15, నవంబర్ 2010, సోమవారం

మరోసారి సురేఖ లేఖాస్త్రం

కాంగ్రెస్‌ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ప్రాధమిక సభ్యత్వాన్ని తొలగించడంపై ఆగ్రహించిన కొండా సురేఖ మరోసారి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు.

పిసిసి అధ్యక్షులు ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిజామాబాద్‌ ఎంపి మధుయాష్కీ చేసిన వ్యాఖ్యలను పట్టించుకోని పిసిసి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఏమీ తప్పు చేయకున్నా ఆయన సభ్యత్వాన్ని ఎలా తీసివేస్తారని ... దివంగత రాజశేఖర్‌ రెడ్డి అభిమానిగా ఉండడమే చెవిరెడ్డి చేసిన తప్పిదమా అని ప్రశ్నించారు

పిసిసి కి ప్రభుత్వానికి ఏమాత్రం సయోధ్యలేదని, ఉంటే గవర్నర్‌కు కాంగ్రెస్‌ పార్టీ నాయకులే వినతి పత్రం సమర్పిస్తే వారిని పిలిపించి విచారించిన దాఖలాలు లేవని, పిసిసి కానీ, ప్రభుత్వం కానీ వారి విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో అర్దం కావడంలేదన్నారు.

ఇప్పటికైనా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ నిలదొక్కుకోవాలంటే ప్రత్యేక కమిటీని నియమించి వాస్తవాలు తెలుసుకోవాలని, ఆంధ్రప్రదేశ్‌ పై ద్రుష్టి పెట్టాలని తన లేఖలో సురేఖ కోరారు.

తెలంగాణావాదినంటూనే సమైక్యవాదిగా ....

రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలంగాణావాదినంటూనే సమైక్యవాదిగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి నేత చకిలం అనిల్‌కుమార్ ఆ రోపించారు.

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అడుగడుగునా తెలంగాణాకు ద్రోహం చేశారని, ఆయన శిష్యుడిగా వ్యవహరిస్తున్న మంత్రి వెంకట్‌రెడ్డి...వైఎస్ మరణానంతరం మంత్రి పదవి ఎక్కడ ఊడుతుందోన ని తెలంగాణ నినాదాన్ని పక్కనబెట్టి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పంచన చేరారని ఆరోపించారు.

డిసెంబర్ 31 తర్వాత తెలంగాణకు జైకొట్టకపోతే మంత్రిని జిల్లాలో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు.

దేహం ముక్కలైనా దేశం ముక్కలు కానీయం

రాష్ట్రం, దేశంలో విభజన ఉద్యమాలు సాగుతున్నాయని, దీనిని సీపీఎం వ్యతి రేకిస్తోందని, దేహం ముక్కలైనా దేశం ముక్కలు కానీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు పేర్కొన్నా రు.

సాధారణ ప్రజలకు విద్యావ్యవస్థ షాపింగ్‌మాల్‌లా తయారైందని,.. కేంద్రం మంత్రి కపిల్ సిబాల్ ప్రవేశ పెట్టే పథకాలు ఆందోళన కలిగిస్తున్నా యని, ప్రైమరీ విద్య కూడా ప్రై వేటీకరణ అయిపోయిందన్నారు. ఎస్ ఎఫ్ఐ విద్యావిధానం, అ«ధ్యయనం, పోరాటం అనే అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఆంధ్రా విశ్వవిద్యాలయం ఎంఫిల్/ పీహెచ్‌డీ ప్రవేశాలకు 12న రాత పరీక్ష

ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంఫిల్/ పీహెచ్‌డీ ఫుల్‌టైం ప్రవేశాలకు వచ్చే నెల 12న రాత పరీక్ష నిర్వహించనున్నారు..

ఫుల్‌టైమ్ పిీహెచ్‌డీ ప్రవేశాలకు రాత పరీక్ష తప్పనిసరనే యూజీసీ నిబంధనలను అమల్లో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నారు. ఫుల్‌టైం ఎంఫిల్, పిీహెచ్‌డీ కోర్సులకు దరఖాస్తుచేసే అభ్యర్థులకు వీలైనంత త్వరగా హాల్‌టిక్కెట్లు పంపిణీ చేయాలని ఉపకులపతి ఆదేశించారు.

ఒకే రోజు సైన్స్, ఆర్ట్స్ కోర్సులకు రాత పరీక్ష నిర్వహించి, తరువాత మౌఖిక పరీక్ష నిర్వహించాలని యోచిస్తున్నారు.

జై రోశయ్య అంటూ.. రూటు మార్చిన కొణతాల...

విశాఖలో ఈ నెల 17న జరిగే ముఖ్యమంత్రి రోశయ్య పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు.

వైఎస్ జగన్‌కే మద్దతు తెలుపుతున్నట్టు ఇప్పటి వరకు కనిపిస్తూ వస్తున్న కొణతాల ఇప్పుడు బాణీ ఎందుకు మార్చారు? ఎంపీ సబ్బం హరికి జగన్ అధికంగా ప్రాధాన్యం ఇస్తుండడం వల్లనే కొణతాల రూట్ మార్చారా? లేక మరేదైనా కారణం వున్నదా? అన్న విషయాలపై చర్చ జరుగుతున్నది.

నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ

నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించాలని, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య డిమాండ్ చేసారు.

అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ అంశంపై నాటకాలు చేస్తున్నాయని, ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని, ఒక వేళ తెలంగాణ ఇవ్వకుంటే నాయకులు పెద్ద ఎత్తున వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె అన్నారు.

అంచెలంచెలుగా మద్యపాన నిషేధాన్ని చేపడుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మద్యాం ధ్ర ప్రదేశ్‌గా మారుస్తుందని, టార్గెట్లు పెట్టి మరీ మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని, టీడీపీ హయాంలో మద్యపాన నిషేధంపై ఎక్కువగా మాట్లాడిన రోశయ్య ప్రస్తుతం మద్యం అమ్మకాలపై దృష్టి సారించడం దారుణమని ప్రొహిబిషన్ అన్నమాటకు అర్థం ఏంటో ప్రభుత్వమే చెప్పాలని ఆమె అన్నారు.

సామ్రాజ్యవాద విష సంస్కృతి విచ్చలవిడిగా ప్రచారం చేస్తూ సినిమాలు, పబ్‌లు, బార్లు తెరువడంవల్ల యువతపై ప్రభా వం పడనుందన్నారు.