7, నవంబర్ 2010, ఆదివారం

జగన్‌కు చేదు ఫలితాలిచ్చిన నెల్లూరు ఓదార్పు

20 రోజుల పాటు నిర్వహించిన నెల్లూరు జిల్లా ఓదార్పు యాత్ర జగన్‌కు చేదు ఫలితాలు మిగిల్చింది. ఆయన జిల్లా పర్యటనలో ఉన్న సమయంలోనే జగన్‌ వర్గీయులై న నెల్లూరు డీసీసీ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, పిసిసి కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కోటం శ్రీధర్‌రెడ్డిపై నాయకత్వం వేటు వేసింది.

మరికొద్ది రోజుల తర్వాత జగన్‌కు మద్దతుగా నిలిచిన యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులను పదవులు నుంచి తొలగించిం ది. టాలెంట్‌ హంట్‌ పేరుతో అధిష్ఠానం జగన్‌ వర్గాన్ని దాదాపు వెంటాడినంత పనిచేసింది. మీరు జగన్‌ వర్గమా ?అని నేరుగా ప్రశ్నించే పరిస్థితికి రావడంతో జగన్‌తో ఉంటే పదవులు రావన్న భయాందోళన సృష్టించడంలో విజయం సాధించింది.

చివరకు.. వైఎస్‌ జీవించి ఉన్నంతకాలం ఆయనకు గట్టి మద్దతుదారుగా ఉన్న మంత్రి ఆనం వర్గం ఒక్కసారిగా విధేయత మర్చి, జగన్‌కు దూరమయింది. ఈ ప్రకారంగా జగన్‌కు నెల్లూరు జిల్లా పర్యటన కలసి రాలేదనే చెప్పాలి.

జగన్‌ ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని అధిష్ఠానం విస్పష్టంగా ఆదేశించడంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు దూరంగా ఉన్నారు. ఒకవైపు భారీ వర్షాలతో జనం సమస్యల్లో చిక్కుకోకుండా, జగన్‌ వారిని పరామర్శించకుండా సొంత ఇమేజ్‌ పెంచుకుంటున్నారన్న భావన కూడా వ్యక్తమయింది. జగన్‌కు చెందిన సొంత మీడియా సంస్థలు తప్ప, మిగిలిన మీడియా సంస్థలేవీ యాత్రకు అంతగా ప్రాధాన్యం ఇవ్వక పోవటం . ... ఒద్దర్పు ప్రాధాన్యత తగ్గుతున్న క్రమంలోనే.. జగన్ వర్గం అటు సినీ నటి రొజాని... ఇటు లక్ష్మి పార్వతిని రంగంలోకి దించినా... వారి ప్రసంగాలలో జగన్కి జై కొట్టడం తప్ప.. విమర్శలు చేస్తున్న విపక్షలని పల్లెత్తు మాటనక పోవటంతో.. జగనే అధినేత్రి పై యుద్ధం ప్ర క టించి నట్లు కనిపిస్తోందని విశ్లేషకుల భావన

ఉప్పెనగా మారుతానంటున్న జగన్

తనలో సహజనం నశిస్తే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభిమానించే ప్రతీ గుండె చప్పుడూ ఏకమై ఉప్పెనగా మారుతుందని కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సొంత పార్టీలోనే కుళ్ళు, కుతంత్రాలు రాజ్యమేలుతూ వుండడంపై ఆయన తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు.

సొంత పార్టీ వాళ్ళే తనను అడ్డుకునేందుకు శతప్రయత్నాలు చేయడం ఆవేదన కలిగిస్తోందని .... కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసిన కొండా సురేఖ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా ఎంతో మందిపై అకారణంగా ఎందుకు కక్ష సాధింపు చర్యలు పడటం తన సహనానికి హడ్డున్తుందని వ్యాక్యానిచాడంతో...

జగన్ కావాలనే మరో మారు అధిష్టానం పై స్వరం పెంచుతూ సొంత కుంపటి పెట్టుకునీన్దుకు సిద్దమవుతున్నాడని విమర్శలు వస్తునై

ఒబామా దంపతుల ఆటాపాటా

అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఆయన సతీమణి నృత్యకోలాహాలం అందరినీ అలరించింది. భారత్‌ పర్యటనలో భాగంగా ముంబై హోలీనేమ్‌ పాఠశాల విద్యార్థులతో కలిసి ఒబామా దంపతులు దీపావళి పండుగ జరుపుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి వారికి ఆటోగ్రాఫ్‌లిచ్చారు.

ఇలా చూపిన విద్యాబాలన్

విజయవాడలో అయ్యప్ప భక్తులకు అన్న సమారాధన

అయ్యప్ప మాల వేసుకునే భక్తులకు ఆదివారం నుంచి జనవరి 5వ తేది వరకు అరవై రోజుల పాటు 'చేయూత' ట్రస్ట్ ఆధ్వర్యంలో సమారాధన కార్యక్రమాన్ని విజయవాడ పటమటలంక అవధూత ఆశ్రమం ప్రాంగణంలో చేపడుతున్నట్టు ట్రస్ట్ ఛైర్మన్ కోనేరు మురళీకృష్ట (కెం.ఎం.కే ఈవెంట్స్), వైస్ ఛైర్మన్ త్రిపురనేని నాగేంద్ర కుమార్ (శ్రీ చైతన్య) తెలిపారు.

గత నాలుగేళ్ల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అరవై రోజుల పాటు జరిగే ఈ అన్నసమారాధనలో ప్రతి ఏటా దాదాపు లక్ష మంది దీక్షా పరులు సద్ది చేస్తుంటారని తెలిపారు. అయ్యప్ప దీక్షా పరులే కాకుండా భవానీమాల, శివ మాల, గోవింద మాల వేసే భక్తులు, ప్రాంగణానికి వచ్చి అన్న సమారాధన చేయవచ్చని తెలిపారు.

13న కర్ణాటకాంధ్ర రాష్ట్ర అవతరణ mahotsavalu

బెంగుళూరు విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో 13న జరుగనున్న శ్రీకృష్ణ దేవరాయల పంచ శత పట్టాభిషేక మహోత్సవం, కర్ణాటకాంధ్ర రాష్ట్ర అవతరణ మహోత్సవాలకు కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు

కర్ణాటకాంధ్ర రాష్ట్ర అవతరణ ఉత్సవాలను కుప్పం ద్రవిడ విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య కడప రమణయ్య లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రత్యేక అతిథులుగా మాజీ గవర్నర్ డా.వి.ఎస్.రమాదేవి, మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్, మాజీ స్పీకర్ రమేశ్ కుమార్, ప్రముఖ కన్నడ సాహిత్య వేత్త చంద్రశేఖర కంబార ముఖ్య అతిథిగా హాజరవుతారు.

చౌడయ్య స్మారక భవనంలో 13న ఉదయం 10 గంటలనుంచి జరిగే ఈ ఉత్సవాలలో శ్రీకృష్ణ దేవరాయ పురస్కారాన్ని ప్రముఖ కన్నడ సాహితీవేత్త చం ద్రశేఖర్ కంబారకు, జాతీయ చలన చిత్ర ఉత్తమ నటి పురస్కార గ్రహీత ఉమాశ్రీ, ప్రసిద్ధ కవి, పలగాని గోపాల్ రెడ్డిలకు ప్రదానం చేసి ఘనంగా సత్కరిస్తారు. సందర్భంగా ప్రముఖ కన్నడ గాయకుడు శశిధర్ కోటె బృందంచే సంగీత సంభ్రమ కార్యక్రమ0... సవితా అరుణ్ ఆధ్వర్యంలో కర్ణాటక వైభవం కన్నడ నృత్య రూపకం ప్రదర్శిస్తారు ప్రఖ్యాత గాయకుడు చంద్రతేజ బృందంచే ఘంటసాల గానలహరి, మిర్యాలగూడకు చెందిన సాంస్కృతిక కళాకేంద్రంచే కృష్ణపక్షం (శ్రీకృష్ణ దేవరాయలు, తిమ్మరసుల కథ) చారిత్రక పద్యనాటక ప్రదర్శన ఉంటుంది.

అయన నిజాం వారసుడే కాదు

నిజాం వారసుడిగా చెప్పుకుంటున్న ప్రిన్స్ ముకరంజా అసలు నిజాం వారసుడే కాదని ... చారిత్రిక కట్టడమైన ఫలక్ నుమా ప్యాలేస్‌తోపాటు నిజాం కట్టడాలన్నింటినీ జాతికి అంకితం చేయాలని మాజీ కేంద్రమంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజ్ ఫలక్ నుమాగా పేరుమారుస్తూ ఖరీదైన హోటల్‌గా ప్రారంభించడాన్ని ఆయన హెచ్చరించారు. మన సంస్కృతికి, చరిత్రకు చిహ్నంగా ఉన్న ఫ లక్‌నుమా, చిరాన్ ప్యాలేస్‌లు, కింగ్ కోఠి లాంటి నిజాం కట్టడాలను తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలni ముఖ్యమంత్రి రో శయ్యకు లేఖ రాశానన్నారు.

60 శాత0 పూర్తైన జైబోలో తెలంగాణా

తెలంగాణ నేపథ్యంలో ప్రఖ్యాత దర్శకుడు స్వీయ దర్శకత్వంలో మహాలక్ష్మీ ఆర్ట్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చలన చిత్రం జై బోలో తెలంగాణ షూటింగ్ వరంగల్‌లో ప్రారంభించనున్నట్టు దర్శకుడు శంకర్ తెలిపారు. ఖిలా వరంగల్, వేయి స్తంభాల గుడి, నగరంలోని షూటింగ్‌కు అనుకూలంగా ఉన్న పలు ప్రాంతాలను , కాకతీయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి చిత్ర నిర్మాణంపై చర్చించారు. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసినట్టు..రియాలిటీ కోసం పలువురు తెలంగాణ యోధులు, మేథావులను కూడ చిత్రంలో భాగస్వాములను చేసినట్టు ఆయన చెప్పారు