూరు నేతల కనుసన్నల్లోనే జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇడమంటే మీకెప్పుడూ ఇచేసమనే అధికారుల మాతతీరీ నివ్వెర పరుస్తోంది.

నాయకుల్లారా ఏకం కండి గద్దరన్న పిలుపు

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కో సం తెలంగాణలోని అన్నిరాజకీయ పార్టీల నాయకుల్లారా ఏకం కండని తె లంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ రాజీనామా చేసినప్పుడల్లా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని, తరువాత పరిస్తితి భిన్నంగా ఉందని అంటూ పల్లెల్లో ఉన్న కూలీలు, కార్మికులు, కర్షకులు ఉద్యమం లో మమేకమై తెలంగాణ సాధన కో సం నాయకత్వం వహించాలన్నారు.

వాళ్ళు నలుగురు జగన్ పాలిట దుష్ట చతుష్టయమట

సోనియా , చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి, రామోజీలు దుష్ట చతుష్టయమని జగన్ వర్గం నేత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, కాంగ్రెస్‌లకు జగన్ ఫోబియా పట్టుకుందని, ఐతే సీఎం కిరణ్తో రాజీనామా చేయించి, ఆయన్నిముద్దాయిగా చేస్తూ రీ ఎంక్వైరీని చేపడితే అసత్య ఆరోపణలతో అణుగదొక్కాలని టీడీపీ, కాంగ్రెస్‌లు చేస్తున్న విషయంలో సీబీఐ చేపట్టే రీఎంక్వైయిరీకి తాము సిద్ధమేనని... తేల్చి చెప్పారు అంబటి.

అప్పట్లో వంగవీటి రంగా హత్యను చేయించింది చంద్రబాబేనని.. క్లాంటి వికి చెప్పు చేతల్లో ఉన్న మేదిఆ చేసే ఆరోపణలు జనం కూడా పట్టించుకోరని అన్నారు ఆయన.

కేసీఆర్ ఆస్తులెన్నో ప్రకటించాలి

తెలంగాణ రాష్ట్ర సాధనకై ఆవిర్భవించినట్లు చెప్పుకుంటున్న కోదండరాంరెడ్డి నాయకత్వంలోని రాజకీయ జేఏసీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పుచేతుల్లో రాజకీయ జేఏసీ నడుస్తుందని పలువురు తెలంగాణా వాదులు ఆరోపించారు.

తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో 'రాజకీయ జేఏసీ నైతికత - ప్రజాప్రతినిధుల రాజీనామా డిమాండ్'అనేఅంశంపై హైకోర్టు న్యాయవాది కె. చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమా వేశం లో పలువురు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ పప్పులు ఉడకవన్న భయంతో కావాలనే కొన్ని పార్టీలు ఈ అంశాన్ని సాగదీస్తున్నాయని ఆరోపించారు. టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు, ప్రస్తుత కేసీఆర్ ఆస్తులెన్నో ప్రకటించాలని డిమాండ్ చేశారు. కోదండరాంరెడ్డి నాయకత్వంలోని రాజకీయ జేఏసీకి సంస్థలు, పార్టీలు, కమిటీల అమోదంతో ఏర్పడనందున నైతికత లేదని అన్నారు.

తెలంగాణ కోసం ఏర్పాటుచేసిన కమిటీకి బీజేపీ లిఖితపూర్వకంగా అభిప్రాయాన్ని వెలిబుచ్చకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.

మరో 'శివ' తీస్తాడట

నాగార్జునకు 'శివ'తో ప్రాణం పోసానన్న రేర్ క్రెడిట్ తనకే దక్కిందని రామ్ గోపాల్ వర్మ పలుమార్లు చెప్పుకుంటూనే ఉంటాడు. అలాగని 'అంతం' గురించి ఎప్పుడూ మాట్లాడడు బట్ ఈసారి నాగచైతన్యకు కూడా అదే రకమైన సినిమాను అందించబోతున్నాడు వర్మ.

బెజవాడతో రామూకున్న అనుబంధంతో 'శివ'ను తన కాలేజీ కథతోనే తీసాడు ఇక ఇప్పుడు అదే రకమైన 'బెజవాడ రౌడీలు'తో నాగచైతన్యకు కొత్త లైఫ్ ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు. విజయవాడ రౌడీ రాజకీయాల నేపద్యంలో రూపొందే ఈ చిత్రంలో తన టెక్నికల్ టీంను అనౌన్స్ చేయకపోయినా నాగచైతన్య మాత్రం నా హీరో అనేలా ఓ మెసేజ్ వదిలేసాడు. కెరీర్ మొదటి రోజులతో పోల్చుకుంటే నాగార్జున కన్నా నాగచైతన్యలో ఓ వంద రెట్లు మంచి నటుడు ఉన్నాడన్న భరోసా అయితే ప్రేక్షకులకు కలిగించాడు కనక చైతన్య తన తదుపరి సినిమాలను ఇంకొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మంచిది.

తుపాకి నుంచి సేకరణ

పవన్ కళ్యాణ్ సిగ్గు పడ్డాడా?

పవన్ కళ్యాణ్ సినిమా ఆరంభం అంటేనే అభిమానులకు అదిరిపోతుంది. అలాంటిది హిందీలో హిట్టు కొట్టిన 'దబాంగ్' సినిమాను తెలుగులోకి పవనే రీమేక్ చేస్తుంటే హడావిడి మామూలుగా ఉంటుందా? అందుకే 'గబ్బర్ సింగ్' సినిమా ప్రకటన విడుదలైన పన్నెండు గంటల్లోపే పవన్ కళ్యాణ్ కొత్త పోలీస్ డ్రెస్సు కుట్టించుకోని మరీ సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసిపారేసాడు. హిందీ మాతృకలో సల్మాన్ ఖాన్ ధరించిన ఆహార్యాన్నే మక్కీకి మక్కీ దింపేసాడు గానీ పవన్ కళ్యాణ్ అన్న పేరు రెండు సార్లు కాకుండా పోస్టర్ మీద పవన్ కళ్యాణ్ ఒక్కసారైనా మొహం చూపిస్తే ఇంకా బాగుండేది అంటున్నారు అభిమానులు. ఇదేనయ్యా కొత్త రకమైన పబ్లిసిటీ అంటే చేసేదేమీ లేదు గానీ మరీ రీమేక్ కథలకు ఘోరంగా అలవాటు పడ్డానని బాధతో సిగ్గుపడిపోయి మొహం దాచుకోలేదు గదా సుమీ?

తుపాకి నుంచి సేకరణ

వర్మా సొల్లు కాన్సెప్టు

పరిశ్రమ అంటే పది మందికి ఉపాధి చూపేలాగా ఉండాలిగానీ, ఉన్నవారిని బికారీలు చేసేలా ఉండకూడదు అంటూ రోజువారీ జీతాల మీద పనిచేసే కొందరి సిని కార్మికులు రామ్ గోపాల్ వర్మ అయిదు రోజుల కాన్సెప్టు 'దొంగల ముఠా' మీద నిప్పులు చెరుగుతున్నారు.

వారాలకు వారాలు ఎవరికీ పనిలేక సినీ కార్యకలాపాలు మొత్తం స్తంభించిపోవడంతో బతుకు బండీ లాగడమే కష్టం అయ్యిందని వాపోతున్న కార్మికులకు ఇప్పుడు అయిదు రోజుల్లో అయిదుగురితో సినిమా తీస్తానని వర్మ చెబుతుంటే ఎక్కడో కాలడం సమంజసమే. 'అంతగా ఉద్ధరించాలి అనుకుంటే...నెలలకు నెలలు సినిమాలను తీస్తున్న దర్శక నిర్మాతలకు 'వన్ మంత్' క్రాష్ కోర్సు పెట్టి మెళుకువలు నేర్పించుకోవచ్చు కదా...ఈ సొల్లు కాన్సెప్టులతో మా పొట్టలు కొట్టడం దేనికో' అంటూ ఓ సినీ నిరుద్యోగి వర్మపై కాటేసాడు.

ఇప్పుడే ఇలా కోప్పడుతుంటే అసలు 'దొంగల ముఠా'లో విషయం ఎంతో చూసిన తరువాత ఇంకెలా మాట్లాడతారో మరి?

తుపాకి నుంచి సేకరణ

రవితేజ 'నిప్పా' లేక 'ఉప్పా'?

వయసు పెరుగుతున్నా హీరోయిజం, ఎనర్జీని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఒక్కో సినిమాతో స్టార్ స్టేటస్ వైపు దూసుకెళుతున్న రవితేజతో అతిత్వరలో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు గుణశేఖర్. 'వరుడు' పెట్టిన ముహుర్తంతో మూర్చపోయిన గుణశేఖర్ 'కత్తి' కోసమని లేచి నిలబడే ప్రయత్నం చేసాడు గానీ అదీ వర్క్ అవుట్ కాలేదు.

నా స్పీడును అందుకోవాలంటే వీలైనంత తొందరలో సంపూర్ణమైన స్క్రిప్టుతో రావాలని గుణకు సూచించిన రవితేజ, సినిమాకు 'నిప్పు' అన్న టైటిల్ కన్ఫర్మ్ చేసాడట. కథ ఎలాగు ఓకే అయ్యింది కాబట్టి, నా 'కత్తి'ని దొబ్బెసారు బాబోయ్ అంటూ ఆ మధ్య ఏడ్చేసిన గుణశేఖర్ ఈ 'నిప్పు'ను కూడా ఇంకెవరో ఆర్పేయకముందే, సినిమా మొదలెట్టి అది 'నిప్పో' లేక 'ఉప్పో' తేల్చేస్తే బాగుంటుంది.

తుపాకి నుంచి సేకరణ

బూజు దులుపుతున్న కమల్ హాసన్

పేరుకే లోకనాయకుడు కానీ ఈ మధ్య తన న్యాచురల్ మార్కును కోల్పోతున్న కమల్ హాసన్ మళ్ళీ ఓ పాత సినిమాను నెత్తికెత్తుకుంటున్నాడు. సుమారుగా పదిహేను ఏళ్ళ క్రితం 'మరుదనాయగం' అనే భారీ చిత్రాన్ని మొదలెట్టి మధ్యలో వదిలేసిన కమల్ ఇప్పుడు తాజాగా ఆ కథ బూజు దులిపే పనిలోపడ్డాడు.

అప్పటి ఈ సినిమా క్లిప్పింగులు, స్క్రిప్టు తెప్పించుకొని మరోసారి కొత్త నిర్మాతను వెతికిపట్టి ఈ మహాయోధుడి కథకు తెర మీద రూపం ఇచ్చే పనిలో మునిగిపోయాడు. మదురై సంస్థానం, పోలీగార్ ఉద్యమ కాలానికి సంబంధించిన ఈ కథలో అమోఘమైన హీరోయిజం ఉన్నప్పటికీ యాభై కోట్ల పైనే పెట్టుబడి కావాల్సి రావడంతో అప్పుడు సినిమాను నిలిపెసాడు. రజినీకాంత్ 'రోబో' సాధించిన విజయంతో రెండు వందల కోట్ల వరకు రిస్క్ చేసే నిర్మాతలు తమిళంలో తయారవడంతో మళ్ళీ 'మరుదనాయగం'కు కొత్త ఊపిరి ఊదేందుకు సిద్ధమయ్యాడు.

'మన్మథ బాణం' తుస్సుమంది ఇక ఈ 'మరుదనాయగం' ఏమంటుందో?

తుపాకి నుంచి సేకరణ

జిప్పులు తీసి రేప్ చేయమన్నాడు

రియాలిటీ సినిమాల పేరిట రెచ్చిపోతున్న బాలివుడ్ దర్శకుల క్రియేటివిటీకి హద్దే లేకుండా పోతుంది. అందుకు ఇది ఓ ఉదాహరణ. ర్యాగింగ్ ఆధారంగా రూపొందింది 'హాస్టల్' అనే హిందీ చిత్రం. కాలేజిలో అడుగుపెట్టిన కొత్త స్టుడెంటును సీనియర్లు గ్యాంగ్ రేప్ చేయడమనే పరమ చెత్త పాయింటుతో దర్శకుడు దీన్ని తెరకెక్కించాడు.

సినిమాలో నటించడం కాదు పాత్రలో జీవించాలి అని చెప్పే దర్శకుడి వద్ద మన్నలేక కొందరు ఆర్టిస్టులు అప్పటికే పారిపోయారు. చివరగా ఆ గ్యాంగ్ రేప్ దృశ్యం తీయాల్సిన సమయానికి పాత్రధారులని ప్యాంటు జిప్పులు తెరిచిపెట్టి కెమెరా ముందు చండాలమైన పోజుల్లో నిలబడమనేసరికి వణుకుపుట్టి, 'మనం తీసేది హిందీ సినిమానా లేక ఇంగ్లీష్ బూతు సినిమానా' అంటూ నోటికొచ్చిన బూతులు తిట్టి సదరు ఆర్టిస్టులు వెళ్ళిపోయారు.

మిగిలిన వాళ్ళతో బాడీ డబల్ ఉపయోగించి సినిమాను కంప్లీట్ చేసే మొన్నే జనాల మీదకి ఈ 'హాస్టల్'ను వదిలారు.

తుపాకి నుంచి సేకరణ

సెక్స్ చేసినా ఆమెకు సింపతీ దొరికింది

సినిమా ఫీల్డులో ఒళ్ళు అమ్ముకోవడం కామనే అయినా దొరికే వరకు ఎవరు దొంగలు కారు కాబట్టి దొరకవి వాళ్ళంతా పబ్లిగ్గా పరువు గలవారం అంటూ కలరింగ్ ఇస్తూనే ఉంటారు. భువనేశ్వరి, జ్యోతిలాంటి వారు కూడా కొన్నాళ్ళ క్రితం పోలీస్ రైడ్ లో దొరికిపోయినప్పుడు 'వీళ్ళ మొహాల్లోనే ఆ కళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది' అంటూకాట్లేసారే tha పోలీసులకు రెడ్ హ్యాండెడ్ చిక్కిందని తెలిసినప్పటి నుండి 'అయ్యో పాపం' అనే వాళ్ళు కొంచెం ఎక్కువే కనపడుతున్నారు.

సినిమాల్లో ఏడుపుగొట్టు పాత్రల్లో జీవించేసిన యమునకు ఇంకా ఇక్కడ సింపతీ ఫాలోయింగ్ ఉందంటే అవి ఆమె చేసిన 'పుట్టింటి పట్టుచీర, మామగారు, సూరిగాడు' లాంటి చిత్రాల వల్లే అనుకోవచ్చు. ఏదేమైనా తెర చాటు భాగోతాలు నడిపే నాయికామణులకు పోలీసుల కంట పడకుండా ఉండడానికి ఇంకొన్ని జాగ్రత్తలు అవసరమేనంటూ చూపిన దృష్టాంతాలు ఇవి.

వీళ్ళు అమ్ముకోకుండా బతకలేరు వాళ్ళు పట్టుకోకుండా ఉండలేరు.ఏమంటారు?

తుపాకి నుంచి సేకరణ

మామను మరిపించేసాడు

మామ నాగార్జున, తాత నాగేశ్వర్ రావుల పేరుతో సుమంత్ ఫీల్డులోకి దిగి పదేళ్ళైనా పట్టుమని ఓ పది మంచి సినిమాలు చేయలేకపోయాడు. ఒకవేళ సినిమాలు మంచివైనా ప్రేక్షకులను హాల్లకు రప్పించెంత సీను ఇతగాడికి లేకుండా పోతోంది. మామేమో తాత పాత పాటలను రీమిక్స్ చేసి కొట్టించుకుంటుంటే అల్లుడేమో మామ పాటలను వాడుకుంటున్నాడు.

'ఘరానా బుల్లోడు'లోని 'భీమవరం బుల్లోడా...' హిట్టు పాటను రీమిక్స్ చేసి 'రాజ్' సినిమాలో యూజ్ చేసుకున్న సుమంత్ అక్కడ నాగ్ కేవలం ఆమనితో మాత్రమె డ్యాన్సులు కడితే ఇక్కడ హాట్ హాట్ ప్రియమణి, విమలా రామన్లను చంకలో వేసుకొని మామను మరిపించే జోరులో కన్పిస్తున్నాడు.

తుపాకి నుంచి సేకరణ

కెరీర్ జీవన్మరణ సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతున్న వీఎన్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుంటే ఇక మాట్లాడడానికి ఏం మిగిలింది.

ఇద్దరు హీరోయిన్లను కంపు చేసి వదిలారు

'ఇన్ కం ట్యాక్స్ వాళ్ళతో పెట్టుకుంటే ఇంటి గుట్టు రట్టయింది బాబోయ్' అంటూ ప్రియాంకా చోప్రా ఏడుపులంకించుకుంది. ఒకే బిల్డింగులో తొమ్మిది ఫ్లాట్స్ కొనుక్కొని, అందులే వరసగా ఉన్న మూడింటిని కలిపి ఓ సింగిల్ లార్జ్ స్పేస్ ఫ్లాట్ చేసి విలాసవంతంగా ప్రేమికుడితో రాత్రి పగలు ఎంజాయ్ చేస్తుంటే ఇన్ కం ట్యాక్స్ వారి కన్ను పడకుండా ఉంటుందా.

సుమారుగా పదిహేను కోట్లకు పైనే నల్ల ధనం ఉందని ఇన్ కం ట్యాక్స్ వాళ్ళు డిక్లేర్ చేసినా పెద్దగా బాధ పాడనీ ప్రియాంక తన ఇంట్లో ఆ రోజు రాత్రి షాహిద్ ఉన్నాడన్న వార్తకే ఎక్కువ ప్రాముఖ్యత రావడంతో విషయం మొత్తం కంపు కంపై పరువు మొత్తం గంగలో కలిసిపోయిందని బాధ పడిపోతుంది.

అదే రోజు ఇన్ కం ట్యాక్స్ దాడుల్లో దొరికిపోయిన కత్రిన కైఫ్ తెలివిగల పిల్ల కాబట్టి తన ఇంట్లో ఏ మగాన్ని ఉంచుకోలేదు. మొత్తం మీద ఇన్ కం ట్యాక్స్ దెబ్బలకు ఇద్దరి ఇమేజి కంపు కంపైంది.

తుపాకి నుంచి సేకరణ


బీచులో పిచ్చెక్కించే నల్ల ఊర్మిళ

ఇంకా ఆగితే లాభం లేదు. 'రగడ'లో అంతగా విప్పేసి సరుకు మొత్తం బయటేసినా అనుష్క కోసమే సొల్లు కార్చేస్తున్న ప్రేక్షకుల భరతం పట్టడానికి ప్రియమణి 'రాజ్'తో చార్జ్ అయిపోయింది.

ఒక్క క్లీవీజ్ షో చేస్తే కాదంటారా ఇప్పుడు బీచులో రంగీలా ఊర్మిళలాగా కిందా పైనా అంతా చూపించి ఊపేస్తే ఏం చేస్తారో చూస్తా అంటూ 'రాజ్'లో బీచ్ సాంగ్ కోసం రెచ్చిపోయింది. సుమంత్ పై నమ్మకముంటే సరిపోద్దా? నన్ను నమ్ముకుంటే ఓపెనింగ్స్ అదర గొడతా అంటూ అప్పట్లో 'ద్రోణ'లో బికినితో నిరూపించిన ప్రియమణి మళ్ళీ అంత మించిన మసాలాతో వస్తున్న చిత్రం 'రాజ్.' ట్రేలర్లతోనే మతి పోగోడుతున్న ప్రియమణి రేపు సినిమా విడుదలయ్యాక 'నల్ల ఊర్మిళ' అన్న బిరుదు కూడా సొంతం చేసుకుంటా అంటోంది. ఇంకొద్ది రోజులాగితే ఈ ఆరబోత సంగతి ఆ ఊర్మిళ సంగతి తేలిపోతుంది.

సల్మాన్ అది పెడితే పవన్ ఇది పెట్టాడు

క్రియేటివిటీ అంటే అదే మరి. కథను, కథనాన్ని డబ్బులెట్టి ఎత్తుకొస్తే సరిపోతుందా. పోస్టర్ల దగ్గరి నుండి మొదలెట్టి పాటల వరకు, సెట్టింగుల వరకు అన్నింటినీ కాపీ కొట్టినప్పుడే 'రీమేకు' అనే పదానికి పూర్తి న్యాయం చేసినవారం అవుతాము. ఇదంతా 'గబ్బర్ సింగ్' గురించేనని మీకు అర్థం అయిపొయింది అనుకోండి.

'దబంగ్'కి రీ-ప్రింటులాగా 'గబ్బర్ సింగ్'ని తయారు చేసేందుకు పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ బాగానే కష్టపడుతున్నారు. 'దబంగ్' మొదటి పోస్టర్ విడుదలలో సల్మాన్ ఖాన్ వీపు చూపిస్తూ కళ్ళ జోళ్ళు పోలీస్ డ్రెస్ కాలర్ కి తగిలిస్తే పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' మొదటి పోస్టర్లో అదే వీపు చూపించి కళ్ళ జోళ్ళకి బదులుగా ఓ గన్నుని బెల్టులో చెక్కుకొని కనపడ్డాడు. అబ్బో ఎంత క్రియేటివిటీ...అంటూ దీనికే మనం అవాక్కయితే రేపు సినిమాలో ఇంకెన్ని చమత్కారాలు చేస్తారో అని అప్పుడే అభిమానుల్లె ఓ రకమైన దడ దడ మొదలైంది.

బయటికి కనిపించరు గానీ అందరికీ పవన్ కళ్యాణ్ కళాపోషణ మీద ఏదో ఓ మూల డౌట్ కెలుకుతూనే ఉంటుంది.

తుపాకి నుంచి సేకరణ



చాప కింద చేరిన నాగచైతన్య

మహేష్ బాబు అయిదు, పవన్ కళ్యాణ్ నాలుగు , జూనియర్ ఎన్టీయార్ మూడు, ప్రభాస్ రెండు సినిమాలు ఒప్పేసుకున్నారు అంటూ మీడియాలో ఊకదంపుడు బాగానే వేస్తున్నా సైలెంటుగా చాప కింద నీరులాగా చేరిపోతున్నాడు నాగ చైతన్య. చాక్లెట్ బాయ్ క్యారక్టర్స్ మాత్రమె కాకుండా యాక్షన్, పర్ఫార్మెన్స్ పరమైన పాత్రలను ఎన్నుకుంటూ చైతు తండ్రిలాగా విశిష్టతను చూపించ బోతున్నాడు.

సుకుమార్ 'ఐ లవ్ యు'లో లవర్ బాయ్ గా, వెంటనే అజయ్ భూయాన్ దర్శకత్వంలో యాక్షన్ హీరోగా మరో పక్క వర్మ 'బెజవాడ రౌడీలు'లో పూర్తి రగ్గుడ్ క్యారక్టర్ అటు తర్వాత తాత రామానాయుడు చిత్రంలో ఫ్యామిలీ హీరోగానే కాక 'డాన్ శీను' దర్శకుడు మలినేని గోపీచంద్ చేతుల మీదుగా ఇంకో మాస్ మసాలా చిత్రానికి కూడా చైతు ఓకే చెప్పేశాడట. సినిమా సినిమాకీ చైతు వేరియేషన్ చూస్తుంటే నాగార్జున తన కొడుకు కోసం పక్కా ప్లాన్ రెడీ చేసినట్టే ఉంది. బెస్ట్ ఆఫ్ లక్ చైతు.

తుపాకి నుంచి సేకరణ

రామ్ చరణ్ కిం కర్తవ్యం?

మొన్నేమో 'ఆరెంజ్' జ్యూస్ ఇచ్చి బొమ్మరిల్లు భాస్కర్ ను హడలెత్తించారు, నిన్నేమో 'మెరుపు' స్క్రిప్టు పేరుతో ధరణిని తరిమేశారు...మరిప్పుడు రామ్ చరణ్ ఏం చేస్తున్నట్టు? అసలు మగధీరుడి కిం కర్తవ్యం ఏమిటీ? ఈ ప్రశ్నల మీదే ఇప్పుడు సిని సర్కిల్స్ లో లోతైన డిస్కషన్స్ నడుస్తున్నాయి.

'మగధీర' అంతోటి సినిమా కాకపోయినా ఓ మోస్తారు హిట్టిచ్చే దర్శకుడు కంటికి కనపడితే వెంటనే మెగా కాంపౌండ్ వద్దకు తరలిస్తే మీకు తగిన పారితోషికాలు ఇవ్వబడతాయి అన్నరేంజులో కథల కోసం, దర్శకుల కోసం రామ్ చరణ్ వేట సాగుతోందట. సమయానికి ఒక్క బోయపాటి, పైడిపల్లి వంశీ తప్ప పెద్ద దర్శకులెవరు ఖాళీగా లేకపోవడంతో అరవం దర్శకుల మీదా ఓ కన్నేశారు. అయినా ఫలితం లేదు. వయసుకు మించిన అంచనాలతో అభిమానుల నుండి వత్తిడి, ఇమేజి చట్రంలో ఇరుక్కోకుండా ఉండేందుకు ప్రయత్నాలు, ఎటువంటి కథతో ముందుకు వెళ్ళాలో తెలియని అయోమయం...అన్నీ వెరసి రామ్ చరణ్ పైన విపరీతమైన ప్రెజర్. ఇక ఇన్ని జయించి కొత్త కథ దొరికేదేప్పుడో, కొత్త సినిమా స్టార్ట్ అయ్యేదేప్పుడో, మళ్ళీ రామ్ చరణ్ బిజీ అయ్యేదేప్పుడో?

తుపాకి నుంచి సేకరణ


చిరంజీవి మీదే కన్నేసింది

నూట యాభయ్యో సినిమా ఎప్పుడు మొదలవుతుందో పాపం చిరంజీవికే తెలియని అమాయక స్థితిలో ఉంటె అప్పుడే మెగా స్టార్ పక్కన హీరోయిన్లుగా నటించేందుకు కొందరు నాయికలు తెర వెనక ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. అన్నయ్య వచ్చేదాకా తమ్ముడు గబ్బర్ సింగ్ తో సర్దుకుందాం అనుకున్న కాజల్ అగర్వాల్ మళ్ళీ ఈ పోటీలో కూడా ముందుందట.

ఆల్రెడీ మెగా కుటుంబంలో అందరితో నటించేసిన కాజల్ ఇక మెగా స్టార్ ఒక్కడితో చేస్తే చరిత్రలో ఏ హీరోయిన్ దక్కించుకొని ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నట్టు అవుతుంది. అందుకే ఆరు నూరైనా పవర్ స్టార్ అయిపోగానే మెగా స్టార్ పని పట్టేందుకు ఇప్పటి నుండే సీక్రెట్ స్కెచులు గీస్తోందట. ఎలాగు చరణ్, అర్జున్, శిరీష్ కాజల్ క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి అప్పుడో సారి ఇప్పుడో సారి చిరంజీవికి కనపడితే ఏదో ఓ మూమెంటులో దొరక్కపోతాడా అన్నది కాజల్ కంత్రీ ప్లాన్ కాబోలు!

తుపాకి నుంచి సేకరణ

ఆరోగ్యశ్రీ దుర్వినియోగానికి నిదర్శనం

గత ఏడాది అక్టోబర్ 24న శ్రీకాకుళం జిల్లా గార మండలం కె.మత్స్యలేశం గ్రామానికి చెందిన జి.భవానీ మరణిస్తే.. రెండు రోజుల క్రితం ఆరోగ్యమిత్ర వారి ఇంటికి వెళ్లి భవాని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని వాకబు చేయటమే కాకుండా ఆరోగ్యశ్రీ పథకంలోchikitsa జరిగి ఆరోగ్యంగా ఉన్న౦దుకు ఆరోగ్యమిత్ర ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేయటం పట్ల ఆశ్చర్య పోతున్నారు జనాలు
వివరాల్లోకి వెళ్తే.. కె.మత్స్యలేశం గ్రామానికి చెందిన జి.భవానీ జ్వరంతో బాధపడు తూ శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో గత ఏడాది అక్టోబరు 18న చేరింది. 22నాటికే సుమారు ఒక లక్ష రూపాయలకు పైగా ఖర్చు కావడంతో బెబెల్తీన కుటుంబ సబ్యులు ఆరోగ్యశ్రీ కోసం దరఖాస్తు చేసారు. చికిత్సకు ప్రభుత్వ అనుమతి 23na వచ్చిన మరునాడే 24న భవాని మృతిచెందింది. మరణ ధృవపత్రాలు కూడా కుటుంబీకులకు తీసుకున్నారు. అయితే ఆమె మరణించిన వారం తర్వాత అక్టోబర్ 30న శస్త్రచికిత్స చేశామంటూ ఇప్పుడు ఆరోగ్యమిత్ర ప్రతినిధులు పరామర్శ. కి రావడం ఆరోగ్యశ్రీ పథకంలో నిధుల దుర్వినియోగానికి నిదర్శనమని విమర్శలు వినిపిస్తున్నాయి .

మృతి చెందినా..ఆరోగ్యం నయమైందని ఆరోగ్యశ్రీ డాబు

హైదరాబాద్‌లోని ఇండో అమెరికన్ ఆసుపత్రిలో పథకం కింద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోష్ఠ గ్రామానికి చెం దిన నగిరి రాజు(22) గత నెల 29న గొంతు క్యాన్సర్‌తో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇది తమ ఖర్మని సరిపెట్టుకున్న కుటి౦బీకులు సంప్రదాయం ప్రకారం అన్ని తతంగాలు ముగించి ఇప్పుడిప్పుడే మనసు కుదుట చేసుకొంటున్న నేపద్యంలో... ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి మృతుడి కుటుంబానికి ఓ లేఖ అందింది. ఆరోగ్యశ్రీతో రాజు ఆరోగ్యం నయమైందని, ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో చెప్పాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నుంచి లేఖ వచ్చింది. అంతేనా.. ఆ పథకం ఎంతో మందికి లబ్ధి చేకూర్చిందని, ఈ పథకం కిందే రాజు చికిత్స చేయడం తమకెంతో ఆనందంగా ఉందని మరీ రాశారు. ఇది చూసిన కుటుంబానికి నవ్వాలో.. ఏడవాలో అర్థం కాలేదు.

నిధులు లేకుండా బాధ్యతలు ఎందుకో?

వైద్య, ఆరోగ్య శాఖను నిధుల కొరత పట్టిపీడిస్తోంది. ఇప్పటికే పీహెచ్‌సీలకు మందుల కోసం కేటాయించిన నిధులు నిండుకున్నాయి. ఆర్థిక సంవత్సరం మార్చితో ముగుస్తుండగా, మందుల పైసలు అడుగంటాయి. ఇదిలా ఉండగా, గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, ఆరోగ్య సేవలకు, ఆరోగ్య ఉప కేంద్రాలకు కేటాయించే అన్‌టైడ్ ఫండ్‌కు ఈ ఏడాది గండిపడింది.
మంజూరైన నిధులను ఖర్చు చేయకుండానే ప్రజాప్రతినిధులు, అధికారులు అందినంత దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని మండలాల్లో పీహెచ్‌సీల అభివృద్ధి నిధులను ప్రజాప్రతినిధులు సొంతానికి వాడుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల రాజకీయ జోక్యం, అధికారుల ఒత్తిళ్ల కారణంగా నిధులు ఖర్చు కాకుండా అలాగే ఉన్నట్లు తెలుస్తోంది.

ఆరోగ్య, శానిటేషన్ పనుల కోసం ప్రతి సంవత్సరం ఆరోగ్య ఉప కేంద్రాలకు ప్రతి ఏడాది అన్‌టైడ్ నిధుల కింద రూ.10 వేలు ఇస్తున్నారు. అయితే, చల్ల వాటికి ఈ ఏడాది ఇంకా ఒక్క పైసా మంజూరు కాలేదు. కానీ విచిత్రంగా పీహెచ్‌సీలకు మంజూరవుతున్న నిధులు దుర్వినియోగమవుతున్నాయనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో నిధుల బాధ్యతను ఎంపీడీఓలకు అప్పగిస్తూ ఇటీవల జీఓను జారీ చే సి ప్రభుత్వం చేతులు దులుపు కావటంతో నిధులు లేకుండా బాధ్యతలు అప్పగించడం ఏమిటని ఇటు వైద్యులు, అటు ఎంపీడీఓలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

తనికెళ్ల భరణికి వేటూరి సాహితీపీఠం అవార్డు

వేటూరి సాహితీపీఠం అవార్డును సినీనటుడు, రచయిత తనికెళ్ల భరణికి అందుకున్నారు. శనివారం తుని వాసవీ కన్యకాపరమేశ్వరీ కల్యాణ మండపంలో జరిగిన ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం లో తొలి అవార్డును తనికెళ్ళ భరణిని ఎంపిక చేసి సత్కరించింది.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ కులానికి శ్రీనాథుడు , మసక మసక చీకటిలో, గసగసాల కౌగిలి అంటూ ఇద్దరు ప్రేమికులను సంగం సగం అంటూ పదాలను తిరగేసి గస గసాలుగా పలికించిన గొప్ప సినీకవి వేటూరి అని అన్నారు. సినీ సాహితీలోకం లో తనదైనశైలిలో రాతలు రాసి నావపై వెళ్ళిపోయిన వేటూరి అదృష్టశాలని ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

టీడీపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ కి తాజా ఉదాహరణ

రాష్ట్రంలో యువనేత జగన్‌ను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న టీడీపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ పశ్చిమ గోదావరి జిల్లాకు సోకింది. నర్సింగ్ కళాశాల వ్యవహారంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న కొవ్వూరు ఎమ్మెల్యే టీవీ రామారావు(టీడీపీ) ఇంటికి మంత్రి పితాని సత్యనారాయణ(కాంగ్రెస్)నేరుగా వెళ్ళి విందారగించి రావడం కొత్త రాజకీయానికి తెరలేపింది.

ప్రస్తుతం జగన్ ప్రభావంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి బలం తగ్గిన నేపథ్యంలో కొందరు ప్రతిపక్ష ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో భాగంగా మంత్రి పితాని, ఎమ్మెల్యే టీవీ రామారావు మధ్య రహస్యంగా మంతనాలు సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది.

జగన్‌కు జైకొట్టాలంటూ రఘువీరాపై దాడి

జిమ్మిక్కులు మాని జ గన్‌కు జైకొట్టాలంటూ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి పై దాడి చేనంత పని చేసారు జగన్ అభిమానులు. ఆలస్యంగా వెలుగు చుసిన ఈ ఘటన రఘువీర సొంత నియోజకవర్గం లో జరిగిన రచ్చబండలో ఎదురైంది. వేదిక వద్ద భారీ సంఖ్యలో పోలీసులని మొహరించినా జగన్ అభిమానులు ముకుమ్మడిగా లేచి మంత్రి ప్రసంగా న్ని అడ్డుకున్నారు. 'మీ జిమ్మిక్కులు వద్దు... జగన్‌కు జై కొట్టాల్సిందే... జగన్ జిందాబాద్, వైఎస్ఆర్ జిందాబాద్' అంటూ పెద్దఎత్తున నినాదాలు చే స్తూ చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. జగన్‌కు జై కొట్టకపోతే గ్రామాలలోకి రానివ్వమంటూ తేల్చి చెబుతూ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కేసీఆర్‌ అందుకు రెడీ ఐతే నేను రాజీనామకి రెడీ

కేసీఆర్‌తోపాటు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి తెలంగాణ వచ్చే వరకూ ఎన్నికల్లో పోటీకి దిగకుండా సిద్ధమైతే తాను రాజీనామాకు సిద్ధమేనని ప్రజారాజ్యం ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను పేటెంట్ హక్కుగా అనుకోవడం సరికాదని , రాజకీయ పార్టీల జెండాలను పట్టుకుని ఉద్యమిస్తే అది కేవలం రాజకీయ పార్టీల ఉద్యమంగానే ఉంటుందని, ఏ ఒక్క రాజకీయ పార్టీ నిర్ణయంతో తెలంగాణ సాధ్యం కాదని, అన్ని పార్టీలు సమష్టి నిర్ణయంతో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి పరిస్థితి దయనీయం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పరిస్థితి దయనీయంగా మారిందని, ఎమ్మెల్యేల మద్దతు లేదని, ప్రభుత్వం ఎలా నడుస్తోందో అర్థం కాని పరిస్థితి నెలకొందని రాజ్యసభ సభ్యుడు అజీజ్‌పాషా అన్నారు. పోలీసు పహారా మధ్య రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నా తెలంగాణవాదం బలంగా ఉండడంతో తెలంగాణవాదులు, ప్రజ ల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయని.. పోలీసు పహారా మధ్య రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నా తెలంగాణవాదం బలంగా ఉండడంతో తెలంగాణవాదులు, ప్రజ ల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయని పాషా అన్నారు.

ఎంఐఎం తెలంగాణకు వ్యతిరేకమని టీఆర్‌ఎస్ దుష్ర్పచారం

అసదొద్దీన్ ఓవైసీని విమర్శిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎంఐఎం టీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావును హెచ్చరించింది. తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకమని కేవలం టీఆర్‌ఎస్ వారే దుష్ర్పచారం చేస్తున్నారు తప్ప ఓవైసీ ఎప్పుడు అలా అనలేదని ఎంఐఎం నాయకులు సిరాజ్‌ఖాద్రి పేర్కొన్నారు.

ముస్లింల పేర దోపిడికి పాల్పడుతున్నారన్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సిరాజ్‌ఖాద్రి హెచ్చరించారు

రవితేజకు తొందర ఎందుకంటే..?

'ఓరి నీ స్పీడు తగలెయ్యా...గిన్నీస్ బుక్కులో ఎక్కుతావ ఏంటి ' అంటూ రవితేజ సినిమాల స్పీడును చుసిన ప్రేక్షకులు గుడ్లు తేలేస్తున్నారు. సినిమా విడుదలను, హిట్టును కూడా ఆస్వాదించకుండా వెనువెంటనే తదుపరి సినిమా షూటింగులోకి దూరిపోయే రవితేజ ఈ ఏడాది కూడా వరసపెట్టి సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు.
వాలకం చూస్తుంటే విజన్ 2020 ప్లాన్ వేసేసి అప్పటి వరకు కాల్షీట్లు ఇచ్చేస్తాడేమో అనిపిస్తుంది.
వీర లెవెల్లో ముస్తాబవుతున్న 'వీర' వెనువెంటనే 'నిప్పు' మొదలు కాబోతుంది అనేది ఓ వార్తయితే ఆ తరువాత వైవీఎస్ చౌదరితో మరో సినిమాకు ఆల్రెడీ డెట్లు ఇచ్చేసాడట. ఇంతలా రవితేజ ఎందుకు తొందర పడుతు న్నాడబ్బా...అంటే ఇప్పటికే నలభై మూడేళ్ళు నిండాయి మరో రెండేళ్ళు పోతే తనని ఎవరూ దేకరు అన్న జీవితసత్యాన్ని ముందే గ్రహించాడు అంటూ కొన్ని వర్గాలు జోకులు పేల్చేస్తున్నాయి. ఇంతకీ ఈ నలభై మూడేళ్ళు ఎన్నేళ్ళ కింది మాటో?

తుపాకి నుంచి సేకరణ

నా పెదవితో ఆడుకోకండి

రాకెట్ సింగ్' అనే మొదటి హిందీ చిత్రంలోనే లిప్ కిస్సులకు దిగిపోయిన షాజాన్ పదంసీకి ఇప్పుడు కొత్త తంటా వచ్చిపడింది. మొన్న 'ఆరెంజ్'లో కూడా చూడచక్కగా కనపడ్డ షాజాన్ లో లోపం అంతా కింది పెదవిలోనే ఉందంటూ మీడియా సృష్టించిన కథనాలకు కొనసాగింపుగా ఇప్పుడు ఇంకో రూమర్ తయారయ్యింది.
షాజాన్ కింది పెదవిని ఈ మధ్యే సర్జరీ చేయించుకొని (అదే ఇంగిలీసులో 'లిప్ జాబ్') చేయించుకొని మరింత అందంగా తయారయిందని, అందుకే ఈ మధ్య అటెండ్ అవుతున్న ప్రతి పార్టీకి పెదాలని రంగు రంగుల లిప్ స్టిక్కులతో రంగరించుకొని మగాళ్ళను రెచ్చగొడుతుంది అంటూ రూమర్లు బయల్దేరాయి. 'అయ్య బాబోయ్...నేనే సర్జరీలు చేయించుకోలేదు. చేయించుకుంటే ధైర్యంగా చెప్పటానికి నాకేం భయం. ఇప్పటికైనా నా పెదవులతో ఆడుకోకండి' అంటూ మీడియాని వేడుకుందట.

తుపాకి నుంచి సేకరణ

అనుష్క కన్నా కాజల్ కు అవి ఎక్కువే

గబ్బర్ సింగ్' సరసన రబ్బర్ బొమ్మలా నటించడానికి పెక్కు మంది హీరోయిన్లు క్యూలు కడుతుంటే అనుష్క, కాజల్ అగర్వాల్ పేర్లు మాత్రం తెలుగు సోనక్షి సిన్హా అంటూ ఎక్కువగా వినపడుతున్నాయి.

పవన్ కళ్యాణ్ పక్కన నటిస్తే చాలు జీవితానికి ఇంకేం కావాలి అని ఫీల్ అవుతున్న ఈ ఇద్దరిలో అదృష్టం ఎవరిని వరిస్తుందో తెలియదు గానీ ఇప్పటికైతే కాజల్ పోటీలో ముందుందట. అనుష్కకు సీనియారిటీ ఉన్నా, కాజల్ తెలివిగా మెగా ఫ్యామిలీతో నడిపిన స్పెషల్ కాంటాక్ట్స్ ఎక్కువగా ఉండడం ఆమెకు ఎకస్ట్రా బెనిఫిట్ అవుతున్నాయి. రామ్ చరణ్ తో 'మగధీర, మెరుపు'; అల్లు అర్జున్ తో 'ఆర్య 2' మాత్రమే కాక బుల్లోడు అల్లు శిరీష్ కూడా కాజల్ కు మిత్రుడు కావడంతో పవన్ కళ్యాణ్ తన వైపే మొగ్గు చూపుతాడని కాజల్ భావిస్తోంది.

ఇక అనుష్కకు మెగా ఫ్యామిలీతో రిలేషన్ 'స్టాలిన్'తోనే సరిపోయింది. అన్నింట్లో తక్కువైనా ఈ లింకుల విషయాల్లో కాజల్ కు అనుష్క కన్నా ఎక్కువే ఉండడంతో ఇక పవన్ సరసన పావనమై పోవడానికి అప్పుడే అల్లాడిపోతుందట.

తుపాకి నుంచి సేకరణ

'బాబాయ్ అబ్బాయ్' దెబ్బలకు భస్మం

ఒక్క సినిమా చేస్తేనే ఎగిరి గంతేసి మూడు నాలుగు సినిమాలకు నిర్మాతలను సూట్ కేసులో సర్దేసే దర్శకులున్న ఈ ఫాస్ట్ కాలంలో బాలకృష్ణకు 'సింహా,' జూనియర్ ఎన్టీయార్ కు 'బృందావనం'లాంటి రెండు పెద్ద హిట్లిచ్చిన దర్శకులు బోయపాటి శ్రీను, పైడిపల్లి వంశీలకు ఇంకా కాలం కలిసిరానట్టే ఉంది.

సింహా బొమ్మ పడి సంవత్సరం దాటుతున్నా హీరోల వేటలో కథల వేటలో ఉన్న బోయపాటి, అసలు ఉన్నా లేకున్నా పెద్ద తేడా లేదనేలా తయారైన పైడిపల్లి ఇంతవరకు తమ తదుపరి ప్రాజెక్టు ఏదీ అనౌన్స్ చేయకపోవడం దురదృష్టకరం. విజయం వరించిన బాబాయ్ బాలకృష్ణ 'పరమ వీర చక్ర' మొదలెట్టి ఇరగ్గొడితే, అబ్బాయ్ జూనియర్ ఎన్టీయార్ 'శక్తి' చూపడానికి ఇంచుమించుగా రెడీ అయిపోయాడు. వచ్చిన హిట్టుని హీరోలు యూజ్ చేసుకున్నంతగా దర్శకులు క్యాష్ చేసుకోకపోవడం ఫీల్డులో కొత్తేమి కాదంటున్నారు విశ్లేషకులు.

ఇప్పటికైతే బాబాయ్ అబ్బాయ్ కొట్టిన హిట్టు దెబ్బలకు వీరిద్దరూ భస్మం అయిపోయినట్టే.

తుపాకి నుంచి సేకరణ

కమల్ పై కన్నేసిన బాలకృష్ణ

సినిమా హిట్టైనా ఫ్లాపైనా తన పంథా మార్చుకోని తెలుగు హీరోల్లో మొదటి వరసలో ఉండే పేరు బాలకృష్ణ. అదే పాత చింతకాయ పచ్చడిని ఎన్నిసార్లు వడ్డించినా రుచిగా ఫీలయ్యే అమాయకత్వం బాలకృష్ణ సొంతం.

గత రెండు మూడేళ్ళుగా నందమూరి అందగాడి ట్రాక్ రికార్డు పరిశీలిస్తే అసలు సోలో హీరోగా సింగిల్ పాత్రతో చేసిన సినిమాలు ఒకటీ అరా మించి లేవు. అన్నింటిలోను డబుల్ యాక్షన్ పాత్రలే ఎక్కువ. మహారథి, ఒక్క మగాడు, పాండురంగడు, సింహా, పరమ వీర చక్ర...ఇలా అన్నింటిలోను బాలకృష్ణ డబల్ ఫోజులే. ఇక పరుచూరి మురళి దర్శకత్వంలో రానున్న తదుపరి చిత్రంలోనైతే ఏకంగా ట్రిపుల్ యాక్షన్ చేసి చింపేయబోతున్నాడు.

బాలకృష్ణ తంతు చూస్తుంటే రానున్న కొద్దిరోజుల్లోనే ఏదో ఓ సినిమాలో పదకొండు పాత్రలేసి కమల్ హాసన్ 'దశావతారం'కి దశదినకర్మ పెట్టేస్తాడో ఏమో అంటున్నారు అభిమానులు. బాలకృష్ణ అంతటి ఘనాపాటి అన్న విషయం మనకు తెలియంది కాదనుకో!

తుపాకి నుంచి సేకరణ

దిల్ రాజే ఇప్పుడు అతనికి బెస్ట్ ఫ్రెండ్

బొమ్మరిల్లు'లాంటి సినిమా మాకు ఒక్కటి కూడా తగల్లేదేమిటని పెద్ద హీరోలు ఫీల్ అవుతుంటే, దిల్ రాజు పుణ్యమాని తెలుగులో అదే బొమ్మరిల్లుతో పాగా వేసేసిన సిద్ధార్థ్ మాత్రం వరస ఫ్లాపులతో ఉనికినే ప్రశ్నార్థకం చేసుకుంటున్నాడు. గుర్రం చేసేది గాడిద చేసినా, గాడిద చేసేది గుర్రం చేసినా ఇలాగే ఉంటుంది.

మాస్ హీరో అవ్వాలి అన్న కల హీరోలందరికీ ఉన్నా ఎవరికి ఏం చేతనవుతుందో అది చేసుకొని ఉన్నంతలోనే తృప్తి పడుతుంటే ఏటికి ఎదురీదినట్టు సిద్ధార్థ్ ధీరుడిలా ఫీలై ఆటాడేసుకోవాలి అనుకున్న ప్రతిసారి ప్రేక్షకులు తగిన శాస్తి చేసి పంపారు. రోజులు దగ్గర పడ్డాయి అనుకున్న తరుణంలో మళ్ళీ దిల్ రాజు నుండి ఫోన్ రావడంతో 'ఓ మై ఫ్రెండ్' అంటూ ప్రేమ కురిపించేసాడు. ఫిబ్రవరిలో మరో 'బొమ్మరిల్లు'ను మొదలెడదాం అని చెప్పేసరికి సిద్ధార్థ్ ఆనందం తట్టుకోలేకపోతున్నాడు. వేణు శ్రీరాం అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్న 'ఓ మై ఫ్రెండ్'కు 'ఓ మై డార్లింగ్' అమృతా రావుగా ఫైనల్ అయిపొయింది.

తుపాకి నుంచి సేకరణ

సునీల్ సంక నాకిపోతాడా

తన సొంత కష్టంతో ఒక్కో మెట్టుగా ఎక్కుతూ, ప్రతి మెట్టుపైన ఓ చెమట బిందువును వదులుకుంటూ వచ్చి ఇప్పుడు అందరికీ నోట్లో నాలుకలా తయారైన కమెడియన్ సునీల్ 'అప్పల్రాజు' మొదలైన దగ్గరి నుండి అందరివాడు కాదు కొందరి వాడైపోయాడని కృష్ణనగర్ జనాలు ముచ్చటిస్తున్నారు.

అందాల రాముడు, మర్యాద రామన్నలు సూపర్ హిట్టు అయిన నాడు కూడా నలుగురిని నవ్విస్తూ కనపడే సునీల్ కొద్ది కాలంగా బిక్కుబిక్కుమంటూ ఉండడం చూస్తుంటే ఇది 'అప్పల్రాజు' మహిమా లేక వర్మా మహిమా అని విశ్లేషణలు కూడా మొదలయ్యాయి. హీరోగా నిలబడాలి అంటే రెండు హిట్లు సరిపోవన్న విషయం తెలిసినట్టే కనపడే సునీల్ తనకు భోజనం పెట్టిన క్యారక్టర్ వేషాలు అసలు వేస్తున్నాడా అంటే క్లారిటీ ఆన్సర్ దొరకట్లేదట.

మరి ఒక్క అపల్రాజు, ఒక్క నెపోలియన్ చిత్రాలతో సునీల్ హీరోగా స్థిరపడిపోతే ప్రాబ్లం లేదు బట్ తేడా పడితే చెప్పుడు మాటలు విన్నందుకు సంక నాకిపోవడం గ్యారంటీ అంటూ సీనియర్ విశ్లేషకులు ఇప్పుడే జాతకం విప్పేస్తున్నారు.

తుపాకి నుంచి సేకరణ


ఈమెది కూడా చిరు ఖాతాలోనే వేసేదా?

చిరంజీవి ఇంట్లోని నలుగురు కుటుంబ సభ్యులు నాలుగు సొంత కుంపట్లు పెట్టుకొని నిర్మాతలై పోతే నేనెందుకు కాకూడదు అనుకుంది చిరు సొంత మనిషిలా ఫీలయ్యే ప్రజారాజ్యం నాయకురాలు శోభారాణి.

నాగబాబు అంజన ప్రొడక్షన్స్, అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్, పవన్ కళ్యాణ్ తన క్రియేటివ్ వర్క్స్ తో పాటుగా రామ్ చరణ్ కూడా నాన్న నూట యాభయ్యో చిత్రానికి తల్లి సురేఖ పేరు మీద బ్యానర్ స్థాపించే పనిలో ఉన్నాడు. ఇంకేముంది అనుకున్నదే తడువుగా సామాజిక న్యాయం మీద కథను రెడీ చేయించేసి చిరంజీవి ఆశీసులు కూడా పొందిన శోభారాణి రేపో మాపో ఓ స్వీట్ డబ్బా ముందు పెట్టి ఈ సినిమా శుభవార్త మీడియాకి విడుదల చేసే పనిలో ఉందట.

చిరంజీవి నాలుగు స్తంభాలాట అంటూ ఇప్పటికే మీడియా దంచేస్తుంటే ఈ బ్యానర్ కూడా చిరు ఖాతాలోకే వెళితే ఐదో స్థంభం ఎక్కడ పాతేది?

తుపాకి నుంచి సేకరణ

దాసరి పుండు మీద 'మిరపకారం' చల్లాడు

అసలే 'పరమవీరచక్ర'కు ఇంటర్ నేషనల్ పరమ చెత్త అవార్డులు ఎన్ని వస్తాయో అంటూ దాసరి నారాయణ రావు టెన్షన్ పడుతుంటే బుడ్డోడు అల్లు శిరీష్ పుండు పైన కారం చల్లినట్టు మాట్లాడుతున్నాడు.

నిర్మాత సి.కళ్యాణ్ పరమ కలెక్షన్ల గూర్చి పట్టించుకోవడమే మానేసి పోలీసుల చుట్టూ తిరుగుతుంటే తన సినిమా మీద మమకారం చావని దాసరి అడపాదడపా టీవీల్లో కనపడుతూ ఎప్పుడో పడుకున్న దాన్ని లేపే విఫలయత్నాలు చేస్తున్నాడు. పరమవీరచక్రకు సరైన సినిమా హాళ్ళు ఇవ్వడంలో అల్లు అరవింద్ వర్గం గీతా ఫిలిమ్స్ ద్వారా రాజకీయం చేసిందంటూ దాసరి వర్గం చిర్రుబుర్రులాడితే, దీనికి సంబంధించి అల్లు శిరీష్ పిల్ల బుద్ధులను మరోసారి ట్విట్టర్లో ప్రదర్శించేసాడు.

'మన గీతా ఫిలిమ్స్ మీద విడుదలైన ప్రతి సినిమాకు మంచి థియేటర్స్ దొరుకుతాయి. మంచి కలెక్షన్లు రాబడతాయి. సినిమా ఫ్లాపైనా కలెక్షన్లు హిట్టుకంటే ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణ మిరపకాయ' అంటూ మిరపకారం చల్లి వదిలేసాడు. అసలే అల్లు అన్నా గీతా అన్నా కుల్లుకుంటున్న దాసరి మరి ఈ వాగుడుకాయని కూడా పట్టించుకుంటాడా?

తుపాకి నుంచి సేకరణ