13, మార్చి 2011, ఆదివారం

కేసీఆర్ తెలంగాణ ద్రోహి కాక ఏమవుతాడు

ఆనాడు ఎన్టీఆర్ హయాంలో ట్యాంక్‌బండ్‌పై మహనీయుల విగ్రహావిష్కరణ సమయంలో తెలంగాణ యోధుడు కొమరం భీమ్‌ను మరిచిన కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గంగాభవాని విరుచుకుపడ్డారు.
విగ్రహావిష్కరణ సమయంలో ఆ నాడు తెలుగు దేశంలో కీలక పదవిలో కేసీఆర్‌కు ఏ ఒక్క తెలంగాణ యోధుడు గుర్తుకురాలే దు... కాని, ఇపుడు తెలంగాణా కోసం కోసం చనిపొయిన కుటుంబాలపై తనకే సానుభూతి ఉన్నట్లు మాట్లాడుతున్నాడని ఎక్కడా లేని ప్రేమ నటిస్తూ యువతను , ప్రాంతీయతత్వాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.

మే నెలలో రాష్టప్రతి పాలన వచ్చేస్తోంది

మే నెలలో రాష్టప్రతి పాలన కిందకి రాష్ట్రం రానుందని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు జోస్యం చెప్పారు. ఆదివారం ఆయన హైదరాబాదులో మీడియాలో మాట్లా డుతూ... ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్‌ అధిష్టానంని మెప్పించి తన పదవిని కాపాడుకునేందుకే కుయుకులు పనుతున్నారని వైఎస్ జగన్‌ను ఎలా అణచాలనే విషయం గురించే ఎప్పుడూ ఆలోచిస్తున్నారని అందువల్లే రాష్ట్రంలో ఎలాంటి పెను విధ్వంసాలు జరుగుతున్నా పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఇప్పటికే గవర్నర్‌ ష్ట్ర పరిస్ధితిపై ఓ నివేదికని పంపించారని తనకు సమాచారముందని ఖచ్చితంగా మేనెలాఖరు నాటికి రాష్ట్రపతి పాలన విధించడం ఖాయమని రాష్ట్రంలో ప్రభుత్వం తగురీతిన పనిచేయట్లేదని... తెలుగుదేశం పార్టీ కూడా ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించడం లేదని విమర్శించారు.

తెలంగాణా ఉద్యమంలో భావ వ్యకీకరణని ఎవరూ తప్పు పట్టలేరని.. అయితే తెలుగుదజాతి మహోన్నతిని చాటిన వారికి ప్రాంతీయ భేదాలు అంటగట్టి వారి విహాలను ధ్వంసం చేయటం తగదని తెలంగాణా ఉద్యమం పేరు చెప్పి కొందరు నేతలు విద్యార్థుల జీవితాలతో ఆడుకోంటున్నారని ఇది హేయమైన చర్యఅని విమర్శించారు. విదార్ధులు కూడా ఆలోచనతో ఆ నాయకుల ఉచ్చులో పడకుాడదని విజ్ఞప్తి చేశారు.

'దొంగలముఠా 'ట్రైలర్స్‌ విడుదల


అందుబాటులోకి వచ్చిన అత్యంత ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 'దొంగలముఠా' చిత్రాన్ని తీశామని, ఈ విధానంలో సినిమాలు తీయడం ఎంతో శ్రేయస్కరమని దర్శకుడు రాంగోపాల్‌వర్మ స్పష్టంచేశారు. రవితేజ, చార్మి, ప్రకాష్‌రాజ్‌, లక్ష్మీప్రసన్న మంచు, బ్రహ్మానందం, సుబ్బరాజు ప్రధాన పాత్రధారులుగా శ్రేయ ప్రొడక్షన్స్‌ పతాకంపై కిరణ్‌కుమార్‌ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్స్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని సినీమాక్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా రాంగోపాల్‌వర్మ మాట్లాడుతూ, 'లోగడ వందరోజుల్లో కూడా సినిమా తీశాం. ఇప్పుడు ఈ సినిమాను ఐదురోజుల్లో తీస్తే ఎలా తీయగలుగుతున్నారని అడుగుతున్నారు.

ఈ నవీన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే మూడురోజుల్లో తీయవచ్చు. క్వాలిటీతో పాటు ఖర్చు కూడా ఎంతగానో కలిసొస్తుంది. అందుకే దీనిని ఉపయోగించి ముందు ముందు సినిమాలు తీయబోతున్నాను. హిందీలో కూడా ఈ పరిజ్ఞానంతో సినిమాలు తీస్తాను' అని అన్నారు.

ఉద్యమానికి తెలంగాణా ఉద్యోగ జెఎసి ద్రోహం

ప్రత్యేక తెలంగాణా రా ష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో భాగంగా ఏర్పాటైన ఉద్యోగ సంఘాల జెఎసి నిట్ట నిలువునా చీలింది. ఫిబ్రవరి 17 నుండి ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు కొందరు తమ స్వార్ద రాజకీయాల కోసం ఈనెల 4న ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఉద్యమాన్ని నీరుగార్చారని ఆరోపిస్తూ 32 సంఘాలకు చెందిన అధికార, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులు ప్రత్యేక సమాఖ్యను ఏర్పరుచుకున్నా రు. తమ స్వార్దం కోసం 4.5 లక్షల మంది ఉద్యోగులకు తీవ్ర ద్రోహం చేసారని, ఈ సందర్బంగా ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందస్తుగా నిర్ణయించిన అంశాలపై సంతకాలు చేసి ఉద్యమాన్ని విరమింప చేశారని ఆరోపిస్తున్నా రు. స్వామిగౌడ్‌, దేవినేని ప్రసాద్‌, శ్రీనివాసగౌడ్‌, విఠల్‌లు ఈ కుట్రలో భాగమని, వారిని పొలిటికల్‌ జెఎసి నుండి బహిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వంతో ఈ నాయకులు కుదుర్చుకున్న ఒ ప్పందంలోని 11వ అంశంలో చేర్చబడిన ఇకనుండి సమ్మె చేయబోమని, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములమై విధులు నిర్వహిస్తామని పేర్కొన్న విషయాన్ని కూడా చూడకుండా సంతకాలు చేస్తున్నారని ఆరోపించారు.

సహాయ నిరాకరణను నిలిపివేస్తూ ప్రభుత్వంతో ఒ ప్పందం కుదుర్చుకునే విషయంలో జెఎసి లోని ఇతర సంఘాలతో చర్చించకుండానే స్వయం నిర్ణయం చేశారని అంటున్నారు. మరో 15 నుండి 20 రోజుల పాటు సహాయ నిరాకరణ జరిగివుంటే ప్రభుత్వం సంక్షోభ స్థితికి చేరుకుని, రాష్ట్ర అవతరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సూచనలు చేసేదని అంటున్నారు. ఈ స్థితిలో వీరు ఉద్యమానికి ఎనలేని ద్రోహం చేశారని ఆరోపిస్తున్నారు.

స్వామిగౌడ్‌ ఎన్జీవోలకు గచ్చిబౌలిలో ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తామని చెప్పి కోట్లాది రూపాయలు దండుకున్నాడని, ఈ విషయమై ప్రభుత్వం వద్ద రికార్డులు ఉన్నాయని, దీన్ని ఆసరాగా చేసుకుని కేసులు బనాయిస్తామని ప్రభుత్వం చేసిన హెచ్చరికకు స్వామిగౌడ్‌ లాంటి నాయకులు లొంగిపోయారని తీవ్రఆరోపణలు చేస్తున్నారు.

మూరుమూల గ్రామాలకు బ్యాంకింగ్‌ సేవలు


గ్రామీణ ప్రజలకు కూడా బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులొకొస్తున్నాయి. మూరుమూల గ్రామాలకు కూడా బ్యాంకింగ్‌ సేవల్ని విస్తరింపజేస్తామని గతేడాది బడ్జెట్‌లో కేంద్రఆర్ధిక మంత్రి ప్రకటించారు. కాగా ఇవిప్పుడు కార్యరూపం దాలుస్తున్నాయి. ఏ బ్యాంక్‌ బ్రాంచ్‌లేని గ్రామాల్లో తొలుత సర్వీస్‌ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. ఇందుకు భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ ముందుకొచ్చింది. సర్వీస్‌పాయింట్లలో కలెక్టన్‌ ఏజెంట్లుగా నియామకాలకు ఇంటర్వ్యూలు ప్రారంభించింది. కనీసం 50వేలు పెట్టుబడి పెట్టగలిగి మరో 50వేలు బ్యాంక్‌కు డిపాజిట్‌ చేయగలిగిన నిరుద్యోగుల్ని ఈ సర్వీస్‌ సెంటర్లలో కలెక్టన్‌ ఏజెంట్లుగా ఎంపిక చేస్తున్నారు. గ్రామాల్లో ఒక చిన్న షాప్‌ను అద్దెకు తీసుకుని ఈ సర్వీస్‌పాయింట్లు నెలకొల్పుతారు. ఆయా గ్రామాల్లోని డ్వాక్రా మహిళల నుంచి వాయిదాలు కట్టించుకోవడం, అప్పులివ్వడం, గ్రామస్థులకు సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్లు తెరవడం వంటి చిన్న చిన్న పనుల్ని ఇక్కడ అప్పటికప్పుడు పూర్తిచేస్తారు. ఇందుకోసం సర్వీస్‌ సెంటర్ల నిర్వాహకులకు నిర్ణీత మొత్తంలో కమిషన్లు చెల్లిస్తారు. కనీసం ఇంటర్‌ పాసైన నిరుద్యోగుల్ని ఈ ఉద్యోగాలకు ఎంపికచేస్తున్నారు. శుక్రవారం నుంచి కాకినాడ స్టేట్‌బ్యాంక్‌ అడ్మినిస్ట్రేటీవ్‌ కార్యాలయంలో ఇంటర్వ్యూలు మొదలయ్యాయి. ఈ నెలాఖరులోగా ఎంపిక పూర్తి చేసి గ్రామాలకు బ్యాంక్‌ సేవల్ని విస్తరించనున్నారు.

చేసింది అపచారం.. పైగా సమర్దిoపు


తెలుగు జాతి కీర్తి కిరీటాలను ప్రపంచ వినువీధుల్లో చాటి చెప్పిన తెలుగు మాగాణి ముద్దు బిడ్డల విగ్రహాలను ప్రాంతీయ విధేష్వాల పేరుతో ధ్వంసం చేసి హుసేన్‌సాగర్‌లో పడేయటాన్ని గర్హిస్తు తెలుగు భాషాభిమానులు టాంకుబాండ్‌పై నిరసన దీక్షకి దిగారు. ఆదివారం పలువురు రాజకీయ నేతలు, స్వచ్చంద సంస్ధల ప్రతినిధులు ఈ నిరసనలో పాల్గొని పోతనామాత్యుని విగ్రహం ముందు కూర్చొని నిరసన తెలిపారు. కృష్ణ దేవరాయులు, బ్రహ్మనాయుడు విగ్రహాల ను చూసి కన్నీళుల పెటుకునారు. తెలుగుజాతి ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు జాతి కుల మత ప్రాంతీయ భేదాలకు అతీతంగా విదేశీయులైనా తెలుగువారికి మేలు చేకూర్చిన ప్రతి ఒక్కరినీ తెలువాళ్లంతా గుర్తుంచుకోవాలన్న ఒకే ఒక్క కాంక్షతో నాటి ముఖ్యమంత్రి వీటిని ఏర్పాటు చేస్తే .. విగహాలకు ప్రాంతీయ విధ్వేషాలు పులిమి కూల గొట్టడం... పైగా వారి ఔన్నత్యం తెలిసికూడా... విగ్రహాలే కదా? అన్న రీతిన మిలీయన్‌ మార్చ్‌ నిర్వాహకులు జరిగిన తప్పిందాన్ని సమరించుకోవటం శోచనీయమని ఈ నిరసనలో పాల్గొన్న పలువురు అభిపాయ పడ్డారు. అంతకు ముందు మహాత్ములారా! మన్నించండంటూ జనవిజాన వేదిక ఆధ్వర్యంలో టాంక్‌ బాండ్‌పై మౌన ప్రదర్శన జరిగింది.

ప్రతి హిందూవు ఇంటిపై కాషాయ ధ్వజo

రాబోయే ఉగాది పండుగ నూతన పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి హిందూవు ప్రతి ఇంటిపై, ప్రతి గ్రామ కూడలిలో కాషాయ ధ్వజాలు ఎగురవేయాలని విశ్వహిందూ పరిషత్‌ పిలుపునిచ్చింది.నగరంలో మార్చి 27న సామూహికంగా ఇతిచింతక్‌ నిర్వహించాలని, మే 8నుండి 23వరకు జరిగే విహెచ్‌పి శిక్షణ వర్గ్‌లో ప్రతి గ్రామం నుండి 5మంది చొప్పున పాల్గొనాలని, ఈ నెల 19 సందర్భంగా పౌర్ణమి ఉంటుందని, అందుకు మనం కాముని పౌర్ణమిగా ఆ రోజు రాత్రి 10గంటలకు కామదహన కార్యక్రమాన్ని నిర్వహించి హోలీ మహోత్సవాన్ని ఈనెల 20న ఆదివారం జరుపుకోవాలని విశ్వహిందూ పరిషత్‌ వెల్లడించింది.

పెరుగుతున్న ఎండలు .. భయాందోళనలో జనాలు

ప్రకృతి ధర్మంలో భాగంగా ప్రతి ఏడు ఎండ, వాన, చలి, గాలి వాటి వాటి పనులు తుచాతప్పకుండా ఎవరి ఆదేశాల కోసం వేచిచూడకుండా వారి తడువు రాగానే వారి వారి పనులు చేసి వెళ్ళిపోవడం ఆనవాయితి. ఇందులో భాగంగా చలి తనదైన శైలిలో విజృంభించి మానవాళిని గజగజ వణికించి తన పని పూర్తి చేసుకొని తరువాత వంతు ఎండకు అప్పగించి వెళ్లడంతో సూర్య ప్రతాపం క్రమం క్రమంగా పెరుగుతూ ఎండ వేడిని పుట్టిస్తున్నడంతో ప్రజలు ఎండలకు బెంబెలేత్తూ పరుగులు తీస్తున్నారు.


గతంలో ఈ సమయంలో ఎప్పుడు లేనంతా ఎండ ఉష్టోగ్రతను ప్రజలు చూస్తూ రాబోయే కాలంలో ఈ ఎండ ప్రభావం ఏ మేరకు ఉంటుందో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యువత, చిన్నారులు ఎండ వేడిని తట్టుకోలేక సమీపంలో ఉన్న నీటి బావుల వద్దకు చేరుకొని ఎండ వేడికి జలకాలటలే శరణ్యం అంటూ వేడి ప్రతాపం నుండి ఉపసమనం పొందుతూ సేదతీరుతున్నారు. పట్టణంలో ఎండ వేడి తట్టుకోలేక ప్రజలు చెట్ల నీడలకు, దుకాణాల ముందు భాగాలకు చేరుతూ ఎండ వేడితో తడారిపోయిన శరీరానికి చల్లని పానియాలు, పుచ్చకాయలు, మజ్జిగ తదితర ద్రవ ప దార్థాలను సేవిస్తూ శరీరంలో తగ్గుతున్న నీటి శాతాన్ని పెంచుకోనేందుకు వారి వారి స్తోమతబ ట్టి సేవిస్తున్నారు.

జగన్‌ని కాంగ్రెస్‌లోకి తేకుంటే రాజీనామా

పది రోజులు తనకు అధిష్టానం సమయమిసే... జగన్‌ని ఆయన వెనకున్న నేతల్నికాంగ్రెస్లోకి తెచ్చి పడేస్తానంటూ తన దైన శైలిలో వ్యాఖ్యలు చేసారు మంత్రి శంకరరావు. ఆదివారం ఆయన తన నివాసంలో మీడియాలో మాట్లాడుతూ.. జగన్‌ ప్రసుతం పార్టీ పెటినా త్వరలోనే తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరటం ఖాయమని జోస్యం చెప్పారు. వైఎస్‌ ఆశయాలో రాహుల్ని ప్రదానిని చేయాలన్న లక్ష్యం కూడా ఒకటని.. దానిన కాదని జగన్‌ ముందు కెళ్లగలరా? అని ప్రశ్నించారు. జగన్‌ని కాంగ్రెస్‌ పార్టీలోకి తాను రపించలేక పోతే తన పదవికి రాజీనామా కూడా చేస్తానని సవాల్‌ విసిరారు.

'విదేశీ' కన్నా మన స్వదేశీ 'మందే' బెటర్

రాష్ట్రంలో విదేశీ మద్యం మందుబాబులకు కిక్కివ్వడం లేదు. అమ్మకాలు ఆశాజనకంగా లేవు. ఐదు నెలల కాలంలో 10 కేసులే అమ్ముడు పోయాయంటే అమ్మకాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం 2010 అక్టోబర్ నుంచి విదేశీ మద్యాన్ని రిటైల్, బార్‌లో అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. దీంతో మందుబాబులు విదేశీ మద్యం తమ ముంగిట్లోకి వస్తుందని మురిసిపోయారు.

ఒక బాటిల్ రూ.1800 నుంచి రూ.3500 పైబడి ఉండడంతో మందుబాబులు వీటి జోలికి వెళ్లేందుకు కూడా సంకోచిస్తున్నారు. అదే ఇండియన్ మేడ్ లిక్కర్‌లో కొంత కాస్లీ అయినప్పటికీ టీచర్స్-50, టీచర్స్, బ్లాక్‌డాగ్, 100 పైపర్స్ రూ.1000 నుంచి రూ. 1500 లోపు ధర ఉండటంతో ఉన్నత శ్రేణి మద్యం ప్రియులు విదేశీ మద్యంపై మక్కువ చూపకుండా స్వదేశీ బ్రాండ్‌నే తాగుతున్నారు.

మన సంబంధికులెవరైనా విదేశీ మద్యం తీసుకొస్తే వారికి ఇండియా కరెన్సీలో రూ.1500 నుంచి రూ.2వేల వరకు అక్కడ లభిస్తుంది. ఇండియాకు తీసుకువచ్చిన తరువాత నామమాత్రంగా రూ.200 నుంచి రూ.300 వరకు ఒక్కొక్క బాటిల్‌పై కస్టమ్ డ్యూటీ పడుతుంది.అదే ప్రస్తుతం మనకు మార్కెట్లో లభిస్తున్న విదేశీ మద్యం సెల్స్‌ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ కలుపుకుంటే రేట్టింపు ధరతో మనకు లభిస్తోంది. బ్లాక్‌లెబుల్ ధర రూ.3,500, రెడ్‌లెబుల్ ధర రూ.1800, శివాస్ రిగల్ రూ.3,500 ధరతో లభిస్తోంది.

ఈ ధరలు అధికంగా ఉండడంతో మన మందుబాబులు వాటిని కొనేందుకు వెనుకంజ వేస్తున్నారు.

ఖజనాకి 'విదేశీ' కిక్కు నిల్లు

రాష్ట్రంలో విదేశీ మద్యం మందుబాబులకు కిక్కివ్వడం లేదు. అమ్మకాలు ఆశాజనకంగా లేవు. ఐదు నెలల కాలంలో 10 కేసులే అమ్ముడు పోయాయంటే అమ్మకాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం 2010 అక్టోబర్ నుంచి విదేశీ మద్యాన్ని రిటైల్, బార్‌లో అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. దీంతో మందుబాబులు విదేశీ మద్యం తమ ముంగిట్లోకి వస్తుందని మురిసిపోయారు.

ఒక బాటిల్ రూ.1800 నుంచి రూ.3500 పైబడి ఉండడంతో మందుబాబులు వీటి జోలికి వెళ్లేందుకు కూడా సంకోచిస్తున్నారు. అదే ఇండియన్ మేడ్ లిక్కర్‌లో కొంత కాస్లీ అయినప్పటికీ టీచర్స్-50, టీచర్స్, బ్లాక్‌డాగ్, 100 పైపర్స్ రూ.1000 నుంచి రూ. 1500 లోపు ధర ఉండటంతో ఉన్నత శ్రేణి మద్యం ప్రియులు విదేశీ మద్యంపై మక్కువ చూపకుండా స్వదేశీ బ్రాండ్‌నే తాగుతున్నారు.

మన సంబంధికులెవరైనా విదేశీ మద్యం తీసుకొస్తే వారికి ఇండియా కరెన్సీలో రూ.1500 నుంచి రూ.2వేల వరకు అక్కడ లభిస్తుంది. ఇండియాకు తీసుకువచ్చిన తరువాత నామమాత్రంగా రూ.200 నుంచి రూ.300 వరకు ఒక్కొక్క బాటిల్‌పై కస్టమ్ డ్యూటీ పడుతుంది.అదే ప్రస్తుతం మనకు మార్కెట్లో లభిస్తున్న విదేశీ మద్యం సెల్స్‌ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ కలుపుకుంటే రేట్టింపు ధరతో మనకు లభిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం జానీవాకర్, బ్లాక్ లెబుల్, రెడ్ లెబుల్ లో లభిస్తుంది. బ్లాక్‌లెబుల్ ధర రూ.3,500, రెడ్‌లెబుల్ ధర రూ.1800, శివాస్ రిగల్ రూ.3,500 ధరతో లభిస్తోంది.

ఈ ధరలు అధికంగా ఉండడంతో మన మందుబాబులు వాటిని కొనేందుకు వెనుకంజ వేస్తున్నారు.

మల్టీ స్టారర్ చిత్రాలకు ప్రాణం పోస్తున్న వెంకి, పవన్?

మన సినీ గత చరిత్రలో మల్టీ స్టారర్ చిత్రాలు బోలెడు దర్సనమిస్తాయి. 80 వ దశకంలో ఐతే.. మల్టీ స్టారర్ చిత్రాలు రాజ్యమేలేయి అనడంలో సందేహం లేదు. ఎన్టిఆర్ నాగేశ్వర రావు, కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు వీరంతా స్టార్ లుగా వెలుగొందు తూనే కలసి పని చేయడానికి ముందుకు వచ్చేవారు. దర్శక నిర్మాతలు కూడా ఆతరహ చిత్రాలు నిర్మించేందుకు తాపత్రయ పడేవారు. అందుకు తగ్గ కధలు సిద్దం చేయమని వత్తిడీ తెచ్చేవారు. కానీ కాలం మారింది.. ఇప్పటి హీరోలు సినిమా అంతా తామే అని వ్యవహరిస్తుండటం.. అందుకు తగ్గట్లు అభిమానులూ వికృత చేష్టలు చేస్తుండటంతో చేయాలని ఉన్నా.. మల్టీ స్టారర్ చిత్రాలకు మనహిరోలు భయపడి దూరమై పోయారు. 1990 తరువాత మల్టీ స్టారర్ చిత్రాలు కరువవ్వడం తో..ఈ పరిస్తితి నుంచి బైట పడే సాహసానికి రెడీ అవుతున్నారు వెంకటేష్, పవన్ కళ్యాణ్ లు. వీరి కాంబినేషన్లో శ్రీకాంత్ అద్దాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు గతంలో వచ్చిన వార్తలు ఇప్పుడు వాస్తవ రూపం దాల్చనుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత అవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి