30, నవంబర్ 2011, బుధవారం

జనపదంలో సందేశం బుర్ర కథ

ఓ సమాజపు విశిష్టతని, సంస్క ృతిని భావితరాలకు అందించగలిగేవి కళలే...
తెలుగుదనం మిళితం చేసుకుని తెలుగు భాషని, పాటని, మాటని, తనలో నింపుకుని
తెలుగు జానపద కళారూపాలలో విశిష్టత దక్కించుకున్న బుర్రకధలు...
నిన్నటి సమాజంలో చైతన్య స్పూర్తిని రగిలిస్తూ... సాగిన ఎన్నో జనపదాలను...
జానపదకళల్ని మనకున్న నిర్లక్ష్యం మూలంగా అంతరించిపోయాయి.
ఈ పరిణామంలోనే బుర్రకథలు కూడా చేరుతుండటం ఆందోళన కలిగించే విషయం...
నిన్నటి వరకు సమాజంలో... జరుగుతున్న పరిణామాలను సామాన్య జనం గుండె తలుపు తట్టి మరీ వివరించే ఈ బుర్రకధల కేవలం ప్రభు త్వ ప్రచార కార్యక్రమాలకు మాత్రమే పరిమితమై పోతూ తమ ఉనికిని నిలుపుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి. ఈ కళకు సంబం ధించిన కళాకారులు కూడా భుక్తి కోసం వేరే వృత్తులవైపు పయనించా ల్సిన దుస్ధితి నెలకొంది. జానపదాలు పేరు చెపితేనే ముందుగా భళరా.. భళి..లాంటి ఎన్నో ఊత పదాలని పరిచయం చేయటమే కాకుండా సంద ర్భోచితంగా హాస్యాన్ని కరుణ రసాన్ని, భీభత్స రసాన్ని ఇలా నవరసాలను మేళవించి సాగే బుర్రకధలే గుర్తుకు వస్తాయి.
నాటి తరంలో పండగొచ్చినా... పబ్బమొచ్చినా... జాతర జరిగినా... తీర్ధా లు చేసినా... భక్తి పారవశ్యంలో మునిగి తేలే జనాలు సినిమాల కన్నా జాన పదకళలలోని మాధూర్యాన్ని ఆస్వాదించేందుకే మొగ్గు చూపే వారు. అందునా అన్నీ కలగలిసిన బుర్రకధలైతే మరీనూ...అసలు ఈ బుర్ర కధలు జనం నడుమనే పుట్టి పెరిగాయని, వస్త్రధారణలోనూ భిన్నంగా ఉంటూనే సంస్క ృతి సాంప్రదాయాలకు అతి పెద్ద పీట వేస్తూఉన్న క్రమం లో అనేక రకాల వాయిద్యాలు పుట్టు కొచ్చాయి. ఈ క్రమంలోనే ఆయా వాయిదాలు పేర్లకు తగ్గట్టు ఒగ్గు, కొమ్ముల, శారద కొండ్రు, పంబల ఇలా అనేక కులాలు ఏర్పడి జానపదాల కోసం ప్రత్యే కించింది నాటి సమాజమని.. జనపదాలతో జనుల ను విజ్ఞాన వంతులు చేసేందుకు అనేక మంది చేస ిన కృషి ఫలితంగా జముకు, ఒగ్గుపాటలు నుండి బుర్ర కధలు ఉద్భవించినట్లు కళాకారులు చెప్తారు. ఆపై యక్షగాన ప్రభావంతో వినోదం కలగ లిసి దేశీయ కళగా రూపాంతం చెందిన బుర్రకధలు ఈ నాటివి కావని, అనేక కాలలలో జరిగిన రచనల్లో బుర్రకధలపై ప్రస్తావన ఉన్నట్లు చరిత్ర చెప్తోంది. 13 వ శతాబ్ధానికి చెందిన పాల్కురికి సోమన్న శక్తి కధ లు, 14వ శతాబ్ధంలో కాటమ రాజు, కుమార రాముని, గాంధారీ కధలు, 15వ శతాబ్ధంలో శ్రీనాధుడు సైతం జనం కోసం వీరగాధలను సామాన్య జనం భాషలో రచించి కళాకారులకు అందించాడని, ఇలా అంచెలంచెలు గా కొత్త పరిణా మాలను సంతరించుకుని రూపొందిన ఈ కళ తొలి నాళ ్లలో తంబుర కధగా ఆపై తంబురకు బుర్ర ఆకారం ఉండటం వల్ల బుర్ర కధగా రూపాంతం చెందింది. అయితే మిగిలిన జాన పదాలకు భిన్నంగా ఈ కళలో వస్త్రధారణ ఎంత ముఖ్యవెూ, ఛందస్సు, అలంకారాలు, నవరసాలు, నృత్యం, శృతి కలిగిన గానం కలగలిపి కధకుడు కధను రసరమ్యంగా చెపుతుంటే... వంత చెప్పే వారు హాస్యన్ని పండించే వారు చెరోవైపున జనానికి చెపుతున్న కధపై ఏమాత్రం విరక్తి కలగకుండా... సామాజిక అంశాలను కూడా మేళవించి.. సందర్భోచిత హాస్యంలో ముంచెత్తడం కూడా అంతే ముఖ్యం.
అనేక రూపాలు
ఈ బుర్ర కధల్లోనూ ప్రభోదాత్మకాలు, చారిత్రకాలు, మతకధలు, పౌరా ణికాలు, పతివ్రతుల కధలు ఇలా అనేక రూపాలున్నాయి. ప్రభోత్మకా లలోనూ రాజకీయాలు, సాంఘికాలు, ప్రచారకాలుగా విడదీసి చూస్తే. పలువురి రాజకీయనేతలకు చెందిన జీవితాలపై కొందరు బుర్ర కధల ను రాయగా సమాజంలోని రాజకీయ పరిస్ధితిని ఎప్పటికపðడు జనాలకు అర్ధమయ్యేలా చిన్న చిన్నకధల రూపంలో చెప్పే ప్రక్రియ ప్రారంభమైంది. దీనిని ఎక్కువగా కమ్యూనిస్టు పార్టీలే అవలంబించి తన సిద్దాంతాలను జనం మధ్యకు తీసుకువెళ్లేందుకు ఉపయోగించు కున్నాయి. లంచగొండితనం, వరకట్నం, వివక్ష, ఇలా అనేక సామాజిక అంశాల నుకధలుగారూపొందించారు. సమాజం లో జరుగుతున్న స్ధితిగతులపై జనాల్ని చైతన్యవంతం చేసే బాధ్యతల్ని బుర్రకధలు వహించాయి. అలాగే ప్రభుత్వం కూడా తాను ప్రవేశ పెడుతున్న పధకాలను, ప్రగతిని, పేదలకు చేరువ చేసేందుకు తన ప్రచారాన్ని బుర్రకధలసాయంతో ముందుకు తీసుకుపోయింది. చారిత్రికా ల విషయానికి వస్తే... అల్లూరి సీతా రామ రాజు, భగత్‌ సింగ్‌, ఝాన్సీ లకి్ఝ భారు, ఇలా అనేక మంది వీరయో ధుల చరిత్రల్ని సామాన్యుడికి అర్ధమ య్యేలా వివరిస్తూ... నాడు జరిగిన స్వాతంత్ర పోరాటానికి సామాన్య జనాలను కూడా సమాయుత్తం చేసిన కళల్లో బుర్రకధలు కూడా ముఖ్య పాత్ర పోషించాయి. అలాగే బొబ్బిలి యుద్దం, పల్నాటి యుద్దం, బాల చంద్రుడు ఇలా అనేక చరిత్ర కధలు కడా బుర్ర కధల రూపంలో జనాలకి చేరువయ్యాయి.
ఇక పౌరాణికాలలో కురుక్షేత్రం, వీరాభిమన్యు, ఉత్తర గోగ్రహణం, భక్త ప్రహ్లాద, భగవద్గీత, శ్రీకృష్ణ విజయం ఇలా పౌరాణిక నాటక రూపాలకు హాస్యాన్ని రంగరించి సామాన్య జనం భాషలోనే మరిం త దగ్గర చేసేందుకు ఉపయోగ పడ్డాయి బుర్రకధలు.
పతివ్రతల కధల్లో, బాలనాగమ్మ, మల్ల మ్మ, సతీ అనసూయ ఇలాంటి వారి కధలు స్త్రీలలో పాతివ్రత్య మహత్యం తెలియ చేస్తునే వారిలో ఎనలేని విశ్వాసం పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ఓ విధంగా ఆత్మ స్ధైర్యాన్ని పెంపొందించాయి.
మత కధలలో... శివ మహత్యం, విష్ణులీలలు, శ్రీనివాస కళ్యాణం ఇలా అనేక దేవుళ్ల కధలని జనంలో భక్తి భావన పెంపొందించేందుకు ఉపయోగ పడ్డాయి.
జగద్విత బుర్ర కధల బృందాలు
బుర్ర కధల చెప్పేందుకు మన రాష్ట్రంలో అనేక బృందాలు జగద్విదితమ య్యాయి, కాకుమాను, నాజర్‌, లకి్ఝ కాంత వెూహన్‌, విఠల్‌ బ్రదర్స్‌, జూనియర్‌ నాజర్‌, బెనర్జీ, కుమ్మరి మాస్టారు, నిదవోలు, అచ్చుతరామ య్య, పడవల శ్రీకృష్ణలే కాకుండా నిత్యం జానపదాలపైనే తమ గమనా న్ని సాగించే ప్రజా నాట్య మండలిలో ప్రత్యేక శిక్షణ తీసుకుని ఎన్నో జన చైతన్య కధలను బుర్రకధల రూపంలో అందించిన వీరమానేని సరోజ, వెూటూరి ఉదయం, తాపీ రాజమ్మ, కొండేపూడి రాధ ఇలా అనేక మంది మహిళా కళాకారులు తమ కళా ప్రదర్శలతో ప్రజలను రంజింప చేసా రు.
వీరిలో కొందరు స్వర్గస్తులు కాగా... మరి కొందరు తమ తరు వాతి తరానికి ఈ కళని అందించలేక పోతున్నామని వ్యధ చెందుతున్నారు.
ఇక బుర్ర కధలకు ఆద్యుడిగా పిలవ బడే నగ్నముని అనేక కధలను బుర్ర కధల కళాకారులు జనాలకి విని పించగా. నిన్నటితరంలో... దండు మూర్తి శ్రీ, నదీరా, సుంకర, నాజర్‌, కామాను, వారణాసి, బద్దిరెడ్డి, ద్వారహిత, సత్యనారాయణ, ఓలే టి ఇలా పలువురు కళాకారులు అనేక కధలను జనపదం లోకి మార్చి... వాటికి హస్యోక్తుల్ని ... సమాజ పరిస్ధితులన్ని అద్ది ... ఈ బుర్రకధలకు ఉన్నత స్ధానం కలిపించడంలో తమ జీవితా లనే అంకితం చేసిన వారు లేకపోలేదు.
రికార్డింగ్‌ డాన్సులుగా మారిపోతున్న బుర్రకధలు
గతంలో విజయనగరం జిల్లాకు చెందిన కుమ్మరి మాష్టారు బుర్ర కధ అంటే జనం పడి చచ్చెవారంటే అతిశయోక్తి కాదు. ఇందు కు కారణం మధ్య మధ్యలో ఆయన చిన్నారులతో భరతనాట్యం, కూచిపూడిలాంటి ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయటం కారణం కావచ్చు .
కానీ నేడు అడపా దడపా చాలా గ్రామాలలో బుర్ర కధలు జరుగుతున్నా.. వాస్తవానికి అక్కడ కధల కన్నా... రికార్డింగ్‌ డాన్సులుగానే కనిప ిస్తున్నా యి. ముందు ముగ్గురుతో ప్రారంభమయ్యే బుర్రకధ వ్యంగ్యోక్తులతో ఆరంభించి ద్వందార్ధాల సంభాషణ లతో పల్లవించి...చివరికి రికార్డింగ్‌ డాన్సు

లుగా మార్చేస్తారు. ఉత్తరాంధ్రా జిల్లాలో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూ... యువతపై వల వేస్తూ... కొందరు సొమ్ము చేసు కుంటున్నారన్న ఆరోపణలూ బొలెడు న్నాయి.
సినిమాలలోనూ బుర్రకధలది ప్రత్యేక స్ధానం..
మన పాత చిత్రాలను ఓ సారి పరిశీలిస్తే... అనేక సందర్భాలలో బుర్ర కధలని వినియోగించుకుని కధలను ముందుకు సాగించేవారు. నాలుగు దశాబ్ధాల పాటు బుర్రకధలకే తన జీవితాన్ని ధారబోసిన నాజర్‌ మాష్టారు తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడే.
ఊత పదాలూ.. వంతలూ.. బోలెడు...
బుర్రకధ కళాకారులు సందర్భాను సారంగా అనేక ఊత పదాలను, వంతలని శ్రావ్యంగా వినిపిస్తూ... ప్రజలని ఆయా సన్నివేశాలలోకి తీసు కుని వెళ్లిపోతుంటారు. విషాధఘట్టాలు వచ్చేపðడు ఆయ్యో... అంటూ అని విలపిస్తునే... హరి.. హరీ, రామా.. అంటూ వంత పాడతారు. అలాగే సంతోషకర ఘట్టాలలో భళా భళి, భేష్‌, తుమ్మెదా... తందానా... తానెతందనానా.., శహభాష్‌ అంటూ పాడతారు. ఒక కధకుడు వినార భార త వీర కుమరా విషయము చెపుతానూ... అంటూ ప్రారంభించి వినరా ధీరా విజయం మనదేరా.. అంటూ యుద్ద సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు వీర రసాన్ని ఉద్రిక్త స్ధితికి తీసుకెళ్లి పదునైన భావంతో జనం గుండెల్ని హత్తుకు పోయేలా జనరంజకంగా కధల్ని చెప్తారు.
సాంకేతిక విప్లవం వూపందుకున్నాక సినిమాలు చాలా జనపద కళల్ని నాశనం చేసాయి. టివిలు వచ్చాక పూర్తిగా వాటి ప్రభావం పడి జాన పదాల వైపు కన్నెత్తి కూడా జనం చూడటం మానేసారు. ఒకపðడు బుర్రకధనే నమ్ముకుని ఎన్నో కుటుం బాలు తమ జీవనాన్ని కొనసాగించేవి. దీన్ని వంశ పారంపర్యం వృత్తిగా చేపట్టిన కుటుంబాలు కూడా అనేకం.
ఒక కధని ఏడేసి రోజులు చెప్పినా జనం విని ఆదరించే స్ధాయి నుండి గంట కూడా బుర్రకధని వినే ఓపిక లేని స్ధితికి మనం చేరుకున్నాం ఇపðడు. మన ప్రాచీన కళల మీద మనం చూపిస్తున్న నిర్లక్ష్యం కారణంగా అవి తెరమరుగు అవుతున్నాయన్నది వాస్త వం. ఈక్రమంలో తమ తంబరల లో విషాదాన్ని నింపుకుని ఆదు కునే ఆపన్న హస్తం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది బుర్రకధ కళాకారుల కుటుంబాలు.
వీటిని కేవలం ప్రచారాలకే పరిమితం చేస్తున్న ప్రభుత్వాలే కాదు... జనం కూడా ఈ జానపదకళ ఆదరిస్తే కానీ భవిష్యతరానికి ఈ వారసత్వ సంపదని అందీయలేని పరిస్ధితి నేడు నెలకొందనటంలో సందేహంలేదు.

మహిళలదీ అగ్రస్ధానమే...
బుర్రకధల దళాలలలో మహిళలకూ పెద్ద పీట దక్కిందని చెప్పాలి. విజయనగరం జిల్లా గరివిడికి చెందిన లక్షి, దంపుడు లక్ష్మి, శ్రీదేవి సిస్టర్స్‌ ఇలా అనేక మంది మహిళలు బుర్రకధలలో తమ సత్తా చూపిం చారంటే సందేహం లేదు. అనేక కధారూపాలతో పాటు మగవారికి ధీటుగా హాస్యోక్తులు ఒలికించడంలో వీరు తమ ప్రతిభాపాటవాలు చూపించారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలలో వారి పేర్లతోనే అనేక బుర్రకధ దళా లు ప్రారంభమయ్యాయి.
కానీ నేడు తగిన ఆదరణ లేక పోవటంతో దాదాపు అన్ని దళాలు కేవలం ప్రభుత్వ ప్రచారానికే పరిమితమై పోతున్నాయన్న ఆందోళనతో పాటు అనేక మంది బుర్ర కధ కళాకారులు పస్తులుండాల్సిన పరిస్ధితి నెల కొందని ఆవేదన సర్వ్‌త్రా వ్యక్తమవుతోంది.


నాజర్‌ గానానికి ముగ్ధుడైన సాలూరి
సినీ పరిశ్రమలో బుర్రకధలు చెప్పడంలోనూ... చెప్పించడంలో బుర్రకధలకు ఆద్యుడిగా చెపðకునే నాజర్‌ మాష్టారు పూలరంగడు చిత్రం కోసం అక్కినేని నాగేశ్వరరావుకి బుర్రకధ నేర్పించారు. అగ్గి రాము డు, భలే బావ, నిలువు దోపిడీ, పెత్తందారులు, మనుష్యులంతా ఒక్కటే తదితర చిత్రాల్లో బుర్ర కధ కళాకారుడిగా కనిపించి మెప్పించడమే కాకుండా బుర్రకధ సన్నివేశాలలో ఘంటశాలతో పాట ని, ఎన్టీఆర్‌, రాజబాబు లాంటిి అగ్రనటులతో డైలాగులు చెప్పించి రస రమ్యత చేకూర్చే వారు. ప్రము ఖ సంగీత దర్శకుడు ఎస్‌.రాజేశ్వరరావు ఆతని గళమాధుర్యానికి ముగ్ధుడై సినీ పాటల అవకాశాన్ని ఇస్తానని చెప్పినా.. వినకుండా తానీ సినీ ప్రపంచంలో నిలువలేనని వచ్చేసి... జీవిత చరమాంతకం వరకు బుర్రకధలకే అంకితం చేసారు. నాజర్‌ మాస్టారు చేసిన సేవలకు పద్మశ్రీనిచ్చి భారత ప్రభుత్వం సత్కరించింది.


ఉత్తరాంధ్రాకి పేరు తెచ్చిన కుమ్మరి మాష్టారు
సినీ పరిశ్రమలో బుర్రకధలలో అడపా దడపా కనిపించిన వారిలో విజయనగరంకి చెందిన కుమ్మరి మాస్టారు ఒకరు. దారా అప్పల నారాయణ అసలు పేరైనా బుర్రకధ దళంలో ఆయన పేరు కుమ్మరి మాష్టారుగానే స్ధిర పడిపోయింది. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడే అయినా... జానపద కళలపై ఉన్న మక్కువతో బుర్రకధల్ని సొంతగా నేర్చు కోవటమే కాకుండా...తన సహచరులైన కుమ్మరి జానకి, రొంగలి సత్యన్నారాయణ మూర్తిలకు నేర్పి వారితోతో కల్సి 1992 వరకు వేలాది ప్రదర్శనలు ఇచ్చా రాయన. ఉత్తరాంధ్రా జిల్లాలలో ఏ ఊర్లో ఏ కార్యక్రమం జరిగినా ముందు కుమ్మరి మాష్టారి బుర్రకధ ఉండి తీరాలనే స్ధాయికి ఆయన ఎదిగారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆంధ్రాయూనివర్శిటీ ఈతనిని కళా ప్రపూర్ణ అవార్డుతో సత్కరించింది.

మణికట్టుకి కనికట్టు

నేటి ఫ్యాషన్‌ ప్రపంచంలో కుర్రకారు దుస్తులకే కాదు...
కళ్లకు ధరించే అద్దాలు, నడుంకి పెట్టుకునే బెల్టులు, చెవి రింగులు, కాళ్లకి వేసే చెపðలు...
చేతికి ధరించే బ్రాస్‌లెట్లు, గడియారాలకీ అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు.
వారి అభిరుచి తగ్గట్లు నేడు అనేక రకాల వాచీలు మార్కెట్లోకి వచ్చేసారు..మారుతున్న కాలంతో పాటుగా...వైరుధ్యానికి పెద్ద పీట వేస్తూ... మార్కెట్‌లోకి ఏ కొత్త తరహా వెూడల్‌ వచ్చి నా కొని పెట్టుకోవా లన్న దృక్పధానికి రెడ్‌ కార్పె ట్‌ వేస్తూ దూసుకుపోతున్న నేటి యవతరం అనేక సరికొత్త సృజనతో రంగరించిన వస్తువులపై మక్కువ చూపుతోంది. అత్యా ధునిక సాంకేతిక పరిజ్ఞానం మేళవించి రోజు రోజుకూ దూసుకు వస్తున్న కొత్త కొత్త గడియారాలని చేతికి అలంకరించుకునేందుకు సిద్దమవుతోంది.
ఒకపðడు ఇంట్లో ఒకరికో ఇద్దరికో వాచీలుండేవి. అదీ ఏబొడ్లోనో దోపుకుని సమయం చూసుకునేవారు. కాల క్రమంలో జరిగిన మార్పులు పురుషులు, మహిళలకు వేర్వేరుగా వాచీలు రావటంతో వీటి వాడకం బాగా పెరిగింది.
అయితే సాంకేతిక విప్లవం అందుబాటులోకి వచ్చాక 'కీ' ఇచ్చే వాచీల స్ధానంలోకి బ్యాటరీ సాయంతో నడిచే వాచీలు రంగ ప్రవేశం చేయ టంతో కారు చౌకగా సామాన్యజనం కూడా కొను క్కునేలా వాచీలు తయారై అందుబాటులోకి వచ్చాయి
చిన్న పిల్లాడి నుండి పండు ముదసలి వరకు ఎవరి అభి రుచికి తగ్గట్టు వారికి వాచీలు అందించడానికి అన్ని కంపెనీలు సిద్ద పడ్డాయి. ఈ క్రమంలో ఏ ఐదేళ్లలో ఒకసారో వాచీలు మార్చేందుకు ఇష్టపడే సామాన్యుడి ఇళ్లలో కూడా విభిన్నతకి పెద్ద పీఠవేస్తూ... డజన్లకొద్ది, సమయానికి, డ్రస్‌కి తగ్గట్టుగా వినియోగించేందుకు వీలుగా వాచీలు కొను గోలు చేస్తున్నారన్నది వాస్తవం.
దాదాపు అన్ని కంపెనీల వాచీలకు సినీ తారలని బ్రాండ్‌ అంబాస ిడర్‌లుగా వ్యవహరిస్తుండటంతో కుర్రకారు వీటి కొనుగోళ్లకి మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలో వాచీల ధరలు కాసింత ఎక్కువగా పెరుగుతు న్నా...వెూడల్‌ నచ్చితే చాలు ఎంత ధరైనా కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు.
ఇందుకు తగ్గట్టుగానే యువత స్పందనల్ని పరిగణలోకి తీసుకుని అనేక రకాల డిజైన్లలో, అనేక వెూడల్స్‌తో ఆకర్షించేలా అన్ని కంపెనీలు చేతి గడియారాలని మార్కెట్‌లోకి తీసుకొస్తునే ఉన్నాయి.
సెల్‌లో వాచ్‌ ఉన్నా సరే...
ప్రస్తుతం ఏ చేతిలో చూసినా సెల్‌ ఫోన్‌ కామన్‌ అయి పోయి న క్రమంలో ఇంకా చేతి వాచీ ఎందుకులే అని అనుకునే వారిని సైతం కొనుగోలు ఆసక్తి చూపుతున్నారు. ప్లాస్టిక, మెటల్‌, గోల్డ్‌, ప్లాటినం కోటింగ్‌లతో వివిధ రకాల చైన్‌లతో, పూసలతో అనేక వాచీలని రూపొందిస్తున్నారు. డిజిటల్‌ మాయాజాలంతో వైవిధ్య భరితమైన అనేక వెూడల్స్‌ అటు అమ్మాయిల్ని, ఇటు అబ్బాయిల్ని తెగ ఆకర్షి స్తున్నాయన్నది వాస్తవం. మరోవైపు ఇంటర్నేష నల్‌ కంపెనీలు కూడా బారతమార్కెట్‌ రంగం లోకి దిగి అనేక రకాల వాచీలను అమ్మకాని కి పెడుతున్నాయి. ఇవి ధరిస్తే... తమ స్టేటస్‌ మరింతగా పెరుగుతున్నట్లు భావిస్తున్న యువత వీటి కొనుగోలుకు ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ద పడుతున్నారు. ఇక చైనా నుండి దిగుమతి అవుతున్న అనేక వాచీలు చవక ధరల్లో లభ్యం అవుతుండటంతో చాలా మంది వాటి వైపు మెగ్గుచూపుతున్నారు.అవి ఓ సారి పాడైతే అంతే సంగతులు కావటం విచారకరమే అయినా రోజురోజుకీ వాటి అమ్మకాలు జోరందుకుంటున్నాయం టే సామాన్యుడిని ఎంతగా ఆకర్షిస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. మార్కెట్‌లో లభిస్తున్న వివిధ వాచీలలో కాంతివంతమైన కలర్‌ డైల్‌ ఉన్నవాటికే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. దీనికి తోడు సిల్వర్‌, గోల్డు, ఆరెంజ్‌, ఎల్లో, బ్లూ క్లాసి క సిల్వర్‌లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయని.. ముి ళలు ఎక్కువగా గోల్డు, బ్లాక కలర్‌తో పాటు మల్టీ కలర్‌ స్ట్రాప్‌ ఉన్న వాటివైపే.. వివిధ రంగు రాళ్లు, గాజులలో వాచ్‌లు పొదిగిన వాటి పైనా.. మక్కువ చూపుతు న్నట్లు వాచ్‌షాప్‌ల యజమానులు చెప్తున్నారు. మణికట్టుపై మాయాజాలాన్ని చూపుతూ కనికట్టు చేసేలా రూపొందుతున్న ఈ చేతి గడియారాలు నేడు బహు మతుల లిస్టులో ప్రముఖ స్ధానం దక్కించుకుంది. మరి మీ మిత్రులకో, బంధువులకో మీరు జీవితాంతం గుర్తుండిపోయేలా చేతివాచీని బహు మతిగా అందించండి.

ఆరోగ్యనిధి దానిమ్మ

మనకు సాధారణంగా లభించే దానిమ్మ పండు ఆరోగ్య నిధి అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అంతేకాదు 1829లో విల్లో చెట్ల నుంచి తీసిన ఆస్ప్రిన్‌ తరువాత మళ్లిd సహజసిద్ధ ఔషధాలలో ఇది అంతటిదని పేర్కొంటున్నారు.
గుండె ఆరోగ్యం, రక్తపోటులతో బాటు, శరీరంలో కొన్ని ప్రాంతాలలో మంటలు వంటి వాటిని తగ్గించడంతో బాటు, క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను, లైంగిక లోపాలను కూడా ఇది సరి చేస్తుందనివారు చెబుతున్నారు. మొట్టవె ుుదటిసారిగా వారు దానిమ్మ గింజలు, తొక్క, బెరడు వంటి వాటిలోఉన్న ఔషధ గుణాలను కనుగొన్నారు. దీనిలో 'పునికాలాగిన్స్‌'గా పిలిచే ఒక రకం మొక్కల నుంచి వచ్చే పోషకం గాఢ స్థితిలో ఉంటుందని గ్రహించారు. అంతేకాక 'ఇది దొరికేది కెవలం దాని మ్మ నుంచే అన్నది గమనించాల్సిన అంశం.
ఈ పునికాలాగిన్స్‌ ఆ పండు తొక్క, లోపలి పసుపు రంగు పొరలు, గింజలు వంటి వాటిలో ఉం టాయ ని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన డాక్టర్‌ స్ట్ట్రీటెన్‌బర్గర్‌ కనుగొన్నారు. అయితే దానిమ్మ తొక్కల కషాయం విరేచనాలను క ట్టేయటంలో అద్భుతంగా పని చేస్తుందని ఆయుర్వేదం కొన్ని వేల ఏళ్ల క్రితమే చెప్పిందన్న విషయం ఇక్కడ గమనార్హం. ఈ పండులోని వివిధ భాగాలలో గొప్ప ఔషధ గుణాలు దాగి ఉన్నందున ఇది దీర్ఘకాలిక రోగాల వల్ల వచ్చే అనేక రుగ్మతల చికిత్సలో ఉపయోగపడగలదని భావిస్తున్నట్టు బ్రిటన్‌లోని క్వీన్‌ మార్గరెెట్‌ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ ఎమాద్‌ అల్‌ దుజైలీ తెలిపారు.

నడుం జర భద్రం


ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న ఫ్యాషన్‌ ప్రపంచం నేడు మన భారత మగువల మనసుల్నికూడా దోచుకుంటోందన్నది వాస్తవం. దీంతో వారి వస్త్ర అలంకరణలో ఎన్నో మార్పులు పుటుకొచ్చాయన్నది జగమెరిగిన సత్యం. నిన్న టి తరం చీరలు, లంగా ఓణీలు కేవలం పండగ పబ్బాలకో పెళ్లి పేరంటాలకో పరిమితం చేసిన నేటి తరం మహిళలు కొత్త కొత్తగా పుట్టు కొస్తున్న ఫ్యాషన్‌ ప్రపంచంలో అడుగు పెడుతూ.. మైమరిచిపోతున్నారు.
ఈ క్రమంలో ఇటీవల కాలంలో జీన్స్‌ ధరించిన మహిళలే కాకుండా వివిధ డ్రస్సులకు తగ్గట్టు బెల్టులు పెట్టడం బాగా పెరుగుతోంది. ఇన్‌షర్టు చేసుకుంటే దాని హూందా తనమే వేరుగా ఉండటంతో మహిళల్లో ఇన్‌ చేసుకుని, బెల్టు వాడే పద్దతి బాగా పెరుగుతోంది.
దీంతో వారి దృష్టి మార్కెట్‌లోకివస్తున్న అనేక రకాల బెల్టులపై పడింది. అనేక రంగుల్లో, కళ్లు చెదరగొట్టేలా కనిపిస్తున్న ఈ బెల్టులు విషయంతో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
స్త్రీల నడుము నాజూకుగా ఉంటుంది కనుక వీరు లావుపాటి, మందంగా ఉండే బెల్టులు వాడితే నడుము కంది పోయి, ఎలర్జీలు ఇతర రుగ్మతలకు దారి తీసే అవకాశాలున్నాయని... నడుముకు సరిపోయిన, మెత్తని, సన్నని బెల్టుని వాడుకుంటే మంచిదని వారు సూచిస్తున్నారు. బెల్టులు, లెదర్‌ షాపులకి వెళ్లేప్పుడు మీరు కంఫర్ట్‌ బెల్టు అడిగితే మంచిదని... వారు చెప్పారు.

24, నవంబర్ 2011, గురువారం

నడుం జర భద్రం

ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న ఫ్యాషన్‌ ప్రపంచం నేడు మన భారత మగువల మనసుల్నికూడా దోచుకుంటోందన్నది వాస్తవం. దీంతో వారి వస్త్ర అలంకరణలో ఎన్నో మార్పులు పుటుకొచ్చాయన్నది జగమెరిగిన సత్యం. నిన్న టి తరం చీరలు, లంగా ఓణీలు కేవలం పండగ పబ్బాలకో పెళ్లి పేరంటాలకో పరిమితం చేసిన నేటి తరం మహిళలు కొత్త కొత్తగా పుట్టు కొస్తున్న ఫ్యాషన్‌ ప్రపంచంలో అడుగు పెడుతూ.. మైమరిచిపోతున్నారు.
ఈ క్రమంలో ఇటీవల కాలంలో జీన్స్‌ ధరించిన మహిళలే కాకుండా వివిధ డ్రస్సులకు తగ్గట్టు బెల్టులు పెట్టడం బాగా పెరుగుతోంది. ఇన్‌షర్టు చేసుకుంటే దాని హూందా తనమే వేరుగా ఉండటంతో మహిళల్లో ఇన్‌ చేసుకుని, బెల్టు వాడే పద్దతి బాగా పెరుగుతోంది.
దీంతో వారి దృష్టి మార్కెట్‌లోకివస్తున్న అనేక రకాల బెల్టులపై పడింది. అనేక రంగుల్లో, కళ్లు చెదరగొట్టేలా కనిపిస్తున్న ఈ బెల్టులు విషయంతో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
స్త్రీల నడుము నాజూకుగా ఉంటుంది కనుక వీరు లావుపాటి, మందంగా ఉండే బెల్టులు వాడితే నడుము కంది పోయి, ఎలర్జీలు ఇతర రుగ్మతలకు దారి తీసే అవకాశాలున్నాయని... నడుముకు సరిపోయిన, మెత్తని, సన్నని బెల్టుని వాడుకుంటే మంచిదని వారు సూచిస్తున్నారు. బెల్టులు, లెదర్‌ షాపులకి వెళ్లేప్పుడు మీరు కంఫర్ట్‌ బెల్టు అడిగితే మంచిదని... వారు చెప్పారు.

తెలుగు జాతి వెలుగు జాతే..

  • ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొక్కటే...
  • నేడు తెలుగువారందరిదీ ఒకటే రాష్ట్రం..
  • భవిష్యత్‌లో రెండు రాష్ట్రాలు, మూడు రాష్ట్రాలు ఏర్పడ వచ్చు.
  • కానీ తెలుగువారి సమైక్యతకు సమగ్రతకు పోరాడిన చరిత్రను విస్మరించలేం. మనముందు నూతన చరిత్ర ఆవిష్కృతమైనా..
దానితో పాటు పూర్వ చరిత్రనూ స్మరించుకోవలసిందే త్యాగధనుల్ని తలచుకోవాల్సిందే.
వారి త్యాగాల స్పూర్తిగా తెలుగువారి సమగ్రాభివృధ్ధికి ముందుకు సాగాల్సిందే...
సువిశాల భారత సామ్రాజ్యానికి స్వాతంత్రం వచ్చాక అంతే స్ధాయిలో రాష్ట్రం కోసం పోరాటం జరగటం ఆంధ్ర ప్రదేశ్‌తోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. 1912 లోనే తెలుగు భాష మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం ఉండా లని టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవ రెడ్డి, భోగరాజు పట్ట్టాభి సీతారామయ్య తదితరుల సారధ్యంలో అలుపెరగని పోరాటం జరిగింది. 40 ఏళ్ల పాటు పోరా డినా... అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం కానీ తరువాత వచ్చిన స్వతంత్ర భారత ప్రభుత్వం కానీ ఆంధ్ర ప్రజల ఆకాంక్షని నెరవేర్చలేదు. ఆ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పాటులో పొట్టి శ్రీరాములు చేసిన ఎనలేని కృషి చిరస్మరణీయం.అని చెప్పక తప్పదు.
అమరజీవి...
1901 మార్చి 16న చెన్న పట్టణంలో జన్మించిన పొట్టి శ్రీరాములు ప్రాధమిక విద్య పూర్తయ్యాక శానటరీ ఇంజనీ రింగ్‌ కోర్సు చేసి పశ్చిమ రైల్వేలో ఉద్యోగం చేసేవారు. ఈ క్రమంలో నాడు స్వాతంత్ర పోరాటంలో అనేక మంది పాల్గొనటంతో ఉత్తేజభరితుడై స్వాతంత్ర సమరం వైపు అడుగులు వేసాడు. ఓ వైపు తన తల్లి చనిపోయినా... వెర వక మాతృభూమిని విదేశీ కబంధహస్తాల నుండి కాపా డటమే లక్ష్యంగా గాంధీ సాగించిన మహౌద్యమానికి తానూ బాసటగా నిలచి ఉపð సత్యాగ్రహం, క్విట్‌ ఇండి యా ఉద్య మాల్లో చురుకుగా పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చే నాటికి ఈ దేశంలో 22 జిల్లాలో తెలుగు మాట్లాడే వారుండేవారు. 1952లో మద్రాస్‌ ప్రెసిడెన్సీలో ఉండి దక్షణ భారత దేశంలో సాంప్రదాయలకు పెద్ద పీట వేస్తూ వచ్చిన తెలుగు జాతి ఎన్నో ఈసడిం పులకు అవమానాలకుగురవుతు ఏహ్యభావం పెరుగుతున్న దశలో వాటిని సహించలేక తెలుగుభాష మాట్లాడే వారందరినీ ఒకే రాష్ట్ర పరిధిలోకి తేవాలన్న ఏకైక డిమాం డ్‌తో 1952 అక్టోబ ర్‌ 19న చెన్నై పట్టణంలోని బులుసు సాంబ మూర్తి ఇంట్లో ఆమరణ దీక్షను ప్రారంభించారు. అంచెలం చెలుగా ఆమరణ దీక్ష ఫలితాలు తెలుగునాట విస్తరిం చడంతో పాటు తెలుగునాట ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపం దుకుం ది. లక్షలాది ప్రజలువీధుల్లోకొచ్చి పొట్టి శ్రీరాములుకు మద్దతుగా ప్రదర్శనలు, నిరసనల దీక్షలు చేపట్టారు. నాటి కేంద్ర సర్కారు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా దీక్ష విర మణకు ససేమిరా అనటంతో పాటు తెలుగురాష్ట్ర ఏర్పా టుకు భీష్మించడంతో క్రమేణా ఆరోగ్యం కృసించి 1952 డిశంబర్‌ 15న దీక్షలోనే ఆయన పరమపదిం చారు.
డిశంబర్‌ ప్రకటన.
పొట్టిశ్రీరాములు మరణ వార్త యావత్‌ ఉమ్మడి రాష్ట్రాన్ని కుదిపేసింది. మద్రాసు నుంచి విశాఖ సాగర తీరం వర కు లక్షలాది ప్రజలు ఆమరజీవి మరణం పట్ల ఆగ్రహావే శాలు వ్యక్తం చేస్తూ. విధ్వంసానికి దిగారు. అనేక హింసా త్మక చర్యలకు కూడా పాల్పడ్డారు. నాడు జరిగిన పోలీసు కాల్పు ల్లో అనేక మంది అసువులు బాసారు. చివరికి ఆయన చేసినప్రాణత్యాగాన్ని గుర్తించిన నాటి ప్రధాని జవహ ర్‌ లాల్‌ నెహ్రూ 1952 డిశంబర్‌ 19 నఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కు శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు.. 1953 అక్టోబర్‌1న తెలుగు వారి కోసం ప్రత్యేక ఆంధ్ర ఏర్పా టు చేసారు.అయితే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న కోస్టల్‌ ఆంధ్రా, రాయలసీమ జిల్లాలను విడి రాష్ట్ర ఏర్పాటు సన్నాహాల దిశలో ఉండగా నాడు ఉమ్మడి ముఖ్యమంత్రిగా వ్యవహరి స్తున్న చక్రవర్తుల రాజగోపాలచారి.. ఆంధ్ర రాష్ట్రం ఏర్పా టు చేస్తే,వెంటనే ఆంధ్రులు వెళ్లిపోవాలని తెగేసి చెప్పడం తోరాజధానిఏర్పాటుపై అనేక తర్జనభర్జనలు జరిగాయి.
రాజధాని కోసం తర్జన భర్జనలు...
ఈ క్రమంలో ఆంధ్రకు రాజధానిగా కాకతీయులు పాలించిన వరంగల్‌ని రాజధానిగా చేస్తే అందరికీ సౌల భ్యంగా ఉంటుందని... అలాగే రాజమండ్రిని పరి గణలో కి తీసుకోవచ్చని రాజ్యాంగ ప్రదాత బాబా సాహేబ్‌ అంబే డ్కర్‌ ప్రతిపాదనచేసారు. మధ్యే మార్గంగా విజయ వాడని కూడా ఎంపిక చేయాలని తలచారు. అయితే అప్పటికే విజయవాడని కమ్యూనిస్టులు తమ కంచుకోటగా మార్చు కోవటంతో అక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే తమకు ఇబ్బం దులు ఏర్పడటం ఖాయమని కాంగ్రెస్‌ నేతలు ససేమిరా అనటంతో రాజధాని కధ మళ్లీ మెదట ికొచ్చింది.
అదే సమయంలో చెన్నైకి దగ్గరగా ఉన్న తమని ఆంధ్ర లో కలపడం వల్ల రాజధాని దూరం అవుతుందని.. తద్వారా తమ రాయలసీమ జిల్లాల అభివృధ్ధి ఆగిపోతుందని... అక్కడి కాంగ్రెస్‌ నేతలు కొత్త మెలిక పెట్టడంతో పాటు రాజధానిని కోస్తా ప్రాంతాలలో ఏర్పాటు చేస్తే తాము అంగీకరించే ప్రశ్నే లేదని, కోస్తా వారిని తాము ఎట్టి పరి స్ధితిలోనూ నమ్మబోమంటూ రాయల సీమలోనే రాజధాని ఉండాలి. లేదంటే తమకు ప్రత్యేకరాష్ట్రమే అవసరం లేదం టూ నీలం సంజీవరెడ్డి లాంటి నేతలు ఎదురు తిరగటం ఓ వైపు అయితే తిరువళ్లూరు, బళ్లారీ, బరంపురం తది తర తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలను కూడా వదులుకునేందుకు సిద్దపడాల్సి వచ్చింది మరో వైపు.. మద్రాసు రాష్ట్రాన్ని వదిలి పెట్టి ఎట్టి పరిస్ధితిలోనూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు త్వరితగతిన ఏర్పాటు చేసుకోవాలని ఒకే ఒక కాంక్షతో రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు రాజ ధానిగా చేసి 1953 అక్టోబర్‌1న ఆంధ్ర రాష్ట్రంని ఏర్పాటు చేసారు. దీనికి తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్రకేశరి టంగు టూరి ప్రకాశం పంతులు వ్యవహరించారుఆపై ఆంధ్ర రాష్ట్రంలోనిజాంస్టేట్‌లోని తొమ్మిది జిల్లాలను కలిపి 1956 నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ని ఏర్పాటు చేసి దీనికి హైదరా బాద్‌ని రాజధానిగా చేసారు. నాటి నుండి తెలుగు వాళ్లు ప్రపంచవ్యాప్తంగా తమ సత్తా చూపి స్తూ, తెలుగుభాషకు, మన రాష్ట్రానికి ఎనలేని పేరు ప్రఖ్యా తులు తెచ్చి పెట్టారు. ఖండా తరాలలోనూ తెలుగువాడి ఖ్యాతి మిన్నంటింది. తెలుగు రాష్ట్ర ఏర్పాటుకు కృషిచేసిన పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షకు దిగిన ఇంటిని ఆయన స్మృతి చిహ్నంగా కాపా డుతూ వస్తోంది. చెన్నైలోని మైలాపూర్‌, రాయపేట హైవే రోడ్డులో ఉన్న 126 నంబర్‌ ఇంటిని మీరెపðడైనా చెన్నై వెళ్తే దర్శించండి. ఇక మన రాష్ట్ర ప్రభుత్వ ఆ మహనీ యుని పేరు మీద పొట్టి శ్రీరా ములు తెలుగు విశ్వ విద్యాల యాన్ని స్ధాపించగా... 2008 లో నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసింది.
రాష్ట్రం సరే... భాషను కాపాడుకొందాం...
కానీ నేడు తెలుగు రాష్ట్ర భవి ష్యత్‌ అగమ్యగోచరంగా తయా రైంది. మా తెలుగు తల్లికి మల్లె పూదండ... అం టూ తెలుగు భాషకి అమ్మలోని కమ్మదనాన్ని మేళవించి చేసిన శంకరంబాడి కలం విన్యా సాలు... చేయెత్తి... జై కొట్టు తెలు గోడా... గతమెంత ఘన కీర్తి కల వోడా... అంటూ వేముల పల్లి శ్రీకృష్ణ తెలుగు జాతి గొప్ప తనాన్ని... నిండు గౌరవాన్ని ప్రపంచం పిక్కరి ల్లేటట్లు చేసినా అవి పాటలకే పరిమితం అయిపో వాల్సిన దుస్ధితి నెలకొంది. కనీ సం తెలుగుభాషకీ గౌరవం దక్కకుండా పోతోంది.
విదేశీయులు మన భాషని ఆశ్వాదిస్తుంటే...
ఒకపðడు ఇటాలియన్‌ ఆఫ్‌ ఈస్ట్‌గా... దేశ భాషలందు తెలుగు లెస్సగా ఎందరో దేశ విదేశాలకు చెందిన అనేక మంది ఈ భాషపై మక్కువతో...తెలుగు నేర్చుకుని.తమ అభిమానాన్ని చాటుకొంటు ప్రపంచంలోని ఏ భాషకూ లేని తెలుగు భాష నుడికారాన్ని, వీనుల విందైన పదకట్టు విన్యాసాలని నేర్చుకుని మన భాష సౌందర్యాన్ని ఆస్వాది స్తుంటే... మనం మాత్రం పరాయి భాషల వెూజు లో పడి తెలుగుభాష కమ్మదనాన్ని పక్కకు నెట్టేస్త్తూన్నా మన తెలు గు భాష అంత్యంత ప్రాచీన భాషగా గుర్తింపు పొందడమే కాకుండా ప్రాధాన్యతా క్రమంలో ప్రపంచవ్యాప్తంగా 6వ స్ధానాన్ని భారతదేశంలో 2వ స్ధానాన్ని దక్కించుకొందంటే మనమింకా అప్రమత్తతగా ఉంటే ఆస్ధాయి ఎక్కడికి పెర గొచ్చో, తెలుగు భాషలోని జాతీయాలు, మాట్లాడేందుకు ఉండే సౌలభ్యం ఉన్నతంగా ఉండటంతో అనేక మంది తెలుగు వారిని తమభాషల్లో కలిపేసు కోవాలని చూసినా అనేక అనువాదాలను తెరపైకి తెచ్చినా వీలుకా లేదు.మన భాషాబలం అలాం టిది మరి.
జాతికి ద్రోహం చేసినట్లే....
కానీ మన వాళ్లే సొంత ఇంటి భాషని నిర్లక్ష్యం చేస్తూ... పరాయి భాషల చూరు పట్టుకు వేలాడుతున్నారు. ఉపాధి కోసం ఇంగ్లీషు నేర్చుకున్నంత మాత్రాన తెలుగు భాషని మరచిపోవాలన్న రూలేమీ లేదు. మాతృభాషలో ఎవరైనా మాట్లాడటం వింటే చాలు...వికృత ముఖం పెట్టి చూడ టం...తెలుగు వచ్చినా మాట్లాడకుండా సాటి తెలుగు వారి ని ఇబ్బంది పెడుతూ పైశాచిక ఆనందం పొడటం అంటే తెలుగు జాతికి ద్రోహం చేసినట్లే భావించాలి. ఇక తెలుగు మాట్లాడేవారంతా ఒక్కటిగా ఉండాలని నినదించిన వారిని ఏహ్యభావనతో చూడటం ఆశ్చర్యకరం. తెలుగు జాతి, భాషావికాసాలకు ఎనలేని కృషి చేసి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మాండలికా లను యావత్‌ తెలుగు జాతి మొత్తానికీ పరిచయం చేసిన ఎందరో మహనీయులని, కవులు, కళా కారులని తలచుకుంటూ.వారు చూపిన బాటలో నడుస్తూ భవిష్యత్‌లో మన రాష్ట్రం ఎన్ని ముక్కచెక్కలైనా తెలుగు వాళ్లంతా తమ భాష సంస్క ృతులును కాపాడుకోవాల్సిన అవసరం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడానికి ఏ మాత్రం సందేహ పడనఖ్ఖర్లే...
అక్కడ వికసిస్తూ.. ఇక్కడ మందగిస్తూ...
విదేశాల్లో ఆటా, తానా, సిలికానాంధ్ర పేర్లతో అక్కడ ఉన్న తెలుగు వారు తమ మాతృభాష గొప్పదనాన్ని ఎప్పటిక పðడు గుర్తు చేసుకుంటూ తెలుగు సంస్కృతి, భాషా వికా సాలకి ఎంతగానో తొడ్పడుతుసాటి తెలుగువారిలో జాతీ యతా భావాన్ని రగిలిస్తున్నాయి. తెలుగు పతాకాన్ని అక్కడ రెపరెపలాడిస్తున్నా.. మన తెలుగు గడ్డపై మాత్రం తెలుగు జాతి ఏకీకరణకుగానీ, భాష పట్ల గౌరవాన్ని కానీ ప్రదర్శిం చక పోవటం విచారకరం.ఇప్పటికే ఇంగ్లీషు మాద్యమానికే పెద్ద పీట వేస్తూ... మాతృభాషలో విద్యాబోధన పట్ల చిన్న చూపు జరుగుతున్న క్రమంలో నేడు స్పోకెన్‌ ఇంగ్లీషు కేంద్రాలొచ్చినట్లే... భవిష్యత్‌లో స్పోకెన్‌ తెలుగు కేంద్రాలు పుట్టుకు వచ్చినా ఆశ్చర్యపోనఖ్ఖర్లే...
ప్రభుత్వమేం చేయాలి...
ఇప్పటికే ఇంటర్నెట్‌లో తెలుగు భాష చదువుకునేందుకు వీలుగా జరిగిన ఏర్పాట్లు సామాన్యజనానికి కూడా అర్ధమ య్యేలా చట్టాలను తెలుగు భాషలోనే అందుబాటులోకి తీసుకు రావాలి. అలాగే ఏ ప్రభుత్వ పధకమైనా ధరఖా స్తు తెలుగులో ఉంటేనే పరిశీలనకు తీసుకుంటామని.. ప్రభుత్వం ప్రకటించాలి. పాలనాపరమైన సౌలభ్యం పేరు తో ఇంగ్లీషు ఎంత ముద్దనుకున్నా...ప్రతి ఆదేశాన్ని ప్రజల చెంతకు చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల ప్రతి జిఓ ప్రజలకు తెలుగులోనే అందుబాటులోకి తీసుకు రావాలి. మరో స్వాతంత్ర పోరాటం జరిపినట్లే తెలుగు ప్రజలంతా యాసలకు, ప్రాంతీయా విధ్వేషాలకు అతీ తంగా ఐక్యంగా మన భాషని రక్షించుకోవటానికి ప్రతి తెలుగు వాడూ నడుంబిగించాలి.



అపðడెందుకు పాల్గొన్నారు
రాష్ట్రం ఎన్నిగా విభజించినా, అది జరిగే వరకు అంతా కల్సి ఉండాల్సిందే కదా ఆంధ్ర ప్రదేశ్‌ అవరతణ దినోత్సవం అంతా జరుపుకోవాల్సిందే...
2004లో మంత్రివర్గంలో ఉన్న నేటి విభజనవాదులు అప్పట్లో ఎందుకు అవతరణ దినోత్సవాలలో పాలొ ్గన్నారు... నేడెందుకు బ్లాకడేేలుగా పాటిస్తున్నారన్న విష యంపై ప్రజల కు వివరణ ఇవ్వాల్సిందే కాదా
వి.శ్రీనివాస్‌, పాలకొండ, శ్రీకాకుళం


పరస్పరం గౌరవించుకోవటం అవసరం
గతంలో జరిగిన జైతెలంగాణా, జై ఆంధ్ర ఉద్యమాలను చూసిన నాకు ప్రస్తుతం రాష్ట్రంలో నెల కొన్న పరిస్ధితి చూస్తుంటే బాధ కలుగుతోంది. విధ్వేషాలు రెచ్చ గొడుతూ పబ్బం గడుపుకుంటున్న రాజ కీయనేతలకు దూరంగా ఈ సారి రాష్ట్ర అవతరణ దినోత్సవాల నిర్వహణ బాధ్యతల్ని కలెక్టర్ల కివ్వటం సరైనదే, ఇక నుండి వారు రాజ కీయ వత్తిళ్లకు లొంగకుండా జనం బాధల్ని గుర్తెరిగి జాగుర కతతో వ్యవహరించాలి. అడుగున పడుతున్న సంక్షేమం ప్రజల ముంగిటకు చేర్చాలి. ప్రజలు కూడా రాజకీయ నేత ల మాటలకు రెచ్చి పోకుండా కేంద్రం విభజన రేఖలు పూర్తి చేసే వరకు సాటి తెలుగు వారిని పరస్పరం గౌరవిం చుకోవాల్సిన అవసరం ఉంది.
- మనోరంజన్‌ రావు, రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి,
ఆర్‌కె నగర్‌, సికింద్రాబాద్‌



రెచ్చగొట్టే వారిని శిక్షించాలి...
రాష్ట్రంలో విపరీత ధోరణులు పెరిగి పోవటానికి నేతల స్వార్ధ రాజకీ యాలే కారణం అన్నది వాస్తవం. లక్ష్య సాధన కన్నా తమ రాజకీ య భవిష్యత్‌పైనే దృష్టి పెడుతూ ఇష్టా నుసారంగా ప్రవర్తిస్తూ... జనానికి సమస్యగా తయారయ్యా రు. ఇలాంటి వారిని జనమే శిక్షించాలి.
గోపాల్‌ రెడ్డి, హౌసింగ్‌ బోర్డు కాలనీ,
ఇసీఈఎల్‌, సికింద్రాబాద్‌


రెండు రాష్ట్రాలు ఏర్పడితే తప్పేంటి
తెలుగువారికి రెండు రాష్ట్రాల డిమాండ్‌ తప్పుకాదు. నాడు పొట్టి శ్రీరాములు అప్పటి పరిస్ధితిలకు అనుగుణంగా తెలుగువారికి రాష్ట్రాన్ని సాధించారు. అలాగే తెలంగాణా వారికి ఇప్పుడొక రాష్ట్రం కావాలి. మరి తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఏర్పడితే తపేపండి అయితే తెలంగాణా రాష్ట్రాన్ని డిమాండ్‌ చేస్తూనే తెలుగు వారిని గౌరవించాలి. పొట్టి శ్రీరాములును స్మరించాలి. అదే భావ సమైక్యతకు, తెలుగు జాతి మనుగడకి శ్రేయాేెదాయకం.
- ప్రసాద్‌, శ్రీకాకుళం


ప్రత్యేక దేశం కావాలన్న నిజాం
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడానికి పూర్వమే హైదరా బాద్‌ నిజాంపాలనలో ఉండేది. భారతదేశానికి స్వాతం త్రమొచ్చినా...తాము మాత్రం అందులో కలిసేది లేదని ససేమి రా అంటూ ప్రత్యేకదేశంగా ఏర్పాటు కావాలని నిజాం తన ప్రయత్నాలు ప్రారం భించా డు. ఈ క్రమంలో ఆయుధాల సమీకరణ చేసుకొంటూనే ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిని ఆశ్రయించి సైన్యాన్ని పెంచుకొన్నారు. ఆపై రజాకార్ల హింస పెరిగి పోవ ట తో ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టులు సాయుధ పోరాటానికి దిగారు. దీంతో హైద రాబాద్‌లో హింస ప్రజ్వరిల్లటంతో 1948లో సెప్టెంబర్‌ 13న భారత ప్రభుత్వం పోలీ సుచర్యకి దిగింది. 5 రోజుల పాటు సాగిన ఈ పోరులో నిజాం ఓటమి పాలవ్వగా 18న పోలీసులు నిజాం సంస్ధానాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. దీంతో తప్పని పరి స్ధితిలో భారత దేశంలో తన సంస్ధానాన్ని కలిపేసేందుకు అంగీకరించాడు.


సైనిక పాలన నుంచి సమైక్యం వైపునకు...
హైదరాబాద్‌ని సైనిక పాలనలోకి తీసుకు వచ్చి సైనిక గవర్నర్‌గా మేజర్‌ జనరల్‌ జెఎస్‌ చౌదరిని నియమించారు. 1949 చివరి వరకూ గవర్నర్‌ పాలనలో ఉన్న నిజాంను హైదరాబాద్‌ రాష్ట్రంగా ప్రకటించి 1950లో రాజ్‌ ప్రముఖ్‌గా నిజాంని ప్రకటించి... ఎం.కె వెల్లోడిని ముఖ్యమంత్రిని చేసారు. ఆపై 1952లో జరిగిన ఎన్నికల్లో భూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అయితే 1953లో ఏర్పాటైన సయ్యద్‌ ఫజిల ఆలీ నేతృత్వంలోని రాష్ట్రాల పునర్విభజన కమి టీ, విశాలాంధ్ర ప్రయోజనాలు గుర్తిస్తునే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు సై అంది. దీనిపై విభేదించి.. హైదరాబాద్‌ అసెంబ్లీ మెజార్టీ సభ్యులతో పాటు కమ్యూనిష్టులు విశాలాంధ్ర ఏర్పాటును సమర్ధించడంతో తెలంగాణా, ఆంధ్రా నేతల మధ్య పెద్ద మనుషుల ఒప్పందం జరిగి 1956 నవంబర్‌1న ఆంధ్ర ప్రదేశ్‌ అవతరించింది.

కాలమేదైనా... నోరూరించే.. ఐస్‌క్రీమ్‌

వేసవి కాలమే... కాదు... శీతాకాలం లో నైనా... చలిపులి చంపేస్తున్నా.... ఐస్‌క్రీమ్‌ చూస్తే... తినాల్సిందే...
అనేక రకాల రంగుల్లో.. అనేక రుచుల్లో... వివిధ వాసనల్లో ఏదైశస్ధులైనా...
ఏ ప్రాంతానికి చెందిన వారినైనా అబ్బురపరిచేలా ఇట్టే ఆకర్షించేది ఐస్‌ క్రీమ్‌.
చిన్నా.. పెద్ద్ద, ముసలి, ముతక అని వయసు తేడాలే లేకుండా మక్కువ చూపిస్తుంటారంటే...
ప్రపంచంలో దీన్ని దాదాపుగా ఇష్టపడని వారే ఉండరనే చెప్పాలి.
చల్లగా... మనసుని ఆహ్లాదకర తీరాలకు చేర్చే సత్తా ఐస్‌ క్రీమ్‌ల సొంతం అని అన్నా ఆశ్చర్యపోనఖ్ఖర్లే...
ఒకప్పుడు కేవలం ఖరీదైన కుటుంబాలకే పరిమి తమైన ఈ ఐస్‌ క్రీమ్‌ నేడు సామాన్యుడికి చాలా అందుబాటు లోకి వచ్చింది. ఇప్పుడు సామాన్యుడి ఇంట కూడా ఏఫంక్షన్‌ చూసినా... అక్కడ జరిగే లంచ్‌, డిన్నర్‌, పార్టీ లు ఐస్‌క్రీమ్‌తోనే ముగియాల్సిందన్నంతగా మనం చేరి పోయామంటే...ఐస్‌ క్రీమ్‌లని ఎంతలా ఇష్టపడుతున్నా మో అర్ధం చేసు కోవచ్చు.
తొలి నాళ్లలో ఐస్‌ క్రీమ్‌ కోసం ప్రత్యేకంగా డైరీ పార్ల ర్లు ఉండగా... కాల క్రమంలో అవి దాదాపుగా ఐస్‌ క్రీమ్‌ పార్ల్లర్లుగా మారిపోయాయి. దీనికి తోడు డైరీ ఫాంలతో పాటు అనేక కార్పొరేట్‌ సంస్ధలు కూడా ఈ ఐస్‌ క్రీమ్‌ తయారీలోకి రావటంతో ఐస్‌ క్రీమ్‌ ఉత్పత్తి దారులు తమ అమ్మకాలను మరింత పెంచు కునే దశలోలో నేరుగా సామాన్యుడి ఇంటి ముంగిటికే ఐస్‌క్రీమ్‌ చేర్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించి ఐస్‌ క్రీమ్‌వ్యాపారం కూడా అభివృద్ది పధంలో పయనిస్తోంది.
తొలినాళ్లలో ఐస్‌ క్రీమ్‌ని నిలవ ఉంచేందుకు తగిన స్ధాయి సామా న్యుడికి లేక పోవటంతో అది ఏ రాజ ప్రాసాదాలకో, ధనవంతులు, సంపన్నకుటుంబాలకో పరిమితమైనా..ఈ క్రమంలో జరిగిన సాంకే తిక విప్లవం కారణంగా ధరలు తగ్గి... చాలా ఇళ్లలో రిఫ్రిజిరేటర్లు వచ్చి చేరాక సామాన్యుడికి బాగా అందుబాటులోకివచ్చింది.
మరోవైపు ఇంట్లో మహిళలు కూడా ఐస్‌క్రీమ్‌ తయారు చేసుకు నేందు కు తెగ ఆసక్తి ప్రదర్శించారు. ఇందుకు తగ్గట్టుగానే అనేక కంపెనీలు ఇందుకు కావాల్సిన సామగ్రిని అందుబాటులోకి తెచ్చాక ఇంట్లోనే ఐస్‌క్రీమ్‌ తయారవ్వటం ప్రారంభించింది.
ఇంతకీ ఐస్‌ క్రీమ్‌ వెనక కధ ఏంటంటే...
రుచికరంగా మనం తింటున్న ఈ ఐస్‌ క్రీమ్‌ల వెనుక పెద్ద్ద కధే ఉంది. దాదాపు 700 ఏళ్ల్ల క్రితం చైనాలోని మార్కొపోలో అక్కడి వంట వాళ్లు, మంచుకి పాలు చక్కెర కలిపి రుచికరమైన ఐస్‌ని తయారు చేసారు. అక్కడి నుండి ఇటలీ, ఫ్రాన్స్‌ దేశాలను చేరిన ఈ వంటకం అమెరికాతో సహా ప్రపంచమంతా విస్తరించినట్లు ఓ కధ ప్రచారం లో ఉండగా... అసలు ఐస్‌ క్రీమ్‌ అంటూ ప్రత్యేకంగా తయారు చేసిన వంటకమే కాదని నాటి కాలంలో ఇంగ్లాండ్‌ సామ్రాజ్యాన్ని పాలిస్తున్న మొదటి ఛార్లెస్‌ దగ్గర ఫ్రెంచి వంటకాలు తయారు చేసేందుకు ప్రత్యే కంగా ఓ వంట వాడు ఉండేవారు. మత్తు పానీయాలను తాగే క్రమం లో వాటిని చల్లబరుచుకుని తాగెె వాడు. ఓరోజు ఇదే విధంగా ప్రిన్స్‌కి కూడా అందచేయగా... మత్తు పానీయంతో తయారు చేసిన ఐస్‌ గడ్డ లు రుచికరంగా ఉన్నాయని ఈ విధానాన్ని ఎవ్వరికీ చెప్పవద్దని ఆదేశాలు జారీచేసినా... ఆ వంటవాడు తన సహచరులకు వివరించ డం... అది వారి ద్వారా యూరోపియన్లకు చేరటం జరిగిందని... అక్కడి నుండి ఈ ఐస్‌ క్రీమ్‌ రహస్యం అమెరికాకు పాకింద ని... అప్పట్లోనే న్యూయార్క్‌ కు చెందిన పలు వార్త్తా సంస్ధలు కధనాలు ప్రచురించినట్లు చెప్తారు. ఇలా అమెరికా పాకిన ఈ ఐస్‌ క్రీమ్‌పై అనేక మంది ఐస్‌ని రకరకా లుగా చేసే విధానాలపై ఎన్నో ప్రయోగాలు చేయటం వల్లనే ఇప్పు డు మనం తింటున్న ఐస్‌ క్రీమ్‌ పుట్టిందని చెప్తారు.
అంచెలంచెలుగా ఎదిగి...
1851లొ బాలిమోర్‌కి చెందిన జేకబ్‌ ఫన్సల్‌ తొలిసారి ఐస్‌క్రీమ్‌ని మార్కె ట్‌లో అమ్మకాలు ప్రారంభిస్తూ... ఓ షాపుని ఏర్పా టు చేయగా... 1903లో డెమాస్కస్‌ నుంచి వచ్చిన సిరియా దేశస్దుడైన ఎర్నెస్ట్‌ ఏ హాంనీ ఐస్‌ క్రీమ్‌లు ప్రత్యేకంగా తినేందుకు వీలుగా కోన్‌ లని తయారు చేసి... వీటిలో అమ్మడం ప్రారం భిం చాడు. ఈ క్రమంలోనే న్యూ జెర్సీకి చెందిన నాన్సీ జాన్సన్‌ సులభ పద్ధతిలో ఐస్‌ క్రీమ్‌ తయారు చేసేం దుకు మిషన్‌ని రూపొందించడంతో ఐస్‌క్రీమ్‌ వాణిజ్యం మరింత విస్తృతమైంది.
1904లో సెయింట్‌ లూయిస్‌లో
జరిగిన ప్రపంచప్రదర్శనలో తొలిసారిగా ఐస్‌ క్రీమ్‌ని ప్రద ర్శించగా...1920లో నీటి ఆవి రి, విద్యుత్‌ శక్తులతో ఐస్‌ తయారీ విధానం అందుబాటు లోకి రావటంతో 1921లో తొలి ఐస్‌ క్రీమ్‌ బార్‌ని తెర చారు. ఇక రెండో ప్రపంచ యుద్ద కాలంలోదక్షిణ ఫసిపిక్‌ నౌకా శాఖలో పనిచేస్తూ.. ఐస్‌ క్రీమ్‌ పై అనేక ప్రయోగాలు చేసిన బుర్టన్‌ బుచ్‌ బాస్కిన్‌ ఐస్‌ క్రీమ్‌ ఫీజర్‌తో తొలిసారిగా 31 రకాలలో ఐస్‌ క్రీమ్‌లని రూపొందించి ప్రపం చ దృష్టిని ఆకర్షించాడు.
1945లో పరిచయమైన ఇర్విన్‌ రాబిన్స్‌ అనే వ్యక్తితో కల్సి చేసిన అనేక ప్రయోగాల అనంతరం ప్రపం చానికి చాక్లొట్‌, వెనిలా, స్టాబెర్రీ ఫ్లావర్లను పరిచయం చేయగలి గాడు. దీంతో ఐస్‌ క్రీమ్‌ తయారీలోనూ పెను మార్పులు సంభవిం చాయ నే చెప్పక తప్పదు.

ఐస్‌ క్రీమ్‌
ఎలా తయారు చేస్తారంటే...
రిఫ్రిజిరేటర్లు వచ్చాక ఐస్‌ క్రీమ్‌లలో అనేక మార్పులు ఊపందుకున్నాయి. పాలు, చక్కెరలతో పాటు తేనె, కోడి గుడ్లు, చాక్లెట్లు, అనేక రకాల పళ్లు, ఆరోగ్యాన్ని అందించే మొలకలతో కూడా ఐస్‌ క్రీమ్‌లు తయారు చేయ టం ప్రారంభమైంది. కమర్సియల్‌ గా కూడా ఐస్‌ క్రీమ్‌లు అనేక రూపా లను సంతరించుకుని ఆకర్షణీయంగా తయా రవుతున్నాయి.
మిల్క్‌ సాలిడ్‌లు, నీళ్లు, పాలు, సుగర్‌, ఫ్యాట్స్‌పూర్తి స్ధాయిలో కలిపి వాటిని ఐస్‌క్రీం ప్లాంట్లలో 'పాయిశ్చరైజర్‌' చేస్తారు. ఆపై హోమోజె నెజేషన్‌ పేరుతో జరిగే ప్రక్రియతో అందులోని కొవ్వు పదా ర్ధాలని కరిగించి, దాదాపు 4 గంటల పాటు స్టోరేజ్‌ ట్యాంకులలో నిలవఉంచాక ఆమిశ్రమాన్ని విభజించి...కావా ల్సి న రంగులు, రుచుల కోసం ఫ్లేవర్లు కలుపు తారు. దీన్ని లిక్విడ్‌ అమోనియంతో 30 డిగ్రీల సెంటీగ్రేట్‌ టెంపరేచర్‌ వద్ద స్ధిర పరుస్తారు.
ఓవర్‌ రన్‌ తప్పని సరి...
ఈ ఏర్పాడ్డ గట్టి పదార్ధాన్ని నేరుగా తింటే కేవలం ఐస్‌గడ్డలు తిన్నట్లుగా ఉంటుంది కనుక గాలిని చొప్పించాల్సింటుంది. గాలి చేకూరిస్తేనే మెత్త్తబడి... తినేందుకు వీలవుతుంది. అందు కు అత్యధిక వేగంగా తిరిగే బ్లేడ్లు ఉన్న ఫీజర్లలో ఉంచి బాగా మిక్స్‌ చేస్తారు. దీని వల్ల ఐస్‌ క్రీమ్‌ తేలిక పడి పరిణామం కూడా పెరుగు తుంది.ఇలా ఐస్‌గా ఉన్న దాన్ని గాలి చొప్పించి క్రీమ్‌గా మార్చే విధానాన్ని ఓవర్‌ రన్‌ అని పిలు స్తారు. ఇంటి అవసరాలకు కావాల్సిన ఐస్‌ క్రీమ్‌లలో 80 శాతం ఈ ఓవర్‌ రన్‌ ఉండాల్సిందే.
ఆపై ప్యాకింగ్‌ చేసే ముందుకు అనేక పళ్లు, రక రకాల విత్తనాలతో అలంక రించి 'హార్డెనింగ్‌ రూమ్‌లో పెట్టి 23 డిగ్రీల సెంటీగ్రేడ్‌ టెంపరే చర్‌లో 12 గంటలు తక్కువ కాకుండా ఈ హార్డెనింగ్‌ కొనసాగిస్తారు. దీని వల్ల ఐస్‌ క్రీమ్‌లో ఉన్న నీటి భాగం గడ్డ కట్టి... తీసుకు వెళ్లేందుకు వీలు కలిగేలా చేస్తుంది.
ఐస్‌క్రీం యూనివర్శిటీ...
నిజమే.. సెంట్రల్‌ ఇటలీలో ఐస్‌ క్రీమ్‌ తయారు చేయటంలో శిక్షణ ఇచ్చేందుకు ఏకంగా యూనివర్శిటీనే నెలకొల్పారంటే ఆశ్చర్యం కలగక మానదు. బొలొగ్నా సమీపంలో కారిగానీ గెలాటో పేరుతో ఏర్పాటు చేసిన ఈ విశ్వ విద్యా లయంలో గ్రాడ్యుయేషన్‌తో పాటు ఐస్‌ క్రీమ్‌ తయారీపై శిక్షణ ఇస్తారు అలాగే వారం నుండి నాలుగు వారాల సర్టిఫికేట్‌ కోర్సులు కూడా ఆఫర్‌ చేస్తోందీ విశ్వ విద్యాలయం.
ఐస్‌క్రీమ్‌ తయారీలో అనేక పద్దతులు, పరిశోధనలు చేసి అనేక పుస్తకాలు కూడా రాసిన మాల్కొల్మ్‌ స్టోగో 1992లో ఈ యూనివర్శి టీని స్ధాపించాడు. చైనా, స్పెయిన్‌, యూనైటెడ్‌ స్టేట్స్‌ ఇలా పలు దేశా ల్లో శాఖలున్న ఈ వర్శిటీలో అమెరికాతో సహ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నఅనేక దేశాల నుండి ఐస్‌ క్రీమ్‌ ప్రేమికులైన విద్యార్ధులు శిక్షణ పొందుతున్నారు.
అనేక రకాల సాంప్రదాయ కళలతో కలగల్సి ఐస్‌ క్రీమ్‌లని తయారు చేసేందుకు వీలుగా శిక్షణ ఇచ్చేందుకు ఈవర్శిటీలో 400 మంది ఉద్యో గులు పనిచేస్తుండగా..ఏటా 12 వేల మంది విద్యార్ధులు శిక్షణ పొందు తున్నారు. రస్ప్‌ బెర్రీ, హసెల్‌ నట్‌, ఫెనెన్న్ల్‌, మోర్టాడెల్లా, లెమన్‌ ఇలా పలు ఫ్లేవర్లకు ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఉంటుంది.
ఐస్‌ క్రీం తయారీ విధానాలపై సెమినార్లని నిర్వహించ డమే కాకుండా డెవలప్‌ మెంట్‌, ఎడ్యుకేషన్‌, ప్రోడక్ట్‌రీసెర్చు, ఫ్లేవర్స్‌, కన్సల్టింగ్‌ బుక్స్‌లపై శిక్షణ ఇస్తారు. అలాగే అన్ని కోర్సులలో టెక్నికల్‌, మార్కె టింగ్‌, మేనేజ్‌ మెంట్‌, విభాగాలలో శిక్షణ పొందిన విద్యార్ధులు అన్ని యూనివర్శిటీలలోగానే ప్రాక్టికల్స్‌ని కూడా చేసి అందులోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
ఈ యూనివర్శిటీలో చేరే విద్యార్ధులకు ఉచిత వసతిసౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అయితే నెలపాటు ఉండే ఒక్కో కోర్సుకు సగటున 1150 యూరోలతో పాటు ఇతర టాక్సులు వసూలు చేసా ్తరు. అంటే దాదాపుగా 19 లక్షల పైమాటే... ఇక వారం కోర్సులు, రెండు వారాల కోర్సులు కూడా ఉన్నాయి. ఇందుకు 6 నుండి 10 లక్షలు వ సూలు చేస్తారు.
మరి మీకూ ఐస్‌క్రీమ్‌ తయారీపై ప్రత్యేక శిక్షణ పొందాలనుకుంటే... ఈ కోర్సుల్లో చేరిపోండి. మరెందుకు ఆలస్యం.

సొంత తయారీకే మహిళల మక్కువ
బైట ఎన్ని పార్లర్లు వెలసినా. కమర్షియల్‌గా తయారయ్యే ఐస్‌ క్రీమ్‌లకి ధీటుగా నిలవకపోయినా... చాలామంది గృహిణిలు ఐస్‌ క్రీమ్‌ల తయారీ పట్ల మక్కువ చూపుతూ... స్వయంగా తయారు చేసుకుకొంటు సంతృప్తి చెందుతున్నారు. వెనిలా, చాక్లెట్‌, పిస్తా, ఫ్రూట్స్‌ ఇలా అనేక ఫ్లేవర్లు అందు బాటులోకి రావటంతో ఐస్‌ క్రీమ్‌ తయారీ ఈజీ అయిపోయింది. దీనికితోడుగా... పిల్లలు అమితంగా ఇష్టపడే... పళ్లను చాక్లెట్‌ ముక్కలను, కేకులని, ఫుడ్డిం గ్‌ ఐటమ్స్‌ని అద్దుతూ... ఆకర్షణీయంగా రూపొందించడమే కాకుండా వారి ఆరోగ్యాన్నిపరిరక్షించడంలోతగిన జాగ్రత్తలు తీసు కోవటం గమనార్హం.

అందరి చూపులు అటు వైపే...

అమెరికాలోని అనేక విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఇండియా నుండి వెళ్తున్న విద్యార్థులకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడుతోంది. దీంతో చివరకి తమ పిల్లలు హైస్కూలు విద్యను అభ్యసించేందుకుకూడా ఇబ్బందులు రావటం ఖాయమని అమెరికాలోని అనేక కుటుంబాల్లో ఆందోళన మొదలైంది.
ప్రపంచంలో అమెరికాలో ఎక్కువగా విద్యను అభ్యసించే వారిలో భారత్‌ విద్యార్థులు రెండవ స్థానంలో ఉన్నారు. చైనాతో పోలిస్తే మన విద్యార్థులు ఏటా 10 లక్షల 50వేల మంది 2009-10లో ఉన్నట్లు అమెరికా పేర్కొంది. అమెరికాలో చదివేందుకు వెళ్లే విద్యార్థుల విసాలు ప్రస్తుతం 20 శాతం పెరిగినట్లు అమెరికా రాయబార కార్యాలయం సమాచారం.
ఇంతలా అమెరికాలో భారత విద్యార్ధులు పెరిగిపోవటానికి ముఖ్య కారణం అమెరికాలోని ఎన్నో విద్యాసంస్థలు తమ విద్యా వ్యాపారాన్ని పెంచుకునేందుకు భారత్‌లో అనేక బ్రాంచీలను ఏర్పాటు చేసుకుంటు..భారత్‌లో సంబంధాలు పెంచుకునే దిశలో యుఎస్‌ - భార త్‌ ఉన్నత విద్యా అవగాహన సదస్సులను జార్జ్‌టౌన్‌ యూని వర్సి టీ వివిధ దేశాలలో భాగస్వామ్య మీటింగ్‌లు చేస్తూ... విద్యార్ధుల ను తమ వైపు ఆకర్షిస్తోంది.
మెజారిటీ మనదే...
ఇక అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించే వారిలో మెజారిటీ విద్యార్థులు భారత్‌కు చెందిన వారే కాగా... ఇప్పుడు ప్రాథమిక విద్యను అభ్యసించేం దుకు తమ బిడ్డలకి అమెరికానే మార్గంగా ఇండియాలో ధనవంతులైన తల్లిదండ్రులు నిర్ణయించుకోగా... ఆదిశగా మధ్య తరగతి కుటుంబాలకు కూడా యత్నిస్తుండటంతో... 'సేఫ్టీ స్కూల్స్‌' పేరుతో సంవత్సరాది పరీక్షల్లో చాలావరకు కోతలు విధిస్తూండటంతో మున్ముం దు తమ బిడ్డల జీవితాలేమైపోతాయో అని తల్లి దండ్రులు ఆందోళనకు గురిచేస్తోంది. ఇండియాలో విద్యార్థులకు పరిమిత సీట్లు విధించడం, సీటు లభించకపోవడంతో ప్రాథమిక విద్య, ఉన్నత విద్యలకోసం అమెరికాను ఆశ్రయిస్తున్నారు. అలాగ కొన్ని ప్రాముఖ్యమైన కోర్సులైన ఆర్థికశాస్త్రం, గణాంకాలు, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ కోర్సులను అభ్యసిం చేందుకు వెళుతున్నారు.
నాలాగే ఎందరో...
మాలశ్రీ మోహన్‌ అనే ప్రతిభావంతురాలై విద్యార్ధిని పాఠశాల విద్యానం తరం ఆమె తల్లిదండ్రులు ఇండియాలొన ప్రాధాన్యత గల కళాశాలలో తమ కూతురును చేర్పించాలని అనుకున్నారు. ఢిల్లిdలోని ఢిల్లిd యూని వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకుంటే... సీటు లభించలేదు. అయితే యుఎస్‌లోని డార్ట్‌మౌత్‌లో ఓ కళాశాలకు సరదా గా ఆమె చేసిన ధరఖాస్తు....20వేల అమెరికన్‌ డాలర్ల స్కాలర్‌షిప్‌తో సీటిస్తామని ఆహ్వానించింది. నాలాంటి వాళ్లు చాలామంది ఉన్నారం టొరదామె.. గ్రేడ్‌ వన్‌ మార్కులతో పాసైన తమ కూతురుకు ఇక్కడ సీటు రాకపోవడమేంటని తన మార్కులు చూసి ఆశ్చ్యర్యానికి గురైన ఆమె తల్లి మాధవి చంద్రఈ విషయాన్ని ట్విట్టర్‌లో పేర్కొంది.
అలాగే మరో విద్యార్ధికి 1500వేల డాలర్ల స్కాలర్స్‌తో స్మిత్‌ నుంచి స్వాగతించడంపై సంభ్రమాశ్చ్యర్యాలకు గురయ్యారు. ఇలా పలువురు ప్రతిభావంతులైన విద్యార్ధులకు భారత్‌లో ఉన్నత స్ధానం మాదే అని చెప్పుకునే కాలేజీల్లో సీటు దక్కకపోగా కోర్నెల్‌, బ్రయాన్‌ మార్‌, డ్యూక్‌, వెస్లియాన్‌, బార్‌నార్‌డ్‌, అంతేగాక యూనివర్సిటీ ఆఫ్‌ వర్జీనియా నుంచి కళాశాల విద్యకోసం అవ కాశాలు లభించాయి.
ఇక్కడ కాదంటే... అక్కడ ఫ్రీ
అలాగే నిఖిత ఢిల్లిd పబ్లిక్‌ స్కూల్‌ నుంచి 2010 నుంచి గ్రాడ్యుయేట్‌లో ఉత్తీర్ణురాలయ్యింది. ఈమెకు 94.5 శాతం ఉత్తీర్ణత సాధించింది. అయితే ఆమెకు ఎకనామిక్స్‌ సబ్జెక్టులో మార్కులు ఎక్కువ రాకపోవడంతో ఆమెకు సీటు ఇవ్వడంలో సెయింట్‌ స్టీఫెన్స్‌ కళాశాల నిరాకరించింది. అప్పుడే నిఖిత ఒక సంవత్స రం ఖాళీగానే ఉండి అమెరికాలోని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌కు దరఖాస్తు చేసుకోగా అమెరికన్‌ లిబరల్‌ ఆర్ట్స్‌ ఎడ్యుకేషన్‌లో ఉచితంగా సీటు లభించింది.
అయితే ఈ విద్యార్ధులంతా పాఠశాల విద్యలో 93.5 శాతం పైగా అత్యధిక మార్కులు సాధించిన వారే కావటం విశేషం.ఇలా అత్యధిక పోటీ ఉన్న తరుణంలో ఒక భారత్‌లో తప్పా... ప్రపంచంలోని అన్ని దేశాలూ అత్యధిక ప్రతిభావంతులైన విద్యార్థులకు తమ దేశాల్లోని విద్యాసంస్ధలలో అవకాశాలు అందించడం కొసమెరుపు. ఏటా విదేశాల్లో ఉన్నత విద్యలను అభ్యసించేందుకు వెళుతున్న భారత్‌ విద్యార్థులలో 1.2 బిలియన్‌ మంది 25 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన వారే ఉండటం గమనార్హం. దేశంలో అత్యధిక విజ్ఞానవంతులైన విద్యార్థులు ఇతర దేశాలకు ఎంపిక అవుతుండగా... వీరిలో మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువ గా ఉండటం ఆసక్తికర విషయమే...
డిస్టెన్స్‌ విద్యార్ధుల పరిస్ధితేంటో...
100 శాతం వరకు మార్కులు వచ్చినప్పటికీ సీటు ఇవ్వ డంలో మన భారత యూనివర్శిటీలు విఫలమవుతున్న నేపధ్యంలో ఇక డిస్టెన్స్‌, గ్రేడ్‌ వన్‌ స్టూడెంట్స్‌ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించా ల్సిన విషయమే. ఇండియన్‌ ఇన్‌ స్ట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజి భారత్‌లో విస్తరిం చింనా... తీసుకునే సీట్ల సంఖ్య మాత్రం రెండు శాతం కంటే తక్కువే.. రెండు సంవత్సరాలు ప్రత్యేకంగా కోచింగ్‌ తీసుకుంటున్నప్పటికీ సీటు లభించడంలేదు.
ప్రమాణాలు మించి చదువుకోవడానికే ...
కాగా...మన వద్ద లభించే ఉన్నత విద్యా ప్రమాణాలు మించి చదువుకోవ డానికే బయటి దేశాలకు వెళుతున్నారని... కేంద్ర మంత్రి కపిల్‌ సిబాల్‌ అభిప్రాయ పడటం విడ్డూరంగా ఉంది.
భారత విద్యార్థులను విదేశాలకు ప్రమోట్‌ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ఢిల్లిd యూనివర్సిటీ ఇలా మంచి మార్కులు వచ్చిన విద్యార్ధులకు సీట్లు ఇవ్వకుండా పోతోందని... అనేక మంది ఆరొపణలు వస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోవట్లేదని... తల్లిదండ్రుల ఆరోపణ.
చికాగో యూనివర్సిటీలో ఆర్థిక ప్రణాళిక శాఖ వ్యాసకర్తగా స్థిరపడిన భారత్‌కు చెందిన నిఖిత స్కాదేవ్‌ మాట్లాడుతూ... భారత్‌లో అవకాశాలు రాకపోతే చింతించ వద్దని...ఇంగ్లీష్‌ ప్రావిణ్యత పెంచుకుంటూ పోతే... అది మీ జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకు వెళ్తుందని అభిప్రాయ పడ్డారు. ఇండియన్‌ ఇన్‌స్ట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజి సైన్స్‌ సంస్థలో విద్యను అభ్యసించిన సిద్ధార్థ పూరి అనే విద్యార్థి కంప్యూటర్‌ ఇంజనీర్‌ కావలనేది అతని కోరిక. అయితే భారత్‌లో అవకాశాలు సన్నగిల్లడంతో... జర్మని భాషలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ను యూనివర్సిటీ ఆఫ్‌ కాలి ఫోర్నియా, బెర్కిలిలో చేరే అవకాశం రావటంతో అక్కడ చేరి పోయాడు. ఇదే విషయంపై బ్రౌన్‌ యూనివర్సిటీకి చెందిన అంతర్జాతీయ సంబంధాల వ్యవహారాల చైర్మన్‌ మాథ్యూ గౌతమ్‌ మాట్లాడుతూ... మేథోసంపత్తి గల విద్యార్థులను పెంచుకునేం దుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని దీనికి భారత్‌లోని ఢిల్లిdలో విద్యార్థులను ఎంపిక చేసుకునేందుకు ఒక కార్యాలయాన్ని ప్రారంభించి ఎక్కువగా మందిని ఈ విద్యా సంవత్సరం ఎంపిక చేసుకో వడమే లక్ష్యంగా పెట్టుకుంటామన్నారు. ఇండియాలో అన్నింటికంటే ముఖ్యంగా తమ పిల్లల చదువుకోసమే ఎక్కువ ధనాన్ని వెచ్చించేందుకు మధ్య తరగతి కుటుంబాలు ఇష్టపడుతున్నాయి. ఇన్‌స్ట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ ప్రసిడెంట్‌ ఆలెన్‌ గూడ్‌మెన్‌ అన్నారు.

బౌలింగ్‌తో “గోల్‌”

అనంతపురం జిల్లాకు చెందిన సల్మాభాను అందరి కన్నా భిన్నంగా...
తానిష్టపడిన క్రికట్‌పైనే మక్కువ ప్రదర్శిస్తూ...
తనకంటూ క్రీడా ప్రపంచంలో ప్రత్యేక స్ధానం దక్కించుకోవాలని...
చిన్నతనం నుండే కలలు కంటూ... ఒడిదుడుకులెదురైనా...
పట్టు వదలని దీక్షతో నిరంతరం క్రికెట్‌పైనే దృష్టి కేంద్రీకరించి...
తన సత్తా నిరూపించుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
చదువుకునే పిల్లలు ఆడుతున్నా... టివి వేసి క్రికెట్‌ చూస్తూ... దానికే అంకితమైపోయినట్లు కనిపిస్తే... మన ఇళ్లలో గయిమనే వాళుల చాలా మంది ఉన్నారు. ఆసకిత కర అంశాలపై తదేక దృష్టి కేంద్రీకరించిపనిచేసే వారిని ఆ క్రమంలోనే ప్రోత్సహిస్తే.. ఆ రంగం లో ప్రతిభా పాటవాలు సాధించి ముందుకేగ గలరని తెలిసినా ప్రతి ఒక్కరూ తన బిడ్డల్ని డాక్టరుగానో... ఇంజనీర్లుగానో చూడాలన్న తపనే వారిని ఇతర రంగాల వైపు మళ్లకుండా చేసోందన్నది వాస్తవం.
అనంతపురం పట్టణానికి సరిహద్దులోని గుత్తి రోడ్డులో నివాస ముంటున్న సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన సల్మా భాను , అందరి ఆడపిల్లల్లానే తన తల్లిదండ్రులు సయ్యద్‌ అప్సర్‌, మహా ముదాల పెంపకంలో సాంప్రదాయ బద్దంగానే పెరిగిన ఆడపిల్ల.
అయితే క్రీడా ప్రపంచంలో అంతా మక్కువ ఎక్కువ చూపే క్రికెట్‌పై ఆసక్తి ప్రదర్శిస్తూ..చిన్న తనం లోనే క్రికెట్‌ ఆడటం ప్రారంభిం చింది. సల్మా భాను మగాళ్లు ఆడాల్సిన ఆటలాడుతోందని అంతా చెవులు కొరుక్కునా... ఆమె తల్లిదండ్రులు ఏనాడూ ఆమెని నిరుత్సాహ పరచలేదు. సరికదా... ఆమెకి మరింత ప్రోత్సాహం అందించడంతో ఉత్సాహం ఉరకలేస్తూ... అను నిత్యం తనని తాను క్రికెట్‌ రంగంలో నిరూపించుకునే ప్రయత్నాలు ఆరంభించింది.
ఈ క్రమంలోనే సల్మా ఉత్సాహాన్ని చూసిన జిల్లా క్రికెట్‌ అసోషియేషన్‌ మాజీ కార్యదర్శ సాగర్‌ చౌదరి ఆమెకు క్రికెట్‌లోని ఎన్నో మెలుకువలు నేర్పించడమే కాకుండా అటు బౌలింగ్‌, ఇటు బ్యాటింగ్‌లోనూ ప్రావీణ్యత సంపాదించేలా శిక్షణ ఇస్తూ... ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా నిలచారు. అడపా దడపా గ్రామీణ ప్రాంతాలతో పాటు, వివిధ జట్ల మధ్య జరిగే పోటీలలోనూ పాల్గొంటూ... సామర్ధ్యం ఉన్న మహిళా క్రికెటర్‌గా అందరి ప్రశంస లు అందుకుంటు 2003లో క్రికెట్‌ క్రీడా ప్రపంచంలోకి అడుగు పెట్టింది ఆమె..ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌తో తన సత్తా చూపి అనతి కాలంలోనే అనంతపురం జిల్లా జట్టులో స్ధానం దక్కించు కుని తన సత్తా నిరూపిం చుకుంది. జిల్లా క్రికెట్‌ లో సేవలందిస్తు దూసు కుపోతున్న సల్మా భాను తన ప్రతిభా పాటవాలతో ఆంధ్రా మహిళా క్రికెట్‌ జట్టులోనూ స్ధానం దక్కించుకుంది.
అయితే 2007లో జాతీయ మహిళా క్రికెట్‌ జట్టుకు ఎంపిక కానప్పటికీ ఏమాత్రం నిరాశ, నిస్పుృహలకు తావియ్యకుండా మొక్కవోని ధైర్యంతో నిరంతరం ప్రాక్టీస్‌ చేస్తూ... ఎప్పటికప్పుడు శిక్షకులు, సీనియర్‌ క్రీడాకారుల సలహాలు తీసుకుంటూ 2008లో జరిగిన అండర్‌ 19 జట్టుకు ఎంపికైంది ఇదే ఏడాది జరిగిన సౌతిం డియా టోర్నీలో పాల్గొని తన స్పిన్‌ బౌలింగ్‌ ప్రతిభతో ప్రత్యర్ధి జట్టులైన తమిళనాడుపై 5 వికెట్లు, కర్ణాటకపై 3 కీలక వికెట్లు తీసి క్రీడా ప్రపంచం దృష్టితనవైపుకు మరల్చుకుంది.
సౌత్‌ ఇండియా టోర్నీలో సల్మాభాను చూపిన ప్రతిభా పాట వాలను గుర్తించి నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో స్ధానం దక్కించుకుని బెంగుళూరు క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సిఏ)లో ప్రత్యేక శిక్షణ పొందిం ది. అలాగే సౌతిండిమా సీనియర్‌ క్రికెట్‌ టోర్నీలో కూడా పాల్గొని 13 వికెట్లు తీసి తన బౌలింగ్‌ రుచి చూపించింది. ఇది అమె సౌత్‌ ఇండియా జట్టులో పూర్తి స్ధానం దక్కించుకునేందుకు ఉపయోగ పడిందనే చెప్పాలి. ఇక విశాఖలో జరిగిన ఆలిండియా ఇంటర్‌ జోనల్‌ పోటీల్లో ప్రతిభ చూపిన సల్మా భాను సీనియర్‌ జాతీయ క్రికెట్‌ శిక్షణా శిబిరానికికూడా ఎంపికైంది.
ఇటీవలే బిసిసిఐ ఆధ్వర్యంలో మహిళా చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొనే ఇండియా రెడ్‌ జట్టులొ స్ధానం దక్కించుకుంది. సల్మా ఆశలు ఆశయాలు ఫలించి... మన జాతీయ జట్టులో స్ధానం దక్కించుకుని అంతర్జాతీయ క్రికెట్‌లో తెలుగు'వాడి'ని రుచి చూపిం చాలని... మనసారా మనమూ ఆశిధ్దాం.

జాతీయ జట్టు స్ధానమే ధ్యేయం
ఎప్పటికైనా జాతీయ జట్టులో స్ధానం దక్కించు కోవాన్నదే తన కాంక్ష అని... ఇన్నాళ్లుగా తన ఎదుగు దలకు తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు కోచ్‌ సాగర్‌ చౌదరి శిక్షణ తన కెంతో ఉపయోగ పడిందని దీనికి తోడు చాలా మంది తనని ఉత్సాహ పరుస్తూ విజయాలు అధిరోహించేందుకు సహకరించారని చెప్పిం ది సల్మా భాను.
తనని తాను నిరూపించుకుని,,
2007లో బిసిసిఐ జాతీయ మహిళా క్రికెట్‌ సంఘాన్ని విలీనం చేసుకొని... అదే ఏడాది జాతీయ సెలక్షన్లు జరిపినప్పుడు సల్మా భాను ఆట తీరు సెలక్టర్లని ఆకట్టుకోలేక పోవటంతో... జాతీయ మహిళా క్రికెట్‌ జట్టుకు ఎంపిక కాలకపోయింది. అయినా నిరాస చెంద క నిరంతరం ప్రాక్టీస్‌తో తనని తాను నిరూపించుకుని క్రికెట్‌ ప్రపంచంలో తనకో స్దానం దక్కించుకుంది.

కళ్ల ఊసులకు..కొత్త సొగసులు..

మౌనంగా భావాలు పలికించ గల సత్తా... మన శరీంలో ముఖ్యమైన అవయమైన కంటిదే..
అవి రెప్ప వేసినా...మూసినా..రెప రెపలాడినా... నవరసాలనూ అద్భుతంగా చూపించి...
మనిషి మనసులోని భావాన్ని...ఎదుటివారికి ఎలాంటి శబ్ధంలేకుండానే స్పష్టంగా చూపించే కళ్లు... నిన్నటి తరంలోనే కాదు నేటి తరంలోనూ... భవిష్యతరం కూడా కళ్లు కుమ్మరించే భావాలను
మరింత స్పష్టంగా కనిపించే విధంగానే వాటికి ఎన్నో విధాలైన మెరుగులు దిద్దుతూ వస్తున్నారు.
మనిషి అవయవయవాలలో ముఖ్యమైనది కన్ను. ఇది లేక పోతే... జీవితమే వృధా అన్న భావన మనిష్యుల్లో ఉన్నా... దాన్ని అధిగమించి ఉన్నత శిఖరాలకు ఎదిగిన వారూ లేకపోలేదు. కాగా నేటి తరం లో అందులోనూ యువతరంలో కళ్లకి కొత్త సొగసులద్దటం ఫ్యాషన్‌గా మారిపోయింది. ఎన్నో రకాల రంగు రంగుల కాస్మోటిక్స ఇపðడు కళ్ల ని మరింతగా చేసేందుకు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. ఈ క్రమం లోనే కళ్లకు మరిన్ని అందాలు రంగరించుకునేలా చేసేందుకు నేడు రాష్ట్రవ్యాప్తంగా అనేక బ్యూటీ పార్లర్లు కూడా పుట్టుకొచ్చాయి. వీటిలో ప్రత్యేక శిక్షణ పొందిన బ్యుటీషియన్లు మహిళల కళ్లకు వన్నెలద్దు తూ... వాటిని ఇట్టే ఆకర్షించేలా చేస్తున్నారు.
అయితే సందర్భాను సారంగా మీ మేకప్‌కి తగ్గట్టుగా ఈ కళ్లకీ మేకప్‌ ఉండాలి మినహా అతి అయినా..మరీ వెగటుగా ఏ చంద్రముఖినో చూ సినట్లు మీ ముఖం తయారవ్వటం ఖాయం. అంతెందుకు మీ స్నేహి తురాలు పెళ్లికి వెళ్లి... మిమ్మల్నే పెళ్లి కూతురనుకుంటారనుకుని సింగారించుకోకుండా మానేస్తారా కాస్త తక్కువగానైనా కొట్టొచ్చేట్లు మేకప్‌ చేసుకుంటారుగా... అదే ఏ చావు ఇంటికో వెళ్లేపðడు ఇష్టాను సారం మేకప్‌ చేసుకుని వెళ్తే ప్రశంసల మాట సంగతి దేవుడెరుగు మీ వెనకే మూతులు కొరుక్కుని... నగుబాటు చేయటం ఖాయం. అందుకే 'సింగార ప్రియులు' అయిన మహిళలు తమ కళ్ల మేకప్‌పై ఎంత శ్రద్ద్ధ వహిస్తున్నారో అందుకు సమయం సందర్భం కూడా చూసు కోవాల ని బ్యుటీషియన్లు చెప్తారు. సాధారణంగా మన కళ్లు బాదం గింజల ఆకారంలోనో, పద్మం పువ్వు రెక్కల ఆకారాన్నో.. చేపల ఆకారం లోనో ఉంటాయి. అందుకే పూర్వ కాలం కళ్లు పెద్దగా ఉంటే మీనాక్షి అని, కమలాక్షి అనే పేర్లు పెట్టేవారు. మరి మన కళ్లు ప్రత్యేకతల్ని కాపాడుతూనే అందర్నీ ఆకర్షించేలా రూపొందించాలంటే.... ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూనే కాస్మోటిక్సని వాడాల్సి ఉంటుంది.
కనుబొమ్మలదే ప్రాధాన్యత...
మీ కళ్లు ఏ ఆకారంలో ఉన్నా సరే వాటిని అద్భుతంగా చూపించగలిగేవి కనుబొమ్మలే అనటంలో సందేహంలేదు ఎవ్వరికీ. అంతలా ప్రభావితం చేస్తాయి. అందుకనేవెూ... సాధా రణ మహిళలల్లో కూడా ఐబ్రో పెన్సిల్స్‌ని వాడకం రాను రాను పెరుగుతోంది.
తమ అందాలను మరింత మెరుగు పరుచుకోవాలనుకునే మహిళలు కంటి రెప్పపై ఉన్న శ్రద్ద కన్నా ఈ కనుబొమ్మలపైనే ఎక్కువ శ్రద్ద చూపించాల్సి ఉంటుంది. కనుబొమ్మలు నిత్యం చర్మానికి అంటుకు పోయినట్లు ఉంటేనే మీ అందం మరింత విరజిమ్ముతుంది.
ఒక్కో సారి ముదురు రంగులను ఇష్టాను సారంగా కనుబొమ్మలపై మేకప్‌ వేసుకుంటారు కొందరు. ఇలా చేయటం వల్ల ముందు బాగానే ఉన్నట్లు అనిపించినా... కాస్త ఆరిపోగానే... కనుబొమ్మల వెంట్రుక లు పైకి వచ్చి మిమ్మల్ని అంద వికా రంగా చేసేస్తాయి. అందుకే ఒత్తుగా కనుబొమ్మలుంటే వాటికో షేప్‌ నిచ్చుకోవాలి. అదే లైట్‌గా ఉండే వారు ఐ బ్రోస్‌ సామాగ్రి వాడి జాగ్రత్తగా మేకప్‌ చేసుకుంటే సరి.
కళ్లనిలా మేకప్‌ చేసుకోండి...
కళ్లకి కొత్త సింగారాలు అద్దాలనుకునే వాళ్లు ఖచ్చితంగా ఇంట్లో చిన్న చిన్న చిట్కాలను పాటిస్తూ... నేచురల్‌ ప్రోడక లను వాడుతుండాలి.
నయనాలు మరింత హొయలొలికిస్తూ . మీకో ప్రత్యేకత సంతరించాలనుకుం టే... కేవలం బైటకు వెళ్లేపðడే కాదు ఇంట్లో ఉన్నపðడు కూడా కళ్లకి అందా లు అద్దుకొంటే బెటర్‌.
కళ్ల సైజు ఎంత ఉన్నా.. ముదురు రంగు లైనర్లు వాడితే... ఆకర్షణగా కనిపిస్తాయి. చిన్న కళ్లు ఉండే వారు ముదురు రంగు లైనర్లును కాస్త దళసరిగానే వేసుకుంటే...కళ్లను విశాలంగా... కనిపించేందుకు ఇవి ఉపయోగ పడతాయి. అలాగే పెద్ద కళ్లు ఉన్న వారు వీలైనంత తక్కువగా వాడితే బాగుంటారు. అయితే కంటి లోపలి భాగాలకు తగలకుండా మేకప్‌ వేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే కంటి ప్రమాదం ఏర్పడ టమే కాకుండా లేనిపోని ఇబ్బందులు కోరి తెచ్చుకున్న వాళ్లవుతారు.
బైట ఏపార్టీకో.. ఫంక్షన్‌కో వెళ్లాలనుకునే వారు కనీసం అరగంట ముందైనా మేకప్‌ చేసుకోండి. ఉదయం పూట బైట కెళ్లాలనుకుంటే ముదురు రంగు ఐ లైనర్లు వాడుతూనే సింగిల్‌ కోడ్‌ ట్రాన్స్‌పరెంట్‌ మస్కారాను కూడా వాడాలి. అదే సాయంత్ర వేళల్లోని పార్టీలకు అటెం డ్‌ కావాల్సి వస్తే మాత్రం ముదురు రంగు ఐలైనర్‌ వాడుతునే షాడోను కాస్త ఎక్కువగా వాడితే మరింత అందంగా కనిపిస్తారు. వీలైనంత వరకు నల్లటి షేడ్‌నే వాడితే బెటర్‌ లేదంటే మీ శరీరానికి తగ్గ ఇతర రంగులతో మేకప్‌ చేసుకుంటే మీ అందానికి మరింత మెరుగు కనిపిస్తుంది.
కను రెప్పలకీ అందాలద్దండి...
కళ్లని కాపాడంతో కీలక పాత్ర పోషించే కను రెప్పలకీ రంగులద్ది కొత్త అందాలు కల్పించవచ్చు. రెప్పలపై మేకప్‌ వేసుకునేపðడు చాలా జాగ్ర త్తలు పాటించాలి. రెప్పల వెంట్రుకలకి ఎంత నిగారింపు ఇస్తావెూ.. రెప్ప పైభాగం మేకప్‌ విషయంలోనూ అంతే జాగ్రత్తలు పాటించాలి. రెప్ప పైభాగంలో వేసిన రంగులకి వ్యతిరేక రంగు కనుబొమ్మకి కంటికీ మధ్య భాగంలో వేసుకుంటే అందం మరింత ఇడుమ డింప చేస్తుంది. అయితే ఈతరహా మేకప్‌ కొన్ని సంద ర్భాలలో మాత్రమే బాగుంటుంది. వీలైనంత వరకు సింపుల్‌గా ఉండేలా రెప్పలపై రంగులు వేస్తేనే బాగుంటారు.
సమయానుకూలంగా ఎం త లైట్‌ మేకప్‌ వేసుకుంటే అంత అందంగా కనిపిస్తారు.

జాగ్రత్తలు...
కళ్లకు అసలు హడావిడి మేకప్‌ తగదు. పగటిపూట జాగ్రత్తగా మేకప్‌ వేసుకున్న వెంట నే బైటకు వెళ్లకండి... కనీసం అర గంట అయినా వెయిట్‌ చేయండి. లేదంటే మేకప్‌లోని తడిపై సూర్యకాంతి తగిలి మీ ముఖం జిడ్డుగా మారిపోయే ప్రమాదం ఉంది. దాని వల్ల జిడ్డుకి ధుమ్మూ, ధూళి అంటి, ముఖంపై దురదలు, దద్దుర్లు రావచ్చు. ఇవి అలర్జీలుగా మారిపోవటవెూ... మొటిమలు తదితరాలకు దారి తీయ టవెూ జరగొచ్చు. అలాగే రాత్రి వేళల్లో మేకప్‌ని పూర్తిగా చెరిపి వేసుకోవాల్సిందే... లేదంటే సన్నితంగా ఉండే మీ ముఖ చర్మ మెద్దుబారి మందంగా తయ్యారవుతుంది.
మీరెంత మేకప్‌ వేసుకుని ఎదుటివారిని రెప్ప వేయించని విధంగా అందంగా తయారైనా... మీరు మాత్రం అడపా దడపా రెప్పలు వేయ టం మరిచి పోకండి. ఇలా రెప్ప వేయటం వల్ల మనం పడే శారీరక శ్రమల్ని వత్తుళ్ల నుండి సత్వర ఉపశమనం పొందుతాం.

15, నవంబర్ 2011, మంగళవారం

మనసుకు వికాసం... మన వన భోజనం

రంగేళీ దీపావళి పూర్తయ్యిందంటే... ఇక పిక్నికలే హడావిడి వచ్చేసినట్లే...

ప్రకృతితో మనిషికున్న బంధాన్ని తెలిపేందుకే వనభోజనాలను ఏర్పాటు చేసారు..

బంధువులతో, స్నేహితులతో పాటు సమాజంలో ఇతర వ్యక్తులను కలుపుకు పోయేందుకు...

వివిధ సంస్క ృతులు, సంప్రదాయాలు, పద్దతులు తెలుసుకునేందుకు...

కార్తీక మాసంలో వచ్చే వనభోజనాలు ప్రతి ఒక్కరికీ ఉపయుక్తంగా ఉంటుందన్నది వాస్తవం.

కార్తీక మాసంలో ప్రతి రోజూ పిక్నికలే హడా విడి అంతా ఇంతా కాదు. పట్టణ వాతావరణంలో పార్కులకి, విహార కేంద్రాలకి రోజూ వెళ్లి రావటం, అక్కడే భోజనాలు చేయటం పరిపాటిగా మారినా... నేటికీ గ్రామీణ ప్రాంతాలలో కార్తీక సమారాధనలు, వనభోజనాల పేరుతో ఃపిక్నికఃలు జరుగు తున్నాయి.

శ్రీకృష్ణ కాలం నుంచే వన భోజనాలు

వాస్తవానికి వనభోజనాలు ఈనాటివి కాదు. శ్రీకృష్ణుడు చిలిపి తనాన్న్ని వర్ణించిన పోతన తన భాగవతంలో లొట్టలేసేలా ఆయన అల్లరిని వన భోజనాలను వర్ణించాడంటే అప్పటి నుండి ఇవి ఉన్నాయన్న మాట.

కార్తీకేహం కరిష్యామి ప్రతస్ధానం జనార్ధన ప్రీత్యర్ధం దేవా దేవేేశ దావెూదర మయాసహా...

అని కార్తీక మంత్ర జపంతో ప్రతి రోజూ ఉదయాన్నే చన్నీటి స్నాన మాచరించి... దీపంకి వాడే నూనె దైవ గుణానికి, వత్తి సత్య గుణానికి, అది రూపే వెలుగు రాజ గుణాలకు ప్రతీకలని, ఈ మూడు గుణాలు కలగలిసిన ప్రమిద తమ జీవితాలలో జ్ఞానదీపాలను వెలిగిస్తుందని పెద్దలు చెప్తారు. అంటే... రాజస్తవెూ గుణాలను అణచి వేసి సహజ సిద్దమైన మనిషిగా తయార వ్వాలనుకునే వారు సత్య గుణాన్ని అలవరచుకోవాలనిఅపðడే జీవితంలో జ్ఞానాంధకార మనే చీకట్లను తరిమివేస్తూ వెలుగు రేఖలు వికసిస్తాయని తద్వారా వెూక్ష మార్గం కి బాటలు వేస్తుందని మన పూర్వీకుల విశ్వా సం. శివ, విష్ణు భేదాలున్న సమయంలో పవిత్రమైన కార్తీక మాసాన్ని ఏకరీతిన ఆచరించడమే కాకుండా... సమాజంలో సామరస్య పూర్వక వాతావరణాన్ని తీసు కొచ్చేందుకే ఆయా ఆలయాల్లో... కార్తీక దీపా లు పెడితే... పుణ్య మని పూర్వీకులు చెప్పిన మాటల్ని నేటికీ ఆచరిస్తోందీ సమాజం.

కార్తీకంలోనే ఎందుకు

ఇక కార్తీక మాసంలోనే వస భోజనాల ఏర్పాటు చేసేందుకు మన పూర్వీకు లు ఎందుకు నిర్ణయించారంటే... మనకున్న 12 తెలుగు నెలలు ఆరు ఋతువులతో అవినాభావ సంబంధాలు కలిగి ఉంటాయి.

చైత్ర, వైశాఖ మాసాలలో వసంత ఋతువు వచ్చే నెలలు. ఈ నెలల్లో ప్రకృతి కొత్త పులకరింతలకు సిద్దమవు తున్నా, ఎండల వేడిమి తీవ్ర వడగాడ్పు లు సాధారణంగా ప్రజల్ని బైటకు వెళ్లే పరిస్ధితి కలిపించవు. ఎండలు పెద్దగా అనిపించకపోయినా, తీవ్ర బడలిక చెందుతాం .

ఇక జ్యేష్ఠ, ఆషాఢంలో గ్రీష్మ ఋతువులో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించేరోజులు..ఈ కాలం లోని సాధారణ పరి స్ధితిలోనే మన శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. ఈ కాలంలో బైట తిరగ టం వల్ల అనేక వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంది.

ఆపై వచ్చే శ్రావణ, భాద్రపదంలలో వచ్చే వర్షఋతువు కారణంగా ఏ క్షణాన వర్షాభావ పరిస్ధితి ఏర్పడుతుందో తెలియదు. అలాగే... నేలలు చిత్తడిగా ఉండటం, పర్యాటక ప్రదేశాలు, తోటలు, ప్రతి ఒక్కటి బురద గా, అపరిశుభ్రంగా తయారవ్వటంతో ఎక్కడా కూర్చొనే పరిస్ధితి ఉండ దు. ఈ సీజన్‌లో వన భోజనం ఎలాంటి సంతృప్తి ఇవ్వదు సరికాదా రోగాల బారిన పడే అవకాశాలూ ఉన్నాయి.

ఇక ఆశ్వయుజ, కార్తీకా లలో వచ్చే శరద్‌ ఋతువు. ఆశ్వ యుజంలోను వర్షాలు పడే అవకాశాలు ఎక్కువ కాగా.. కార్తీకంలో కాసింత వేడి, చిరు జల్లులు, సాయంత్రానికి చిన్నపాటి చల్ల గాలులు వెరసి ఓ ఆహ్లాద కరవాతావరణం ఉంటుంది.

ఆపై వచ్చే మార్గశిర, పుష్య మాసాలు హేమంత ఋతువుకి ప్రతీకలు. ఈ కాలం ఎక్కువగా మంచుకురిసే, క్షణాలే ఎక్కువ. దీంతో ఈ నెలల్లో బైట తిరగాడే చిన్నారుల్లోనే కాదు. సాధారణ వ్యక్తులలోనూ అనేక రుగ్మతలు వచ్చే అవకాశాలు బొలెడున్నాయి.

చలి మంటలు, కాసింత వేడి ఇలా వాతావరణం ఆనందకరంగా ఉన్నా... ఉబ్బసం, శ్వాస సంబంధిత వ్యాధులు, ఇతర వ్యాధులను పైకి వస్తాయి. అలాగే చివరిగా మాఘ, ఫాల్గుణ మాసాలలో వచ్చే శిశిర ఋతువు చెట్ల ఆకులరును రాలుస్తూ... ప్రకృ తంతా బాధాతత్పహృదయంలో విలవిలలాడుతున్నట్లుం టుంది., పచ్చనివాతావరణ ఎక్కడా కానరాక మనసు కు కూడా ఎలాంటి ఆహ్లాదం దక్కదు.

అందువల్లే కార్తీక మాసం అన్నింటా, అందరికీ ఆహ్లాదకర వాతావరణాన్ని పంచుతుందని ముఖ్యంగా శివకేశవులకు ఇష్ట ప్రదాయకమైన నెలగా భావించిన పెద్దలు ఈ నెలలో సమారాధనలు చేయటం (అన్నదానం) శ్రేష్టమైనదిగా పేర్కొన్నారు.

కార్తీక మాసంలో వర్షాభావ పరిస్ధితి తక్కువగా ఉండటం... ఆశ్వ యుజంలో కురిసిన వర్షాలకు నేల చిత్తడ ిగా మారినా... అవన్నీ ఇగిరి గట్టి పడుతుం డటం, ప్రత్యేకంగా సంతోషకర పరిస్ధితులు ఎక్కువగా ఈ కార్తీక మాసంలో ఉండటం వల్లే వన భోజనాలకు ఈ నెలను ప్రత్యేకించా రోవెూ

వనాలలో భోజనాలు...

ఆహ్లాదకర వాతావరణాన్ని, ఆయుర్వేద గుణాలున్న చెట్లు, మొక్కలపై నుండి వీచే గాలులు పీల్చడం వల్ల కూడా ఆరోగ్యం సిధ్దిస్తుందని భావించిన పెద్దలు ఇలా వనాలలో భోజనాలు ఏర్పాటు చేసే వారని కొంద రు పెద్దలు చెప్తుండగా... ఆధునిక సమాజానికి


దగ్గరవుతూ అనేక ధ్వేషభావనలు పెంపొందించుకుని కులాల గోడలు, అనేక కట్టు బాట్లు విధించుకుని... లేని పోని భేషజాలకు పోయి. సమాజంలో అనేక విపరీత పరిణామాలు సిద్దిస్తున్న దశలో అందరినీ ఊరికి దూరంగా ఓ చోట కూర్చొన బెట్టి పరస్పర చర్చలు సమావేశాలు జరపటం, ఆరోజున ఎలాంటి యుధ్ద పరిస్ధితి నెల కొన కుండా ఆ ప్రాంతాలలో పూజలు, వ్రతాలు, చేసేవారని... అందరికీ సహపంక్తి భోజనాలు జరపి భోజన కాలే... హరిణా మస్మరణే... గోవిందా... గోవిందా... అంటూ భక్తి భావన తోడు చేసేవారు. దీని వల్ల తర తమ భేధాలు తగ్గి వైషమ్యాలు దూరమై సహజీవనా నికి బాటలు పడేవని.. ఈ క్రమంలోనే వనభోజనాలు పుట్టుకొచ్చాయని మరికొందరు పెద్దలు చెప్తారు.

ఇక సమాజంలో వస్తున్న మార్పులు, జరుగుతున్న పరిణామాలతో పాటు వాస్తవ దృక్కోణంలో వివిధ వర్గాల ప్రజల ఆచార వ్యవహారాలను దగ్గర నుండి పరిశీలించే అవకాశాలు ఈ వనభోజనాలు దారి చూపిస్తాయన్నది వాస్తవం.

మరోవైపు మన దేవతలు కూడా ఎక్కువగా ఏ కొండ పైనో, వనాలలోనో వెలసి, తమ భక్తులని తమ దరికి రప్పించుకుంటారు. ఇలా దైవ దర్శనానికి గుంపులుగా వెళ్లే భక్తులు చెట్ల నడుమ భోజనాదులు చేసేవారు.

కాల క్రమంలో పెరిగిన రవాణా వ్యవస్ధ... ఈ వనభోజనాలకు దూరం చేయటం తో... ఏడాదిలో ఓ సారైనా తమ వారం దరితో ఉల్లాసంగా గడిపే క్షణాలుగా వన భోజ నాలను గుర్తించి వీటిని క్రమం తప్పకుండా పాటిస్తు న్నాడని మరికొందరు చెప్తారు. నాగరిక సమాజంలో యాంత్రిక జీవనాన్ని అనుభవిస్తున్న మనిషికి షడ్రుచుల సమ్మేళనమైన భోజనాలతో పాటుగా ఆనందోత్సాహాలను అందించడమే కాదు... భవిష్యతరానికి అనేక విషయాలలో మార్గ దర్శకంగా కార్తీక శోభ, వనభోజనాలు నిలుస్తున్నాయనటంలో సందే హం లేదు.

పెరుగుతున్న కార్పొరేట్‌ కల్చర్‌...

కార్తీక మాసంలో శివుడికి, విష్ణువుకీ దీపారాధన చేసి.. ఉసిరి చెట్టు ఉన్న వనంలో భోజనాలు చేస్తే... పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందన్నది పూర్వీకులు చెప్పేవారు. కాలక్రమంలో వన భోజనాలు విద్యార్ధులలో చైతన్యం తీసుకొచ్చేందుకు, వారికి సమాజ కట్టుబట్లు ఇతర విషయా లపై అవగాహన కలిగించేందుకు ఉపయోగపడేవి. అయితే గత మూడు దశాబ్ధాలుగా సమాజంలో వస్తున్న అనేక మార్పులు కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విడిపోయి వనభోజనాలు జరుగుతున్నా యి. కాగా మరోవైపు ఈ వన సమారాధనలల్ని నాగరిక సమాజంలో పికనిేకలే పేరుతో విచ్చల విడి తనానికి ప్రతీకగా మారి పోయింది. పేకాట రాయుళ్లకి పిక్నికలుే నిత్యపండగగా మారిపోగా.. పిక్నికలేలో చిన్నారులకు, మహిళలకు ప్రత్యేకంగా జరిగే ఆటల పోటీలు పసందుగా ఉంటాయి. కార్తీక మాసం శివుడికి ఇష్ట ప్రదమైన నెల అని... నదీతీరాలలో పిక్నిక లు ఏర్పాటు చేస్త్తూనే... అక్కడే భక్తి శ్రద్దలతో స్నానాదులు, వంటలు పెడుతు... భక్త కన్నప్ప కూడా మాంసాదులతోశివుడ్ని ఆరాధించాడని చెప్తూ... నేడు పికనిేకలేలో మంసాహార వడ్డన క్రమంగా పెరుగుతోంది. అత్యంత భక్తి భావనతో కార్తీక మాసాన్ని జరుపుకుంటూ మద్య, మాంసాదులకు దూరంగా ఉండే కుటుంబాలు చాలనే ఉన్నాయి. అయితే ఇలా మాంసాదులతో వన భోజ నా లను కలుషితం చేస్తున్నారన్న భావన సర్వత్రా వినిపిస్తోంది. పెద్ద పెద్ద హౌటళ్లు కూడా ఈ కల్చర్ని ప్రోత్స హిస్తూ... మన పూర్వీకులు కనీసం కార్తీక మాసంలోనైనా మాంసం తినకుండా దూరంగా ఉండి జీవ హింసకి పాల్పడరని ఆశిస్తే... దానికి తిలోదకాలు ఏనాడో ఇచ్చే సారు. ఇలాంటి పరిణామాలకు దూరంగా ఇక ముందైనా పిక్నికలుే జరగాలని ఆశిద్దాం.

వనాలలోనే భోజనాలెందుకు

ఒకపðడు వనాలలో ఉండి ప్రకృతి వైద్యం వల్ల ఆరోగ్య కరంగా ఉండే మనిషి... నాగరికత పెరిగాక ప్రకృతి వైద్యాన్ని వీడి అనేక రకాల వైద్యాల బాట పట్టాడు. చెట్టు బెరళ్లు, వేర్లు, ఆనేక ఆకు పసర్లు, ఇలా అనేక వృక్ష జాతులకు దూరమై...ఈ క్రమంలో అనేక రుగ్మతలకు చేరువయ్యాడు.

దీంతో మళ్లీ మానవాళిని ఏడాదిలో కనీసం ఒక్క రోజైనా వనాలకు వెళితే... కొంతమేరైనా మానసికోల్ల్లాసంతో పాటు ప్రకృతి ఆయుర్వేద ఔషధ గాలులు పీల్చ్చి.. ఆరోగ్యవంతుడవుతాడన్న ఆవస్యకతని తెలియచేస్తూ వనభోజనాలు ఏర్పాటు చేసినట్ల్లు పెద్దలు చెప్త్తారు.

సమిష్టి తత్వానికి ప్రతీకలుగా...

ఇప్పటికే ఉమ్మడి కుటుంబవ్యవస్ధ ఛిన్నాభిన్నమె...ౖ ఆనందాలే కాదు.. ఆచార వ్యవహారాలు దాదాపు మరచిపోతున్న క్రమంలో వన భోజనాలు సమిష్టి తత్వాన్ని పెంపొందించేందుకు అవకాశాలు చూపుతున్నాయనటంలో సందే హం లేదు. వ్యక్తుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరాటాలకు పిక్నికలుే కూడా వేదికలైపోతుండటం విచారకరం... ఈ వనభోజనాలని తమ స్వార్ధం కోసం వాడకొంటున్న వారిని జనం సమిష్టిగానే తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వెలుగు స్మృతుల ఃదీపావళిః

  • జగమంతా వెలుగులిచ్చే దీపావళి వచ్చేసింది.... నాడు దీపావళి అనగానే...
  • ప్రతి ఇంటా కనిపించే హడావిడి నేటికి మచ్చుకైనా కానరావట్లేదు.

ఇందుకు కారణాలు అనేకం .... పెరుగుతున్న ధరలు, పెరగని జీతాలు, ఇవి చాలవన్నట్లు రాష్ట్రంలోని పరిస్ధితులు... సామాన్య జనాన్ని కుదేలెత్తించడంతో ఈ సారి దీపావళి తూతూ మంత్రంగానే కానిచ్చేయాలని చూస్తున్నారు జనం.దీంతో తెచ్చిన సరుకు ఎలా అమ్మాలో అర్ధం కాక బాణసంచా వ్యాపారులు బెంబేలెత్తి పోతున్నారు.మా రోజుల్లో దీపావళి ... అంటూ నిన్నటి తరం చెపðకునే ముచ్చట్లు వింటుంటే...ఇక ముందు దీపావళి జ్ఞాపకాలలోనే మిగిలిపోయే పండగ అయిపోయేలా ఉందనిపించక మానదు.

దసరా హడావిడి పూర్తవ్వగానే దీపావళి హడావిడి ప్రారంభమయ్యేది. నిన్నటి తరంలో ఓ పదిహేను రోజులు ముందుగానే అన్ని ఇళ్లకి ఆ సందడి వచ్చేసి... దాదాపు అన్ని రంగాల వారికి ఎంతో కొంత ఉపాధి కలిపించేది. దీపావళి నాడు లకిë పూజ కోసం ప్రత్యేకంగా పూలషాపు మొ దలు కొని, బంగారు షాపు, కొత్త దుస్తుల కోసం బట్టల షాపులు, దర్జీలు ఇలా అంతా బిజీ బిజీగా ఉండే వాళ్లు. దీపావళినాడు డబ్బు లున్న వాళ్లయితే కంపెనీ మందుగుళ్లపై మక్కువ చూపి ఎన్నోరకాల టపాకాయల్ని కాల్చేవారు.

ప్రతి ఇంట్లో కుటీర పరిశ్రమే...

దీపావళి కి కావాల్సిన సామన్లు సామాన్య జనం సొంతంగా తయారు చేసుకోవటానికే ఉత్సాహం చూపేవారు. మతాబులు, చిచ్చు బుడ్లు, తూనీగలు, సిసింద్రీలు, తాటాకు టపాకాయ లు, జువ్వలు ఇలా బోలెడన్ని సామగ్రిని ఇళ్లలోనే తయారు చేసుకుని డబ్బుని ఆదా చేసుకునే వాళ్లు. ఈ క్రమంలో దాదాపు అన్ని ఇళ్లు ఓ కుటీర పరిశ్రమలకు కేంద్రాలుగా మారిపోయే వంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇళ్లన్నీ మసి మసిగా తయారవుతా యని పెద్దలు వారించినా... పిల్లలు మాత్రం ఎక్కడో ఓ మూల దేవదారు చెక్కల్ని కాల్సి, వస్త్ర కాగితం పట్టి అందులో సరేకారం, గంధకం కల్పి... సిసింద్రీలు దట్టించి వదిలేవారు. అడ్డూ ఆపు లేకుండా రివ్వుమంటూ ఎగిరే ఈ సిసింద్రీలు ఏ పూరి గుడిసిపైనో పడితే... అరుపులు, కేకలు, నీళ్లతో పరుగులు ఓ వంతైతే... ఇవతల మన వాళ్ల వీపులు విమానం వెూతలతో లకిë బాంబులని తలపించేలా మారు వ్రెూగి పోయేవి. ఇక చిచ్చుబుడ్లు దట్టించేపðడు మొదట్లో పెద్ద వాళ్లు కొంత విసుక్కుని ఏంటీ సంత అంటూ గద్దించినా... బిక్కు బిక్కు మంటూ పిల్లలు దట్టించినవి సరిగా వెలకపోవటవెూ ఏ ఇబ్బందో జరిగితే అలా కాదు ఇలా కాస్త సురే కారం వెరు,ఇంకా గట్టిగా దట్టించు ఇంకా చిట పట మంటూ వెలగాలి అంటూ డైరక్షన్లతో ప్రారంభమై చివరికి లుంగీ ఎగ్గట్టి మందుగుండుని సరి చేసి బుడ్లు దట్టి స్తూ తన చిన్న తనపు దీపావళి కబుర్లు చెపðకుంటూ పనిని పూర్తి చేసే వారన్నది నిజం.

సామాగ్రి ఎండపెట్టడం ఓ ప్రహసనమే...

వంద రూపాయలు పెడితే వచ్చే బుట్టెడు మందుగుండు సామగ్రి (ఇందులో కాకర పువ్వె త్తులు, అగ్గి పెట్లు, భూచక్రాలు, విష్ణు చక్రాలు, పాము బిళ్లలు, పెన్సిళ్లు, చిటపట కాకర్లు... ఇలా బోలెడన్ని లెక్కకు మిక్కిలి అన్నట్లు ఉండేవి) వీటిని రోజూ ఎండ పెట్టడం కూడా పిల్లలకి పెద్ద ప్రహసనమే... ఇంట్లో వాళ్లు చూడకుండా దొంగచాటుగా కాల్చేసి నాకేం తెలిదన్నట్లు ముఖం మార్చే సుకునే వారు. కావాలంటే గత తరం వారైన మీ అమ్మా నాన్నల్నో, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మలనో అడగం డి.. ఇలాంటి దీపా వళి ముచ్చట్లు బోలెడు చెప్తారు.

మొత్తానికి ఃనరక చతుర్ధశిః వచ్చేసిందంటే.. వీధిలో పిల్లల హడావిడి ఎంతో ఊళ్లో తయారు చేసే టపాసుల శబ్ధాలు, జువ్వల రరు... రరు లు.. సురు మంటూ ఎగిరి పడే పిచ్చుకలు ఎక్కడెవరు ఏం కాల్చినా నిల బడి చూసి ఆనందిస్తునే తానూ మరిన్ని చేయాలంటూ ఇంటికి పరుగులు తీసేవాళ్లు. దీపావళి మరో రోజులో వస్తుందన్న సంతోషం అందరిలోనూ కనిపించేది.పండగ రోజు ఇంట్లో ఉదయం నుండి ప్రతి ఇల్లూ సందడే సందడి. తలంటు స్నానాలు, కొత్త బట్టలకు రిబ్బన్‌ మ్యాచింగ్‌ లేదని అలకలు, ఇందుకోసం పది రూపాయలు పట్టుకుని ఊళ్లోని రిబ్బన్ల షాపు లకి పరుగులు.. ఆ జ్ఞాపకాలు అనుభవించే వారు వర్ణిస్తున్నపðడు వింటే ఎంత బాగుంటుందో..

ఇక మద్యాహ్నం పిండి వంటలతో భోజనాలు ముగిస్తే... సాయంత్రానికి ఆడ పిల్లలు ఇంటి ముందు రంగవల్లులతో ముస్తాబులు చేసేవారు. దేవుడి గదిలో అమ్మ చేస్తున్న లకిëదేవి పూజ ఎపðడు పూర్తవుతుందా అని... దీపాలు ఎపðడు పెడతారా అని పెద్ద పని ఉన్నట్లు వీధులోకి పెరట్లోకి తెగ తిరగేసే వాళ్లు... అసలు దీపావళి అంటేనే పిల్లల పండగ కదా మరి ఆ మాత్రం హడావిడి చేయటక పోతే ఎలా అని పెద్దలు చిరునవ్వులు చిందించిన సందర్భాలూ బోలెడు. అమ్మ దీపాలను తెచ్చి పెట్టడం ప్రారంభించి ఆముదం కర్రని వెలిగించి పిల్లల్తో గుమ్మం దగ్గర కొట్టించే వాళ్లు. ఇలా చేస్తే చేతులు కాలిపోవని చెప్పేవాళ్లు నాటి బామ్మ లు. అమ్మ తెచ్చిన దీపాలను ఇంటి ముందు అందంగా వరుస క్రమంలో పెట్టడంలో ఆడ పిల్లలు నిమఘ్నమైతే... దీపం రావటమే ఆలస్యం అన్నట్లు పరుగు పరుగున వెళ్లి దాచిన సామానులన్నీ బైటకు తెచ్చే వాళ్లు మగపిల్లలు. చేతిలో తాట్రేకు టపాకాయ కాల్చడమంటే ఓ అద్భు త సాహస ప్రక్రియే నాడు. మగ పిల్లల్ని ఆడ పిల్లలు కూడా ఫాలో అవుతూ తిట్లు తిన్న సందర్భాలున్నాయి.

మగ పిల్లలు భూ చక్రాలు, చిచ్చు బుడ్లని కాలుస్తూ... తారా జువ్వలని, పిచ్చుకలని, సిసింద్రీలని కాలుస్తుంటే.. తామూ అవి కాలుస్తామని మారం చేసే ఆడ పిల్లల్ని కాకర పువ్వెత్తులని కాల్చమని వారించే వారు పెద్దలు. అన్నీ కాల్చేయాలనున్నా... పౌర్ణమికి, నాగుల చవితికి అంటూ కాసిన్ని తీసి దాచేయటమే కాకుండా... ఎవరెక్కడ ఏం కాల్చుకు ఛస్తారో అనిలోపల భయపడుతునే మరోవైపు పిల్లలు కాలుస్తున్న మందు గుండు వెలుగుల్లో ఆనంద పడుతూ... తన చేతిలో మాత్రం ఓ బర్నాలో, నూనె గిన్నో రడీగా ఉంచుకునే వాళ్లు అమ్మలు.మొత్తానికి దీపావళి నాడు కాల్చాల్సినవన్నీ కాల్చేసినా... ఇంట్లోకి రండి అని నాన్న గద్దింపుతో లోనకొచ్చి... పాముల బిల్లలు వెలిగించి అది బుస బుస మంటుం టే ఆనందించే రోజులవి.

ఇవి కాక గ్రమంలోని యువకులంతా రెండు వర్గాలుగా వీడి పోయి తారా జువ్వలు, సిసింద్రీలు, పిచ్చుకల్ని ఆకాశంలో కాక భూమిపైనే వదులుతూ... పరుగులు తీస్తూ... ఃపల్లిః అంటూ ఓ గ్రామీణ క్రీడని కేవలం దీపావళినాడే అడే వారు. ఇవన్నీ గత తరం ముచ్చట్లు కాగా... నేడు దీపావళి పేరు చెపితేనే చేతులు కాల్చుకోవటం మాట అటుంచి డబ్బులు కాల్చే పండగగానే పరిగణిస్తున్నారు. అణబాంబులు వినియోగిస్తుండగా లేని భయాలు దీపావళి బాగా జరుపుకుని టపాసు లు కాలిస్తే... ఏర్పడే కాలుష్యం పట్ల జనం బెంబెలెత్తేలా ఉపన్యాసాలు దంచిన ప్రభావంతో పాటు పెరగని జీవన ప్రమా ణాలు సైతం పండగ చేసుకోవాలంటేనే ఖర్చెందుకన్న భావన అందరిలో పెరిగి పోయింది.

పోనీ ఇంట్లోనే టపాసులు చేసుకోవ టవెూ... చిచ్చుబుడ్లు కట్టుకోవటవెూ చేద్దామనుకుంటే... అందుకు తగిన ముడి పదార్ధాలు దొరకట్లేదు సరికదా బ్రాండెడ్‌ కొందామంటే గత ఏడాదికన్నా రెట్టింపు ధరలు పెరిగి పోవటంతో... పిల్లల సరదా తీర్చేందుకైనా... ఉన్నంతలో మందుగుండు సామాన్లు కొంత కొని.. ఈ సారి దీపావళి ఏదోలా కానిచ్చేదా మన్న భావన సామాన్య జనంలో ఉంది.

పెట్టుబడులు వచ్చేనా

గత కొన్నేళ్లుగా దీపావళి సామాన్లు అమ్ముతూ వస్తున్నా... ఏనాడూ ఇంతటి పరిస్ధితి చూడలేదు. గతంలో మేం కొన్న ఖరీదుపైనే 50 శాతం ధరలు పెరిగాయి. దీనికి తోడు రవాణా ఖర్చులు, తదితరాలు కల్సి ఈ సారి ధరలు పెరిగాయనే చెప్పాలి. దీంతో మందుగుండు సామాన్ల అమ్మకాలు బాగా తగ్గే అవకాశాలు కనిపిస్తూ... పెట్టిన పెట్టుబడులు వస్తాయన్న నమ్మకం కూడా కనిపించడంలేదు.

- డి. వెంకటాచారి,

మందుగుండు అమ్మకందారు, ఆనంద్‌బాగ్‌


అపðలు పాలు చేస్తున్న పండగలు

గత నెలంతా బందులు, స్ట్రైకుల వల్ల సంపాదన అంతంత మాత్రమే... వాహనా లు బైటకు పంపాలంటే బాధపడ్డా... సరి కాదా.. ఇంటిని, ట్రావెల్స్‌కి ఖర్చు తడిసి వెూపెడైంది.

ఇపðడు దీపావళి జరపాలంటే... మరింత ఖర్చు పిల్లల సరదాని కాదనలేక... సాంప్ర దాయాన్ని మర్చిపోలేక అపð చేయాల్సి వస్తోంది. ఇక ముందు పండగంటేనే భయపడి పారిపోయేలా పరిస్ధితి తయారవుతోంది. ఇలా అయితే జనం బతికేదెలా

- కృష్ణ, ట్రావెల్‌ ఏజంట్‌

ఆర్‌కె నగర్‌


టీవీల్లో చూడాల్సి వస్తుందేవెూ

నా చిన్న తనం రోజులే గుర్తు తెచ్చుకుని నేటి దీపావళి మనవళ్లతో గడిపేస్తా.. మందుగుండు సామాన్లు కాల్చకుండానే చేతులు కాలే లా ధరలున్నాయి. ఇక ముందు ఎవరైనా దీపావళి జరుపుకుం టుంటే టివిల్లో లైవ్‌ ఇస్తే.. చూసి ఆనందించే రోజులు వచ్చేస్తాయోవెూ అనిపిస్తోంది.

- ఎం.వి. రామశాస్త్రి, ముంగండ, తూర్పుగోదావరి

పండగంటే భయమేస్తోంది

పెరుగుతున్న ధరలే బెంబేలెత్తిస్తున్న దశలో పండగ చేయటమంటే భయమేస్తోంది.ప్రయివేటు ఉద్యోగుల జీతాలు అంతంత మాత్రం. ప్రభుత్వం సంక్షేమం పేరుతో రూపాయికి బియ్యం ఇస్తామని చెప్తూ ... వ్యాట్‌ మాటున నిత్యావసరాల ధరలు మరింత పెంచేసి నడ్డి విరిచేసి, పండగ జరుపుకోనివ్వట్లే.... మేం ఎవ్వరికి చెపðకోవాలి.

- ఎం. సుభద్ర, గృహిణి, వరంగల్‌

వెయ్యికి గుప్పెడు సామాన్లు..

గత ఏడాదే రేట్లు పెరిగాయని అనుకుంటే ఇపðడు సామాన్యుడికి అందుబాటులో లేనంతగా ఎగబాకాయి. వెయ్యి రూపాయలు తీసుకెళ్తే... 10 రకాల సామాన్లు కూడా రాలేదంటే మందుగుండు ధరలు ఎంతలా పెరి గాయో అర్ధం చేసుకోవచ్చు. ఇలానే కొన సాగితే దీపావళి జరుపుకోకుండా మిన్నకుండటమే బెటరని పిస్తోంది.

- శ్రీనివాస్‌, సంకిలి, శ్రీకాకుళం

అంగవైకల్యం అడ్డొచ్చినా.. గ్రామం నుంచి గూగుల్‌కి

విధి వెక్కిరిస్తూ... తనపై దాడి చేసి అంగ వికలాంగుడిగా చేసేసి... మూడు చక్రాల బండిపైనే...

ఇక నీ జీవిత ప్రయాణం అని తన స్ధితి గతిని మార్చేసినా... మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ...

తనని తాను నిరూపించుకోవాలన్న తపన..ఎన్ని ఒడిదుడుకులెదురైనా... ఎదుర్కొని నిలబడుతూ...

తన సంకల్పానికి సాయమందించిన చేతులెన్నో... ఉన్నాయని... తన కాళ్లని తీసేసిన దేవుడు..

ఆకాశమే హద్దుగా సాగిన.. తన లక్ష్య సాధనకి ఎందరో మంచి వ్యక్తులని పరిచయం చేసాడని...

గ్రామీణ ప్రాంతం నుండి...ఐఐటి చదివి... ప్రతిష్టాకర గూగుల్‌లో ఉద్యోగం సంపాదించిన...

నాగ నరేష్‌... నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు

మూడు చక్రాలపై చిరునవ్వులు చిందిస్తూ.. ఆశా వాదిగా కనిపించే నాగ నరేష్‌ మాటలు వింటే గొప్ప ఆధ్యాత్మిక వాది కూడా. అనుకోని ఘటన జరిగితే విధి వంచితుడిగా ఇది తన ఖర్మంటూ తిట్టుకు కూర్చొకుండా ఐఐటి పూర్తి చేసి, గుగూల్‌ లో ఉద్యోగం సంపాదించి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.

తణుకు దగ్గర్లో గోదావరి తీరాన ఓ కుగ్రామం తీపర్రు. అక్కడ నివాస ముండే ప్రసాద్‌ లారీ డ్రయివర్‌గా పని చేస్తుంటే..ఆతని భార్య కుమారి, తాను తన భర్త నిరక్ష్య రాస్యులు కావటంతో కనీ సం తన ఇద్దరి పిల్లల నైనా బాగా చదివించు కోవా లన్న తపనతో... గుట్టుగా సంసారం నెట్టుకొచ్చేది. అందరి పిల్లల్లానే నాగనరేష్‌ చిన్న తనంలో అల్లర్లు, మారాం చేయటాలు, పరుగులు తీయటాలు నిత్యకృ త్యమే. అయితే పాఠాలు చదవటంలో మాత్రం ఫస్టే. అల్లరెంత చేసినాఎన్ని తిట్లు తిన్నా చదువు విష యం లో ఉపాధ్యాయుల ప్రశంసలందుకునే వాడు.

తన చిన్న తనపు రోజుల్ని గుర్తు చేసుకుంటూ... ఃచదువుకోవాలన్న తనలోని కుతూహలం గమనిం చి... మా నాన్న చదువు కోక పోయినా... దగ్గరుండి మరీ చదివించేవాడు.

నే చెపుతున్నది రైటో.. రాంగో.. తెలియక పోయినా ప్రతి ప్రశ్నకు నాతో పదే పదే జవాబులు చెప్పిస్తూ, పరీక్షల్లో నే క్లాసుకి ఫస్టొస్తే..తానే పాసై పోయి నట్లు తెగ హడావిడి చేసిన రోజులు మరువలేనివి..ః అంటూ తన గతాన్ని నెమరు వేసుకొంటాడాయన.



నా నిర్లక్ష్యం వల్లే నా కాళ్లు పోయాయి.

సంక్రాంతి సెలవులివ్వటంతో అమ్మమ్మ వాళ్ల ఇంట్లో పండగజరుపుకోవాలనుకున్నాం. నాకు బాగా గుర్తు జనవరి 11 , 1993. మరో బంధు వు ఇంట్లో ఓకార్యక్రమం చూసుకుని అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు అమ్మా నేను, అక్కా బయలుదేరాం. బంధువు లింట్లో కార్యం అయ్యే సరికి బాగా పొద్దు పోయింది. అమ్మమ్మ వాళ్ల ఊరెళ్లాలంటే ఆ టైమ్‌లో బస్సుల్లేవు. ఏం చేయాలా అని ఆలో చిస్తున్న సమయంలో సరిగ్గా నాన్న లారీ లోడ్‌తో అటుగా వచ్చింది. రోడ్‌పై మమ్మల్ని చూసి ఆపారు.

విషయం చెప్పాక... రాత్రంతా ఇక్కడెందుకు.. ఇంటి కొచ్చి.. ఉదయం వెళ్ధురుగానీ అనటంతో, అప్పటికే లారీ కేబిన్‌లో జనాలున్నా.. సర్ధుకోవాలని ఓ వైపు రిక్వస్టు చేస్తునే... అమ్మా, అక్క లని బోనెట్‌పై కూర్చో పెట్టి, నన్ను తన సీటు పక్కన ఉన్న డోర్‌ దగ్గర కూర్చోపెట్టుకున్నాడు నాన్న.లారీ కదిలి. స్పీడ్‌ అందు కుంది. ఓ వైపు నిద్రి స్తున్నా... రోడ్లపై తిరుగుతున్న వాహనాలు, ఇళ్లు, షాపులు చూడాలన్న ఉత్సాహం.. అల్లరి చిల్లరి ఆలోచనలకు ఎలానూ కొలవు లేదు గా... ఈ నేపధ్యం లో నా పక్క నున్న డోర్‌ లాకపౖేె పడింది నాచెయ్యి. అంతు ఒక్క సారిగా అది ఊడి రావటం లారీ నుండి నే కింద పడటం క్షణాల్లో జరిగి పోయాయి. అదే సమ యం లో లారీ వెనక ఉన్న ఇనుప కమ్మెలు నాకాళ్ల ని చీల్చేసాయి. వెంటనే నాన్న లారీ అపే డు. యాక్సిడెంట్‌ అయిన ప్రాంతానికి దగ్గరో ్లనే ఉన్న ప్రయివేటు ఆసుపత్రికి నన్ను అర చేతుల మీదే పరుగు పరుగున తీసుకెళ్తే పోలీస్‌ కేసు పెట్టాకనే రండి అంటూ నిఖ్ఖఛ్చి గా చెప్పేయటంతో.. చేసేది లేక దిగాలుగా బైటకొచ్చిన నాన్నకి ఎదురుగా రోడ్డు మీద ఓ కానిస్టేబుల్‌ కనిపించాడు. ఆయనకి పరిస్ధితి వివరిం చడంతో... ఆయనే నన్ను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు. వైద్యులు కాళ్లకి కట్లుకట్టి, పేగులు మెలి తిరిగి ఉన్నాయని చిన్న పాటి ఆపరేషన్‌ కూడా చేసి సవరించారు. అయితే విధి రాతని ఎవ్వరూ తప్పించ లేవెూవెూ కాళ్లకి ఇన్ఫెక్షన్‌ సోకి సెప్టిక అయ్యాయి.దీంతో నన్ను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లాలని మా నాన్నకి చెప్పేసారు అక్కడి వైద్యు లు. నన్ను అక్కడికి మార్చాక... నా కాళ్లు తొలగిం చేసారు. ఆసుపత్రిలో. అంతా నా మీద జాలి చూపిస్తూ... నన్ను చిన్న పిల్లాడిలా నన్ను లాలి స్తుం డటంతో కాస్త ఆనందంగా.. తెచ్చే పళ్లు, బ్రెడ్‌లు తింటూ హాయిగా కాలక్షేపం జరిగి పోతోంది.మూడు నెలల తరువాత నన్ను డిస్చార్జ్‌ అయ్యి ఇంటి కెళ్లానో లేదో ఊరు ఊరంతా నన్ను పరామర్శించడానికి వచ్చింది. ఊళ్లో చలాకీగా తిరిగిన నేను కాళ్లు లేకుండా మంచాన పడటం అందరినీ కలచి వేసిం ది. అయినా నన్ను అంతా చూటానికి వస్తున్నారనే సంతోషం.నన్ను చమ ర్చేది. నా మిత్రులంతా ప్రతి క్షణం నాచుట్టూనే ఉం టూ కబుర్లు చెప్తూ.. నా బాధ ని మరిచి పోయేలా చేస్తుండేవారు. కొన్నాళ్ల తరువా త వాళ్లే తమ చేతులపై నన్ను ఆడుకున్నా... ఎక్కడి కైనా వెళ్లినా తీసుకు ని వెళ్లడం ప్రారంభించారు. అసలు నాకు యక్సిడెంట్‌ కాక ముందే తణుకు పట్ట ణానికి వలస వెళ్లి పోవాలనుకున్నాం. కాబట్టి తప్పనిస్ధితిలో మేం తణు కు కి షిఫ్టయ్యాం. అప్పటికే నేను చదువులో ఫస్టొచ్చే వాడిని కావటంతో అక్కడి మిషనరీ స్కూల్‌ వాళ్లు తమ స్కూల్లో నాకు సీటిచ్చారు. అక్క కూడా ఆ స్కూల్లోనే చేరింది.

ఇక ఉదయం స్కూలుకి తీసుకెళ్లింది మొదలు అన్నీ నాకు అక్కే...నన్ను వెూసుకుపోయేది. చదివించేది. బోధించేది. మేం పడుతున్న బాధ భరించ లేకో ఏవెూ, నాన్న స్కూలు పక్కనే ఓ స్ధలం చూసి ఇల్లు కట్టుకునేందుకు సిద్దపడ్డాడు. స్కూల్లో స్నేహితులు కూడా ఎక్కువవ్వటంతో వాళ్లు ఇంటికి వచ్చి మరీ నన్ను తీసుకు పోయేవారు. మూడో క్లాసులో ఉండగా జైపూర్‌ కాళ్లు అమర్చారు. నాకు పూర్తిగా కాళ్లు తొల గించిన క్రమంలో వాటితో నడవటం కాస్త బాధా కరంగా ఉండేది. దాదాపు రెండేళ్లు వాటితో కుస్తీ పట్టినా నడవటం సాధ్యం కాకపోవటం, కూర్చో వటం ఇబ్బంది కరంగా మారటం తో.. ఇక నాతో కాదని కుంగిపోతున్న సమ యంలో మూడు చక్రాల సైకిల్‌ బాగా సాయపడింది. అందరికీ వెూసే భారం తగ్గింది. అయినా ఎపðడూ నాకు వెన్నంటి ఉండే స్నేహితులు, అక్క సైకిల్‌ని తోస్తూ... క్లాసులోకి వెూసుకు పోయేవాళ్లు. క్లాసులో అందరితో పోటీపడి మరీ చదివే వాడ్ని... క్లాసు ఫస్టు రావాలని పరితపించే వాడిని. ఈ క్రమంలో మా లెక్కల మాషా ్టరు ప్రవెూద్‌లాల్‌ గారు నన్ను టాలెంట్‌ టెస్టులపై దృష్టి పెట్టమని ప్రేరేపిస్తే... అప్పటికే ఐఐటి కోసం ప్రిపేర్‌ అవుతున్న నాకు సీనియర్‌, మిత్రుడు చౌదరి నాకు ప్రేరణ ఇచ్చాడు. వీరిద్దరి ప్రోత్సాహంతో 10 వ తరగతిలో 542 మార్కులు సాధించి స్కూల్‌ ఫస్టొచ్చా. దీంతో గౌతమ్‌ జూనియర్‌ కాలేజిలో తమ కాలేజీలో ఫీజు మినహాయింపు ఇస్తూ... ఇంటర్‌ సీటి చ్చారు. ఇందుకు ప్రవెూద్‌ సార్‌ చేసిన కృషిని ఎంత చెపðకున్నా తక్కువే. ఇంత కాలం అమ్మా, నాన్న, అక్క స్నేహితుల నడుమ ఉన్న నేను ఒక్కసారిగా రెసిడెన్షియల్‌ వాతావరణా నికి మారటం కాస్త ఇబ్బందిగా మారింది. దానికి అల వాటు పడటానికి ఎక్కువ రోజులు పట్టలేదు. ఓ సారి లైబ్రరీలో ర్యాంకుల రారాజు భాస్కర్‌ అంటూ వచ్చిన వార్త నన్ను ఆకర్షించింది. ఓ పేద జాలరి కుటుంబం నుండి ఐఐటిలో మొదటి పది ర్యాంకర్లలో ఒకడిగా నిలవటమే కాకుండా ఏఐ ట్రిపుల్‌ ఈ లో ప్రధమ ర్యాంకరుగా ఎదిగిన ఈ కె కె ఎస్‌ భాస్కర్‌ గురించి చదివా... అప్పటికే ఎంసెట్‌లోనూ ఫస్టు ర్యాంకరు భాస్కరే. ఆయనని స్పూర్తిగా తీసుకుని నేనూ ఎందు కు ఎదగ కూడదనిపించింది.ఈ క్రమం లో విద్యార్ధు లని ఉత్తేజ పరిచేందుకు ఏర్పాటు చేసన కార్యక్ర మానికి భాస్కర్‌ కూడా వస్తున్నాడని తెల్సి ఆతన్ని కలవబోతున్నందుకు ఆనందంగా ఫీయ్యా. చివరికి ఆయనని కలిసా... దాదాపుగా నా కన్నా ఓ రెండేళుపెద్దే ఉంటాడెవెూ కానీ ఆయన సాధించిన విజ యాలు నన్ను అబ్బురపరిచాయి. ప్రేరణ కలిగించా యి. నా తల్లిదండ్రులు, అక్క సహకారం అంతా ఇం తా కాదు. ఎక్కడైనా నేను విఫలమై బాధ పడితే ఓదా రుస్తూ... ఇంకా చదువు తప్పక విజయం సాధి స్తావ ని ప్రోత్సహించేవాళ్లు... చదువు పట్లనే చూపి స్తున్న శ్రద్ద నేను సాధిస్తున్న విజయాలే ఇందుకు కారణం కావచ్చు. ఎలాగైనా ఐఐటి సీటు సాధించాలన్న దీక్ష తో చదవటం ప్రారంభించి చివరికి విజయం సాధిం చా. ఐఐటిలో నాకొచ్చిన ర్యాంకు 992 పెద్దది కాక పోయినా వికలాంగుల కోటాలో నేను నాలుగో వాడ ిగా నిలిచా. మద్రాసులోని ఐఐటిలో కంప్యూటర్‌ సైన్స్‌ లో చేరా... అయితే నా మూడో తరగతిలో జైపూర్‌ కాళ్లు అమర్చిన వాళ్లు నే కాస్త ఎదిగాక నాకో జీవనో పాధి కలిపిస్తామని వచ్చారు. అపðడు ఐఐటి నా లక్ష్యం అది తప్పక సాధిస్తా... నే అందులో చేరాక సాయం చేయండని చెపితే..తప్పక అని హామీ ఇచ్చా రు. గుర్తుంచుకుని మరీ నే ఐఐట ిలో చేరాక ఫీజులు తదితరాలు వాళ్లే చూసుకునే వాళ్లంటే గొప్ప విషయమే కదా. దీంతో నా తల్లిదండ్రులకు నా చదువు భారం కాకుండానే సాగుతుం దన్న ధైర్యం నాకొచ్చింది. ఐఐటిలో పరిచయమైన కార్తీక అనే సీనియర్‌ అన్నింటి నాకు దశా దిశ నిర్ధేశన చేస్తూ ఓ విధంగా రోల్‌ వెూడల్‌గా నిల చాడు. తొలి ఏడాది పూర్తయ్యాక సెలవులకు ఇంటికి వెళ్లి వచ్చే సరికి కాలేజ్‌లో చాలా మార్పులు జరిగాయి. ముఖ్యంగా లిఫ్ట్‌ స్ధానంలో మెట్ల మార్గంకి తోడుగా వాలుగా ఉండే ర్యాంప్‌ ఏర్పాటు. ఇది నేను ఏ క్లాసుకైనా ఓ అంతస్తునుండి మరో అంతస్తుకి వెళ్లాలనుకుంటే... ఇబ్బందే.. ఏం చేయాలో పాలు పోని దశలో విద్యార్ధి విభాగానికి జనరల్‌ సెక్రటరీగా ఉన్న ప్రసాద్‌, డీన్‌ ప్రొఫసర్‌ ఇడి చాందీలు విద్యుఛ్చక్తిలో నడిచే చక్రాల కుర్చీ కొనుకునేందుకు ఏభై ఐదు వేల రూపాయలు అప్పటికపðడు సమకూర్చి ఇచ్చారు. ఈ కుర్చీ నా జీవన గతినే మార్చేసింది. ఐఐటిలో ప్రొఫసర్‌ పాండు రంగన్‌ గారు చేసి హెల్ప్‌ చాలా గొప్పది. ఇంటర్న్‌ షిప్‌ కోసం నన్ను బోస్టన్‌కి పంపించారాయన.

ఈ క్రమంలో నాలుగేళ్లు ఎందరినో కలిసే అవకా శాలు వచ్చాయి. ఎన్నో విషయాలు నేర్చుకున్నా... ల్యాబ్‌లో పనిచేసే వాళ్లతో మాటా ్లడుతుంటే నిజమే ఈ లోకంలో కొందరే చెడ్డవాళ్లు అంతా మంచి వాళ్లే ..అన్న వాస్తవం తెలిసింది. నాకు సాయం చేసిన వారినెన్నడూ మర్చిపోనని వారిఇఎన్నడూ కృతజ్ఞతలు చెప్తున్నా... నా మిత్రులంతా పిహెచ్‌డి చేయమని ప్రోత్సహించినా... ఇన్నాళ్లు నా కోసం కష్టపడ్డ తల్లి దండ్రులకు అండగా నిలవటం కోసం ఉద్యోగ వేట ప్రారంభించా. ఈ దశలో నాకు వెూర్గాన్‌ స్టాన్లీ కంపె నీ నుండి మంచి ఆఫర్‌ వచ్చినా... నాకు గేమ్స్‌ థీరీ, అల్గారి ధమ్‌, కంప్యూటర్‌ సైన్స్‌లపై విపరీతమైన ఆసక్తి ఉండటంతో తరువాత వచ్చిన గుగూల్‌ ఆఫర్‌కే ప్రాధాన్యత ఇచ్చా... ఇదండీ నా పోరాటం వెనుక ఉన్న కధాకమామిషు.

కాళ్లు తీసేసి ప్రాణాలు కాపాడారు..

నా నిర్లక్ష్యం. ఆకతాయి తనం కారణంగానే నేను లారీ కింద పడితే... నన్ను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లాక... వైద్యులు పరీక్షించి బాగా నిర్లక్ష్యం చేయటం వల్లే నా కాళ్లకి సెప్టిక అయ్యిందని అది వెూకాళ్లకి కూడా పాకిందని, కాళ్లు తీసేయక పోతే ప్రాణాలకే ప్రమాదం అంటూ దాదాపు నడుం వరకు నా రెండు కాళ్లని ఆపరేషన్‌ చేసి తొలగించేసారు.

నాకు తెలివొచ్చాక అంతా అగమ్య గోచరం. లేవబోయా సాధ్యం కాలే.. ఇదేంటని చూసా..నా కాళ్లు కని పించ లేదు. ఏమైందని అడిగా ఎదురుగా ఉన్న అమ్మని. ఆమె భోరున ఏడుస్తూ విషయం చెప్పింది. మిన్ను విరిగి మీద పడ్డట్టు అయ్యింది.

స్పూర్తి రగిలించిన ర్యాంకుల రారాజు

నేను ఇంటర్‌ చదువుకునే రోజుల్లో మా కాలేజికొచ్చిన ర్యాంకుల రారాజుగా అప్పట్లో పిలుచుకునే భాస్కర్‌ నాలో స్పూర్తి రగిలించాడనే చెప్పాలి. ఆయనని ఒ సారి కలిసానో లేదో... నేనూ ఎందుకు ఆయనలా మంచి మార్కులు తెచ్చుకోకుని ర్యాంకులు సాధించకూడదన్న భావన నాలో మెదలైంది.

అప్పటి నుండి ఐఐటి నా లక్ష్యంగా ఎంచుకుని దాన్ని చేరేందుకు ఎంత కష్టమైనా ఒర్చుకుని ముందుకు సాగా... నా విజయం వెనుక ఎందరో మిత్రులు, మరెందరో సన్నిహితులతో పాటు ఎన్నో ఆపన్న హస్తాలు కూడా అండగా నిలచాయి. వారే లేకుంటే నేనెక్కడ ఉండే వాడినో...

సాటి ప్రయాణీకుడు నా హాస్టల్‌ ఫీజు కట్టాడు..

నే బిటెక రెండో ఏడాది పూర్తవ్వ గానే అనుకుంటా ఓ కాన్ఫరెన్సు కోసం రైల్లో వెళ్తున్న నాకు కో పాసింజర్‌గా పరిచయమైన సుందర్‌ అనే వ్యక్తి.. నాగురించి కొద్దిగా తెలుసుని నా హస్టల్‌ ఫీజుని భరిం చాడంటే... నాకు ఎందరి ఆపన్న హస్తాలందాయో అర్ధం చేసుకోవచ్చు.

లేేకుంటే తొపర్రు లో వ్యవసాయం చేసుకుంటూ ఏ పశువులో మేపుకునేం దుకు పరిమితమై పోవాల్సిన నాకు ఎందరో చేసిన సాయమే నన్ను ఇంతటి వాడిని చేసిందన్నది యదార్ధం.

ఈయనదో వి'చిత్ర' ప్రపంచం

అందరి జీవితాలలొ ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. అయితే అలాంటి వాటినుంచి ప్రేరణపొంది తనని తానుతీర్చిదిద్దుకుంటూ ముం దు కేగడమే కాకుండా అదే సమయంలో తానే చేసే పనితో తన కంటూ ఓప్రత్యేక గుర్తింపు తెలుసు కున్న వారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి గుర్తింపు తెచ్చుకున్న వారిలో నేడు ప్రపంచంలో మాక్రో ఫోటోగ్రఫీకి కింగ్‌గా వెలుగొందుతున్న థామస్‌ షహీన్‌ ఒకడు.

థామస్‌షహీన్‌ చిన్నతనంలో సరదాగా గీసిన గీత లు మెచ్చుకోలుగా ఉండటంతో...చిత్రలేఖనం వైపు నడిపిం చింది.. విద్యార్ది దశలో ఆర్థోపోడా, సాలీడు లాంటి.. చిత్రాలను అందంగా పెన్సిల్‌తో గీస్తూనే.. వాటిలో సహజత్వాన్ని కంటికింపుగా... స్పష్టంగా కనిపించేలా చేసి టీచర్ల ప్రశంసలందుకున్న థామస్‌ షహీన్‌ మరిన్ని కీటకాల బొమ్మల్ని గీయటం ప్రారంభించాడు. ఓ సారి మిత్రుడొకరు కెమేరాతో చేస్తున్న హడావిడి ఫోజుల్ని చూసి తానెక్కువగా ఇష్టపడే కీటకాలను కెమేరాలో బంధిస్తే ఎలా? ఉంటుందన్న దిశగా ఆలోచ నలు మొగ్గతొడిగింది.

అందుకు అనుగుణంగా ఫోటోగ్రఫీపై మక్కువ పెంచుకుని...తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ

ఫోటోగ్రఫీని నేర్చుకొనేందుకు తొలినాళ్లలో ఇబ్బం దులుఎదుర్కొన్నా... సాధారణ ఫోటోల కన్నామాక్రో లెన్స్‌ని ఉపయో గించి తీసిన ఫోటోలు తీయటం కష్టమైన పనే నని తెలుసుకున్నా... తన కం టూ ఓ ప్రత్యేకతని నిలుపుకునే కోణం లో అడుగులు వేసాడు.

సహజ సిద్ధంగా ప్రకృతి ప్రేమికుడు కూడా కావడంతో ప్రకృతిలోని అందాలనే కాదు... పశు, పక్షాదుల్ని బంధించి... తమ ఆల్బమ్‌లలో భద్రపర చుకుంటున్న వారికి భిన్నంగా తాను చిన్నప్పుడు చేసుకొన్న సాలీడునే మోడల్‌ చేసుకొని ఫోటోలు తీసాడు. ఇవి వైరుధ్యాన్ని... కలిగి ఉండటంతో.. తాను తీసిన ఫోటోలు అనేకమందికి చూపిస్తూ... వారిని ఆశ్చర్యచకితుల్ని చేస్తూ... వారిచ్చే సూచనలు పాటి స్తూ తనలోని విద్యని మరింత మెరుగు పర్చుకుని... దృష్టి నంతా కీటకాల వైపు మరల్చి... అహోరాత్రాలు శ్రమించి ఎన్నో కీటకాలు, దోమలు, చీమల ఫోటోలు తీసి ప్రపంచమే విసు ్తపోయాలే చేసాడు.

ఇప్పటికే ఫోటోగ్రఫీ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎందరికో ఫోటోగ్రాఫర్లు ఉన్నా మాక్రో ఫోటోగ్రఫీలో మకుటంలేని మహారాజులా ముందు

కు దూసుకుపోతున్నాడు థామస్‌ షహీన్‌.

ఫోటోగ్రఫీలో అందరూ చూసే అందాలను సహజ సిద్ధంగా కెమెరాలతో బంధించే ప్రక్రియ అంతా పాటిం చడం సర్వసాధారణం. అయితే అందుకు భిన్నంగా మన కంటికి కనిపించే చిన్న చిన్న జీవుల్ని చిత్రీకరిం చడంలో ప్రత్యేక ఆనందం మాటలకందలేనిదని.. కీట కాల ఫోటోలు తీయటమంటే సాధారణ విషయం కాదు. ఎంత నేర్పు...అంతకుమించిన ఓర్పు కావాలని చెప్తాడాయన... కీటకాలు ఫోటోలు తీసే సమయాలలో ఎదుర్కొనే ఒడిదుడుకులెన్నో... ఒక్కోసారి అవి దండు గా మనపై దాడిచేసే సందర్భాలూ తాను ఎదుర్కొన్నా నని, ముఖ్యంగా జీవప్రపంచాన్ని ఫోటోలుగా తీయాల నుకుని ఈ రంగాన్ని ఎంచుకునేవారు అత్యంత ప్రాణ ప్రదమైన జంతువులనే కాదు...ప్రమా దకర జంతువు తో, కీటకాలతో సన్నిహితంగా మెలగాల్సి ఉంటుంది. అన్నిటిని తట్టుకుంటూ భయా న్ని వీడి ముందుకు సాగాల్సి ఉంటుందని సలహా ఇస్తారాయన ఔత్సాహికులకి.నాకు అత్యంత ఇష్టమైన కీటకాలలో సాలీడు ప్రధానమైంది... దాని తీరువేరు. అదిగూడుకట్టుకొనే విధానం ప్రత్యే కంగా ఉంటుంది. అలాంటి చిత్రీకరణ నాకెం తో నచ్చుతుందని చెప్పాడు. ఎంత అసహ్యిం చుకున్నా..కీటకాలలోనూ ఆనందం,విషాదం, కోపం అన్ని ఉంటాయి. వాటిని మానవాళికి అర్ధమయ్యేలా చూపడమే తాను చేస్తున్నదని ధామస్‌ చెప్తాడు.వేసవిలో ఫోటో లు తీయటం కాస్త ఇబ్బందే... కీటకాలు తమ ఇతర అన్వేషణలో ఉంటాయి. ఆ సమయంలో వాటిని చిత్రీకరిస్తే వాటికి కోపం రావచ్చు.. ఇలాంటి సమయాల్లో దాడులు చేసే కంపించుకున్న సందర్భా లు నా జీవితంలో ఉన్నాయి.

కీటకాలనే కాదు వాటి తలలు, కీళ్ల సందులనీ చిత్రీ కరిస్తూ అద్భుత ప్రపంచంలో విహరిస్తున్నా... వన్య ప్రాణి మ్యూజియంలలో, వెబ్‌సైట్లలోనే తీసిన చిత్రాలు చూసుకొన్నప్పుడు కలిగే ఆనందం ఇంత అంతా కాదు. అలాగే... మనం చూసే... చిన్ని చిన్ని కీటకాలే అనేక రంగురంగుల్లో అద్భుతాలని ఆశ్వాదిస్తున్న వారిని చూస్తుంటే సంతృ ప్తి పడుతున్నాఅని చెప్పే ఆయన 1980 లో కొనుక్కున్న పాతకాలాపు పిన్టెక్స్‌ 28ఎంఎం తాకుమాన్‌, నేటికీ నాకు ఉపయోగపడుతోంది...2-టెలీ కన్వర్టర్‌కి తోడుగా ఎస్‌ఎంసి పెన్‌టెక్స్‌ వాడుతూ పెన్‌టెక్స్‌ ఐఎస్‌టి డిఎల్‌ఎఫ్‌ 1.750 ఎంఎం లీవ్‌ డిఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరా... ఇప్పుడు వాడుతున్నా... ‘తైరీస్టార్‌ 3500 మాక్రోలెన్స్‌ పాత వివిటార్‌ ప్లాష్‌ గోల్డ్‌ ఫిష్‌ బాక్స్‌ రిప్లక్టర్లుగా వాడుతున్నా... అంటూ తాను వాడే కెమేరాలు అందరూ వాడేవేనని అయితే నాలుగేళ్ల క్రితం వరకు ఫిల్మ్‌లని వాడీ కెమెరాలనే వాడుతూ.. కొత్తగా డిజిటల్‌ కెమెరాని కొన్నా... నాపాత పనిముట్ల ని జత చేరిస్తే కానీ సంతృప్తికరమైన ఫోటోలు తీయ లేక పోతున్నట్లు చెప్తాడు థామస్‌.

సాంకేతిక విప్లవం ఎంత ఎదిగినా కంప్యూటర్లపై హడావిడి చేసినా ఫోటోగ్రఫీలో ప్రవేశించినా.. మాక్రో ఫోటోగ్రఫీలో మాత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిం చ లేకపోయిందనే చెప్పాలి. కెమెరాతో తీసిన క్వాలిటీ... ఫోటోషాప్‌లో సృష్టించలేకపోతోందన్నది సుస్పష్టమని వాస్తవ దృక్కోణం చూపులతో ఫోటో అద్భుతమనే తన అనుభవాలని రంగరించి మరీ ధీమాగా చెప్తున్నా డు థామస్‌. ఔత్సాహిక ఫోటోగ్రఫీర్లని ప్రోత్సహించే క్రమంలో తన వెబ్‌సైట్‌ ద్వారా.. మాక్రో ఫోటోగ్రఫీకి సంబంధించిన అనేక మెళకువలు, సలహాలు... సూచ నలు ఇస్తున్నాడు థామస్‌ మరికెందుకాలస్యం ఇంకా మీకు ఫోటో గ్రఫీపై ఉండే అనుమానాలను తెలియ చేసి... వాటిని తీర్చేసుకోండి.

ఇప్పటికే మీరు ఫోటోగ్రఫీ రంగంలో ఉంటే మాక్రో లెన్సుతో పాటుగా ఓ అడాఫ్టర్‌ని కొని మీరూ పురుగులో పుట్రలో తీయటం ప్రారంభించి ధామస్‌ లెవెల్లో కాక పోయినా కొంతమేరైనా ఖ్యాతిని కొట్టేయచ్చు ఏమంటా రు మరి.

అంతర్జాలంలో తెలుగు వెలుగులు

తెలుగు భాష మనది... నిండుగ వెలుగు జాతి మనది... అని పాటలు పాడకునే దిశ నుండి

ప్రపంచ వ్యాప్తంగా మరింత అభివృద్ధి దిశగా వేసిన అడుగులు ఫలించాయి.

అంతర్జాలంలో మన మాతృభాషలోనే భావ సందేశాలు, చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని రాసుకునేందుకు వీలుగా యునికోడ్‌ కాన్సిర్టియంలోకి ఎట్టకేలకు ప్రవేశించే అవకాశాన్ని దక్కించుకున్న తెలుగు భాష- ఇక విశ్వజనీతం కావటం ఖాయమని... నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే తమిళ, హిందీ, భాషలు యూనికోడ్‌ కాన్సిర్టియంలోకి ప్రవేశించి తమ సత్తా చాటు కోవటం ప్రారంభించాయి. తాజాగా తెలుగు భాషకు కూడా యూనికోడ్‌లో ప్రవేశం దక్కడంతో పాటు పూర్తి అధికారిక సభ్యత్వం కూడా సంపాదించుకోవటం పట్ల తెలుగు భాషాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గత కొంత కాలంగా ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వంతో పాటు వివిధ సాంకేతి క సంస్ధలు చేసిన ప్రయత్నాలు ఫలించడంతో అడోబ్‌ సిస్టమ్స్‌, యాపి ల్‌ ఇంక, మెక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌, ఒరాకిల్‌ అమెరికా, గూగుల్‌, ఐబి ఎం కార్పొరేషన్‌, ఎస్‌ఎపి తదితర ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సంస్ధలు కూడా తమ సాఫ్ట్‌వేర్‌లని తెలుగు భాష కు మద్దతు ఇచ్చేలా రూపొం దించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నాయి.

ఇటీవల కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లో జరిగిన తొలి అంతర్జాతీయ తెలుగు అంతర్జాలసమావేశంలో తెలుగు భాషకు యునికోడ్‌లో ప్రాధా న్యత లభించడంతో దీనిని ఆసరాగా తీసుకుని భాషని విస్తృత పరచాలని ఈ మేరకు అనేక ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించా రు. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగు మాట్లాడేవారు 7కోట్ల పైచిలుకు కాగా, ప్రపం చ వ్యాప్తంగా వీరి సంఖ్య 18 కోట్లు ఉంటుం దని ఓ అంచనా.

తాజాగా జరిగిన నిర్ణయాలతో ఇన్నాళ్లూ ఇంగ్లీషు భాషలో ఉండి... తగు రీతిన అర్ధం కాని పరిస్ధితి నెలకొన్న చట్టాలను కానీ, ఇతర ప్రభుత్వ నిర్ణయాలను, గవర్నమెంట్‌ ఆర్డర్లను, టెండర్లు, ఇలా చాలా విషయాలు ఇక ముం దు తెలుగులోనే కనిపించనున్నాయి. దీంతో సామాన్యుడికి సమాచారం అర్ధమయ్యేలా రూపొందటం వల్ల వారిలో మరింత చైతన్యం వెల్లి విరిసే అవకాశాలు బోలెడున్నాయని సామాజిక వేత్తలు కూడా చెప్తున్నారు.

అలాగే అనేక మంది రచయితల రచనలు, ప్రపంచ వ్యాప్తంగా జరిగే అనేక విశేషాలను యునికోడ్‌లో తెలుగు రంగ ప్రవేశం తరువాత నేరు గా మన స్వీయ భాషలోనే చదువుకునే అవకాశం ఉందని సాహితీ ప్రియులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమాచార సాంకేతిక విప్లవం దూసుకు వస్తున్న క్రమంలో ఇపðడు గ్రామ గ్రామానా ఇంట ర్నెట్‌ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అందుకు తగ్గట్టుగానే భారత ప్రభుత్వ టెలికాం సంస్ధతో పాటుగా వివిధ ప్రయివేటు టెలికాం సంస్ధలు కూడా అనేక ప్యాకేజీలు ఇచ్చి ఇంటర్నెట్‌ని విస్తృత పరచడం తో తెలుగు వెలుగులు మరింతగా విరజిమ్మేందుకు అవకాశం ఉందన్న ది వాస్తవం. యూనికోడ్‌ పరిధిలోకి తెలుగు భాష వచ్చి చేరడంతో... విదేశాలలో ఉండే తన బంధు మిత్రులతో తెలుగులోనే ఛాటింగ్‌ చేసు కుంటూ వారు మనపక్కనే ఉండి మాట్లాడుతున్నారనే భావన కలగటం ఖాయమని.. వ్యక్తి గత ఆలోచనల్ని, అక్షర రూపాల్లో వివిధ బ్లాగుల్లో ఇప్పటికే తెలుగులో వెలువరిస్తున్న రచయితలకు కూడా తాజా పరిణామాలు మరింత ఉత్సాహాన్ని ఇవ్వటం ఖాయమని పలు వురు బ్లాగర్లు చెప్తున్నారు.

కాగా యునికోడ్‌ తెలుగు ఫాంట్లుపై మరిన్ని సాంకేతిక పరమైన ప్రయోగా లు జరుగుతున్న దశలో ప్రస్తుతం ఉన్న విండో స్‌ ఎక్సపీ ద్వారానే అన్ని భారతీయ భాషలనీ వాడుకుంటున్నట్లే... తెలుగునీ వాడుకునే అవ కాశాలున్నాయి. చాలా మందికి యాప ిల్‌, ఫొనిటికకీే బోర్డు మాత్రమే తెలుగు లో వాడటం అలవాటు. అయితే ఎక్సపి ఇన్‌ స్క్రిప్ట్‌ కీబోర్డుకి పని చేస్తుం ది. అలాంట పðడు కీ బోర్డు ఆప్షన్‌ మార్చుకోవాల నుకుంటే సీడాక సంస్ధ వెబ్‌ సైట్‌ నుండి బోర్డ్‌ డ్రైవ్‌లు ఉచితంగా డౌన్‌ లోడ్‌ చేసుకుని ఇనిస్టాల్‌ చేసుకుంటే మీకు నచ్చిన కీబోర్డుతో టైపింగ్‌ చేసుకోవచ్చు.

యునికోడ్‌లో తెలుగు భాషకు అరుదైన గౌర వం దక్కడంతో ఇక తెలుగుఃవాడఃిని చూపిం చడమే తరువాయి. ఐటి దిగ్గజాల సరసన మనం కూడా చేరి సభ్యత్వం పొందటంతో ఇంటర్నెట్‌లో తెలుగు లిప ిలో జరుగుతున్న పొరపాట్లను సవరిస్తూ... యూనికోడ్‌ లిపి ప్రమాణా లకు అనుగుణం గా కొత్త లిపిని రూపొందించేందుకు సాంకేతిక నిపుణులు కృషి చేసున్నారు. అలాగే ఇందుకు గాను ఆరు ఇంటర్నెట్‌ ఫాంట్లను రూపొందిస్తూ... వీటన్నింటినీ ఉచితంగానే డౌన్‌లోడ్‌ చేసు కునే ఆస్కారం కలిపించాలని నిర్ణయించింది ప్రభుత్వం. తెలుగు భాష టైప్‌ చేసేపð డు వచ్చే తపðలను దిద్దేందు కువీలుగా ప్రత్యేకంగా ఓ స్పెల్‌ చెక సాఫ్ట్‌వేర్‌ని కూడా రూపొందించే పనిలో పడ్డాయి

మరికొన్ని సంస్ధలు. అలాగే ఇపðడు అంతా వాడుతున్న వివిధ కీ బోర్డులకు అనుగుణంగానే యూనికోడ్‌లో తెలుగును శాశ్వత ప్రమా ణాలతో రూపొందించాలని తెలుగు భాషపై మక్కువ ఉన్న అనేక మంది విదేశాలలో ఉన్న సాంకేతిక నిపుణులు ప్రత్యేక శ్రద్ద తీసుకుని అనేక ప్రయోగాలకు నడుం బిగించారు. మరోవైపు తెలుగు భాషలో ఉన్న వివిధ రకాల వెబ్‌ సైట్లనుఒకే వేదిక పైకి తీసుకు వచ్చేందుకు ప్రత్యేకంగా ఓ బ్రౌజర్‌ని ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలను ముమ్మ రం చేసింది. ఏది ఏమైనా... మన భాషని విస్తృత పరిచే క్రమంతో అంతర్జాలంలో ప్రత్యేక స్ధానం దక్కించుకుంటూ వస్తున్న సాంకేతిక సమస్యలను అధిగమిస్తూ... దూసుకు పోవాలని మనమూ ఆశిద్దాం...

తెలుపు నలుపైతే.....పొరపాటు లేదోయ్‌...

నిన్న మొన్నటి వరకు నలుపు దుస్తులు ధరిస్తేనే శనీశ్వరుడు పట్టిపీడిస్తారని..

ధవళ వస్త్రాలవైపే మోజు చూపించిన సమాజం నేడు అంచెలంచెలుగా...

తన ధోరణి మార్చుకుంటూ నలుపు వైపు పయ నిస్తోం ది.

చీకటి లేకుంటే వెలుగు ఎలాంటి ప్రాధాన్యత ఉండదు ఈ క్రమంలోనే..

మన నిత్య జీవిత గమనం లో నలుపు ప్రాధాన్యత క్రమేపీ పెరుగుతోంది.

నిత్యం పూజించే నర, నారాయణులు నల్లని వారే.. మనం వాడుకునే ఎన్నో వాహనాలు నలుపు రంగు లోనే ఉంటాయి. ఇక మన వాహనాలు పరుగులు తీసే రోడ్డు దాదాపుగా నలుపే.. న్యాయ దేవత కళ్లకు కట్టే రిబ్బన్‌ నలుపు, న్యాయ వాదుల కోటు నలుపు, మనం చేతికి తొడిగే వాచ్‌, కాలికి వేసే చెప్పు, కళ్లకి తొడిగే అద్దాలు ఇలా ఏదైన నలుపు కి ప్రాధాన్యత పెరిగి నేటి

యువతరం నలుపు డ్రస్సులంటే తెగ మోజు పడుతు న్నారు.

ఒక్కప్పుడు పెళ్లిళ్లు,పేరంటాలలో తెలుపు బట్టలతో ధగధగలాడిపోయిన వారుసైతం నేడు నలుపుదుస్తుల వైపు మక్కువ చూపుతున్నారు. అంతే కాదు మన సినీతారలు వచ్చే ఏఫంక్షన్‌ అయినా తీసుకోండి దాదా పు ఈ తారలంతా నలుపు దుస్తులతోనే దర్శన మిస్తారు. అందుకు ప్రత్యేక కారణం... అభిమానులని ఇట్టే ఆకట్టుకునేందుకు అవకాశాలెక్కువగా ఉండేరంగు కాబట్టి.

ఉదాహరణకి చిరంజీవిని తీసుకోండి... సొంత సినిమా ఫంక్షన్‌ అంటే జీన్‌ ఫేంట్‌ నల్లషర్టు వేసు కుని, మిగిలిన వారికన్నా... భిన్నంగా కనిపిస్తుండగా... మహేష్‌ బాబు ఎక్కువగా ఫంక్షన్లకి తానెక్కువగా ఇష్టపడే బ్లాక్‌టీషర్ట్టుతొ దర్శనమిస్తాడు. అనుష్క అయితే షాపింగ్‌ కెళ్తే ముందు కొనేది నలుపురంగు డ్రస్సుల నేన ట. అందుకే చిన్న ఫంక్షనైనా నలుపు చీర కట్టుకొస్తుంటా అని ఆమధ్య ఓఇంటర్వూలో చెప్పుకొచ్చింది కూడా.

ఇకవరుస విజయాలతో దూసుకు పోతున్న గోపీచంద్‌ సైతం సినీ ఫంక్షన్లలో నలుపు దుస్తులతో కనిపిస్తాడు. ఆమధ్య జరిగిన కేన్స్‌ ఫెస్టివల్‌లో నియాన్‌ కాంతుల నడుమ నల్లని దుస్తులతో మెరిసి తన స్పెషలిటీ నిరూపించుకుంది. ఇలా సెల బ్రెటీలంతా నలుపుకు ప్రాధాన్యత ఇస్తు... ఫంక్షన్లలో తన ప్రత్యేకతని నిలుపుకుం టూ వస్తున్నారు.

ఇలా ఫ్యాషన్‌ ప్రపంచంలో నలుపు తన స్దానాన్ని పదిలపరుచుకుంటూ ఎవరు? అంటూ ప్రత్యేక గుర్తింపు నివ్వటమే కాకుండా.. ఆల్‌టైమ్‌ ఫేవరేట్‌ కలర్‌ బ్లాక్‌ అంటూ... యువతరానికి ఆనందాన్ని కలుగ చేస్తోందనటంలో ఆశ్చర్యం లేదు. నలుగురిలో మీరు ప్రత్యేక ఆకర్షణగా నిలవాలంటే...నలుపు దుస్తుల్ని ధరించా ల్సిందే...నేడు వయసుతొ సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అంతా బ్లాక్‌లో కనిపిం చేందుకు తహతహ లాడుతున్నారు.

నేటి ప్యాషన్‌ ప్రపంచంలో కుర్రకారుని ఆకర్షిం చేందుకు అన్ని వస్త్ర కంపెనీలు నలుపు రంగు వస్త్రాలతో రూపొం దించిన అనేక రకరకాల దుస్తుల్ని మార్కెట్‌లోకి దించా యి. యువత నలుపు రంగులో ఉండే జీన్స్‌. టీషర్టులు, కురా తపైజామాలు షార్ట్‌లు కనిపిస్తుండగా... మహిళల కోసం అనేకరకాల ఎంబ్రయిడరీ డిజైన్లతో ప్రత్యే కఫ్యాషన్‌ డిజైన్లతో కూడిన చీరలు, స్కర్ట్టులు, ఫ్యాంట్లు, టైలు, కోట్లు, ఫ్రాక్స్‌ దర్శనమిస్తు న్నాయి. బ్లాక్‌కలర్‌ని స్టయిలిష్‌కి మారు పేరుగా, సెక్సీ కలర్‌గా పేరు తెచ్చుకు న్న ఈ రంగు ఇప్పుడు సగటు జీవికి కూడాఫేవరేట్‌ రంగుగా మారిపోయిందనటంలో సందేహం లదు.

నేడు వేసుకున్న దుస్తులకు

తగ్గట్టుగా

మ్యాచింగ్‌లు కూడా నలుపే కావాలని మొగ్గు చూపు తున్నారు. మెడలొ ధరించే దండలు, చెవులకు పెట్టుకునే రింగులు, డైమండ్‌తో చేయించుకున్నా... చేతి గాజులు, నడుం బెల్టు, హాంగ్‌ బ్యాగ్‌లు ఇలా ప్రతివస్తువూ నలుపు గా ఉండాలని కోరు కుంటున్నారంటే నేటి యువతరం నలుపుని ఎంత ఇష్టపడుతున్నారో ఇట్టే అర్ధం చేసుకోవ చ్చు.

నఖ శిఖపర్యంతం నలుపుతోనే తమకో ప్రత్యేకత వస్తు న్నప్పుడు ఇది అశుభమైన రంగని ఎందుకంటున్నారో అర్ధం చేసుకోలేక పోతున్నామన్నది నేటి తరం వేస్తు న్నప్రశ్న దీనికి సమాధానం మనం ఖచ్చితంగా ఇవ్వలేక పోయినా... ఇది యూనివర్శల్‌ కలర్‌ అందుకే ఫంక్షన్ల కెళ్లేప్పుడు ఎలాంటి రంగు దుస్తులు వేసుకెళ్లాలన్న కన్ఫ్యూజన్‌లో మీరుంటే నలుపు డ్రస్‌ని వేసుకొని వెళ్లండి... అది లేదంటే... నలుపు, తెలుపు కాంబి నేషన్‌ దుస్తులు వేసుకుంటే సరి అంటున్నారు ఫ్యాషన్‌ నిపుణులు.

భారీ డిజైన్లకన్నా సింపుల్‌గా ఉండే డిజైన్లతో కూడిన దస్తులపై మక్కువ చూపిస్తున్నవారిలో ఎక్కువగా నలుపు కాంబినేషన్‌ వైపే చూస్తుంటా రని, అయితే సిప్లిసిటీకి, డిగ్నిటీకి ప్రతీకగా నిలచే నల్లని దుస్తులు వైపు ఎక్కువ మక్కువ చూపిం చడానికి కారణాలు అన్వేషిస్తే... నలుపు ధరిస్తే సన్నగా కనిపిస్తా మన్న భావన పెరగటం ఓ కారణం కాగా బంగారం, ముత్యాలు, వజ్రాలు ఎన్ని ఉన్నా సింపుల్‌ యాక్స రీస్‌ నలుపు కి సరిగ్గా మ్యాచ్‌ కావ టం కూడా మరో కారణమని... నిపుణులు చెప్తున్నారు.

సాధారణంగా త్వరగా రంగుని కోల్పోయే లక్షణాలు న్న ఈ నలుపు రంగు దుస్తులు కొనేప్పుడు నాణ్య మైన వస్త్రాలకే ప్రాధాన్యత ఇవ్వండి. బ్లాక్‌లోదొరికే చాలా రకాల షేడ్స్‌లో మీకు నచ్చిన వాటిలో మంచి ఫ్యాబ్రిక్‌కి చూసికొనుక్కోండి. ఎలాంటి రంగుదుస్తులు న్నా... టాప్‌, బాటమ్‌ ఎక్కడైనా మ్యాచ్‌ అయ్యి మీరు వేసుకునే దుస్తులకు గుర్తింపు తెచ్చే నలుపు రంగుని మీ జీవితంలొ ఓ భాగం చేసుకోండి. ఎక్క డున్నా మీ ప్రత్యేకత నిలుపుకునేందుకు నేడే ఓ నలుపు రంగుని దుస్తుల్ని కొనుక్కోండి.

సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌

పెరుగుతున్న ఫ్యాషన్‌ ప్రపంచంలో నలుపు కున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. దాదాపు నేడు జరుగుతున్న అనేక ఫంక్షన్లలో నలుపు రంగు డ్రస్‌ వేసు కొచ్చిన వారే సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ గా నిలబడుతున్నారనటం అతిశయోక్తి కాదె మో? మీకెన్ని రంగు రంగుల దుస్తులున్నా... ఒక్క నలుపు డ్రస్సయినా లేకుంటే మీకు ఫ్యాషన్‌ టేస్ట్‌ తెలియదన్నా ఆశ్చర్యపోనఖ్ఖర్లే...

బతుకు 'దీపం' వెలిగేనా?

నిన్నటి వరకు గిర గిర తిరిగే కుమ్మరి చక్రం నేడు ఆగి పోయింది.

నాగరికత నేర్చాక తన చేతి వేళ్లతోనే సొగసులద్దుతూ... ప్రకృతిలోని మట్టికే ప్రాణ ప్రతిష్ట చేస్తూ...

ఈ జగానికి భోజన కంచం, మంచినీళ ్ల్లగ్లాసు, వంట పాత్రలని తయారు చేసిన చెయ్యి...

నేడు సాయం కోసం అర్ధిస్తోంది. దీపావళికి ప్రతి ఇంటా కాంతులు వెద జల్లే దీపాలకు ప్రమిదలనందించి పరమానందభరితుడైన ఈ సమాజ నేస్తం నేడు తన ఇంట్లో మిణుకుమంటున్న దీపం ఆగిపోకూడదని, తరతరాలుగా వస్తున్న ఈ కళ తనతోనే అంతరించి పోకూడదని కోరుకుంటున్నాడు.

దీపావళి అనగానే అందరి మదిలో ఏదో తెలియని ఆనందమే... చిచ్చుబుడ్లు మతాబులే కాదు వెలుగులు విరజిమ్మే దీపాలకే దీపావళి రోజున ప్రత్యేక స్ధానం ఉంది. ఎంత పేదవాడైనా ఆ రోజున ఖచ్చితంగా తన ఇంటి ముందు చిన్న పాటి దీపాన్ని వెలిగించి ఆ వెలుగులో అలౌకిక ఆనందాన్ని పొందుతాడన్నది వాస్తవం.

దిబ్బి దిబ్బి దీపావళి.. మళ్లీ వచ్చే నాగులు చవితి అంటూ దీపావళి నాడు సాయంత్రం వేళల్లో ఆముదపు కర్రకు, గోగునార కర్రలకు చిగుళ్లలో దూదెను కట్టి వెలిగించి నేలకు కొట్లడంతో దీపావళి ప్రక్రియ ప్రారంభమవుతుంది. దక్షిణ వైపు నుండి ముందుగా దీపా న్ని వెలిగించడం హిందూ సాంప్రదాయాలలో ఒకటిగా వస్తోంది. ఇలా దీపం వెలిగించడాన్ని ఉల్కాదానంగా పేర్కొంటారు. ఇది పితృదేవతలకు దారి చూపుతుందని ఓ నమ్మకం. ఈ దీపం వెలిగించా క ఇంట్లో నువ్వెల నూనెతో మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించి ముందుగా ఆ దీపపు లకి్ఝకి నమస్కరించి...లకి్ఝపూజకి ఉపక్రమిస్తా రు. కలశంపై లకి్ఝదేవిని ఆవాహన చేసి లకి్ఝ పూజ అనంతరం దీపాలను ఇంటి ముందు వరుసగా పెట్టి బాణా సంచా కాల్చేందుకు సిద్దమవుతారు. అంటే మట్టి దీపాలను దేవతా మూర్తులుగా ప్రాధాన్యత ఇచ్చిన సాంప్రదా యం మనది.

ఒకపðడు దీప కాంతుల కోసం విరివిగా మట్టి ప్రమిదలనే ఉపయోగించేవారు. కానీ మారు తున్న కాలం తో అనేక మంది డిజైనర్లు తమ చేతి కి పనికలిపించి అనేక రకాల డిజైన్లు రూపొందించ డంతో వేలాది డిజైన్ల ప్రమిదలు బోలెడు లభ్యం కావ టం ప్రారంభమయ్యాయి. సాధారణ ప్రమిదలకన్నా... రంగులతో హొయలొలికించేలా రూపొందిన ఈ ప్రమిదలు అందర్నీ ఆకర్షించడంతో వీటి ప్రాముఖ్యత క్రమంగా పెరగటం ప్రారం భించింది.

ఈ క్రమంలో దీపావళికి పూజించే లకి్ఝ దేవి ఆకృతి ఉన్న దీపాల ప్రమిదలతో పాటు శిపార్వతులు, వినాయ కుడు ఇలా అనేక దేవతా స్వరూపాలు ప్రమిదలకు వచ్చి చేరాయి. ఒక దానిని మించి మరొకటి రూపొందించిన ఈ దీపపు ప్రమిదలు సాంప్ర దాయాలకు అనుగుణంగా ఉండటంతో పాటు చూడగనే ఆకర్షించేలా ఓ ప్రత్యేకత సంతరిం చుకునేలా ఉండటం వల్ల వాటివైపు ఎక్కువమం ది మక్కువ చూపారనే చెప్పాలి. దీపావళి జీవితం లో వెలుగు నింపే పండగగా పేరు. దీపావళికి వాడే ప్రమిదల్లో అనేక హొయలుతో రావటంతో మన స్ధానిక సాంప్రదాయ కుమ్మర్ల నోట మట్టి పడిందనే చెప్ప క తప్పదు. తరతరాలుగా మట్టినే నమ్ముకుని జీవిస్తున్న అనేక కుంటుంబాలు సమస్త మాన వాళికి కావాల్సిన అనేక రకాల పాత్రల తయారు చేసి అంద చేసేవారు. అయితే రాను రాను లోహపు పాత్రలు, స్టీల్‌ వాడకం పెరిగాక మట్టి కుండల్లో వంట చేసుకునే ప్రక్రియ దాదాపుగా అంతరించి పోయింది. మట్టి కుండల స్ధానంలో ప్లాస్టిక బిందెలు, వచ్చి చేరాయి. మట్టి కుండల్లో నీరు శ్రేష్టమని తెలిసినా దాని చల్లదనం ఆరోగ్యా న్నిస్తుందని తెలిసినా అంతా ఫ్రిజ్‌ల మీదే ఆధార పడి అనవసర రోగాలు కొనితెచ్చుకుంటుం డంతో తనది అక్కరకి రాని వృత్తిగా మారిపోయిం దన్న తపన పడుతున్న కుమ్మరులెందరో ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఒకపðడు సారెపై అనేక ఆకృతులు రూపొందించి సమాజంలో తలలో నాలుకగా వ్యవహరించిన కుమ్మరి బ్రతుకు నేడు ఛిన్నాభిన్నమైపోయిం ది. అయినప్పటికే నేటికీ చాలా కుటుంబాలలో నిన్నటి తరంకి చెందిన వారు సారెతిపðతూ ప్రమిదలనైనా చేసి ఇచ్చేందుకు తాపత్రయ పడు తున్నారంటే అంతరించి పోతున్న కళని భావితరాలకు మచ్చుకైనా చూపించాలన్న తపనే కారణం.

కడుపు నింపని కులవృత్తి

కులవృత్తికి సాటి రావు గవ్వల చెన్నా... అంటూ నాడు కుల వృత్తులనుగౌరవించి.. భావితరా లకు అందించాలని తత్వవేత్త లు రాసినా ఇపðడా కుల వృత్తులు తమకు కనీసం కూడా పెట్టడం లేదన్న ఆవేదన చాలా మంది కుమ్మరి పని వారిలో ఉంది. ఏడాదిలో

కనీసం మూడునెలలు కూడా సరైన పని ఉండటం లేదని.. ప్రపంచమంతా ప్లాస్టిక మయమైపోవటంతో తమ పొట్టని నింపు కునేందుకు తమ వారసులు వేరే వృత్తులవైపు మళ్లుతున్నారని... దీంతో తమ వృత్తి మూల పడిపోతోం దని ఆవేదన చెందుతున్నారు. వాస్తవానికి తమ లోనూ ఎందరో నైపుణ్యం ఉన్న వారు ఉన్నా సరైన శిక్షణ, ప్రోత్సాహం కరువవుతుండటం వల్లే జీవనోపాది ్థకోసం వేరే మార్గాలను పట్టాల్సి వస్తోందని, తరతరాలుగా వస్తున్న ఈ వృత్తిని అంతరించుకొనిపోకుండా చూసుకునేం దుకు తామే నడుంబిగించి చేసిన మట్టి పాత్రల్ని అమ్మ కాలు జరిపేందుకు తిరుగుతున్నా సరైన ఆదరణ లభించ ట్లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేసారు.

దూసుకు పోతున్న రాజస్ధాన్‌ ప్రమిదలు

ఇక కొల్‌కత్తా, రాజస్ధానీ కళాకారులు రూపొందించిన దీపాల ప్రమిదల అందాలు ఇట్టే కట్టిపడేస్తుండటంతో క్రమంగా అటువైపు మక్కువ చూపేవారు ఎక్కువవుతున్నారు. నగరా లతో పాటు చిన్న తరహా పట్టణా లలోనూ ఇపð డు ఈ ప్రమిదల అమ్మకం జోరందుకుంది. వివి ధ రంగులతో, అనేక రకాల డిజైన్లతో, కొత్త తర హాలూ రూపొందించిన ఈ ప్రమిదలు విభిన్న ఆకృతుల్లో, కళ్లు చెదిరేలా రూపొందించటంలో ఆయా రాష్ట్రాల కళాకారులు తమ నైపుణ్యం చాలానే ప్రదర్శిస్తూ.. దూసుకు పోతున్నారనే చెప్పక తప్పదు.

పొట్ట కొడుతున్న ప్లాస్టిక ప్రమిదలు...

కనీసం దీపావళికైనా పట్టెడన్నం తింటామని భావించిన సగటు కుమ్మరి కుటుంబాన్ని ఇప్పటికే రాజస్ధానీ , గుజరాత్‌, కోల్‌కత్తా ప్రమిదలు నోటి కాడ కూడుని లాగేస్తుంటే... మరోవైపు ప్లాస్టిక దీపాలు కూడా ఉన్న దాన్ని ఊడగొడుతోంది. చుక్కల నంటిన ధరలు కిందకి దిగి రాక పోవటంతో ఓనాడు ఘనంగా జరుపు కున్న దీపావళిని నేడు ఉన్నంతలో తూతూ మంత్రంగా జరిపేసుకునేందుకు ఏనాడో మానసికంగా సిద్ద మైన సగటు మనిషికి దీపాల ఆకృతిలో ఉన్న విద్యుత్‌ దీపాలు ఊరట నిచ్చాయనే చెప్పక తప్పదు.

కార్పొరేట్‌ దెబ్బ :

ఇప్పటికే పలు రకాలుగా తమ ప్రమిదలు వాడకం తగ్గిపోవటంతో తమ జీవన గమనమే మారి పోయిం దని...వీటికి తోడు మార్కెటింగ్‌ రంగంలో ప్రవేశించిన అనేక కార్పొరేట్‌ కంపెనీలు తమ ఔట్‌లెట్లలో అనేక రకాల కొవ్వెత్తులతో పాటు దీపపు ప్రమిదల కొవ్వెత్తులు కూడా అమ్మకాలు జరుపుతుండటంతో సాధారణ ప్రజలు కూడా తమవైపు చూడటం మానేసారన్నది కుమ్మరి కళాకారుల ఆవేదన.

మనమేం చేయాలి :

తరతరాలుగా సమాజానికి సేవలందిస్తూ... మట్టినే నమ్ముకుని జీవిస్తున్న కుమ్మరి కుల వృత్తుల వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎంత ఉందో సగటు మనిషిగా మనకీ అంతే ఉంది. కనీసం ఈ దీపావళికైనా మీ ఊర్లో కుమ్మరి తయారు చేసిన ప్రమిదలు కొనండి. వాటికి మీరే రక రకాల రంగు లేసు కుని మీకు నచ్చినట్లు అలంకరించుకోండి. ఇందుకు పూసల దండలు, కుందన్‌లు, స్టిక్కర్లు, లేస్‌లు ఇలా ఇంట్లో మీకు అందుబాటులో ఉండే వాటితోనే అలంకరించుకుంటే... బాగుంటుంది ఓసారి ఆలోచించండి.

కుల వృత్తికి గుడ్‌ బై

నా చిన్నప్పటి నుండి ఈ వృత్తినే నమ్ము కుని కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు నాన్న. రోజంతా కష్టపడ్డా కనీసం కూలి కూడా వచ్చే అస్కారం లేకపోవటం, ఏరోజు బతుకు ఆరోజే అన్న చందంగా మారటంతో ఒకపðడు ఆనందంగా బతికిన మా కుటుంబం మట్టి వస్తువులు వాడకం తగ్గుముఖం పట్టాక చెల్లా చెదురైపోయింది. అందుకే కుల వృత్తికి గుడ్‌ బై చెప్పేసి నేనో ప్రయివేటు కంపెనీలో చేరి పోయా... -కానుగుల పరశురాం, గౌతమ్‌ నగర్‌, సిికింద్రాబాద్‌

ఆదాయం అంతంతే...

నేటికి మా ఇంట్లో అడపా దడపా పెళ్లిలకు కావాల్సిన కుండ లను, మట్టి పాత్రలని అమ్ముతాం. అయితే వాటిపై వచ్చే ఆదాయం అంతంత మాత్రమే.. అందుకే అమ్మతో ఇంటి దగ్గర చిన్న షాపు పెట్టించా...నేనే సొంతంగా మరో వ్యాపా రం ప్రారంభించుకున్నా... కులవృత్తిని పక్కకు పెట్టడం కాస్త బాధాకరమైనదే... దాన్ని తగ్గించు కోవటానికే వినాయక చవితి, పండగల్లో మట్టితో చేసే విగ్రహాలను, ప్రమిదలను అమ్ముతున్నాం.

- ఇ.రాజు, దయానంద నగర్‌, మల్కజ్‌గిరి.

ఎంత కష్టపడ్డా ఫలితం సున్నా...

వయసుడుగుతున్నా...నిమిషానికో ఓ ప్రమిదని, పని నిమి షాలకో కుండని చేయగలను నేటికీ.. అన్నీ చేసి వాటిని ఎండ బెట్టి కాల్చి.. విరిగినవి పోగా మిగిలినవి మార్కెట్‌కి తీసుకుపోతే కొనేవారే కరువవుతున్నారు. దీపావళి కోసం ప్రమిదలు తయారుచేస్తున్నా... రోజంతా కష్టపడ్డా ఫలితం నిండు సున్నా... బజార్లోకి వచ్చిన అనేక రకాల ప్రమిదల ముందు మా ప్రమిదలు విల విల లాడుతున్నాయి. మిషన్లని ఉపయోగిస్తూ... పోత తరహాలో రాజస్ధాన్‌, కలకత్తా వాళ్లు మాలా సారె తిప్పకుండానే ప్రమిదలు చేసి పడేస్తున్నారు. రంగుల వాడుతు.. పింగాణీ దీపాల్ని పోలి ఉండటంతో అంతా అటువైపే మళ్లు తుండటం తో మమ్మల్ని పట్టించుకోవట్లేదు

-నరసింహ, కుమ్మరి, నరసింహ నగర్‌, మల్కజ్‌గిరి.