5, నవంబర్ 2010, శుక్రవారం

మా ఎమెల్యేని వెతికి పెట్టండి

వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీపై అత్యధిక మెజారిటీతో గెలుపొందిన రమేష్‌బాబు గత కొంతకాలంగా కనిపించడంలేదంటూ కాంగ్రెస్‌నేతలు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో సిఐని కలుసుకొని ఫిర్యాదు చేశారు.

ప్రజలు, రైతు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూంటే ఎమ్మెల్యే నియోజక వర్గాన్ని, ప్రజలను గాలికి వదిలేసి ఏవో కుంటిసాకులు చెబుతూ తప్పించుకొని తిరుగుతున్నాడని, నియోజకవర్గాన్ని పట్టించుకోవడంలేదని వారు విమర్శించారు. ప్రజలు ఎంతగానో ఆశపడి రమేష్‌బాబును గెలిపిస్తే, గెలిచిన మూడు, నాలుగు ఒద్దులు మినహా ఎప్పుడు కూడా నియోజకవర్గంలో అందుబాటులో ఉండటంలేదని విమర్శించారు.

కేసీఆర్ ... నరకాసురుడు...

రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ అభినవ నరకాసురుడు కేసీఆర్ దిష్టిబొమ్మను తిరుపతిలో దగ్ధం చేశారు.

అలజడులు సృష్టి స్తూ రాష్ట్రంలో శాంతికి విఘాతం కలిగించేలా కేసీఆర్ నరకాసురుడులా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతికి భగ్నం కలిగిస్తే నరకాసురుడి గతే కే సీఆర్‌కు పడుతుందని హెచ్చరించారు సాప్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.రాజారెడ్డి .

నరక చతుర్ధశిని పురస్కరించుకుని సాప్స్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు..రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం కేసీఆర్ వేర్పాటు వాదాన్ని రెచ్చగొడుతూ రాష్ట్రాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ జ్యోతికి 271వ రోజులు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ఆదిలా బాడ్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని బొప్పారం తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జ్యోతికి శుక్రవారం నాటికి 271వ రోజుకు చేరుకుంటుంది.

ఉద్యమంలో భాగంగా గ్రామ జేఏసీ నాయకులు ఫిబ్రవరి 8న ఈ అఖండ జ్యోతిని వెలిగించారు. తెలంగాణ ఏర్పాటు జరిగేంత వరకు జ్యోతిని వెలుగుతూనే ఉంటుందని గ్రామ జేఏసీ నాయకులు పేర్కొన్నారు.

కేసీఆర్ ఖబడ్దార్! మేం తలచుకుంటే నువ్వు తిరగలేవ్

‘కేసీఆర్ కూతురు కవిత ఆంధ్ర ప్రాంతానికి చెందిన సినిమా ఫంక్షన్లకు హాజరవుతోంది. కుమారుడు కేటీఆర్ ఆంధ్ర వారితో వ్యాపారాలు చేస్తున్నాడు. కేసీఆర్ ఆంధ్ర ప్రాంత పరిశ్రమల సీఈఓలతో సమావేశం అవుతారు. ఇదేనా కేసీఆర్ చేసే తెలంగాణ ఉద్యమం’ అంటూ ప్రశ్నించారు. ఆయన తెలంగాణ అంశంపై పార్లమెంటులో ఎన్నిసార్లు మాట్లాడారో ప్రజలకు వివరించాలని తెలుగుదేశం ఎంపి రమేష్ రాథోడ్ డిమాండ్ చేశారు.

ఇటీవల రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, టీఆర్‌ఎస్ నాయకులు కార్యక్రమాన్ని అడుకోవడానికి ప్రయత్నించడం సిగ్గుచేటని ... టీడీపీ కార్యకర్తలు తలచుకుంటే టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు గడప దాటి బయటకు వెళ్లలేరని, కేసీఆర్ ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.

అయోమాయానికి గురిచేస్తున్న దుగ్గల్

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని, రాయలసీమను తెలంగాణలో కలపాలనే వ్యాఖ్యలతో కూడిన ప్రకటనలు చేసి అయోమాయానికి గురిచేస్తున్నారని తెలుగు దేశం నేత వేణుగోపాలచారి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆందోళన వ్యక్తం చేశారు. .

తెలంగాణ రాష్ర్టం ఏర్పా టు విషయంలో కాలయాపన చేయడానికి వివిధ కమిటీలను వేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డిసెంబ ర్‌లో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.

చిత్ర విచిత్రాలకు కాంగ్రెస్సే సాటి

ఒంగోలు రాజకీయంగా చిత్ర విచిత్రాలు చేయడంలో కాంగ్రెస్‌కు కాంగ్రెస్సే సాటని మరోసారి నిరూ పితమైంది. యువజన కాంగ్రెస్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుల నియామక వ్యవహారం అందుకు తార్కాణంగా నిలుస్తోంది. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత జారీ అయిన నియా మకపు ఉత్తర్వులు బుధవారం మధ్యాహ్నానికి నిలిచిపోయాయి. అందుకు కారణాలు ఏమైనా, కారకులు ఎవరైనా కాంగ్రెస్ మార్క్ వ్యవహారం ఎప్ప టికీ ఇంతే అన్న చందంగా వ్యవ హారం మారింది. ఈ నియామకా ల్లో జరిగిన మన జిల్లా అధ్యక్షుడి నియామక అంశం జగన్ వర్గీయుల ను సైతం ఆశ్ఛర్యానికి గురి చేసింది.

ప్రస్తుతం తాత్కాలికంగా నియామకాలు ఆగిపోవడంతో ముందు ముందు రోజుల్లో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోననే అంశం ఆసక్తికరంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణసత్తా చాటుతాం

‘ఆంధ్రప్రదేశ్ శాసనసభలోకి టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అడుగుపెడుతారా? అని కొంతమంది ఆంధ్ర నేతలు ప్రశ్నిస్తున్నారు, వారికి ఇదే మా సమాధానం, కచ్చితంగా సభకు వస్తాం, తెలంగాణసత్తా చాటుతాం, వచ్చే సమావేశాల నాటికి దానిని తెలంగాణ రాష్ట్ర శాసనసభగా మార్చుకుంటాం’ అని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె తారకరామారావు పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం తామే సాధించి తీరుతామని ప్రగల్భాలు పలుకుతోన్న కాంగ్రెస్ నేతలు ఒక విషయాన్ని గ్రహించాలి, కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది, కెసిఆర్ దీక్షవల్లనే తప్ప, ఇందులో కాంగ్రెస్ నేతల వల్ల కాదని ఆయన కెటిఆర్ గుర్తు చేశారు. డిసెంబర్ తర్వాత మరోసారి తెలంగాణ సమాజమంతా ఏకమై కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణ ఉద్యమకారుల్ని అతి క్రూరంగా కాల్చిచంపించిన కాసు బ్రహ్మానందరెడ్డి వంటి వారి విగ్రహాలు తమకు అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రనేతల విగ్రహాలపై చీమ వాలితే కూడా స్పందించే చంద్రబాబుకు, తెలంగాణ రాష్ట్రం కోసం వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.

మొతేరాలో ‘వీర’ మోత!

న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం నాడు ఇక్కడ మొతేరాలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రారంభమైన తొలి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ కివిస్ బౌలర్లను ‘వీర’ బాదుడు బాదారు.

డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెవాగ్ (173) చెలరేగి ఆడి కివీస్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించగా, ‘మిస్టర్ డిపెండబుల్’ రాహుల్ ద్రవిడ్ కూడా తనదైన శైలిలో రాణించి సెంచరీతో అలరించాడు.

'జై బోలో తెలంగాణా' లో ముఖ్యపాత్రకి ప్రముఖ హీరో

తెలంగాణా అంశం చుట్టూ నడిచే కథాంశంతో దర్శకుడు ఎన్‌.శంకర్‌ 'జై బోలో తెలంగాణా' తీస్తున్నారు. మహాలక్ష్మి ఆర్ట్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఎన్‌.శంకర్‌ మాట్లాడుతూ...'టాకీతోపాటుగా రెండు పాటలు పూర్తయ్యాయి. దాదాపు 60 శాతం షూటింగ్‌ పూర్తయింది. నవంబర్‌ నెలాఖరులో ప్రొడక్షన్‌ పూర్తవుతుంది. డిసెంబర్‌లో సినిమా విడుదల అవుతుంది. తెలంగాణ రావడానికి కారణమైన సాయుధ పోరాట యోధుల్లో ఒక ముఖ్యమైన నాయకుడి పాత్రను ఒక ప్రముఖ హీరో పోషించనున్నాడు' అని చెప్పారు.

పవన్‌కళ్యాణ్‌ చిత్రానికి హాలీవుడ్‌ డిజైనర్‌

ఆదిత్య ప్రొడక్షన్‌పై కొండా కృష్ణంరాజు నిర్మిస్తున్న చిత్రంలో పవన్‌కళ్యాణ్‌ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు. హాలీవుడ్‌లో ప్రముఖ చిత్రాలకు ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పనిచేస్తున్న స్టీఫెన్‌.ఎం.ఆర్టలానీ ఈ సినిమాకు పనిచేయడానికి సిద్ధమవుతున్నారు.

మిషన్‌ ఇంపాజిబుల్‌-3, లెటర్స్‌ టు జూలియట్‌ వంటి హాలీవుడ్‌ చిత్రాలకు ఆర్టలానీ పనిచేశారు. వార్నర్‌బ్రదర్స్‌, పారామౌంట్‌, ట్వంటీయత్‌ ఫాక్స్‌, కొలంబియా వంటి సంస్థలకు తన సేవలందించారు. పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న ఈ చిత్రం కాన్సెప్ట్‌ విని పనిచేయడానికి అంగీకరించారు.

ఇప్పటికే సినిమాకు సంబంధించిన లొకేషన్స్‌, సెట్‌లు, మేకప్‌లు, కాస్ట్యూమ్స్‌ తదితర డిజైన్లు తయారు చేసుకుని 8న భారతదేశానికి వస్తున్నారు. తెలుగు, మలయాళ భాషల్లో పవన్‌కళ్యాన్‌ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రచన: భారవి, కెమెరా: శేఖర్‌ వి.జోసెఫ్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: శేషు, దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు.

ఇరాక్ యుద్ధంలో చాలా తప్పులు చేశా....: బుష్

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ ఇరాక్ యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. ఇరాక్ యుద్ధంలో చాలా తప్పులు చేశానని ఆయన తన పుస్తకంలో రాశారు. ఆర్థిక మాంద్యాన్ని తొలగించేందుకు తాను ప్రయత్నిస్తున్న సమయంలో అధ్యక్ష పదవి కోల్పోవడాన్ని "ఓ మునిగిపోతున్న ఓడకు కెప్టెన్‌గా భావించాన"ని ఆయన తన పుస్తకంలో పేర్కొన్నారు.

సచిన్‌ నేటి బ్రాడ్‌మన్‌

అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో 22 ఏళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై బ్రిటీష్ మీడియా ప్రశంసల వర్షం కురిపించింది. ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో దూసుకోపోతున్న మాస్టర్ బ్లాస్టర్‌ను "నవయుగ బ్రాడ్‌మన్"గా అభివర్ణించింది.

టెస్టు క్రికెట్‌లో శతకాల 'అర్ధ సెంచరీ'కి అడుగు దూరంలోనే ఉన్న సచిన్, కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఈ రికార్డును అధిగమిస్తాడని బ్రిటన్‌కు చెందిన 'ది టైమ్స్' పత్రిక వెల్లడించింది. ది టైమ్స్ పత్రిక రాసిన ఓ కాలమ్‌లో ప్రముఖ క్రీడా విశ్లేషకుడు జాన్ వుడ్‌కాక్ సచిన్‌ను నేటి కాలపు బ్రాడ్‌మన్‌గా కొనియాడాడు. సచిన్ ఆడినన్ని ఇన్నింగ్స్ బ్రాడ్‌మన్ ఆడుంటే మాత్రం శతకాల సంఖ్య 100కు చేరేదని వుడ్‌కాక్ చెప్పాడు. ప్రస్తుతం బ్రాడ్‌మన్ కనుక ఉండివుంటే.. సచిన్ తరహా ఆటతీరుతో యావత్తు క్రికెట్ అభిమానులను అలరించేవాడని వుడ్‌కాక్ చెప్పాడు.

సోనియా 9, మనోహ్మన్ 18

ప్రపంచంలోని అత్యంత శక్తి మంతుల్లో చైనా అధ్యక్షుడు హు జింటావొ అగ్రస్థానంలో నిలిచారు. మార్పు నినాదంలో అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన బరాక్ ఒబామా ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు.

ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన అత్యంత శక్తిమంతుల జాబితా-2010లో భారత్ నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, టాటా గ్రూపు చైర్మన్ రతన్ టాటా, ఎన్నారై పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్‌లకు చోటు దక్కింది.

సోనియా 9, మనోహ్మన్ 18వ స్థానాల్లో నిలిచారు. ముఖేష్ 34, లక్ష్మీ మిట్టల్ 44, రతన్ టాటా 61 ర్యాంక్ దక్కించుకున్నారు.

'గాలి' సోదరులకు ఈసీ నోటీసులు

అధికార దుర్వినియోగం కింద కర్ణాటక మంత్రి గాలి జనార్ధనరెడ్డి, ఆయన సోదరునికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. ఈ నెల 18న ఎన్నికల సంఘం ముందు హాజరుకావాలని ఆదేశించింది.

‘బద్రీనాథ్’ తరువాతే బన్ని ‘హ్యాపీ’గా వరుడవుతాడట...

సినీ హీరో అల్లు అర్జున్ త్వరలో ‘వరుడు’ కాబోతున్నాడు. తను కోరుకున్న అమ్మాయి స్నేహారెడ్డినే ‘హ్యాపీ’గా వరించబోతున్నాడు. జనవరి తర్వాత అల్లు అర్జున్, స్నేహారెడ్డిల వివాహం జరుగుతుందని అల్లు అరవింద్ అధికారికంగా ప్రకటించారు.

‘బద్రీనాథ్’ సినిమా షూటింగ్ జనవరి చివరి నాటికి పూర్తవుతుందని, ఆ తర్వాత పెళ్లి చేయాలనుకుంటున్నట్టు ఆయన

జగన్ అభిమానులను పదవులను నుంచి తప్పించేందుకు టాలెంట్ హంట్

ఏఐసీసీ సమావేశంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రస్తావన లేకపోవడం తెలుగువారిని అవమానించడమేనని పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు అన్నారు. చేసిన తప్పుకు ఏఐసీసీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రులకు క్యారెక్టర్ లేదంటూ ముఖ్యమంత్రి రోశయ్య చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను దిగజార్చేవిధంగా ఉన్నాయన్నారు.
అసలు లీకువీరులు సీఎం పేషీ అధికారులేనని అన్నారు. ఏపీఐఐసీ వ్యహారంలో డీఎల్ రవీంద్రారెడ్డితో సీబీఐ విచారణకు డిమాండ్ చేయించింది రోశయ్యేనని ఆయన ఆరోపించారు. టాలెంట్ హంట్ ద్వారా యూత్ కాంగ్రెస్ నేతల ఎంపికలో అవినీతి, అవకతవకలు జరిగాయన్నారు. వైఎస్సార్, జగన్ అభిమానులను పదవులను నుంచి తప్పించేందుకు టాలెంట్ హంట్ జరిపారని అంబటి ధ్వజమెత్తారు.

సోనియా పుట్టిన రోజు మళ్ళి వస్తోంది ..

సోనియా తన జన్మదినకానుకగా తెలంగాణ ఇచ్చిందని చెప్పిన కెసిఆర్కి ఆమె జన్మదినం మళ్ళీ వస్తోందని గుర్తు చేయాలని అనుకొంటున్నాం' అని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు అన్నారు.

. నాగం జనార్ధనరెడ్డి, కడియం శ్రీహరి, హరీశ్వర్ రెడ్డి గురువారం మీడియా తో మాట్లాడుతూ 1956 నుంచి మొదలుకొని కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే వస్తోంది. తెలంగాణ ఇచ్చినట్లే ఇచ్చి కేంద్రం డిసెంబర్ 23వ వెనక్కు తీసుకొంది. తెలంగాణ ప్రజలను మోసం చేసింది..తెలంగాణ ప్రకటనను కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కు తీసుకొన్న డిసెంబర్ 23వ తేదీని విద్రోహ దినంగా పాటిస్తామని ప్రకటించారు.

నాలుగు వందల మంది చనిపోయినా ..నిర్ణయించాంనిన్న ఎఐసిసి సదస్సులో దేశంలోని అన్ని విషయాలు మాట్లాడి తెలంగాణ ఊసే ఎత్తలేదు. కాంగ్రెస్ మోసాన్ని ప్రజలకు గుర్తు చేయడానికి విద్రోహ దినంగా పాటించాలని నిర్ణ యించినట్లు చెప్పారు
.