1, ఫిబ్రవరి 2011, మంగళవారం

రంజిత రాసలీలల వ్యవహారం నా భక్తులు పట్టించుకోలే...

ఇద్దరు ప్రముఖులు రూ.100 కోట్ల కోసం తనను బ్లాక్‌మెయిల్ చేసి కుట్ర పన్ని ఈ కేసులో ఇరికించి జైలుకు పంపారని ధ్యానపీఠాధిపతి నిత్యానంద స్వామి ఆరోపించారు. సిఓడి పోలీసులకు ఈ వివరాలు చెప్పినా వారు విని ఊరుకున్నారని ... తనకు ప్రాణభయం ఉన్నందున ప్రస్తుతానికి వీరి పేర్లను వెల్లడించలే కపోతున్నట్లు చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా తనకు కోటి మంది భక్తులు ఉన్నారని తనపై సినీనటి రంజిత రాసలీలల వ్యవహారం పూర్తిగా కట్టుకథ .. నీచమైన ఆరోపణలు వచ్చినప్పటికీ భక్తులు పట్టించుకోవడంలేదని నేటికీ లక్షల సంఖ్యలో తమ ఆశ్రమానికి వస్తూనే ఉన్నారని... ఇప్పటికీ ఇంటర్నెట్‌లో తానే అందరికన్నా పాపులర్ గురువునని నిత్యానంద చెప్పుకున్నారు.

చిరంజీవినీ ముంచేస్తుంది

కాంగ్రెస్ పార్టీ మునుగుతూ.. చిరంజీవినీ ముంచేస్తుందన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ. కాంగ్రెస్‌పార్టీ మునిగిపోయే పడవ అని, చిరంజీవి ఆ పడవను ఎక్కితే బరువెక్కువవుతుందే కానీ.. తేలదని ఎద్దేవా చేశారు. . కేంద్రంలో, రాష్ట్రంలో కాయకల్ప చికిత్స చేసి కాంగ్రెస్‌ను నిలబెట్టుకోవాలని చూస్తున్నారని, వాస్తవానికి కాయకల్ప చికిత్స వల్ల రోగం పూర్తిగా నయం కాదని.. లోన కుళ్లి పోతుంటే పైన సుగంధ ద్రవ్యాలు చల్లితే ఉపయోగం ఉండదు' అని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్, ప్రజారాజ్యంల సహజీవనం ఎప్పటి నుంచో

పెళ్ళి కాకుండా కాంగ్రెస్, ప్రజా రాజ్యం పార్టీలు ఎప్పటి నుంచో సహజీవనం చేస్తున్నాయని, ఇప్పుడు అధికారికంగా తాళి కట్టుకొందామని అనుకొంటున్నాయని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు.

ఇతర పార్టీలోని పరిణామాలతో తమకు సంబంధం లేదని, తమ పని తాము చేసుకొంటూ పోతామని ఆయన చెప్పారు. ఒకరి కోసం అవిశ్వాసాలు పెట్టాల్సిన అవసరం తమకు లేదని...తమ వ్యూహం ప్రకారం తాము ముందుకు వెళ్తామన్నారు. రాష్ట్రంలోని అనిశ్చితితో మొత్తం రాష్ట్రం నష్టపోతోందని, శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకొని కేంద్రం వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

'కెసిఆర్ తాతలు బొబ్బిలిలో ఏం పేడ తిన్నారు?

టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ వాడుతున్న పదజాలం చూస్తే ఆయనను పిచ్చి కుక్క కరిచినట్లుందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. 'కెసిఆర్ తాతలు బొబ్బిలిలో ఏం పేడ తిన్నారు? కెసిఆర్ గతంలో టిడిపిలో ఉన్నప్పుడు రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం వచ్చినప్పుడు ఆరంగారంగా పులుసుకూరలు, చేపల పులుసులు, బిర్యానీలు తిన్నారు.

అవన్నీ పేడేనా? కెసిఆర్ తాతలు వలస వచ్చినట్లే అనేక మంది చదువులు, ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఇక్కడకు సీమాం«ద్రులే రాలేదు. తెలంగాణ ప్రజలు సహృదయులు...నిస్వార్ధపరులని, వారి మనసులను కెసిఆర్ విషపూరితం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

పీఆర్పీ అంటే 'పీపుల్ రిజక్టెడ్ పార్టీ

చిరంజీవి మాట్లాడితే కొన్ని చోట్ల బోర్డుల్లో ఉన్నట్లు 'మే ఐ హెల్ప్ యూ' అంటూ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారని పీఆర్పీ అంటే 'పీపుల్ రిజక్టెడ్ పార్టీ అని మాజీ మంత్రి ఎం.మారెప్ప కొత్త నిర్వచనం ఇచ్చారు. ఆ పార్టీకి ఓ విధానం అంటూ లేదని ఎద్దేవా చేశారు.

రోజా తననైనా తిట్టగలదని జగన్ గ్రహిస్తే మంచిది

అవినీతిలో జగన్ పాత్ర ఉన్నందువల్లే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్రంలో...రాష్ట్రంలో ఉన్న అవినీతిపై పోరాడతానంటే రోజా బాధ పడుతున్నట్లు కనిపిస్తోందని తెలుగు మహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి వ్యాఖ్యానించారు. సినిమాల్లో వేషాలు మార్చినట్లుగా ఆమె మాటలు మారుస్తు...'రోజా టిడిపిలో ఉండగా వైఎస్ రాజశేఖరరెడ్డిని తిట్టారు. అటువైపు వెళ్ళగానే చంద్రబాబును తిడుతున్నారు.ఆమె రేపు తననైనా ఇదే మాదిరిగా తిట్టగలదని జగన్ గ్రహిస్తే మంచిది' అని శోభ అన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ కి పైసా కూడా విడుదల కాలేదన్న జగన్

అభివృద్ధి, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మైనార్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రావల్సి ఉందన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం పైసా కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. కమిషన్లు వేయటం తప్పా ప్రభుత్వాలు ముస్లింలకు చేసింది ఏమీ లేదని జగన్ అన్నారు.

పదవుల కోసమే పీఅర్పీని కాంగ్రెస్‌కు తాకట్టు

పదవుల కోసమే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టినట్లుందని మాజీ ఎంపీ హరిరామజోగయ్య తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రజలకు వివరణ ఇచ్చాకే చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయన అన్నారు. ఈ మేరకు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి హరిరామజోగయ్య ఓ లేఖను సంధించారు.

గంగూలీకి అస్సాం యూనివర్సిటీ డాక్టరేట్

భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి అస్సాం యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. గంగూలీతోపాటు మరో ముగ్గురికి కూడా డాక్టరేట్‌ను అందచేశారు. డాక్టరేట్ అందుకున్న వారిలో ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ ఇర్ఫాన్ హబీబ్, కళాకారుడు ప్రోఫెసర్ కేజీ సుబ్రమణ్యం, అస్సాం సాహిత్యకారుడు, జర్నలిస్ట్ హోమెన్ బోర్గోహెయిన్‌లున్నారు.

చార్మీ 'గబ్బర్ సింగ్'ని ఒప్పిస్తుందట

'మహా మహా...'అంటూ 'మంత్ర'లో రేపిన వేడి సెగలను ఇప్పుడు 'ఐస్ ఐస్...' అంటూ 'మంగళ'లో చల్లార్చుతున్న చార్మీకి 'రగడ'లో నాగార్జున పాటతో మంచి గిరాకీలు వచ్చి పడుతున్నాయి. ఒక పక్క హీరోయిన్ వేషాలను ట్రై చేస్తూనే మరో పక్క ఐటెం పాటల్లో రెచ్చిపోవడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది.

కత్తిలాంటి ఫిజిక్ అంటూ నాగార్జున ఇచ్చిన కాంప్లిమెంట్స్ చార్మిలో ధైర్యాన్ని నింపాయి కాబోలు ఏకంగా పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్'లో ఐటెం పాట కోసం లాబియింగ్ మొదలెట్టింది. హిందీ మాతృక 'దబంగ్'లో 'మున్ని బద్నాం' పాటకు దేవిశ్రీ ప్రసాద్ తెలుగు ట్యూన్ కడుతుంటే, మలైకా అరోరా ఖాన్ స్టెప్పులను చార్మీ నిశితంగా పరిశీలిస్తూ పవన్ కళ్యాన్ని పడగొట్టే పనిలో ఉంది. పవర్ స్టార్ పక్కన నర్తించే అవకాశం దొరికితే అదృష్టం తలుపులు తీసినట్టేనని చార్మీ అప్పుడే తన పాత ప్రియుడు దేవికి బ్రోకర్ పనులు అప్పజెప్పిందట.



తుపాకీ
నుంచి

కోర్టులో జడ్జీలకు మల్లికా షెరావత్ డ్యాన్స్ నచ్చింది

మల్లికా షెరావత్ పేరు వింటేనే తుల్లిపోయే కుర్రకారుకి పోటీగా ముసలివాళ్ళు కూడా తోడయ్యారు. సరిగ్గా అయిదేళ్ళ క్రితం ఓ అయిదు నక్షత్రాల హోటల్లో మల్లికా చేసిన రికార్డింగ్ డ్యాన్సు సంచలనం అయ్యింది. వినోద్ జైన్ అనే సంఘ సంస్కర్త అటెండ్ అయిన ఈ పార్టీలో మల్లికా చేసిన డ్యాన్సు ఆయనకు నచ్చలేదు. ఇంతటి అసభ్యకరమైన డ్యాన్సు తన జీవితంలో చూడలేదని, ఇదే డ్యాన్సులని సెన్సార్ లేకుండా టీవీల్లో ప్రసారం చేయడం మరింత దారుణమని కోర్టులో ఓ పిటీషన్ దాఖలు చేసాడు.

అయిదేళ్ళు కోర్టులో కేసు నడిచి, ముసలి జడ్జీలు పదేపదే అదే వీడియోను వందల వేల సార్లు చూసేసరికి మల్లికా ఫ్యాన్స్ అయిపోయారు. అందుకే మల్లికా చేసిన నృత్యంలో ఏ మాత్రం అశ్లీలత లేదని తమ విచారణలో తేలినట్టు ఓ జడ్జిమెంటు ఇచ్చేసారు. వినోద్ మాత్రం జడ్జీలకు ఈమె రికార్డింగ్ డ్యాన్సులు నచ్చాయేమో కానీ మల్లికాను వదిలేది లేదు అంటూ వీడియోను హై కోర్టు న్యాయముర్తులకు చూపిస్తానంటూ ముంబై హై కోర్టులో మళ్ళీ ఓ పిటీషన్ దాఖలు చేసాడు.



తుపాకీ నుంచి

బుడ్డోడిని బురిడి కొట్టిస్తారట

చిచ్చరపిడుగు జూనియర్ ఎన్టీయార్ 'శక్తి'కి అదనపు శక్తే అసలు శక్తి అయ్యేలా ఉంది. దర్శకులైనా, నిర్మాతలైనా బుడ్డోడి హీరోయిజం బేస్ చేసుకొనే సినిమాలు తీస్తారు కానీ కథనో, హీరోయిన్లనో నమ్ముకొని కాదు. కానీ విచిత్రంగా 'శక్తి' షూటింగ్ అయ్యేకొద్ది కేడీ లేడి పూజా బేడీకి పిచ్చిపిచ్చిగా పబ్లిసిటీ వచ్చేస్తోంది.

ఈజిప్టు రాకుమారి పాత్రలో నటిస్తున్న ఈ 'చిట్టెమ్మ మొగుడు' డాక్టరమ్మకు కెమెరా ముందు మొహమాటపడే గుణమే లేదు కనక దర్శకుడు మెహెర్ రమేష్ ఏ రెంజులో ఈ ఆంటీని ఆడేసుకున్నాడో అనే గుసగుసలు మొదలయ్యాయి. పూజాకి తోడు ఇలియానా తాజా అందాలు కూడా ఏడాది గ్యాపు తర్వాత అంగట్లో పెట్టేస్తోంది కాబట్టి 'శక్తి'కి ఈ ఇద్దరు అసలైన శక్తి కానున్నారని చెప్పుకోవచ్చు. మరి నిజంగానే బుడ్డోడిని బురిడీ కొట్టించే సత్తా వీరిలో ఉందంటే అభిమానులు ఊరుకుంటారా?



తుపాకీ నుంచి

వాళ్ల ముఖాలకు బిర్యానీ చేయడం వచ్చా?

మొన్నటికి మొన్న 'వాళ్లకు సిగ్గులేదు. వారిది రాక్షస సంతతి' అని విమర్శించిన టీఆర్ఎస్ చీఫ్... ఇప్పుడు ఆంధ్రా వాళ్లు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా తెలంగాణకు వచ్చారని...తెలంగాణలో చేసిందే బిర్యానీ! అసలు వాళ్ల ముఖాలకు బిర్యానీ చేయడం వచ్చా? ఆంధ్రోళ్లు చేసిన బిర్యానీ తింటే పేడ తిన్నట్లు ఉంటుంది'' అని సీమాంధ్రులకు ముస్లింల సంస్కృతి, సంప్రదాయాలే సరిగా తెలియవని కేసీఆర్ గేలి చేశారు.

రాష్ట్రంలో రాజకీయ అంత్యాక్షరి సాగుతోంది : రోజా

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి తానే అనేక సలహాలిచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్రంలో మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని జగన్ వర్గం నేత, సినీనటి రోజా ముఖ్యమంత్రికి సూచించారు. సలహాలివ్వడం గొప్పతనం కాదని, కార్యక్రమాల్ని అమలు చేయడమే గొప్ప అని ఆమె అన్నారు. పేద ప్రజల కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల్ని అమలు చేశారని రోజా తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరి గుండెల్లో వైఎస్ గూడు కట్టుకున్నారన్నారు.

రాష్ట్రంలో అనేక సమస్యలతో సతమతమౌతున్న ప్రజలకు మంచి నిర్ణయాలు తీసుకునే అధికారం ముఖ్యమంత్రికి ఉందని ఆమె అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ అంత్యాక్షరి సాగుతోందని రోజా ఆరోపించారు. జగన్‌పై ముఖ్యమంత్రి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు వంత పాడుతున్నాయన్నారు. పరిటాల హత్యకేసులో జగన్‌కు ఎలాంటి సంబంధంలేదన్న విషయం అందరికి తెలిసిందేనని అన్నారు.

రాష్ట్రంలో ఫ్యాక్షన్‌ను పెంచిపోషించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కలిసిపోయి జగన్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. జగన్‌పై ఆరోణలు చేయకుండా ఏమైనా ఆధారాలుంటే చూపాలని ఆమె డిమాండ్ చేశారు.

బ్రహ్మానందం పుట్టినరోజు ఫిబ్రవరి 1

చిన్నపిల్లలకు బెమ్మానందం, వూళ్ళ వాళ్ళకి బెమ్మిగాడు, అక్షరం ముక్కవచ్చి, సభ్యతతో మాట్లాడాలనుకునే వారికి బ్రహ్మానందం, తొలి సినిమా చూసాక పాత్ర మనసులో ముద్రపడిపోయిన వారికి అరగుండుగానే కొనసాగుతున్నారు బ్రహ్మానందం గిన్నిస్బుక్ఆఫ్వరల్డ్రికార్డులో హాస్యనటుడుగా నమోదు కాకముందు అయిన తర్వాత కూడా.


రేలంగి, రమణారెడ్డి, నాగభూషణం, అల్లురామలింగయ్య, రాజబాబు వీళ్ళు తెరమీద కనిపించగానే (అంతకుముందు వారు నటించిన చిత్రాలు చూసి పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వుకున్న కారణంగా) పడీ పడీ నవ్వుతారు. వీళ్ళు విలన్‌ తరహా పాత్రలు చేసినా హావభావాలు కిసుక్కున నవ్వేటట్టు చేస్తాయి. ఈ కోవలోకి చేరినందుననే బ్రహ్మానందం కూడా తెరమీద కనిపించగానే ఏ డైలాగూ చెప్పక పోయినా నవ్వు వచ్చేస్తుంది. కొంటె చూపులు, తిక్కతిక్కగా వున్నట్టు కనిపించడం, వెంగళాయిలా ప్రవర్తించడం, పెదవులు బిగించడం, లేదా రెండు చేతులూ తలమీద పెట్టుకోడం, నడిచే తీరు, ఇతర మేనరిజాల వల్ల ప్రేక్షకులకు చచ్చినట్టు అంటూ నిజంగా చచ్చినట్టు కాదు అసంకల్పికంగా నవ్వేస్తారు, నవ్వుకుంటారు, నవ్వుతూంటారు.

ఇక డైలాగ్స్‌ కూడా పాత్ర స్వభావానికి అనుగుణంగా రూపొందినట్లైతే అవి పేలిపోయి, థియేటర్ని నవ్వులతో పేల్చేస్తాయి. పక్కవాళ్ళు భుజాలు నొప్పి పెట్టడం వల్లనో, వీపు మార్మోగడం వల్లనో బాధపడే సందర్భాలు, ఆ బాధని వచ్చే నవ్వులో మరచిపోవడాలు కామన్‌. ఇంకా బెమ్మానందంని చూసిన తరువాత కడుపునొప్పి వచ్చినా, పళ్ళు కటకటాడినా, పెదవిగాని, నాలుక గాని కొరుక్కోవడం వల్ల రక్తం చిందినా ఆ బాధలు తెలియడానికి కొంత టైమ్‌ పడుతుంది. తెలిసాక అనుభవించిన భోగం వల్ల బాధ అంతగా బాధించదు.

గతంలో కామెడీ ఆర్టిస్టులు అవసరం వుండేది సినిమాకి. జంధ్యాల ప్రారంభించిన కామెడీ చిత్ర యజ్ఞం ఊపు అందుకుని ఇ.వి.వి. సత్యనారాయణ, రేలంగి నరసింహారావు వంటి దర్శకులుతో మహాయజ్ఞంగా మారి కామెడీ కామెడీ ఆర్టిస్టులు అవసరం కాదు అత్యవసరం అనే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఏర్పడటానికి కారకుల్లో ఒకరైన బ్రహ్మానందం పుట్టినరోజు ఫిబ్రవరి 1.

జగన్ గ్యాంగ్ అవుట్ .. చిరు వింగ్ ఇన్ ...

ప్రజారాజ్యం పార్టీకి కేబినెట్‌లో స్థానం