22, సెప్టెంబర్ 2012, శనివారం

కొత్త గెటప్‌లతో హీరోలు

నేటిట్రెండ్‌కు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించాలని హీరోలంతా ఉవ్విళ్లూరుతున్నారు. తాము చేసే సినిమా కథ మొదలుకుని పాత్ర వరకు అన్నింటిలోను వారు జాగరూకతతో వ్యవహరిస్తున్నారు. పాత్ర డిమాండ్‌ మేరకు ఎంతైనా కష్టపడి తమ బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకోవడానికి కూడా సంసిద్ధమవుతున్నారు. ఇందుకోసం సన్నబడటమే కాదు ఒక్కోసారి బరువు పెరగాలన్నా వెనుకాడటం లేదు. అంతేకాదు సిక్స్‌ప్యాక్‌ అవసరమైతే దానిని కూడా ఆచరణలో పెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే... పాత్ర తీరుతెన్నులను అనుసరించి అభిమానులను ఆకట్టుకునేందుకు హెయిర్‌ స్టైల్‌, డ్రస్సులు, గాగూల్స్‌ వరకు అన్నింటా కొత్తదనాన్ని ప్రదర్శించేందుకు హీరోలు పోటీపడుతున్నారు. కాగా కొందరు పేరున్న హీరోలు చేస్తున్న చిత్రాలను, పాత్రలను విశ్లేషిస్తే, ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తేటతెల్లమవుతాయి. ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళితే...!
బాలకృష్ణ: ఆ మధ్య 'శ్రీరామరాజ్యం'లో శ్రీరాముడిగా పౌరాణిక పాత్రలోను, ఆ తర్వాత 'అధినాయకుడు'లో మాస్‌ పాత్రలోను కనిపించిన బాలకృష్ణ ఈ మధ్యనే 'ఊకొడతారా... ఉలిక్కిపడతారా'లో జమీందార్‌ గెటప్‌లో కనువిందుచేశారు. ఇప్పుడేమో 'శ్రీమన్నారాయణ'లో పవర్‌పుల్‌ జర్నలిస్టుగా ఓ వైవిధ్యమైన పాత్రలో కనిపించడం విశేషం. పైపెచ్చు ఈ చిత్రంలో పదేళ్ళ వయసు వెనుకకు వెళ్లినట్లుగా బాలకృష్ణ ఎంతో గ్లామరస్‌గా కనిపించారని విశ్లేషకులు అంటున్నారు. కొన్ని సన్నివేశాలలో డ్రస్సులు మొదలుకుని గాగుల్స్‌ వరకు ఆయన తనదైన ప్రత్యేకతను కనబరిచారు. అభిమానులు సైతం ఇదే అభిప్రాయాన్ని ఆనందంతో వ్యక్తీకరిస్తుండటం విశేషం. కాగా బాలకృష్ణ చేయబోయే కొత్త చిత్రం గురించి ఏవేవో ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, అదేమిటన్నది ఇంకా ధ్రువీకరణ కాలేదు.
నాగార్జున: 'రాజన్న' లాంటి చారిత్రాత్మక చిత్రం చేసిన అనంతరం నాగార్జున భక్తిరస చిత్రంలో శిరిడిసాయి పాత్రలో కనిపించారు. ఇక వీటికి పూర్తి భిన్నంగా 'లవ్‌ స్టోరి' చిత్రంలో ఆ కథ, పాత్రకు అనుగుణంగా న్యూ లుక్‌తో ఫ్రెంచ్‌ గడ్డంతో ఆయన కనిపించబోవడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇదిలావుండగా, ఆయన నటించిన మరో చిత్రం 'డమరుకం' విడుదలకు సన్నద్ధమవుతోంది. ఈ తరహా సోషియో ఫాంటసీ చిత్రం చెయ్యడం తన కెరీర్‌లోనే మొదటిసారని నాగ్‌ ఆ మధ్య అన్నారు కూడా. ఇక ఈ చిత్రం క్లైమాక్స్‌ ఎంతో హైలైట్‌గా ఉంటుంది. ఆయా సన్నివేశాల్లో గెటప్‌ పరంగా కూడా ఆయన కొత్తగా కనిపించబోతున్నారు. నాగార్జున మరో కొత్త కోణంలో కనిపించబోయే 'భాయ్‌' చిత్రం కూడా త్వరలో సెట్స్‌పైకి రానుందని అంటున్నారు. ఇందులో కూడా మరో కొత్తకోణంలో ఆయన కనిపిస్తారని చెబుతున్నారు. ఇక అక్కినేని నాగేశ్వరరావుతో పాటు నాగార్జున, నాగచైతన్య ముగ్గురు కలసి నటించబోయే చిత్రం కూడా నాగార్జునకు ఇంకో వైవిధ్యభరితమైన చిత్రం అవుతుందని అంటున్నారు.
వెంకటేష్‌: ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'బాడీగార్డ్‌' అంచనాలకు చేరువ కాలేకపోయింది. ఈ నేపథ్యంలో వెంకటేష్‌ ఇప్పుడు ఒకటికి రెండు చిత్రాలలో నటిస్తున్నారు. మహేష్‌బాబుతో కలసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు'లో వారిద్దరూ అన్నదమ్ములుగా నటిస్తున్నారు. కుటుంబ అనుబంధాలకు సంబంధించిన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కుటుంబ కథా చిత్రాల హీరోగా పేరున్న ఆయనకు ఈ చిత్రంలోని పాత్ర ఎంతో పేరు తెచ్చిపెడుతుందని అంటున్నారు. ఇక మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'షాడో' చిత్రంలో అండర్‌ వరల్డ్‌ డాన్‌ పాత్రలో నటిస్తున్నారు. హెయిర్‌స్టైల్‌ మొదలుకుని డ్రస్సు వరకు అన్నివిధాలా కొత్త గెటప్‌లో కనిపించబోతున్నారు. ఇక వివేకానందుడి పాత్రలో కూడా నటించాలని వెంకటేష్‌ ఎంతగానో ఉవ్విళ్లూరుతున్నారు. ఈ చిత్రాల తర్వాత వివేకానందుడి చిత్రం మొదలవుతుందని అంటున్నారు. ఈ చిత్రాలు, ఇందులోని పాత్రలు వేటికవే విభిన్నమైనవి కావడం గమనార్హం.
పవన్‌ కల్యాణ్‌: 'గబ్బర్‌సింగ్‌' ఘన విజయం సాధించిన నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంతవరకు తన కెరీర్‌లో చెయ్యని జర్నలిస్టు పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టుగా ఆయనెంతగానో ఒదిగిపోయారని దర్శకుడు పూరి జగన్నాధ్‌ అంటున్నారు. దాదాపు 12 ఏళ్ళ క్రితం కెరీర్‌ మొదటి దశలో వీరిద్దరి కలయికలో 'బద్రి' వచ్చి విజయవంతమైన సంగతి తెలిసిందే. ఇందులో న్యూ లుక్‌తో మరింతగా ప్రేక్షకాభిమానులను ఆయన ఆకట్టుకోనున్నారని పూరి చెబుతున్నారు. ఈ చిత్రం తర్వాత నిర్మాత కొండా కృష్ణంరాజు హిందీ, తెలుగు భాషల్లో నిర్మించే చిత్రంలో పవన్‌ నటించనున్నారు. దీనిద్వారా ఆయన బాలీవుడ్‌లోకి ప్రవేశిస్తున్నారు.
మహేష్‌బాబు: 'దూకుడు', 'బిజినెస్‌మేన్‌' వంటి విభిన్నమైన చిత్రాల అనంతరం మహేష్‌ చేస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు'. ఇది పూర్తిగా ఫ్యామిలీ సెంటిమెంట్‌ చిత్రం కావడంతో ఇందులో మహేష్‌ తన హెయిర్‌స్టైల్‌ మార్చినట్లుగా తెలుస్తోంది. ఇటీవల విడుదల చేసిన స్టిల్స్‌లో ఆ విషయాన్ని గమనించవచ్చు. కొన్ని మాస్‌ చిత్రాల తర్వాత కుటుంబ చిత్రంగా మహేష్‌కు ఇది ఓ విభిన్నం కానుంది. ఇక సుకుమార్‌ దర్శకత్వంలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తీస్తున్న చిత్రంలో కూడా మహేష్‌ నటిస్తున్నారు. దీనికోసం మహేష్‌ సిక్స్‌ప్యాక్‌ చేస్తున్నారని వినికిడి.
జూనియర్‌ ఎన్‌.టి.ఆర్‌.: 'దమ్ము' చిత్రం తర్వాత జూనియర్‌ ఎన్‌.టి.ఆర్‌. చేస్తున్న చిత్రం 'బాద్‌షా'. మాఫియా నేపథ్య కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్‌.టి.ఆర్‌. కొత్తగా కనిపిస్తారని చెబుతున్నారు. అంతేకాదు ఈ చిత్రంలో ఆయన ఫ్రెంచ్‌ గడ్డంతో కనిపించ బోవడం ఓ విశేషం. ఇంతవరకు ఇటలీ, బ్యాంకాక్‌ వంటి విదేశాలలో ఈ చిత్రం భారీ షెడ్యూల్‌ను జరుపు కుంది. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, పూరీ జగన్నాథ్‌, హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో ఎన్‌.టి.ఆర్‌. చిత్రాలు చేస్తారని అంటున్నారు.
రామ్‌చరణ్‌: 'రచ్చ' తర్వాత రామ్‌చరణ్‌ ఇప్పుడు ఒకటికి మూడు చిత్రాలు చేస్తుండటం విశేషం. పేరున్న యువ కథానాయకులకు ఇది ఎంతో స్ఫూర్తిదాయకమవుతోందని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో 'నాయక్‌' చిత్రంలోను, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు'లోను రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. అలాగే హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న 'జంజీర్‌'లో కూడా ఆయన నటిస్తున్నారు. ఈ మూడు చిత్రాల్లోను పొంతన లేకుండా అటు పాత్రో చితంగాను, ఇటు లుక్‌ పరంగాను విభిన్నంగా కనిపించేందుకు ఆయన జాగ్రత్తలు తీసుకున్నారట.
ప్రభాస్‌: యంగ్‌ రెబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాస్‌కు మాస్‌ చిత్రాలు, పాత్రలు పెట్టిందిపేరు. అయితే ఆ ఇమేజ్‌కు భిన్నంగా ఆయన నటించిన చిత్రాలు 'డార్లింగ్‌', 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' చిత్రాలు వరుసగా విజయవంతం కావడంతో నటుడిగా ప్రభాస్‌ ఎంతో పరిణతి సాధించాడని కృష్ణంరాజు కూడా ఎంతో మెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ తన ఇమేజ్‌కు అనుగుణమైన మాస్‌ పాత్రలో 'రెబల్‌' చిత్రం ద్వారా కనువిందు చేయబోతున్నారని ఆ చిత్ర దర్శకుడు రాఘవ లారెన్స్‌ అన్నారు. ప్రభాస్‌ కెరీర్‌లోనే ఇంతకుముందెన్నడూ జరగనంత జాప్యం ఈ చిత్ర నిర్మాణంలో చోటుచేసుకుంది. ఈ చిత్రం పూర్తయ్యేందుకు ఒకటిన్నర సంవత్సరానికి పైగా పట్టింది. క్వాలిటీ కోసమే అంత సమయం తీసుకున్నామని లారెన్స్‌ అన్నారు. ఇందులోని పాత్రలో ప్రభాస్‌ లుక్‌ పరంగా కూడా చాలా కొత్తగా కనిపించనున్నారు. విడుదలైన కొన్ని స్టిల్స్‌లో డ్రస్సుల్లోను, గాగుల్స్‌లోను ఆయన కొత్తగా కనిపిస్తున్నారు. ఇక ప్రభాస్‌ నటిస్తున్న మరో చిత్రం 'వారధి' కూడా ఆయనకు విభిన్నమవుతుంది. ఇందులో మరో కోణంలో ఆయన కనిపించనున్నారు. వీటి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ చిత్రం చేస్తారని అంటున్నారు.
శ్రీకాంత్‌: ఫ్యామిలీ చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్‌ మరోవైపు మాస్‌ చిత్రాలలో కూడా నటిస్తున్న విషయం తెలియంది కాదు. ఆ మధ్య 'శ్రీరామరాజ్యం'లో లక్ష్మణుడిగా పౌరాణిక పాత్రలో సైతం పేరుపొందిన ఆయన ఇప్పుడు 'దేవరాయ'లో శ్రీకృష్ణ దేవరాయలు పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో దొరబాబు అనే మరో మాస్‌ పాత్రను కూడా చేస్తున్నారు. తాను శ్రీకృష్ణదేవరాయలు పాత్ర చేసేందుకు 'శ్రీరామరాజ్యం'లోని పాత్ర ఎంతో ప్రేరణను ఇచ్చిందని శ్రీకాంత్‌ అన్నారు. ప్రస్తుతం వెంకటేష్‌ 'షాడో'లో ఆయన ఓ కీలక పాత్రను చేస్తున్నారు. అలాగే 'శత్రువు' అనే మరో చిత్రంలో మాస్‌ పాత్రలో నటిస్తున్న ఆయన ఇవన్నీ తనకు విభిన్నమైనవని అంటున్నారు. కాగా ఈ హీరోల చిత్రాలు కొన్ని త్వరలోను, మరికొన్ని విజయదశమి, దీపావళి, ఇంకా ఈ ఏడాది ఆఖరులోను, వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నద్ధ మవుతున్నాయి. ఈ పోటీలో ఎవరు విజేతలవుతారన్న అంశం ప్రేక్షక న్యాయస్థానంలోనే తేలుతుంది.
- శ్రీరామ్‌

రీల్‌ వెనుక....

సినిమా రంగుల ప్రపంచంలో వెలుగునీడలు పక్కపక్కనే ఉంటాయి. సినిమాను నమ్మకుని చిత్రసీమకు చేరుకున్న చాలామందిలో కొందరు అందలమెక్కితే మరికొందరు ఎదుగుబొదుగులేని జీవితం గడుపుతున్నారు. కళ్ళముందే వచ్చిన వాళ్ళు ఎదుగుతుంటే తమ దురదృష్టానికి చింతిస్తూ కుమిలిపోతున్నవారెందరో కనిపిస్తారు. ఉదయం నుండి ప్యాకప్‌ చెప్పేవరకు యూనిట్‌ అందరికీ తిండి తిప్పలు చూసే ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌ల జీవితాన్ని పరిశీలిస్తే కష్టాలే కనిపిస్తాయి. వందలాది మంది ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌ల జీవితాలు ఇంతే. ''నెలలో పనిదొరికేది కేవలం వారం పది రోజులే, మిగతా రోజుల్లో పస్తులు ఉండాల్సిందే. రోజు భత్యంగా కేవలం 500 మాత్రమే ముడుతాయి'' అంటున్నారు ప్రొడక్షన్‌ అసిస్టెంట్స్‌ పొంబల రాజు, చంటి (రాజు).
''మా పని సూర్యుడు ఇంకా రాకముందే అంటే నాలుగు గంటలకే మొదలవుతుంది. ప్రొడక్షన్‌ మేనేజర్‌ చెప్పిన ప్రొగ్రామ్‌ ప్రకారం నడుచుకుంటాం. నాలుగు గంటలకే అడ్డాకు చేరుకుని, అక్కడికి మేనేజర్‌ పంపిన వ్యాన్‌లో మెస్‌కు చేరుకుంటాం. ముందురోజు రాత్రి ఆర్డర్‌ చేసిన టిఫిన్లు వ్యాన్‌లోకి ఎక్కించుకుని ఉదయం ఆరు గంటలకల్లా లొకేషన్‌ చేరుకుంటాం. లొకేషన్‌లోనే టీ తయారు చేసి, యూనిట్‌ అందరికీ సప్లయ్‌ చేస్తాం. ఆ తర్వాత టీఫిన్లు సిద్ధం చేస్తాం. హీరో హీరోయిన్‌, దర్శకుడు, నిర్మాత, ఇతర ప్రధాన టెక్నీషియన్స్‌కు ఎవరికివారికే ప్రత్యేకంగా క్యారేజ్‌లు కట్టి ఉంచుతాం. వాటిని వారి గదికి చేర్చాలి. మిగతావారికి స్వయంగా వడ్డిస్తాం. టిఫిన్స్‌ పూర్తికాగానే మళ్ళీ మెస్‌కు చేరుకుని మధ్యాహ్న భోజనాల ఏర్పాట్లు, ఆ తర్వాత డిన్నర్‌కు కావాల్సినవి ఏర్పాట్లుచేసుకోవాలి. సినిమాకు సంబంధించి మొట్టమొదట వచ్చి, చివర్లో వెళ్ళిపోయేవాడు ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌'' అని రాజు చెప్పారు.'' ''మాది అనంతరపురం జిల్లా సింగనమల మండలం, అలంకరాయనిపేట గ్రామం. పనికోసం వెతుక్కుంటూ 28 సంవత్సరాల క్రితం చెన్నై వెళ్ళాను. కొన్నాళ్ళు విజయకృష్ణ ఆఫీసులో బాయ్‌గా చేశాను. సీనియర్‌ నటుడు నరేష్‌కు అసిస్టెంట్‌గా కొద్దికాలం చేశాక. 'అలజడి' సినిమా నుండి ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌గా మారాను. అక్కడ (చెన్నై), ఇక్కడ (హైదరాబాద్‌) యూనియన్లలో మెంబర్‌ షిప్‌ ఉంది. అప్పట్లో 3,500లకు సభ్యత్వం ఇచ్చేవారు. ఇప్పుడైతే రూ.లక్ష డెబ్బైఅయిదు వేలు తీసుకుంటున్నారు. ఇక మాకు పని దొరికే రోజులు తక్కువే. ఈ రంగంలో కూడా పోటీ పెరిగింది. కొందరు మేనేజర్లు తమ బంధువులను పిలిపించి, యూనియన్‌ సభ్యత్వం ఇప్పించి, పనికల్పిస్తున్నారు. దీనివల్ల మాలాంటి సీనియర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎలాంటి రక్షణ లేని జీవితాలు మావి. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగిదే వైద్య ఖర్చులకోసం యూనియన్‌ కొంత అప్పు ఇస్తుంది. అయితే ఇదంతా తీర్చాల్సిందే. నా వ్యక్తిగత విషయానికి వస్తే నాకు ఇద్దరు పిల్లలు. పెద్ద అమ్మాయి ఇంజనీరింగ్‌ చదువుతోంది. అబ్బాయి ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. పదిహేనేళ్ళ క్రితం కొందరి సూచనమేరకు హైటెక్‌ సిటీ ప్రాంతంలో కొంత స్థలం తీసుకున్నాను. అక్కడే రేకులతో ఇళ్ళు నిర్మించుకున్నాను. అందులో కొంతభాగం అద్దెకిచ్చాను. ఆ అద్దె మా కుటుంబాన్ని పోషిస్తోంది. సినిమా అంటే ఉన్న ఇష్టం వల్ల ఇబ్బందులు ఎదురైనా కొనసాగుతున్నాం. నాలాంటి వారు చాలా మంది ఉన్నారు'' అని పొంబల రాజు వివరించారు. ''మాలాంటివారికోసం ప్రభుత్వం కానీ పరిశ్రమ కానీ ఏదైనా చేస్తే బావుంటుంది. పని గ్యారంటీలేని జీవితాలుమావి. అందుకే మా పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివించాలనే ఉద్దేశంతో కష్టపడుతున్నాం'' అని ముక్తాయించారు.
- పృథ్వీ

నృత్యప్రధానంగా ఎబిసిడి

ఆధునిక పోకడలతో రూపొందిన సంగీత నృత్య ప్రధాన చిత్రం ఎబిసిడి: 'ఎనీబడీ కెన్‌ డ్యాన్స్‌'. నృత్య దర్శకుడుగా, నర్తకుడుగా, దర్శకుడుగా, హీరోగా రాణిస్తున్న ప్రభుదేవా ఒక డ్యాన్సర్‌గా నటించారు రిమో డిసౌజా దర్శకత్వంలో. రోన్నీ స్క్రూవాలా, యూటివి మోషన్‌ పిక్చర్స్‌ సి.ఇ.ఓ. సిద్దార్థ రాయ్‌ కపూర్‌ కలసి నిర్మించి తన చిరకాల స్వప్నం నిజం చేసారని దర్శకుడు రియో డిసౌజా పేర్కొన్నారు. యుటివి మోషన్‌ పిక్చర్స్‌ అన్నివిధాల అండగా నిలవడంతో 3డిలో రూపొందించానని, విడుదలయ్యాక కుటుంబ ప్రేక్షకులను అలరిస్తూ అద్భుతాలు సృష్టిస్తుందనే నమ్మకం తనలో నాటుకుపోయిందన్నారాయన.
ప్రధానపాత్ర పోషించిన ప్రభుదేవా అయితే మిగతా డ్యాన్సర్లతో కలిసి నటిస్తుంటే పునరుత్తేజం పొందారు. యువ నృత్యకళాకారులతో కలిసి నటిస్తున్నప్పుడు సంభ్రమాశ్చర్యాలు ముప్పిరిగొన్నాయట. అద్భుతమైన ప్రతిభ కలిగిన వాళ్ళతో కలసి స్టెప్స్‌ వేయగలనా, డ్యాన్స్‌ చేయగలనా అని పలుమార్లు ఆలోచనలో పడ్డారు కూడా. దాంతో తను టీనేజ్‌ యువకుడుగా మారి నటనకంటే డ్యాన్స్‌లకే ప్రాధాన్యత ఇచ్చారు ప్రభుదేవా.
అమెరికన్‌ డ్యాన్స్‌ రియాల్టిdషోల ద్వారా పాప్యులర్‌ అయిన లారెన్‌ గొట్‌లైబ్‌ మరొక కీలకమైన పాత్ర పోషించడమేకాక తన నృత్యాలతో ఆశ్చర్యం కలిగించారు. హాలీవుడ్‌లో నటించాలన్న లక్ష్యంతో చాలా ప్రయత్నాలు చేసినా నెరవేరక పోవడంతో బాలీవుడ్‌ ద్వారా నటుడుగా, డ్యాన్సర్‌గా నిరూపించుకునే అవకాశం ఏర్పడటం తన అదృష్టంగా భావిస్తున్నారు.
ప్రముఖ డ్యాన్సర్‌ గణష్‌ ఆచార్య మరో కీలక పాత్ర పోషించారు. డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ రియాల్టిd షోలో విజేతలైన సల్మాన్‌ యూసఫ్‌ ఖాన్‌, ధర్మేష్‌ యలండే, మయురేష్‌ వాడ్కర్‌, వృశాలి చవాన్‌ అద్భుతంగా డ్యాన్స్‌లు చేసినట్టు తెలుస్తోంది. పునీత్‌ పథక్‌, కిశోర్‌ అమన్‌, భావనా ఖండూజ, సాజన్‌ సింగ్‌, జితేంద్ర ఆచార్య, అంకిత్‌ గుప్తా మిగతా పాత్రధారులు. దర్శకుడు రియో డిసౌజా కూడా నటించారు.
సబీన్‌ జిగార్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం 1గంట 50 నిముషాల పాటు ప్రదర్శితమయ్యేలా రూపొంది 28వ తేదీన విడుదలవుతోంది.

'లైట్‌' తీస్కో ...

బస్టాప్‌లో బస్‌ కోసం నిలబడతాం. దూరం నుంచి బస్‌ వస్తోంది. చెయ్యెత్తాం. తీరా బస్‌ ఆగలేదు. మనం మామూలుగా కాకుండా తల నిమురుకున్నట్టుగా చేతిని కిందికి దించుతాం. ఏదో ఒక పార్టీకి వెళ్లాము. అందరికంటే మన బట్టలు సరిగ్గా లేవని మనసులో అనిపించింది. ఇక పార్టీ అయి ఇంటికి వెళ్లే వరకు ఆ ఆలోచన వదలదు. ఆఫీస్‌లోనో, ఇంట్లో బంధువులో మనకు తగిన విలువ ఇవ్వలేదు. మనసులోంచి ఆ విషయం ఎంత తీసేయాలన్నా సాధ్యం కావటం లేదు-ఇవన్నీ మనందరికీ ఎపðడో ఒకపðడు జీవితంలో ఎదురయ్యేవే. ఇతరుల అంచనాలకు తగినట్టుగా లేమేవెూ అనే ఆలోచన. మనల్ని చూసి ఎవరేమనుకుంటున్నారో అనే బిడియం - నిరంతరం మనుషుల్ని వెంటాడుతుంది. కొందరిలోఎక్కువగా, కొందరిలో తక్కువగా. ఇలాంటి అనవసరమైన విషయాలు మనల్ని అతిగా బాధపెడుతుంటే జీవితం పట్ల మన ఆలోచనలు సరిగ్గా లేవని అర్థం. తేలిగ్గా తీసుకోవాల్సిన విషయాలను కూడా భారంగా చూస్తున్నామంటే కొన్నాళ్లకు మనకు మనమే భారంగా మిగులుతాం -

టేకిటీజీ పాలసీ లేకపోతే....

- జీవితం సంక్లిష్టంగా లేదు...మన ఆలోచనలే అలా ఉన్నాయి. జీవితం ఎపðడూ సింపుల్‌గానే ఉంటుంది. సింపుల్‌గా ఉండటంలోనే సత్యముంది - ఆస్కార్‌వైల్డ్‌
- ఏడుపు అనేది మన కన్నీళ్లను వృథా చేసే ప్రక్రియ, ఎవరికోసం ఏడుస్తావెూ వారు మన కన్నీళ్లకు అర్హులు కారు. అలాంటి అర్హత ఉన్నవారు అసలు మనకు కన్నీళ్లే తెప్పించరు.
- సంతోషం అనేది సీతాకోకచిలుక. మనం వెంటబడుతుంటే దొరకకుండా తప్పించుకుంటుంది. వదిలేసి ప్రశాంతంగా కూర్చున్నపుడు వచ్చి మన భుజంపై వాలుతుంది
- బాధలు తప్పవు... ఎదుర్కొనే శక్తిని పెంచుకోవాలి సమస్యలు తప్పవు... అధిగమించే నైపుణ్యం పెంచుకోవాలి. సవాళ్లు తప్పవు... పోరాడే తెలివితేటలు పెంచుకోవాలి
- భగవంతుడు ఈ భూమ్మీద బోలెడు కామెడీ నాటకాలు రాశాడు. అయితే జరిగిన పొరబాటు ఎక్కడంటే వాటిలో నటించడానికి సరైన నటుల్ని ఎంపిక చేసుకోలేదు.
- తెలివితేటలు అనుభవం నుంచి వస్తాయి. అయితే చాలా అనుభవాలు మనకు తెలివితేటలు లేకపోవటం వలన కలుగుతాయి.
పువ్వులాంటి జీవితాన్ని ముల్లుగా ఎందుకు చూస్తున్నాం
అక్కర్లేని విషయాల్లోనే ఎందుకు చక్కర్లు కొడుతున్నాం
భారం, భయం, బోర్‌, బేజారు... వీటిని తప్పించుకోలేమా
టేకిటీజీ - అనే పదం అంత కష్టమా
చిన్నతనంలో అందరికీ జీవితం తెెలిగ్గా కనబడుతుంది. అందంగా ఉంటుంది. సీతాకోకచిలుక కనిపించినా, ఇష్టమైన చిరుతిండి తిన్నా, ఆరుబయట ఆడుకున్నా బోలెడు ఆనందం కలుగుతుంది. నవ్వుతున్నవాళ్లంతా మంచి వాళ్లలా, కోపంగా ఉన్నవారంతా చెడ్డ వ్యక్తులుగా కనబడుతుంటారు. కానీ రానురాను పెద్దయిన కొద్దీ ఆనందాలు మాయమవుతుంటాయి. ప్రపంచంలో ఉన్న చెడు అనుభవంలోకి వస్తుంది. ఇతరులు ఎలా ఆలోచిస్తున్నారో అలాగే ఆలోచించడం మొదలుపెడతాం. జీవితంలో అవమానాలు, కష్టాలు, అపజయాలు తెలుస్తుంటాయి. మనసుకి నొప్పి కలుగుతుంది. ఇంకెప్పుడూ అలాంటి నొప్పి లేకుండా బతకాలనిపిస్తుంది. ఇక అక్కడితో మనం మనలాగా కాకుండా ఇంకోలా ప్రవర్తించడం అలవాటు చేసుకుంటాం. ఇవన్నీ భారంగా కనిపిస్తాయి.
మనం బాధపడకుండా ఉండాలంటే, విజయాలు సాధించాలంటే ఇతరులకంటే ముందుండాలంటే ఏంచేయాలో ఆలోచిస్తాం. ఇక అప్పటినుండి ఈర్ష్య, అసూయలు, భయాలు, మైండ్‌గేమ్‌లు అన్నీ మొదలవుతాయి. వీటిమధ్య జీవితం మరింత క్లిష్టంగా మారిపోతుంది.
న లైట్‌తీస్కో అంటున్న యువతరం!
ఈ మధ్యకాలంలో యువతరం, పిల్లల నోటివెంట ఒకమాట ఎక్కువగా వినబడుతోంది. అది లైట్‌తీస్కో- ఒ క రకంగా ఇది మంచి మార్పే. జీవితాన్ని ఇదివరకటికంటే తేలిగ్గా తీసుకోవటం ఈ తరం వారికి అలవాటవుతోంది. అయితే ఇక్కడొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. జీవితంలో అన్ని విషయాలు లైట్‌గా తీసుకునేవి కావు. అలాగే అన్నీ భారంగా భావించాల్సినవీ కావు. పరీక్షలు ఫెయిలయినపుడూ, వ్యాపారంలో నష్టాలు వచ్చినపుడూ, చేయాల్సిన పనులన్నీ పేరుకుపోతున్నపుడూ- లైట్‌తీసుకున్నామంటే ఇక అంతే సంగతులు. జీవితం కూడా మనల్ని లైట్‌గా తీసుకుని మనకంటూ ఎక్కడా గుర్తింపు, గౌరవం లేకుండా చేసేస్తుంది.
న అనవసరమైనవి వదిలించుకోవడమే తెలివి
మన స్థాయిని పెంచి మేలుచేసే విషయాలను చాలా గట్టిగా పట్టుకోవాలి. అలాగే ఎందుకూ పనికిరాకపోయినా కొన్ని విషయాలు మనల్ని జిడ్డులా పట్టుకుని వదలనంటుంటాయి. వీటిని వదిలేస్తుండాలి. అంటే పట్టువిడుపులన్నమాట.
ఒక్కసారి రెండుమూడు తరాల ముందుజీవితాలను పరిశీలిస్తే, అప్పటిరోజుల్లో ఉన్న మాటపట్టింపులు, అలకలు, సంవత్సరాల తరబడి మాట్లాడకుం డా బిగదీసుకుపోవడాలు, అవమానం ఎదురైతే కుమిలిపోవడాలు... ఇప్పుడు అంతగా లేవు. మనం గమనిస్తే ఇరవైఏళ్ల క్రితం వరకు మన సినిమాల్లో సంవత్సరాల తరబడి మాట పట్టింపులతో విడిపోయి బతికే భార్యాభర్తలు, సే ్నహితులు, అన్నదమ్ముల పాత్రలు కనిపిస్తుండేవి. ఇప్పుడు జీవితాన్ని అంత సీరియస్‌గా తీసుకుని బాధల్ని మూటలు కట్టుకుని ముం దురోజులకు తీసుకుని పోదామని ఎవరూ అనుకోవటం లేదు. ఇదంతా మంచి పరిణామమే. మనకీ అవతలివారికి కూడా ఏమాత్రం మేలుచేయని అంశాలను పట్టుకుని వేళ్లాడేబదులు వాటిని టేకిటీజీ...అనివదిలేయడమే మేలు.
న క్రమశిక్షణకు హాస్యం అడ్డుకాదు
మనం చాలాసార్లు చాలా తప్పుడు అభిప్రాయాలతో ఉంటాం. తల్లి ఎప్పుడూ పిల్లలకు ఏమీ తెలియదని, తాను వాళ్లని చక్కదిద్దుతున్నాననే అభిప్రాయంతో ఉంటుంది. అలాగే ఉపాధ్యాయులు టీచర్లు, ఇరుగుపొరుగు, కొలీగ్స్‌, బంధువులు...ఇలా ఒకచోట కలిసి పనిచేస్తున్నపుడు మనం అవ తలి వారిపట్ల ఒక అభిప్రాయంతో ఉంటాం . అందుకే అవ తలి వ్యక్తుల మాటలు, పనులు, చలోక్తులు లాంటివి పెద్దగా గమనించము. అన్నిచోట ్ల అందరూ స్వేచ్ఛగా ఉండవచ్చు- అనే అభి ప్రాయం బలంగా ఉన్నపుడు మాత్రమే మనం ఇతరుల మాటలకు విలువనివ్వగలం. వారితో కాస్త హాస్యాన్ని జోడించి మాట్లాడగలం. వారు వేసే జోకులకు మనస్ఫూర్తిగా నవ్వగలం. అలాంటి వాతావరణం తేలిగ్గా ఉంటుంది.
కొంతమంది ఎక్కువగా నవ్వడాన్ని ఒక నేరంగా పరిగణిస్తారు. క్రమశిక్షణ, హద్దులు వీరికి బాగా నచ్చిన పదాలు.
జీవితంలో మనం ఏర్పరచుకున్న ఏ నియమమైనా మనకు ఆనందాన్ని విశాలత్వాన్ని ఇవ్వాలి. అలాకాకుండా నేను చాలా ఉన్నతంగా, క్రమశిక్షణతో బతుకుతున్నాను- అనే భావనతో ముడుచుకుపోయి సీరియస్‌గా ఉండటం వలన జీవితం దానికున్న సహజమాధుర్యాన్ని కోల్పోతుంది. చరిత్రలో మనకు తెలిసిన చాలామంది పెద్దవాళ్లు హాస్యాన్ని ప్రేమించారు. ఇతరులపట్ల చాలా ఆదరంగా ఉన్నారు. తాము సాధించాల్సిన కార్యాలకోసం మాత్రం సీరియస్‌గా పనులు చేశారు.
నపనిలో పట్టుదల...ఫలితం టేకిటీజీ!
టేకిటీజీ పాలసీకి వ్యతిరేక పదం చెప్పాలంటే పర్‌ఫెక్షనిజం. తీసినగ్లాసు తీసినచోట, పెట్టిన వస్తువు పెట్టిన చోట ఉంచడంతో మొదలైన పర్‌ఫెక్షనిజం పెద్దపెద్ద విషయాల వరకు వెళ్లిపోతుంది. ఇదంతా క్రమశిక్షణలో భాగంగా చిన్నతనంలో నేర్చుకుంటాం. ఇది ఇలాగే ఉండాలి- అనటంలో ఒక సీరియస్‌నెస్‌ ఉంది. అయితే ఇక్కడ క్రమశిక్షణని తక్కువ చేసి మాట్లాడటం కాదు. జీవితాన్ని సౌకర్యంగా మార్చుకోవడానికి మనం పద్ధతులు ఏర్పాటు చేసుకున్నాం. ఃఈ విధానాలు మనకోసంః అనుకున్నంతసేపు బాగుంటుంది...మరి కాస్త ముందుకువెళ్లి ఈ గొప్ప పద్ధతులు పాటించడానికే మనం పుట్టాము- అనుకుంటేనే వస్తుంది సమస్యంతా.
కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నదానికి వ్యతిరేకంగా జరిగినా తట్టుకునే ఓర్పు, సహనం ఉండాలి. సందర్భానికి అనుగుణంగా మనల్ని మనం సవరించుకునే శక్తి ఉండాలి. ఇదే ఫ్లెక్సిబిలిటీ. అయితే ఎక్కడ ఎంతవరకు పట్టుదలగా ఉండాలి, ఎక్కడ సడలించవచ్చు...లాంటి విషయాలు మన విచక్షణమీద ఆధారపడి ఉంటాయి.
ఇంకా చెప్పాలంటే పనిచేసేటప్పుడు గట్టిపట్టుదలతోనే చేయాలి. కానీ ఫలితం విషయంలో టేకిటీజీ పాలసీతో ఉండాలి. ముఖ్యంగా ఏం చేసినా మారని విషయాల్లో, అనుకోకుండా ఫలితం తారుమారు అయినపుడు, ఇతరులు మనవల్ల బాధపడతారు అనుకున్నపుడు, ఒక విషయం ఎక్కువ సమయం మనల్ని బాధకి గురిచేస్తున్నపుడు టేకిటీజీయే శ్రీరామరక్ష.
నఈజీగా గాయపడతాము...
ఎవరే చిన్నమాటన్నా కొంపలు మునిగిపోయినంత బాధకలుగుతుంది. ఈజీగా తీసుకునే అలవాటు ఉండదు కాబట్టి ఏ విషయాన్నీ అలా తీసుకోలేము. ఎవరు ఏమన్నా తట్టుకోలేకపోవటం అం టే అది అన్ని వేళలా ఆత్మాభిమానం అవ్వదు. ఒక గాజు మేడని లోపల నిర్మించుకుని ఎవరు రాయేస్తారోననే దిగులుతో గడపటం. అదే మన లోపల ఒక కంచుకోట ఉంటే...
న గతంలో చేసిన తప్పులనుంచి బయటపడలేము
పొరబాట్లు తప్పులు చేయకుండా జీవితాలే ఉండవు. వాటినుండి పాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్లాలి. పొరబాట్లని తేలిగ్గా తీసుకోలేకపోతే అది ఆ పొరబాటుని మించినది అవుతుంది. ఎందుకంటే గతాన్ని తీసేయలేకపోవటం అంటే భవిష్యత్తుని వదిలేసుకోవటం. ముందున్న గమ్యాన్ని చేరడానికి వెనక్కి నడిచినట్టుగా ఉంటుంది. ఇతరులు చేసిన పొరబాట్లను కూడా ఇలాగే చూడాలి. త్రాసు పట్టుకుని ఇతరులు చేసిన తప్పుల్ని, మన పొరబాట్లని కొలతలు వేసుకుని తీర్పులు ఇవ్వడానికి మనం పైనుంచి దిగివచ్చిన న్యాయమూర్తులం కాదు. జరిగిపోయిన విషయాల్లోంచి ఒక కొత్త విషయాన్ని నేర్చకోవటం తప్ప మరే ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోవాలి.
నఇతరులనుంచి ఎక్కువ గౌరవం, కృతజ్ఞత ఆశిస్తాము
మనం చాలా గొప్పవ్యక్తులమనీ, అందరూ మనల్ని గౌరవించాలనే మిథ్యాభావన ఒకటి ఉంటుంది. అలాంటి గౌరవం దక్కకపోతే తట్టుకోలేము. ఏదో పోగొట్టుకున్నట్టు బాధపడిపోతాం. గౌరవం, కృతజ్ఞత బయటనుంచి మనకు వచ్చేవి కావు. ఇవి మనలోపలే ఉంటాయి. ఃనీ ప్రమేయం లేకుండా ఎవరూ నిన్ను అవమానించలేరుః అంటారు మహాత్మా గాంధి. గౌరవం అంటే మనపట్ల మనకున్న విశ్వాసం. కృతజ్ఞత అంటే జీవితంలో మనకు లభించిన ఎన్నో మంచి విషయాలను గుర్తించి, వాటిని కలిగి వున్నందుకు ఆనందంగా, సంతృప్తిగా ఉండటం. ఇతరులు మనతో ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది వారి సొంత విషయం. దానికి, మన ఆనందానికి ముడిపెట్టి చూడడం హాస్యాస్పదం.
నమన లక్ష్యాలను నిర్లక్ష్యం చేస్తాము
జీవితంలో లక్ష్యాన్ని మాత్రమే చూడాలంటే అనసరమైన విషయాలను నిర్లక్ష్యం చేయాలి. పరిస్థితులు, మనుషులు ఎలా ఉన్నా లక్ష్యం మాత్రమే కనిపించాలంటే మిగిలిన అన్నింటినీ టేకిటీజి అని వదిలేయాలి.
నవ్వటం, హాస్యంగా మాట్లాడటం, త్వరగా గాయపడకుండా ఉండటం, ఇతరులతో మృదువుగా మాట్లాడటం, మార్పుని అంగీకరిస్తూ ముందుకు సాగటం, ఇతరుల వల్ల హాని, అవమానం కలుగుతుందనే భయం లేకుండా ఉండటం....ఇవన్నీ జీవితాన్ని భారంగా కాకుండా ప్రియంగా చూడగల సామర్ధ్యాలు. వీటిని సాధనతోనన్నా సమకూర్చుకోవాల్సిందే.
-వడ్లమూడి దుర్గాంబ

'మేడ్‌ ఇన్‌ ఇండియా'

ఆర్థిక ప్రగతి పశ్చిమ దేశాల నుంచి ఆసియా దేశాలకు మారిందనడానికి సూచిక ఇది. ఆసియా దిగ్గజాలైన భారత్‌, చైనాలలో తయారైన వస్తువులకు పశ్చిమ దేశాల్లో క్రేజ్‌ రోజురోజుకూ పెరుగుతోంది. ఫార్చ్యూన్‌ మేగజైన్‌ చేసిన సర్వేలో ఈ విషయం స్పస్టమైంది. అందులోనూ భారత్‌ వస్తువులకు మరింత గిరాకీ పెరిగింది.
'మేడ్‌ ఇన్‌ ఇండియా' ఉత్పత్తులకు అమెరికాలో గిరాకీ బాగానే ఉందని ఒక సర్వేలో వెల్లడైంది. అదే విధంగా, మేడ్‌ ఇన్‌ చైనా ఉత్పత్తుల పట్ల వినియో గదారులు అంతగా ఆసక్తి చూపడం లేదని తేలింది. అమెరికాకు చెందిన ఫార్చ్యూన్‌ మేగజైన్‌ ఈ విశేషా లను వెల్లడించింది. ఈ వస్తువుల్లో ఆట వస్తువులు కూడా ఉన్నాయి. అమెరికాకు చెందిన ఆట వసు ్తవుల కంపెనీ మట్టెల్‌ చైనా నుంచి వీటిని దిగుమతి చేసుకుంటుండగా, వినియోగదారులు అంతగా ఆసక్తి చూపడం లేదు. 57 శాతం మంది అమెరి కన్లను మేగజైన్‌ సంప్రతించగా, అయిదుగురిలో ముగ్గురు చైనా ఉత్పత్తుల పట్ల ఆంతగా ఆసక్తిని వ్యక్తపరచలేదు. అయితే, సర్వే జరిపిన వారిలో 52 శాతం మంది 'మేడ్‌ ఇన్‌ ఇండియా' ఉత్పత్తుల పట్ల వ్యతిరేకత చూపలేదని మేగజైన్‌ పేర్కొంది. మొ త్తం అమెరికన్లలో 35 శాతం మంది భారతీయ వస్తువుల పట్ల అంతగా ఆసక్తి చూపడం లేదని, 11 శాతం మంది అత్యధికంగా ఆసక్తి చూపుతున్నారని వివరించింది. అదేవిధంగా చైనా వస్తువుల పట్ల 11 శాతం మంది కొద్దిగా ఆసక్తి చూపుతుండగా, 30 శాతం మంది అసలు పట్టిం చుకోవడం లేదని పేర్కొంది. గత నెలలో జరిపిన ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు కూడా బయటపడ్డాయి. ఆయా వస్తువులు అసలు ఏ దేశంలో తయారవుతున్నదీ అమెరికన్లు పట్టించు కోవడం లేదని, అయితే, చైనా వస్తువలు అయితే మాత్రం జాగ్రత్త పడుతున్నారని తేలింది. తూర్పు ఐరోపాలో తయారైన వస్తువులను 57 శాతం మంది, పశ్చిమ ఐరోపా వస్తువులను 55 శాతం మంది, కెనడా ఉత్పత్తులను 53 శాతం మంది, భా రత ఉత్పత్తులను 52 శాతం మంది, ఆఫ్రికా ఉత్పత్తులను 51 శాతం మంది, మెక్సికో ఉత్పత్తులను 48 శాతం మంది, జపాన్‌ ఉత్పత్తులను 47 శాతం మంది, దక్షిణ కొరియా ఉత్పత్తులను 46 శాతం మంది అమెరికన్లు ఇష్టపడుతున్నారు.