19, ఆగస్టు 2011, శుక్రవారం

తలపుల 'తెరలు' తీసే చిత్రాలు

బుజ్జిగాడి బర్త్‌డే నుండి.. బాలుగాడు ప్రైజ్‌ అందుకునే ఫంక్షన్‌ వరకు ఫోటోగ్రాఫర్‌, ఫ్లాష్‌ లైట్ల మెరుపుల హడావిడి అంతా ఇంతా కాదు. నిత్య జీవితంలో ఆనందాల జ్ఞాపకాలను అనునిత్యం మనకు గుర్తు చేసేవి ఫోటోలే...పెళ్లిళ్లు, పేరంటాలు, పుట్ట్టినరోజులు, పండగలు ఇలా ఏ కార్యక్రమం చేసినా... ఫోటోల వెల్లువ నేడు కామన్‌ అయిపోయింది.సాంకేతికాభివృధ్ధి ఫోటోగ్రఫీలోనూ చోటు చేసుకుని ఒకపðడు రోజుల తరబడి ఫోటో కోసం వేచి చూసే స్ధితి నుంచి క్షణాలలో కావాల్సిన సైజులో ఫోటో తీసుకునే డిజిటల్‌ ఫోటోగ్రఫీ అందుబాటులోకి వచ్చింది.

ఉదయం లేచింది మెదలు... రాత్రి నిద్ర పోయే వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఓ తరహాలో ఫోటోలపై ఆధారపడుతు న్నారనే చెప్పక తప్పదు. ఇపðడు సెల్‌ ఫోన్లలో కూడా కెమెరాలు ఇమిడి పోవటంతో దాదాపు ప్రతి ఇంట ఫోటోగ్రాఫర్‌ పుట్టుకొచ్చాడనటంలో సందేహం లేదు. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఫోటో మీదే జీవితం ఆధారపడి ఉందనటంలో అతిశయోక్తి లేదు. హృదయానికి హత్త్తుకునేలా చిత్రీకరించిన ఫోటోలు మనిషిపై ఎంతో ప్రభావం చూపిస్తాయన్నది వాస్తవం. చిరాకు గానో... మనసుకి కష్టం కలిగినపðడో పాత ఫోటోలు చూసుకుంటూ జ్ఞాపకాల దొంతరులను నెమరేసుకుంటే కొంత మేరైనా ఉపశమనం లభిస్తుంది. విశ్వవ్యాప్తంగా ఫోటోగ్రఫీ ప్రాధాన్యతని గుర్త్తించి గత 173 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఆగష్టు 19న ఃప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంః గా నిర్వహిస్తున్నారు.

ఇక ఫోటోగ్రఫీ అభివృద్ధితీరు తెన్నులు ఓ సారి పరిశీలిస్త్తే...

నేడు క్షణాల్లో కన్నువిందుచేసే ఫోటోల వెనుక ఐదు శతాబ్దాల చరిత్ర దాగి ఉంది.

1550 డే-సబ్టిలైటెట్‌ అనే భైతిక శాస్త్రవేత్త కాంతిని తగుఋజుమార్గంలో కటకాల మధ్య గుండా ప్రసరింపచేస్తే ప్రతిబింబాన్ని స్కేచ్‌ వేసి ఫోటోగ్రఫీకి ప్రాణ ప్రతిష్ట చేసాడు.

1568 డానియల్లో బార్బర్‌ కాంతిమార్గాన్ని నిర్ధేశిించేలా కటకాల మధ్య దూరం నెలకొల్పి.. ప్రతిబింబాల చిత్తరువులను లిఖించవచ్చని పేర్కొన్నాడు.

1646 కిర్చల్‌ అనే శాస్త్రవేత్త ఎన్నో ప్రయోగాల చేస్తూ కెమెరా రూపొందించేందుకు ప్రయత్నించాడు.

1657 కస్పర్‌ స్కాట్‌ లనే శాస్త్రజ్ఞుడు కిర్చల్‌ చూపిన బాటలోనే పయనిస్త్తూ అనేక పరిశోధనలు చేసారు.

1685 వర్బర్గ్‌కి చెందిన జాన్‌ ఝహ్నా రిఫ్లక్టర్‌ కెమేరాకు డిజైన్‌ చేసాడు.

1725 ఆల్డ్ర్‌ఫర్‌ యూనివర్శిటీలో పరిశోధకుడిగా పనిచేస్త్తున్న ఃజాన్‌ హెన్రీ స్కాజ్‌ః ఫోటో కెమిస్ట్రీ పేరుతో కాగితంపై వివిధ రసాయనాలను లేపనంగా పూసి చిత్రీకరించేందుకు ప్రయోగాలు చేసాడు.

1769 జార్జ్‌ బ్రాండర్‌ ఏకంగా ఃటేబుల్‌ః ఆకారంలో ఓ పెద్ద కెమేరాకు రూపకల్పన చేసాడు.

1822 ఃజాన్‌ హెన్రీః ఫోటో కెమిస్ట్రీని ఆధారంగా చేసుకుని కార్ల్‌ విలియమ్స్‌, జాన్‌సన్‌బ్రేర్‌, నైస్‌ఫోర్స్‌ నిప్సేల బృందం ప్రయాగాలను ప్రారంభించింది.

1826 ఫ్రెంచ్‌ పరిశోధకుడైన నైస్‌ఫోర్స్‌ నిప్సే పెట్రోలియం ఉత్పత్తులలో ఒకటయిన బిటు మేన్‌, జుడియాల కలయికతో కూడిన రసాయనాన్ని మెరుగు పెట్ట్టిన ఓ పళ్లెంపై పూసి తీసి ప్రయోగాలు చేస్తూ...1829లో మరో శాస్త్రవేత్తతో కల్సి చేసిన ప్రయోగాలు ఫలించి... ఓ రాగి ప్లేటుపై వెండి పూత పూసి... సున్నితమైన కాంతిని.. దానిపై ప్రసరింప చేసినపðడు కెమేరా ఎదురుగా ఉన్న వస్తువు ప్రతిబింబం ప్లేటుపై ముద్రించబడటాన్ని ఆవిష్కరించి.. తాను తీసిన ఫోటోని ప్రపంచానికి విడుదల చేసాడు. దీనినే తొలి ఫోటోగా... నైస్‌ఫోర్స్‌ నిప్సేని ఫోటోగ్రఫీ˜ీకి ఆద్యుడిగా చెపðకుంటారు...

1835 ఇంగ్ల్లాండ్‌కు చెందిన విలీయం హెన్రీ ఫాక్స టల్బర్డ్‌ తొలిసారిగా పేపర్‌పై నెగిటివ్‌ తయారు చేసారు.

1837 నిప్సే మనుష్యులని ఫోటో తీసేందుకు తాను చేస్తున్న ప్రయోగాలు ఫలిస్తున్నట్లు ప్రకటించాడు. కాగా లూయీస్‌ జాక్వాస్‌ మాండే డాగ్యూరీ తొలిసారిగా బైట ప్రపంచాన్ని... మనుష్యులని తన కెమెరాతో ఓ వీధిని తన కెమెరాలో బంధించి ఫోటోగ్రఫీ ప్రాముఖ్యతని ప్రపంచానికి చాటి చెప్పాడు. చీకటిగదిలో తను తీసిన ఫోటో ప్లేట్లను..సిల్వర్‌ నైట్రిక ఆసిడ్‌ని డిస్టలరీ నీటిలో కలిపి తయారు చేసిన రసాయనాన్ని పూత పూసిన కాగితంపైకి పాజిటవ్‌గా మార్చగలిగానని.. దీనిని ధయోసల్ఫేట్‌లో ముంచి ఉంచితే చిత్రానికి స్ధిరత్వం వచ్చినట్లు గుర్తించానని ఇందుకు ఓ బాక్సలో 117 డిగ్రీల వాలున ఉంచిక కటకాలపై నుంచి సన్నని కాంతి పుంజాన్ని పంపానని విశ్లేషించాడు.. దానికి ఃడగ్యూరీ టైపుఃగా నేటికీ పిలుస్తారు.,

1839 జనవరి 9న ఫ్రెంచ్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లో ఃడగ్యూరీః తన ప్రయోగాల సారాంశాలను.. వచ్చిన ఫలితాలను ప్రకటించగమే కాకుండా సింగిల్‌ లెన్స్‌తో కూడిన కెమేరా తయారీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు ప్రకటించారు. కొద్ది నెలల అనంతరం అదే ఏడాది ఆగష్టు 19న ఫ్రెంచ్‌ ప్రభుత్వం ఃడగ్యూరీః ప్రయోగాన్ని అధికారికంగా గుర్తించింది. అప్పటి నుంచే ఫోటోగ్రఫీలో ఆగష్టు 19కి ఎనలేని ప్రాధాన్యం ఇవ్వటం ప్రారంభమైందనే చెప్పక తప్పదు. డిశంబర్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన సర్‌ జాన్‌ హ్రెస్కల్‌ నెగిటివ్‌, పాజిటివ్‌ తయారీలో సిల్వర్‌ కార్బనేట్‌ ఉపయోగాలను వెల్లడించాడు.

1840 వియత్నాంలోని జోసఫ్‌ పట్జ్వేల్‌, పీటర్‌ వోగ్లాండర్‌లు రెండు లెన్సుల కెమేరాకు రూపకల్పన చేసారు.

1841 ఫిబ్రవరిలో టాల్బెల్‌ అనే శాస్త్రవేత్త తాను చేసిన ఫోటో ప్రయోగాల ఫలితాలను ఃటాల్బెల్‌ టైప్‌ఃగా పేర్కొంటు దానిపై పేటెంట్‌ హక్కుల్ని కూడా సొంతం చేసుకున్నాడు. టాల్బెట్‌ చూపిన దారిలో చేసిన ప్రయోగాలు బ్లాక Ê వైట్‌ ఫోటోగ్రఫీని కొత్త పుంతలు తొక్కించాయి.

1847 అబెల్‌ నైప్స్‌ అనే శాస్త్రవేత్త గాజుపై జల్లిక ఆసిడ్‌, హైపోలతో చేసిన ప్రయోగాలను విశ్లేషించినా.. అది కాలాహరణంగా పరిగణించారంతా..

మరోవైపు ఃటాల్బెల్‌ టైప్‌ఃగా ఉన్న పద్దతిపై మరిన్ని ప్రయోగాలు చేసిన ఇంగ్లాండ్‌కి చెందిన ఫెర్రిక స్కాట్‌ ఆర్డర్‌ ఃకొలోడిన్‌ః పద్దతి రూపొందించాడు. ఇందులో ఆయన ఃటాల్బెల్‌ టైప్‌ఃలో వినియోగిస్తున్న రసాయనాలకు తోడుగా ఫెర్రిక సలఫర్‌ని జతచేసి చిత్రీకరింప బడిన గ్లాస్‌ ప్లేట్లని 3 నుండి 25 సెకన్లపాటు నెగిటివ్‌ని తీసుకు రాగలిగినట్లు తెలిపారు. అంతే కాక లెదర్‌ కాగితంపై పాజిటివ్‌ని కూడా రూపొందించవచ్చని పేర్కొన్నారు.

1850 బ్లాంక్వర్ట్‌-ఎవర్డ్‌ ఃసిల్వర్‌ నైట్రేట్‌ఃని పూసిన కాగితంపై ఫోటో పాజిటివ్‌ రూపొందించడం 19వ శతాబ్ధంలో అత్యంత విజయంగా చెప్తారు.

1878 ఛార్లెస్‌ బెనెట్‌ అనే భౌతిక శాస్త్రవేత్త సిల్వర్‌ నైట్రేట్‌, కాడ్మియం బ్రోమైడ్‌ల కలయికతో కూడిన పేపర్‌ని రూపొందించి సెకనులో 22% సమయంలో కాంతిని గ్లాస్‌ ప్లేట్లపై నుండి ప్రసరింపచేసి ఃపాజిటివ్‌ః తీసుకువచ్చాడు.

1880 గ్లాస్‌ ప్లేట్ల స్ధానంలోకి డ్రై ప్లేట్లను అందించే ఏర్పాటుకు ప్రయోగాలు ప్రారంభమయ్యాయి.

1888లో న్యూయార్క్‌లోని జాన్‌ వెస్లీ హెట్‌ ఃసెల్యులాయిడ్‌ః మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీని ప్రారంభించి ప్రయోగాలకు శ్రీకారంచుట్టగా యుఎస్‌లో బ్రిటీష్‌ ఫోటోగ్రాఫర్‌ జాన్‌ కార్బెట్‌ ఫిల్థోపియా కేంద్రంగా డైప్లేట్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించాడు.

1888 ఏడాది ద్వితీయార్ధంలో జాన్‌ కార్బెట్‌ రూపొందించిన ఫిక్సిబుల్‌ నెగిటివ్‌ ఫిల్మ్‌ విజయవంతం అయ్యింది.

1888 న్యూయార్క్‌లోని పయనీర్‌ జార్జ్‌ ఈస్ట్‌మన్‌ కంపెనీ ఃకొడకః కెమేరాకి రూపకల్పన జరిగింది.

1889 సెప్టెంబర్‌లో న్యూయార్క్‌లోని భన్బిల్‌ గాడ్విన్‌ ట్రాన్పిరెంట్‌ రోల్‌ ఫిల్మ్‌ని రూపొందించి పేటెంట్‌ హక్కులు కూడా పొందటంతో ఈస్ట్‌మన్‌ కంపెనీ ఆయన్ని ఆహ్వానించి... రోల్‌ ఫిల్మ్‌ల తయారీపై ప్రయోగాలకు ఆసరాగా నిలచింది.

1902 జాన్‌ కార్బెట్‌ ప్రయోగాలు విజయవంతం కావటంతో కోడక రోల్‌ కంపెనీ రోల్‌ ఫిల్మ్‌ విడుదల చేసింది.

నాటి నుండి వివిధ కంపెనీలు ఫోటోగ్రఫీ రంగంలో అనేక కెమేరాలు రూపొందించాయి. తొలినాళ్లలో ఫిల్ముసైజ్‌ ప్రింట్‌ సైజు ఒకే స్ధాయిలో ఉండగా... అనతి కాలంలో వాటికి ధీటుగా 2బి, 120, 35, 24, 16 ఎంఎంల కెమేరాలు రంగంలోకి రావటంతో రోల్‌ ఫిల్మ్‌ వాడకం పెరిగి ఫోటోగ్రఫీ విస్తరణకు దోహదం చేసింది. బ్లాక Ê వైట్‌ ఫోటోగ్రఫీ పూర్తిస్ధాయిలో సక్సస్‌ అయ్యి అందరికీ ఫోటోగ్రఫీ అందుబాటులోకి వస్తున్న క్రమంలో కలర్‌ ఫోటోగ్రఫీపై ౖ ప్రయోగాలు ప్రారంభమై కొత్త అధ్యయనానికి తెరలేపాయి

కోడక డిజిటల్‌ కెమేరాలను రంగంలోకి తీసుకు రాగలిగింది. సింగిల్‌ లెన్స్‌ రిఫ్లక్స (ఎస్‌ఎల్‌ఆర్‌) కెమేరాల తరహాలోనే డిజిటల్‌ సింగిల్‌ లెన్స్‌ రిఫ్లక్స (డిఎస్‌ఎల్‌ ఆర్‌) కెమేరాలను రూపొందించబడ్డాయి. అనతి కాలంలోనే రింగ్‌ఫైండర్‌ కెమేరా, ట్విన్‌లెన్స్‌ రిఫ్లక్స కెమేరా, సింగిల్‌ లెన్స్‌ రిఫ్లక్స కెమేరా, డిజిటల్‌ సింగిల్‌ లెన్స్‌ రిఫ్లక్స కెమేరా, బొమ్మకెమేరా, వ్యూ కెమేరా, మువీ కెమేరా, వీడియో కెమేరాలు అందుబాటులోకి వచ్చాయి.

జిరాక్స...

డిజిటల్‌ ఫోటోగ్రఫీపై జరుగుతున్న ప్రయోగాల దిశలో 1952లో అప్పటికే వినియోగంలో ఉన్న వీడియో ప్లేయర్లలో కదులుతున్న బొమ్మల ఫ్రేమింగ్‌ని స్ధిరపరచి... ఫోటోగా మార్చడానికి ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలోనే 1957లో రసూల్‌ క్రిష్‌ రూపొందించిన ఃడ్రమ్‌స్కానర్‌ః ఆదరణ పొందింది. ఇదే టెక్నాలజీ ఉపయోగించి జిరాక్స మిషన్‌ రూపకల్పన జరిగింది. 19వ శతాబ్ధం ఫోటోగ్రఫీని కొత్త పుంతలు తొక్కించిందనే చెప్పాలి. ఈరంగంలో విశ్వవ్యాప్తంగా వచ్చిన సాంకేతిక మార్పులతో మరింత వేగం పుంజుకుని పొలరాయిడ్‌ కెమేరాలు దూసుకు వచ్చాయి. అయితే ఇది కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం కావటం... ఖర్చు కూడా ఎక్కువగా అవతుండటంతో పరిశోధనలు మిన్నంటి...తనదైన పంథాలో చివరకి నెగిటివ్‌ లేకుండా ఫోటో తీసే విధానం (డిజిటల్‌ ఫోటోగ్రఫీ) వచ్చింది.

కలర్‌ ఫోటోగ్రఫీ.....

బ్లాక అండ్‌ వైట్‌ ఫోటోగ్రఫీ అద్భుతంగా వెలుగొందుతున్న తరుణంలో 1861లో స్కాట్‌ లాండ్‌లో భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రంలలో నిష్ణాతుడిగా పేరున్న జేమ్స్‌ కార్ల్‌ మార్క్స్‌ ఫోటోగ్రఫీపై మక్కువతో అనేక ప్రయోగాలు చేసి తొలిసారిగా రంగుల్లో ఫోటో తీసే విధానాన్ని రూపొందించి ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. కలర్‌ ఫోటోగ్రఫీకి అద్యుడిగా ఈయన్నే పేర్కొంటారు. ఇంద్ర ధనస్సు రంగుల్లోని ఎరుపు, ఆకుపచ్చ, నీలంలను (ఆర్‌జిబి) తన ప్రయోగాలకు వాడుకుంటునే ద్వితీయంగా సిఎంవైకెలను ఉపయోగించాడు. ప్రత్యేకంగా రూపొందించిన ప్రొజక్టర్ల సాయంతో తెల్లని కాంతిని ప్రసరింప చేసి నెగిటివ్‌ తయారీ చేయవచ్చని నిరూపించాడు. 1873లో ఫోటో అమల్షన్‌ తయారు దారుడైన హెర్మన్‌ వోగెల్‌ ఃకలర్‌ కెమిస్ట్రీః పేరుతో రంగుల ఫోటోలపై అధ్యయనం చేసి విజయం సాధించాడు. 1892లో జాన్‌జూలీ కలర్‌ టచ్‌ సింగిల్‌ నెగిటివ్‌ని రూపొందించి ఃస్క్రీన్‌ ప్లేట్‌ః ప్రోసెసర్‌ని విడుదల చేసాడు. ఇందులో ఆయన అంతవరకు బ్లాక Ê వైట్‌ ఫోటోగ్రఫీలో వాడుతున్న ఎన్‌లా ర్జర్లుకు కలర్‌ ఫిల్మింగ్‌ (ఆర్‌జిబి)ని జత చేసి.. కలర్‌ ఫోటో ప్రింటింగ్‌ విధానం తీసుకొచ్చాడు. 1907లో ఃటమ్రీ బ్రదర్స్‌ః ఈ స్క్రీన్‌ ప్లేట్‌ విధానాన్ని కాస్త మారుస్తూ... లెడ్‌తో కూడిన ఆటో క్రోవెూ ప్లేట్స్‌ని విడుదల చేసారు.ఈ క్రమంలోనే లూయిస్‌ డక్యూస్‌ డు హర్న్‌ వీటిపై మరిన్ని ప్రయోగాలు చేసి సింగిల్‌ ఎక్పోజర్‌ లేయర్‌ ఫిల్మ్‌ని రూపొందించారు. దీనిని అనతి కాలంలోనే అంత వరకు బ్లాక Ê వైట్‌లో వాడుతున్న రోల్‌ ఫిల్మ్‌ తరహాలో 120 ఎంఎం కలర్‌ ఫిల్మ్‌ రోల్స్‌ని రూపొందించి.. 1936 నాటికి 35 ఎంఎం కెమేరా యుగం ప్రారంభం కావటంతో ఆదిశలో కలర్‌ ఫిల్మ్‌రోల్స్‌ ఉత్పత్తి జరిగింది.

డిజిటల్‌ ఫోటోగ్రఫీ ...

1951లో జాన్‌ మిలీనియర్‌ అనే ఎలక్ట్ట్రానిక్స ఇంజనీర్‌ వీడియో టేప్‌ రికార్డర్‌ (విటిఆర్‌) నుండి సంగ్రహించిన చిత్రాలను తిరిగి మేగ్నిటిక టైప్‌ పైనే నిక్షిప్తం చేయవచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించాడు. దీనికి తోడుగా 1956లో ఛార్లెస్‌ పి గిన్బెర్గ్‌ సైతం విటిఆర్‌ టెక్నాలజీని ఉపయోగిస్తూ... నిక్షిప్తమైన చిత్రాలను టెలివిజన్‌లో చూసేలా చేసిన ప్రక్రియ డిజిటల్‌ వైపు ఫోటోగ్రఫీని పరుగులు తీయించిందనే చెప్పాలి. 1960లో చంద్రమండలంలోకి నాసా ప్రయోగించిన రాకెట్‌ అక్కడ నుండి పంపిన సందేశాల ఆధారంగా కంప్యూటర్‌ సాయంతో ఫోటోలుగా మార్చడం జరిగిన పరిణామాలు డిజిటల్‌ ఫోటోగ్రఫీ మరింత వేగవంతమైంది. 1973లో యుఎస్‌ఏ, న్యూయార్క్‌లో ఎలక్ట్రానిక్స ఇంజనీర్‌గా పినచేస్త్తున్న బోక్లేన్‌ స్టీవెన్‌ జె సస్సన్‌ నేతృత్వంలో ఈస్ట్‌మన్‌ కోడక కంపెనీ ఛార్డ్‌ కపుల్డ్‌ డివైల్‌ (సిసిడి) సాయంతో ఫిల్మ్‌ లేకుండా ఫోటో తీసే పద్దతిని కనుగునేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఈ బృందం 1975లో 8 పౌండ్ల బరువుతో ఉన్న ఓ కెమేరాని రూపొందించింది. అయితే ఇది కేవలం 0.01 పిక్సిల్‌ అయినా యావత్‌ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలతో ముంచి మరిన్ని ప్రయోగాలకు ఉపయుక్తంగా మారింది. 1978లో తన డిజిటల్‌ కెమెరాపై పేటెంట్‌ హక్కులు పొందిన బోక్లేన్‌ స్టీవెన్‌ జెసస్సన్‌ డిజిటల్‌ విప్లవానికి నాంది పలికారనే చెప్పాలి. ఆపై కోడక కంపెనీ అనేక మంది శాస్త్రవేత్తలతో కూడి అనేక రకాల ప్రయోగాలు నిర్వహించి విజయవంతంగా డిజిటల్‌ కెమేరాతో తీసిన ఫోటోలు ఫ్లాపీలలో నిక్షిప్తం చేసేలా రూపొందించింది.

2010 నవంబర్‌ 17న అమెరికా అధ్యక్షుడు బరాక ఒబామా తన వైట్‌ హౌజ్‌లోని ఈస్ట్‌రూంలో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఫోటోగ్రఫీలో డిజిటల్‌ విప్లవానికి నాంది పలికి కెమేరాని రూపొందించిన బోక్లేన్‌ స్టీవెన్‌ జె సస్సన్‌కు ఃనేషనల్‌ మెడల్‌ ఆఫ్‌ టెక్నాలజీ Ê ఇన్విటేషన్‌ః అవార్డునిచ్చి సత్కరించడం ఓ విశేషం.


డిజిటల్‌ అందుబాటులోకి వచ్చాక ఫోటో క్వాలిటీని పెంచేలా మెగాపిక్స పరిధి కూడా పెరిగింది. చిన్నపాటి కంప్యూటర్‌ చిప్స్‌లో ఫోటోలు నిక్షిప్తం చేసే విధానం... చివరికి సెల్‌ ఫోన్లలోనూ కెమేరాలు వచ్చి ఫోటోగ్రఫీ గతినే మార్చేసాయి..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కెమెరాలను తయారు చేస్తున్న కంపెనీలు: హస్సన్‌బ్లేడ్‌, మామియా, మినోల్టా, యాషికా, నికాన్‌, కోనికా మినోల్టా, ఫ్యూజీ, మిచ్చిబిషీ, సోనీ, సామ్‌ సంగ్‌, పానసోనిక, కేనన్‌, కాషియో, కాన్టెక్ట, లైకా, ఆగ్ఫాఫోటో, ఇల్‌ఫర్డ్‌ ఫోటో, ఫ్యూజికా, పెన్‌టెక్స, బోలెక్స, హెచ్‌పి, లోవెూ, మినిక్స, వివిటార్‌, సిగ్మా కార్పొరేషన్‌, రీకో, రోలై, ప్రాక్టికా, జైస్‌, జెనిత్‌, మస్టిక సిస్టమ్స్‌, పోలరాయిడ్‌, లిన్‌ఫో, మినోక్స, అగ్లక్స, అషిఫ్లెక్స తదితరాల కంపెనీలు కెమెరాలను ప్రపంచానికి అందిస్తున్నాయి.

ప్రస్తుతం ఆధునిక ఫోటో ప్రపంచాన్ని డిజిటల్‌ టెక్నాలజీ ఎంతగా శాసిస్తున్నా... పలు కంపెనీలు అందిస్తున్న డిజిటల్‌ కెమెరాలు ఎన్ని వస్తున్నా... నెగిటివ్‌ ప్రాసెస్‌కు ధీటుగా వీటి క్వాలిటీ ఉండటం లేదన్నది నిపుణులు అభిప్రాయం. త్వరగా పనిపూర్తవుతోందని తప్ప ఫోటోగ్రఫీపై పూర్తిస్ధాయి అవగాహన డిజిటల్‌ ఫోటోగ్రఫీ వచ్చాక లేదనే చెప్పాలి. కనీసం లైటింగ్‌ విధానంపై పట్టు కూడా లేక పోవటం.. కనీసం ఫోటో తీసే యాంగిల్‌పై కూడా అవగాహన లేకుండానే నేడు ఫోటోగ్రఫీ విలవిలబోతోందన్నది నాటి తరం ఫోటోగ్రాఫర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎప్పటికపðడు కొత్త పుంతలు తొక్కుతూ దినదిన ప్రవర్ధమానం చెందిన ఫోటోగ్రఫీ నేడు నిత్య జీవనంలో భాగమైపోయింది. జర్నలిజంలో ఫోటోలలే ప్రధాన పాత్ర, సినీ ప్రపంచంలో టెక్నాలజీ ఎంత మారుతున్నా నేటికి చాలా విషయాలలో ఫోటోగ్రఫీనే ఆధారంగా చేసుకుంటున్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. టెలీస్కోప్‌ల సహాయంలో అంతరిక్షచిత్రాలను కూడా ఫోటోల రూపంలో మలచడంతో ఫోటోగ్రఫీకి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు మైక్రో ఫోటోగ్రఫీ (మూక్రో లెన్స్‌తో కీటకాలు, చిన్న చిన్న వస్తువులు, కంటికి కనించని బాక్టీరియాలను చిత్రీకరించడం) అందుబాటులోకి వచ్చాక వైద్యరంగంలోనూ మార్పులకు తోడ్పడిందనే చెప్పాలి.

ఇక మన భారతదేశంలో అంతర్జాతీయ ఛాయాచిత్రకారుల కౌన్సిల్‌ చేసిన పలు తీర్మానాలకు అనుగుణంగా 1991 ఆగష్టు 19 నుండి ఫోటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. మన రాష్ట్రంలోనూ ఫోటోగ్రఫీడే సందర్భంగా వివిధ అంశాలపై పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జర్నలిస్ట్‌ అసోషియేషన్‌ తమ పోటీలను ఫోటో జర్న లిజం చేసే వారికి మాత్రమే పరిమితం చేయగా.. సమాచారం పౌరసం బంధాల శాఖ ప్రభుత్వ కార్యక్రమాలపై ఫోటోగ్రాఫర్లు తీసిన ఫోటోలను వివిధ విభాగాలలో పోటీ నిమిత్తం ఆహ్వానిస్తూ... ఔత్సాహికులను ప్రోత్సహిస్తోంది. ఏదిఎమైనా 64 కళల్లో ఒక్కటిగా ఛాయాచిత్రకళ నేటి తరాన్ని అలరిస్తోన్నది.

జీవితాలను శాసిస్తున్న స్మార్ట్‌ ఫోన్లు

గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ ఫోన్ల వాడకం ఎంత పెరుగుతోందో... దానికి మించి స్మార్ట్‌ ఫోన్లని హ్యాకింగ్‌, ఇతర భద్రతల పట్ల వస్త్తున్న ఆందోళనలూ పెరుగుతున్నాయి. అయితే ఈ తరహా ఆందోళనలు అవసరం లేదని, ఐ ఫోన్లని తొలిసారిగా కొనేవారిలో ఈ ఆందోళన ఎక్కువగా ఉన్నట్లు తాము గుర్తించినట్లు ఫ్ల్లోరిడా యూనివర్శిటీ డైరక్టర్‌గా వ్యవహరిస్తున్న లిసా మెర్లో చెప్పారు.

స్మార్ట్‌ ఫోన్లలోని వివిధ ఫీచర్లు ఆకర్షణీయంగా ఉండి వినియోగదారులను తమ వైపుకు తిపðకుంటున్నాయనటంలో సందేహంలేదు. టీనేజర్లలో ప్రేమ సందేశాలతో సహా పలు రకాల సంక్షిప్త సమాచారం అందించడంలో స్మార్ట్‌ ఫోన్లు ముందున్నాయని... పార్టీలు జరుగుతున్నపðడు మైకుల లో వచ్చే పాటల హౌరులోనూ వీటిలో వచ్చే సంగీతంపైనె ఎక్కువ మంది మక్కువ చూపించడం గమనించినట్ల్లు ఆమె వెల్లడించారు. అంతలా వీరు స్మార్ట్‌ ఫోన్లతో అనుబంధాన్ని పెనవేసుకున్నారనటాకి ఇది ఓ ఉదాహరణ మాత్రమేనని చెప్పారు.

ఇక సెల్‌ ఫోన్లు-టీనేజర్ల అనుబంధంపై పరిశోధనలు చేసి ఇంటెల్‌ సైన్స్‌ సెంటర్‌లో 75 వేల డాలర్లు కైవసం చేసుకున్న న్యూయార్క్‌లోని లాంగ్‌ ఐలాండ్‌కి చెందిన మైఖేల్‌ హాకమెేన్‌ మాట్లాడుతూ ధనిక కుటుంబాలకే ఇన్నాళ్లు పరిమితమైన ఫోన్లు విస్తృతం చెందాయని... అనేక రూపాలలో లక్షలాది మంది విద్య్యార్ధులు స్మార్ట్‌ ఫోన్లని వినియోగిస్తున్నారని... ముఖ్యంగా లెక్చరర్లు పాఠాలు చెప్పేటపðడు వాటిని మరోమారు వినాలనుకునేవారు రికార్డు చేసుకుంటున్న ఘటనలు కూడా తాను చూసినట్లు చెప్పారు. హైస్కూల్‌ విద్యార్ధులలోనూ ఫోన్ల వాడకం పెరుగుతోందని.. వారి అవసరాలు గుర్తించి పెద్దలూ ప్రోత్సహిస్తున్నారని తన పరిశోధనలో తేలినట్లు చెప్పారామె.

అయితే స్మార్ట్‌ ఫోన్లతో ఎన్ని మంచి పనులు చేయచ్చో... అన్ని దుష్పరిణామాలున్నాయని చెప్తున్నారు యూఎస్‌కి చెందిన మానసిక వైద్య నిపుణులు, స్లీప్‌ స్పెషలిస్ట్‌ అయిన మైఖేల్‌ బ్యూర్స్‌. ప్రీ రిసెర్స్‌ సెంటర్‌ చేసిన సర్వే ప్రకారం యూఎస్‌లో 35 శాతం మందికి పైగా ప్రజలు స్మార్ట్‌ ఫోన్లని వినియోగిస్తున్నారని.. వీరిలో ఫోన్లని తాము నిద్రపోయేపðడు పక్కలో పెట్టుకోవటం వల్ల అనేక రకాల రుగ్మతలకు లోనవుతున్నారని ఆయన చెప్పారు. రాత్రి వేళ అదే పనిగా స్మార్ట్‌ ఫోన్లలో మెయిల్స్‌ చెక చేసుకోవటం, ఛాటింగ్‌ చేయటం వల్ల నిద్ర కరువవుతోందని దీంతో ఆ ప్రభావం మెదడుపై పడి జ్ఞాపక శక్తి తగ్గుతున్నట్లు గుర్తించామని వెల్లడించారు.

నగదు భారీ చెల్ల్లింపుల సంగతి కన్నా పిల్లల్లో చెడ ప్రవర్తనకి స్మార్ట్‌ ఫోన్లు కారణమవుతున్నాయని వాషింగ్టన్‌ డిసిలో పనిచేస్తున్న టోనియా జంపిరియా ఆవేదన వ్యక్తం చేసింది. నా మేనకోడలుకి నే కొనిచ్చిన ఫోన్‌ని ఈ మధ్య పరిశీలిస్తే దాని నింపుగా బేతు వీడియోలు, అశ్లీల సమాచారాలు ఉన్నాయి. అసలు టీనేజర్ల ఫోన్‌ల విషయంలో సెన్సారింగ్‌ ఉండేలా ఉంటే మంచిదని అభిప్రాయపడ్డారు.

మరోవైపు స్మార్ట్‌ ఫోన్లలోని ఫీచర్లు నచ్చి దాని ఆకర్షణలో పడ్డ్డాక .. అందుకు వేలల్లో ఖర్చు చేస్తున్న సందర్భాలూ లేక పోలేదని యూఎస్‌లోని జెడి పవర్‌ అసోసియేట్స్‌ ప్రతినిధులు చెప్తున్నారు. అమెరికాలో స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారుడు ప్రతి ఒక్కరూ సగటున 107 డాలర్లు డేటా కోసవెూ... ఇతరత్రానో ఈ ఫోన్లపై ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇదే విషయంపై ఓ హియోలో ప్రొఫషల్‌ మార్కెటింగ్‌ నిష్ణాతుడైన క్రిస్టన్‌ విల్సన్‌ మాట్లాడుతూ... కేవల తాను మెయిల్స్‌ని మెబైల్‌లో చెక చేసుకుంటానని... ఇతర వాణిజ్య కార్యకలాపాలకు చెందిన ఫోన్లు కోసం నిరంతరం ఫోన్‌లో అవసరం ఉంటుంది. దాదాపు వినోద సాధనం కూడా నాకు ఈ ఫోనే... ఇందుకు ప్రతి నెల ఖర్చు కూడా భారీగానే ఉంటుందని చెప్పాడు

మెబైల్‌ వాణిజ్య వేత్తలు కూడా వీటిని ధృవీకరిస్తూ... ఏటా వెబ్‌సైట్లు, మెబైల్స్‌లలో వివిధ రకాలు అప్లికేషన్ల మార్పులు, చేర్పులపై తాము ఏటా 6 బిలియన్‌ డాలర్ల వ్యాపారం చేస్తున్నామన్నారు.

- ఎం రాంగోపాల్‌

16, ఆగస్టు 2011, మంగళవారం

కుంభకోణాల జాతర!

కల్పనాథ్‌ ఆధ్వర్యంలో చక్కెర కుంభకోణం ఆనాడు పార్లమెంటు ను కుదిపివేసింది. అప్పుడు ప్రభు త్వం తీసుకున్న అస్తవ్యస్త చర్యలు అవినీతి ఫలితంగా ప్రజలపై భారం 3వేల కోట్లకుపైగా పడింది. స్వేచ్ఛా విపణిలో చక్కెర ధర కేజీ రూ.11ల నుంచి రూ.17లకు పెరగడంవల్ల చౌక ధరల దుకాణాలలో సరఫరా చేసే చక్కెర ధర కేజీ రూ. 1.75పైసలు పెంచడం వల్ల చక్కెర ధర 66 శాతం పెరిగింది. చివరకు కేంద్ర పౌరసరఫరాల శాఖమంత్రి ఎ.కె ఆంటోని, చక్కెర కుంభకోణంలో ప్రధాన పాత్ర వహించిన కల్పనాథ్‌ మంత్రి పదవులకు రాజీనామాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. మరొక ముఖ్యమైంది హవాలా కుంభకోణం. హవాలా అంటే విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించిన అనధికార లేదా అక్రమ లావాదేవీల ప్రక్రియను హవాలా అని పేరు. అంతేకాక హవాలా అంటే అప్పగింత అని కూడా అర్థం. అంతర్జాతీయ స్థాయిలో సాగే అక్రమ లావాదేవీలకు హవాలా ఒక ముఖ్యమైన యంత్రాం గంగా వ్యవహరించింది. రకరకాల తప్పుడు మార్గాల్లో ఈ సొమ్మును అటు ఇటు చేరవేయడంలోనూ, హవాలా నిర్వాహకు లు నిర్వహిస్తారు. వీరు ఇండియాలోనూ, విదేశాల్లోనూ బినామీ ఖాతాలు ప్రారంభించి నల్లడబ్బును ఈ ఖాతాల ద్వారా బదలాయిస్తారు. విదేశాలలో విలాసాలు జరపాలనుకునే వారు. విలువైన వస్తువులు పొందగలిగేవారు. అంతర్జాతీయంగా అక్రమ వ్యాపారాలు చేసే వారు హవాలాను ఆశ్రయిస్తారు. గతంలో ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ రెగ్యులేషన్‌ యాక్టు ద్వారా విదేశీ మారకం కావలసిన వారు అందుకు సంబంధించిన వివరాలను అధికారులకు తెలియజేసి కొన్ని పరిమితులకు లోబడి డాలర్లు తీసుకునే వీలయ్యేది. ఇటీవల కాలంలో మన్మోహన్‌ ఆర్థిక విధానాల వలన ఈ చట్టం రద్దు అయింది. సరళీకరణ ఆర్థిక విధానాల వలన, విదేశీ కంపెనీలు యదేచ్ఛగా ప్రవేశం కల్పించడంలో హవాలా లావాదేవీలు కొనసాగుతున్నాయి. లక్షల కోట్ల నల్లధనం విదేశీ బ్యాంకులలో మూలుగుతున్నది. హవాలా కుంభకోణం ప్రక్రియలో పి.వి. నరసింహారావు, యస్‌కె జైన్‌, ఆరిష్‌ మహ్మద్‌ఖాన్‌, మదన్‌లాల్‌ ఖురానా, కె.కె. ధావన్‌, మాధవరారు సింధియాలకు సంబంధము ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ఇక యుపిఏ 1, 2 ప్రభుత్వాల హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాలు దేశాన్ని కుదిపివేసినవి. 2జీస్పెక్ట్రమ్‌ కుంభకోణం 1లక్ష 76వేల కోట్ల రూపాయలు. చివరకు మంత్రి డి. రాజా, ఎంపీ కనిమొళి కటకటాల వెనుక ఊచలు లెక్కపెడుతున్నారు. కామన్‌వెల్త్‌ క్రీడల కుంభకోణంలో, స్టేడియం నిర్మాణం, మరమ్మత్తులు, క్రీడలు మౌలిక సదుపాయాల ఏర్పాట్లు, క్రీడలకు అవసరమైన సామాగ్రి కొనుగోలునించి అన్ని వ్యవహరాలలోనూ అధికార యంత్రాంగం అంతులేని అవినీతి చేసిందనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నవి. క్రీడల కమిటీ చైర్మన్‌ సురేష్‌ కల్మాడిని కాంగ్రెస్‌ పార్లమెంటరీ కార్యదర్శి పదవి నుంచి తొలగించి చేతులు దులుపుకున్నారు. ఈ కుంభకోణంలో వేల కోట్ల నష్టం జరిగిందని తేలింది. మహారాష్ట్రలో బయటపడిన అతిపెద్ద కుంభకోణం ఆదర్శసొసైటీ. చివరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోకచేవాన్‌ పదవి నుండి వైదొలగిన పరిస్థితికి దారితీసింది. యుద్ధంలో మరణించిన వీర జవానుల భార్యా, పిల్లలకు చెందాల్సిన ప్లాట్లను కూడా వదలలేదు. ముంబాయిలోని విలాసవంతమైన కోలాబో ప్రాంతంలో 31 అంతస్థులను నిర్మించారు. 103 మీటర్లు ఎత్తు, 103 ప్టాట్లలో ఒక్క ప్లాటు కూడా యుద్ధ వీరుల భార్యలకు, పిల్లలకు కేటాయించలేదు. ఈ ప్లాటులన్నింటినీ ఉన్నతస్థాయి అధికారులు, రాజకీయ నాయకులు పంచుకొని మార్కెట్‌ ధరకు ఒక్కొక్క ఫ్లాట్‌ రూ. 10 కోట్లు ఉన్న వాటిని రూ. 80 లక్షలకు విక్రయించడం జరిగింది. ఇందులో కాంగ్రెస్‌ మాజీ మంత్రులు, ముఖ్యమంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఉన్నతాధికారులు ఉన్నారు. సత్యం కంప్యూటర్స్‌లో వేలాది కోట్ల రూపాయల అవినీతి లావాదేవీలు ప్రపంచ దేశాలలో ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయే విధంగా కుదిపేసిన అతి పెద్ద కుంభకోణం. ఈ కుంభకోణంలో ప్రభుత్వ భూములు, అక్రమ సంపాదనలు, బంధువుల పేర్లపై ఉన్న ఆస్తుల వివరములు పరిశీలిస్తే అంతర్జాతీయ అవినీతి ఈ విధంగా ఉన్నది అనేది సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణం ద్వారా తెలిసింది. వై.యస్‌. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అల్లుడైన అనిల్‌ కుమార్‌కు ఖమ్మం జిల్లాలో 1లక్ష 20వేల ఎకరాలు గనుల భూములు కట్టిపెట్టడం ప్రజలందరికీ తెలిసిన విషయం.

కె.జి గ్యాస్‌ భారీ కుంభకోణం చాలా ప్రముఖమైంది. కృష్ణా, గోదావరి బేసిన్‌ నుండి వెలువడే గ్యాస్‌ను కేంద్ర ప్రభుత్వానికి రిలయన్స్‌ ఇండిస్తీస్‌కు మధ్య పంపిణీ ఒప్పందానికి సంబంధించినది. రిలయన్స్‌ సంస్థ మొదట 2.4 బిలియన్‌ డాలర్ల అభివృద్ధి ఖర్చు చూపించి తర్వాత 8.5 బిలియన్‌ డాలర్లకు పెంచి చూపేందుకు ఎందుకు అనుమతించారని కాగ్‌ ముసాయిదా నివేదిక ప్రశ్నించింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో సుమారు 45000 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసారు. రిలయన్స్‌వారు, పెట్రోలియం శాఖ అధికారులు కుమ్మక్కైనారని కాగ్‌ నివేదిక తెలిపింది.

అత్యున్నత నైతిక విలువల కోసం ఉన్నామని చెప్పుకుంటున్న బిజెపి బండారం కూడా బయటపడింది. అవినీతి అంశాన్ని గత ఎన్నికలలో ప్రధాన అంశంగా ప్రచారం చేసిన బిజెపి నాయకులు అద్వానిపైన అప్పటి బీహర్‌ శాసనసభా పక్ష నాయకుడు యశ్వంత్‌ సిన్హాపైన చార్జీషీటు దాఖలు కావడంతో బిజెపి బండారం బయటపడింది. కానీ ముడపులు ముట్టిన వారిలో మదన్‌లాల్‌ ఖురానా, యల్‌.కె. అద్వానీ ఉన్నారనేది వాస్తవం. కర్నాటకలో బిజెపి ముఖ్యమంత్రి యెడ్డ్యూరప్పలు అవినీతి కుంభకోణాలలో చిక్కుకుని అవినీతిలో కూరుకుపోయిన సంగతి వేల కోట్లు అవినీతి చేశాడని బంధుప్రీతి, అడ్డగోలు నిర్ణయాలు చేశాడని, గనుల మాఫియాకు, సంబంధిత తదితర అంశాలపై సాక్షాత్తూ లోకాయుక్త సంతోష్‌ హెగ్డే, ఆ రాష్ట్ర గవర్నర్‌ భరద్వాజ్‌ హెచ్చరికలు మనందరికి తెలిసినవే. చివరకు అప్ప వైదొలగినా తనమనిషినే సిఎం చేశారు.

ఇక నల్లడబ్బు సంగతి పరిశీలిస్తే దేశంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో భరించలేని స్థాయికి చేరుకున్నదనేది వాస్తవం. మనదేశం నుండి అక్రమంగా తరలించబడిన సొమ్ము 20లక్షల కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా. 1990-2010 సం్ప్పల మధ్య దేశం నుండి అక్రమంగా నిధులు తరలిపోవడం అధికమయిందని ఒక అధ్యయన సంస్థ పేర్కొంది. ఇతర దేశాలలో ఎవరి పేరున ఎంతెంత ఉన్నది అనే వివరాలు చెప్పడానికి మన్మోహన్‌సింగ్‌ సర్కారు ముందుకు రాకపోవడం నల్ల డబ్బు లాబీలు ఎంత బలంగా ఉందో అర్థమౌతోంది. 1966లో మొట్టమొదటగా లోకపాేల్‌ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అప్పటి నుండి అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పటిష్టమైన, స్వతంత్రమైన లోకపాేల్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడాన్ని దాటవేస్తూ వచ్చారు. వి.పి.సింగ్‌ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో వామపక్షాల కోరికను అనుసరించి 1989 సంవత్సరంలో లోకపాేల్‌ బిల్లులో ప్రధానిని చేర్చడానికి అంగీకరించారు. 2009లో స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్న ప్రణబ్‌ కూడా ప్రధానిని చేర్చారు. కానీ ఇప్పుడు ప్రధానిని చేర్చడానికి వీలులేదని మన్మోహన్‌ సర్కారు తటపటాయిస్తుంది. అత్యంత నీతి నిజాయితీగా ఉన్న మన్మోహన్‌సింగ్‌ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు.

సుప్రీంకోర్టు, తదితర జడ్జీల బంధుప్రీతి, అవినీతి కార్యకలాపాలు అరికట్టడానికి నేషనల్‌ జ్యూడీషియల్‌ కమిటీని ఏర్పాటు చేయలేని చేతగాని ప్రభుత్వంగా ఉంది. న్యాయమూర్తులు కూడా జవాబుదారీ తనం ఉండవలసి ఉంది. పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ఎన్నికలలో పోటీ చేసేటప్పుడు ఆస్తుల వివరాలతో అఫిడవిట్‌లు ఇస్తున్నారు. వీరందరికీ ఎన్నికలలో కోట్లాది రూపాయలు ఎక్కడ నుండి వస్తున్నవనేది నిశితంగా విచారణ చేయడం లేదు. అంతేకాక తప్పుడు సమాచారంతో ఇచ్చిన అఫిడవిట్‌ దారులపై ఎందుకు విచారణ చేయడం లేదు. అఫిడవిట్‌లు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయంటే ఉదాహరణకు:- మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య గారి పేరున ఒక్క కారు కూడా లేదని అఫిడవిట్‌లో యిచ్చారు. కె. రోశయ్యగారు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి వివిధ స్థాయిలలో మంత్రి పదవులు చేసి, ముఖ్యమంత్రి చేసిన ఆయనకు కారు కూడా లేదంటే ప్రజలు నమ్మగలరా ఆఫిడవిట్‌లు దాఖలు చేసిన వారి బంధువుల ఆస్తులు, బినామీ ఆస్తులను ఎంక్వైయిరీ చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది. కనుక లోకపాేల్‌ బిల్లు అత్యంత అవసరం అనేది దేశప్రజల ముందు చర్చ జరుగుతోంది. తప్పని సరిగా లోకపాేల్‌ బిల్లులో ప్రధానిని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులను చేర్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.

ప్రస్తుత విధానాల వలన అవినీతి పెచ్చుపెరిగి విలయతాండవమాడుతోంది. ప్రజాధనం ఇంత పెద్ద వెూతాదులో లూటీ కావడాన్ని అడ్డుకోవలసి ఉంది. ప్రతిఘటించవలసి యున్నది. సరళీకరణ విధానాలు, ప్రైవేటీకరణ అవకతవకలకు, అవినీతికి అవకాశాలు విపరీతంగా పెంచింది. అవినీతి అరికట్టాలంటే లోకపాేల్‌ బిల్లు వచ్చినంత మాత్రాన పోతుందని కాదు. ప్రైవేటీకరణ, సరళీకకరణ తగ్గించడం ద్వారానో, ప్రభుత్వ రంగ సంస్థలను పటిష్టపర్చడం ద్వారానో ఎన్నికల ఖర్చు, అవినీతి తగ్గాలంటే దామాషా పద్ధతి మీద ఎన్నికలు జరపడమే మేలు. కాబట్టి లోకపాేల్‌ బిల్లు తేవడంలోనూ, అవినీతి, నల్లడబ్బు అరికట్టడంలో, రాజకీయ నాయకులు, బడా కార్పొరేట్‌ సంస్థలు అవకతవకలు, నేరాల మీద పెద్ద ఎత్తున ప్రజానీకం, వివిధ వర్గాల ప్రజలు వివిధ వర్గాల సంస్థలు, రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో కదలాలి. నిరంతరం ఉద్యమం చేయాలి. పాలకుల మెడలు వంచి ప్రజాభిప్రాయానికి దిగి వచ్చే విధంగా ప్రజాచైతన్యంతో పోరాడాలి.

- రాజగోపాల్‌

ఎక్సర్‌సైజే....క్యాన్సర్‌ రోగులకు వరం

కేన్సర్‌తో బాధపడుతూ వైద్య చికిత్సల అనంతరం ఆసుపత్రుల చుట్టూ తిరిగేవారికి ఒక సూచన. ఆసుపత్రులకు వెళ్లడం కంటే ముం దుగా వారానికి రెండున్నర గంటలు వ్యాయామం చేస్తే చాలంటు న్నారు మెక్‌మిలాన్‌ కేన్సర్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు. ఇదే వారి పాలిట మంచి ఔషధమని సలహా ఇస్తున్నారు.
శస్త్రచికిత్స తరువాత అంతటితో ఆగకుండా ఎక్సర్‌సైజ్‌ చేయడం మంచిదని సంస్థ చెబుతోంది. ఎక్సర్‌సైజ్‌వల్ల ఇబ్బందులు తొలగిపోవ డ మ కాక శస్త్రచికిత్స అనంతరం వచ్చే శారీరకరుగ్మతలను రాకుండా చేస్తుంది. ఆరోగ్యశాఖ కూడా మెక్‌మిలాన్‌ చెప్పిన విధంగా చేయడం మంచిదని చెబుతోంది. ఈ నివేదిక ఆధారంగా లండన్‌లోని 20 లక్షల మంది రోగులను వ్యాయామం చేయించారు. ఈ పద్ధతిని పాటించ డంవల్ల మంచిదేనని ఆరోగ్యశాఖ క్యాన్సర్‌ రోగులకు మార్గదర్శకాల ను సూచించడం జరిగింది. ఈ ఫలితాలను కాలేజి ఆఫ్‌ స్పోర్ట్స్‌ మెడిసిన్‌ అమెరికన్‌ వారు కూడా ఈ పరిశోధనను బలపరిచారు. చాలా మంది ప్రజలకు ఈ విధానం ఆరోగ్యంపై ఎటువంటి చెడు ప్రభావం పడకుండా కాపాడగలిగింది. క్యాన్సర్‌ ద్వారా వచ్చే ఇతర రోగాలబారీ నుంచి కూడా కాపాడుకోవచ్చు. అంతేగాక ఎక్సర్‌సైజ్‌ చేయడం వల్ల రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న 40 శాతం మంది త్వరితగతిన 30 శాతం వ్యాధి బారినుండి బయటపడ్డారు. వారానికి ఆరు గంటల వ్యాయామం చేయడం ద్వారా ఎముకల క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులు వ్యాధి తీవ్రత వల్ల చనిపోయే స్థితి నుంచి బయటపడినట్లు తేలింది.
చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మెక్‌మిలాన్‌ క్యాన్సర్‌ సెంటర్‌ సైరన్‌ డేవనే మాట్లా డుతూ అవసాన దశలో ఉన్న క్యాన్సర్‌ రోగులు త్వరలో ప్రమాదం నుంచి బయటపడినట్లు చెప్పారు. దీంతో క్యాన్సర్‌ రోగులు సంభ్రమా శ్చ్య ర్యాలకు గురైనట్లు చెప్పారు. ఎటువంటి వైద్యసేవలు అవసరం లేకుండా శాశ్వతంగా ఆరోగ్యాన్ని పొందేందుకు ఇటువంటి వ్యాయామం తోడ్పడటంతో వారి ఆనందానికి హద్దుల్లేవు. ప్రత్యేక మైనటువంటి వ్యాయామమే చేయాలని నిబంధనలేమీ లేవు. తోటపని, నడవడం, ఈత కొట్టడం వంటివి కూడా ఇలాంటి వ్యాయామం కిందకే వస్తాయి. నేను నావద్దకు వచ్చే రోగులకు నీకు రోగం లేదనుకొని ఇంతకుముందు ఎలా ఉన్నావో అలాగే ఉండాలని సూచిస్తానని క్లినికల్‌ ఆంకాలజి మెక్‌మిలాన్‌ సెంటర్‌ మెడికల్‌ అధికారి జానెమహర్‌ తెలిపారు.
అయితే ప్రతి ఒక్కరు ప్రాథమికంగా ఎక్సర్‌సైజ్‌ చేయడమే ఒక మంచి మందుగా క్యాన్సర్‌ రోగులు భావించాలని చెప్పారు. క్యాన్సర్‌ చికిత్స అనంతరం వచ్చే ఇతర రోగాలనుంచి బయటపడాలంటే ఒక మంచి ఆలోచనే ఎక్సర్‌సైజ్‌ అని మార్టిన్‌ లెడ్‌విక్‌ తెలిపారు. కనుక క్యాన్సర్‌ రోగులు నూతన వ్యాయామ పద్ధతులను చేసి చూడండి మరి.

నగరం నిద్రపోతున్న వేళ సెన్సార్ బి(క)ట్స్

గురుదేవ క్రియేషన్స్‌ (ప్రై) లిమిటెడ్‌ పతాకాన నంది శ్రీహరి నిర్మించిన చిత్రం 'నగరం నిద్రపోతున్న వేళ'. జగపతిబాబు, చార్మి, చంద్రమోహన్‌, ఆహుతి ప్రసాద్‌, బాబూమోహన్‌, శివారెడ్డి ముఖ్యపాత్రధారులు. లక్ష్మీ నరసింహం ఛాయాగ్రహణాన్ని, యశోకృష్ణ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే దర్శకత్వం ప్రేమ్‌రాజ్‌ సమకూర్చారు.
అయిదుగురు సభ్యులతో కూడిన ఇసి ఈ చిత్రాన్ని చూసి .......... కట్స్‌తో 22-6-11న 'యుఎ' సర్టిఫికెట్‌ జారీ చేసింది.
మూడు నాలుగు రీళ్ళలో :
1) బాటిల్‌ మీద 'బ్రేజర్‌' అని వున్న లేబుల్‌ తొలగించమన్నారు.
2) వ్యభిచరిస్తున్నట్టుగా హిజ్రాలను చూపే దృశ్యాలు. ఆ దృశ్యాల్లో వచ్చిన డైలాగ్స్‌ తొలగించారు.
3) మింట్‌ రెస్టారెంట్లో డ్రగ్స్‌ వాడకం, లిప్‌లాక్‌ (పెదవితో పెదవి కలిపి ముద్దాడు) దృశ్యాలను ఫ్లాష్‌లా చూపమన్నారు.
4) అయిదు ఆరు రీళ్ళలో ఛానెల్‌ ఎండిని ఉద్దేశించి 'కొజ్జావాడు' అని జగపతిబాబు అన్న మాటని తొలగించారు.
5) ఏడు ఎనిమిది రీళ్ళలో ఎన్నికల్లో గెలుపుకి సంబంధించి బాబూ మోహన్‌, ఎంఎల్‌ఎ, హిజ్రాల మధ్య వచ్చిన సంభాషణ కత్తెర పాలయింది.
ఎనిమిది తొమ్మిది రీళ్ళలో :
6) ఎ. రెడ్‌ డ్రెస్‌లో ఐటమ్‌ డ్యాన్సర్‌ యొక్క క్లీవేజ్‌ ఎక్స్‌పోజర్‌ తొలగించారు.
బి. ఇదే డ్యాన్స్‌లో ఐటమ్‌సాంగ్‌ చేసే డ్యాన్సర్‌ బొడ్డుకు సంబంధించిన దృశ్యం, కెమెరాను పై నుంచి జూమ్‌ చేయడం, డ్యాన్సర్‌ పిరుదలకు దగ్గరగా పురుషుల ముఖాలు ఉంచటం వంటి దృశ్యాలను తొలగించారు.
7) పదకొండు పన్నెండు రీళ్ళలో ప్రజలతో కలసి ఛార్మి ట్రాన్స్‌పోర్ట్‌ మినిస్టర్‌ని చంపే దృశ్యాన్ని ఫ్లాష్‌లా చూపమన్నారు.
8. సినిమాలో ఎక్కడ 'ట్రాన్స్‌పోర్ట్‌ మినిస్టర్‌' అని వచ్చినా ''ట్రాన్స్‌పోర్ట్‌ '' పదాన్ని తొలగించమన్నారు.
9. సినిమాలో 'రెడ్డి' అనే పదం ఎక్కడ వచ్చినా అది తొలగింపుకు గురి అయింది.
3800.95 మీటర్ల నిడివిగల 'నగరం నిద్రపోతున్న వేళ' చిత్రం 24-6-11న విడదలైంది.

క్రోనికేపిటలిజంకు 'నవ'యుగ పడగ

ఆంధ్రప్రదేశ్‌లో క్రోనికేపిటలిజంకు ఉదాహరణగా నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీని పేర్కోవచ్చు. ఈ సంస్థ 1987--88లో 20 లక్షల ఆస్తులను చూపింది. 1999-2000 నాటికి దీని ఆస్తుల విలువ 26.50 కోట్లకు చేరుకున్నాయి. 2004-05 నాటికి 167 కోట్ల విలువైన ఆస్తులు నమోదయ్యాయి. గతేడేళ్ళలో ఇవి 1140 కోట్లకు చేరుకున్నాయి. ఇదికాక రాష్ట్ర తీరంలో అత్యంత కీలకమైన గంగవరం, కృష్ణపట్నం పోర్టుల్ని ఇదే సంస్థ కైవసం చేసుకుంది. ఈ పోర్టుల నిర్మాణం పేరిట 7 వేల ఎకరాల భూముల్ని ప్రభుత్వం నుంచి పొందింది. తాజాగా ఇదే సంస్థకు మచిలీపట్నం పోర్టు అప్పగించి 15 వేల ఎకరాల్ని దఖలుచేయాలంటూ కృష్ణాజిల్లా ప్రజాప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ తీరప్రాంత భూముల విలువ వేలకోట్లలో ఉంటుంది. 2002లో 1.80 కిలోమీటర్ల పొడవైన యానాం.. ఎదుర్లంక వంతెన నిర్మాణాన్ని చేపట్టిన ఈ సంస్థ ఆర్ధిక లేమితో సతమతమైంది. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అడ్వాన్స్‌లిచ్చి ఈ సంస్థను ఆదుకుంది. అలాంటిది తొమ్మిదేళ్ళ వ్యవధిలో కోస్తాతీరంలో దాదాపు సగభూభాగాన్ని ఈ సంస్థ సొంత ఖాతాలో వేసుకోగలిగింది. వేలకోట్లకు పడగలెత్తగలిగింది. కార్పొరేట్‌ వ్యవస్థలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు కలసి క్రోనికేపిటలిజంకు పాల్పడితే జరిగే దోపిడీకిదే ప్రతీక.

భాషా ప్రాధాన్యతను పట్టించుకునే నాథుడేడీ?: ఎం.పి. లగడపాటి


ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ మాట్లాడుతూ, మన రాష్ట్రంలో తెలుగుభాషలో విద్యాభ్యాసం నిర్బంధం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు తల్లి కష్టాలలో ఉందని, కన్నీళ్ళు పెట్టుకుందని, భాషా ప్రాధాన్యతను వర్ధమాన కవులు, రచయితలు గుర్తించి యువతకు మన భాష ఔన్నత్యాన్ని చాటితే తప్ప మధురమైన భాషగా ముందడుగు వేయదని అన్నారు. మాతృభాషను గుండెలో పదిలంగా పెట్టుకోవాలని, తద్వారా తెలుగుతల్లి, తెలుగునేల సమైక్యంగా ఉండాలని ఆయన అభిలషించారు. ఈ సభలో ప్రారంభోపన్యాసం చేసిన మండలి బుద్ధప్రసాద్‌ లగడపాటికి ఒక సూచన చేస్తూ, ఎందరో మహనీయులు మొక్కవోని దీక్షతో కృషి చేయగా తెలుగుకు ప్రాచీన భాష హోదా లభించిందని, అయితే ఇంతవరకు నిధులు విడుదల కాలేదని, ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో రాజగోపాల్‌ ఈ అంశాన్ని లేవనెత్తి ఈ నిధులను రాబట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు.

అమ్మ భాషకు మరింత వెలుగు

 శరవేగంగా అందివస్తున్న టెక్నాలజీని వినియోగించుకుని పొరుగు రాష్ట్రాలు తమ తమ మాతృభాష వికాసానికి ఉరకలు, పరుగులు తీస్తుండగా, ఈ విషయంలో తెలుగుభాష వెనుకపడిపోకూడదని పలువురు సాంకేతిక నిపుణులు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో రెండవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు మూడవ రోజు ముగింపు సభను ఎస్‌విఎస్‌ కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ''సాంకేతికంగా తెలుగు భాషాభివృద్ధి'' అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో పలువురు కంప్యూటర్‌ శాస్త్రవేత్తలు 'అంతర్జాలం' (ఇంటర్నెట్‌) తెలుగు భాషా వ్యాప్తికి కూడా అందుబాటులోకి వచ్చిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ చర్చకు సమన్వయకర్తగా వ్యవహరించిన సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిబొట్ల ఆనంద్‌ మాట్లాడుతూ, తెలుగు భాషను ప్రపంచ భాషగా తీర్చిదిద్దడానికి 'అంతర్జాలం' అందివచ్చిందన్నారు. అంతర్జాలంను శక్తివంతమైన మాధ్యమంగా అభివర్ణిస్తూ, ప్రపంచానికి మాటా మంత్రం నేర్పిన తెలుగుజాతి గొప్ప రచయితలను జాతికందించిందని, ఈ రచనలు దేశందాటి వెళ్ళడానికి ఇంటర్నెట్‌ వినియోగమే ప్రత్యామ్నాయ మన్నారు. ఇప్పటి వరకు మూడు వేల పుస్తకాలను ఇంటర్నెట్‌లో బంధించామని, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ సంస్థలు మనతో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చిన నేపథ్యంలో ఈ అంతర్జాల వినియోగాన్ని వేగవంతం చేసుకోవాల్సిన బాధ్యత తెలుగు రచయితలపై ఉందన్నారు. వచ్చే సెప్టెంబర్‌ 28, 29, 30 తేదీలలో అమెరికాలోని సిలికానాంధ్రలో అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన ఈ సమావేశాల కార్యనిర్వాహక అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ కంప్యూటర్‌ ఇంజనీర్‌ అంబరీష్‌ రూపొందించిన 'రమణీయ' యూనికోడ్‌ ఫాంటును ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ తెలుగును ఆధునిక భాషగా తీర్చిదిద్దడానికి సాంకేతిక నిపుణుల చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఎ.పి. నాలెడ్జ్‌ నెట్‌వర్క్‌ ప్రముఖుడు ఎ.అమరనాథరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం తరఫున ఆరు ఫాంట్లను సిద్ధం చేశామన్నారు. కృష్ణా యూనివర్సిటీ ఉప కులపతి మైనేని దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ సైన్స్‌ను తెలుగుపరంగా అభివృద్ధి చేసుకోవాలని, ఈ-రీడర్‌ను ప్రవేశపెట్టి తెలుగు రచనలను తక్కువ ఖర్చుతో ఆకళింపు చేసుకోవడం ద్వారా మాతృభాషను సుసంపన్నం చేసుకోవచ్చని సూచించారు. ఈ-తెలుగు రూపకర్త వీవెన్‌ మాట్లాడుతూ వాక్య నిర్మాణంపై రచయితలు స్పష్టతను ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్‌ రంగ ప్రముఖులు కె.ఎస్‌.బి.వి.కె.శివరావు, జి.వెంకట్రామయ్య, బి.వెంకట్రామ్‌, కిరణ్‌, కె.వీరభద్రశాస్త్రి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు వి.హర్షవర్ధన్‌, చావా సురేష్‌, రెహమానుద్దీన్‌ తదితరులు పాల్గొని తెలుగుభాష విశ్వపరివ్యాప్తమవ్వడానికి అంతర్జాలాన్ని వినియోగించు కోవడంపై పలు సూచనలు చేశారు.

కార్పొరేట్ల గుప్పిట్లో పిఎంవో, సిఎంవోలు

లోక్‌పాల్‌ బిల్‌ పరిధిలోకి ప్రధానిని కూడా చేర్చాలంటూ పౌరసమాజ నేత అన్నాహజారే పట్టుబడుతున్నారు. ఇందుకోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడుతున్నారు.
మరోవైపు కృష్ణా జిల్లా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులంతా బందరు పోర్టు నిర్మాణానికి సుమారు 15 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థ నవయుగ కనస్ట్రక్షన్స్‌కు వెంటనే అప్పగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇందుకోసం శాసనసభ్యత్వాల్ని వదులుకునేందుక్కూడా వారు వెనుకాడటంలేదు. పరస్పర వైరుధ్యమున్న ఈ రెండు అంశాలు దేశంలో పెరిగిన క్రోని కేపిటలిజంకు అద్దం పడుతున్నాయి. జగన్‌ అవినీతిపై ప్రాథమిక సాక్ష్యాలున్నట్లు తేల్చిన హైకోర్టు తన తీర్పునిస్తూ దీన్ని క్రోని కేపిటలిజంగా పేర్కొంది. అప్పట్నుంచి క్రోని కేపిటలిజంపై దేశవ్యాప్తంగా చర్చసాగుతోంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రభుత్వానికి, కార్పొరేట్‌ యజమాన్యాలకు మధ్య సాన్నిహిత్యం ఏర్పడటం, వీరంతా కార్పొరేట్‌ మాఫియాగా రూపొంది సంయుక్తంగా ప్రభుత్వ సంపదను దోపిడీ చేయడమే క్రోని కేపిటలిజం. ఈ విధానంలో వ్యాపార, పారిశ్రామికవేత్తలకు మార్కెట్లో తమ ఉత్పత్తుల్ని విక్రయించడం ద్వారా కంటే తమ ప్రయోజనాలకనుగుణంగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేయించడం ద్వారానే ఎక్కువ లాభపడతారు. ఇందులో వ్యాపారం, ఉత్పత్తులు ఉండవు. వీటి పేరిట ప్రభుత్వ ఆస్తులను దోచేస్తారు. ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులపై రాయితీలు పొందుతారు. ప్రభుత్వం నుంచి అదనంగా సాయం అందుకుంటారు. ఇంతవరకు భారత ప్రజలకు రాజకీయనేతల అవినీతి గురించి తెలుసు.. ఉద్యోగుల అవినీతిపైనా అవగాహన ఉంది. ప్రభుత్వం, ప్రభుత్వంలోని మంత్రులు,
ముఖ్యమంత్రులు, ప్రధాని కూడా కాంట్రాక్టులు, కొనుగోళ్ళ వ్యవహారాల్లో ముడుపులు తీసుకుంటారన్నదీ వారికి అవగతమే. కానీ క్రోని కేపిటలిజంపై భారతీయులకింకా పూర్తిస్థాయి అవగాహన రాలేదు. గత దశాబ్దకాలంగా క్రోని కేపిటలిజం విస్తృతమైనప్పటికీ దీనిపై బహిరంగచర్చ జరగడం జగన్‌ వ్యవహారం తర్వాతే మొదలైంది.
90వ దశకంలో భారత రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థల్లో అనూహ్య మార్పులొచ్చాయి. ఆర్థిక సంస్కరణలు అమలయ్యాయి. డబ్ల్యుటిఓలో భారత్‌ భాగస్వామైంది. అంతర్జాతీయ మార్కెట్‌లకు భారత్‌ తలుపుల్ని బార్లా తెరిచింది. ప్రపంచీకరణ, అంతర్జాతీయకరణంటూ ఆర్థికాంశాల్లో అనేక మార్పులు ప్రవేశపెట్టారు. దీని ఫలితంగా గత రెండు దశాబ్దాల్లో సంపద పెరిగింది. ఆదాయ అవకాశాలు మెరుగయ్యాయి. అదే సమయంలో దేశంలో నయా సంపన్నవర్గం పుట్టుకొచ్చింది. కార్పొరేట్‌ వ్యవస్థ బలీయంగా మారింది. అది ప్రభుత్వాల్నే శాసించగల స్థాయికెదిగింది. జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీల కాలంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అమలు చేసేవారు. అంతర్జాతీయ పరిణామాలకనుగుణంగా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించినప్పటికీ అది ప్రభుత్వ అజమాయిషీలోనే కొనసాగేది. కీలక రంగాలన్నీ ప్రభుత్వ అధీనంలోనే ఉండేవి. కంట్రోలింగ్‌ వ్యవస్థ పకడ్బందీగా అమలయ్యేది. రాజీవ్‌ కాలం నుంచి ప్రభుత్వానికి, వ్యాపారులకు మధ్య సత్సంబంధాలు పెరిగాయి. పివి కాలంలో ఇవి మరింత ఊడలేసాయి. ఇదే క్రోని కేపిటలిజానికి దారితీసింది. గత రెండు దశాబ్దాల్లో పుట్టుకొచ్చిన కొత్తతరం కార్పొరేట్‌ వ్యవస్థ ఉత్పత్తి, వ్యాపార రంగాలకంటే రాజకీయ పార్టీలు, నేతలతో సాన్నిహిత్యానికే ప్రాధాన్యతనిచ్చింది. ఎవరు అధికారంలో ఉంటే వారి ద్వారా తమ ప్రయోజనాల్ని నెరవేర్చుకుంటోంది. క్రోని కేపిటలిజం గతంలో నియంతల పాలనలో ఉన్న దేశాల్లోనే ఎక్కువగా కనిపించేది. రెండో ప్రపంచ యుద్దానంతరం జపాన్‌లో క్రోని కేపిటలిజం మొదలైంది. సౌత్‌ కొరియాలో ఇది విస్తరించింది. లాటిన్‌ అమెరికాలో కొన్ని కుటుంబాలు ప్రభుత్వాన్ని గుప్పెటపట్టి దేశంపై అజమాయిషీ వహించేవి. ఇండోనేషియా, అర్జెంటీనా, బ్రెజిల్‌, మలేషియాల్లో కూడా క్రోని కేపిటలిజం విస్తృత స్థాయిలోనే ఉంది. పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా, సోవియట్‌ యూనియన్‌లో కమ్యూనిస్ట్‌ నియంతృత్వ ప్రభుత్వాలు కొంత మంది కార్పొరేట్లను చేరదీసేవారు. వారి పోటీదార్లను ప్రభుత్వమే అణగదొక్కడం ద్వారా సొంతవర్గానికి మేలు చేకూర్చేవారు. ప్రభుత్వ నిర్మాణాల కాంట్రాక్టులన్నీ వారికే దక్కేవి. పాలకులు, అధికారులు, కార్పొరేట్లు కలసి ప్రజాధనాన్ని దోచుకునేవారు. హంగేరి, రుమేనియా, అల్బేనియా, పోలెండ్‌, బల్గేరియాల్లో కూడా ఇది విస్తృత స్థాయిలోనే సాగింది. తూర్పు జర్మనీ ఉన్న సమయంలో అక్కడి ప్రభుత్వం కార్పొరేట్ల గుప్పెట్లోనే ఉండేది.
క్రోని కేపిటలిజం కారణంగా ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థలే కుప్పకూలాయి. అగ్రరాజ్యం అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యానికి క్రోని కేపిటలిజం కూడా ఓ కారణం. మార్పుతెస్తానంటూ ఎన్నికల బరిలో దిగిన ఒబామా అధికారం చేపట్టగానే జెపి మోర్గాన్‌, లాయిడ్‌బ్లాంక్‌ ఫియన్‌ పరిశ్రమలకు భారీగా రాయితీలిచ్చారు. ఈ సంస్థలు అమెరికాలో పెద్దసంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించగలవన్న ఆశాభావంతో ఆయన వారడిగిన అన్ని ప్రయోజనాలు చేకూర్చిపెట్టారు. జనరల్‌ మోటార్స్‌, క్రిస్‌లర్‌లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బిలియన్ల డాలర్లను మాఫీ చేసేశారు. ప్రస్తుతం హెల్త్‌కేర్‌ పరిశ్రమపై ఒబామా దృష్టి పెట్టారు. దీంతో ఈ పరిశ్రమ లాబీయిస్టుల్తో వైట్‌హౌస్‌ నిండిపోతోంది. పవర్‌ సెక్టార్‌కు కూడా భారీ రాయితీలు ప్రకటిస్తున్నారు. తనకనుకూలంగా ఉన్న ఈ పరిశ్రమలకు ప్రభుత్వ నిధుల్ని అందజేస్తున్నారు. వీటివల్ల అదనంగా ఉద్యోగావకాశాలు సమకూరకపోగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. తిరిగి రెండో ప్రపంచ యుద్దకాలానంతర పరిస్థితుల్ని అమెరికా ఎదుర్కొంటోంది. రష్యా ఆర్థికంగా పుంజుకుంటున్న తరుణంలో ఆ దేశాన్ని కూడా క్రోని కేపిటలిజం ముంచెత్తింది. టెలి కమ్యూనికేషన్స్‌ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడానికీ క్రోని కేపిటలిజమే కారణం. భారత్‌లో కూడా ఇదిప్పుడు ఊడలేస్తోంది. క్రిందిస్థాయి కంటే పైస్థాయిలోనే అవినీతి జాఢ్యం పెరిగింది. పెద్ద కార్పొరేట్‌ వ్యవస్థలేవీ ఎమ్మెల్యేలు, ఎమ్‌పిలు, మంత్రుల్తో వ్యాపార సంబంధాలు నెరపడంలేదు. ముఖ్యమంత్రులు, ప్రధానుల్నే అవి తమ గుప్పెట పట్టాయి.
తమ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలకు, నాయకులకు విస్తృతంగా విరాళాలిస్తున్నాయి. దీంతో కార్పొరేట్లు ఆడమన్నట్లల్లా రాజకీయ నేతలు ఆడుతున్నారు. వారి ప్రయోజనాల పరిరక్షణ కోసం, లాభాల కోసం, వారి ఆస్తులు వందలు, వేల రెట్లు పెంచడం కోసం వారికనుకూలంగా ఉత్తర్వులిమ్మంటూ ప్రభుత్వాలపై ఒత్తిళ్ళు తెస్తున్నారు. పౌరసమాజం ఈ విషయాన్ని గుర్తించే లోక్‌పాల్‌ పరిధిలోకి ప్రధానిని తేవాలంటూ డిమాండ్‌ చేస్తోంది. భవిష్యత్‌ పరిణామాల్ని ఊహించిన కాంగ్రెస్‌ ఇందుకు అభ్యంతరం చెబుతోంది. హజారే బృందం ఆలోచనలో ప్రధానంటే మన్మోహన్‌సింగ్‌ కాదు. ఆ పీఠంపై ఎవరుంటేవారే పౌరసమాజానికి లక్ష్యం. ప్రధాని స్థాయిలో వేలు, లక్షల కోట్ల అవినీతి సాగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలకు ప్రస్తుతం మంత్రుల్ని బాధ్యులుగా చేస్తున్నారు. 2జి స్పెక్ట్రమ్‌లో జరిగిందదే. రాజా, కనిమొళి లాంటివారిని బలేసి ప్రభుత్వ పెద్ద తనకు సంబంధంలేదంటూ తప్పించుకున్నారు. ప్రభుత్వ నిర్ణయాలన్నీ సమష్టిగానే జరుగుతాయి. ఇందుకు ప్రధానే బాధ్యత వహిస్తారు. ఆయన సూచించిన ఎమ్‌పిలకే మంత్రి పదవులు లభిస్తాయి. తనకనుకూలమైన వ్యక్తుల్ని ప్రధాని కేబినెట్‌ సహచరులుగా ఎన్నుకుంటారు. తీరా భారీ అవినీతి విషయాలొచ్చేసరికి ఈ విషయాలన్నింటినీ పక్కనబెడుతున్నారు. ఒకరిద్దర్ని బలేసి చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ప్రధానిని లోక్‌పాల్‌ బిల్‌ పరిధిలోకి తీసుకురాగలిగితే దేశంలో క్రోని కేపిటలిజం తగ్గుతుంది. అలాగే రాష్ట్రాల స్థాయిలో ముఖ్యమంత్రుల్ని ఈ బిల్‌ పరిధిలోకి తెస్తే భారీ అవినీతికి అడ్డుకట్టవేయగలిగే అవకాశాలుంటాయి.

14, ఆగస్టు 2011, ఆదివారం

అవినీ తి ప్రభావం అన్ని రంగాలపై .......

కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దేశం, రాష్ట్రంలో అవినీతి పెరిగిందని ఎమ్మెల్యే అశోక్‌గజపతిరాజు విమర్శించారు. హద్దుల్లేకుండా పెరిగిపోతున్న అవినీ తి ప్రభావం అన్ని రంగాలపై పడుతు ందన్నారు. అవినీతి తారాస్థాయికి చేరి న నేపథ్యంలో దీనిపై టీడీపీ ప్రజల్లో విస్తృత స్థాయి చర్చకు తెర తీసిందన్నారు.

శోభన్ బాబు సూచన మేరకు పెట్టుబడులు

భూమిని నమ్మి నష్టపోయినవారుండరని సినీనటుడు, బిల్డర్ మురళీమోహన్ చెప్పారు తాను ఇతర వ్యాపారాల్లో నష్టపోయినట్లు చెప్పారు. సినీనటుడు శోభన్ బాబు సూచన మేరకు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి లాభాలు గణించినట్లు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ది చెందుతున్న నగరాల్లో గుంటూరు ముందువరుసలో ఉందన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడితే వందల రెట్లు లాభాలు వస్తాయని చెప్పారు.

సంస్కరణల చాప చుట్టేశారు

ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు సంస్కరణలను పంచకళ్యాణిలా పరుగులు తీయించింది. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలకంటే ఎంతో ముందు నిలిచింది. అందుకే, ప్రపంచ బ్యాంకుకు చాలా ముద్దొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రతి రంగంలో, ప్రతి శాఖలో తలదూర్చి తన విధానాలతో శాసించింది. ఇప్పుడు ప్రపంచ బ్యాంకుకు మన రాష్ట్రం చేదైంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం తదుపరి దశ సంస్కరణలకు అనుకూలంగా లేదని, రాజకీయ అనిశ్చితితో పాలన గాడి తప్పుతోందని భావిస్తోంది.

ఏపీతో కటీఫ్ చెప్పాలని నిర్ణయించుకుంది. ఆంధ్రప్రదేశ్ మూడో ఆర్థిక సంస్కరణల రుణం అమలు తీరుపై ప్రపంచ బ్యాంకు ఇటీవల ఒక నివేదికను తయారు చేసింది. దానిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. గతంలో అప్పులు ఇచ్చినప్పుడు తాము పెట్టిన షరతులను సరిగా అమలు చేయడంలేదంటూ ఈ నివేదికలో వాపోయింది. టెండర్ల విధానాన్ని సంస్కరించే ప్రొక్యూర్‌మెంట్ బిల్లు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపలేదని పేర్కొంది.

"ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టినప్పటికీ... అది ఆమోదిస్తారనే నమ్మకం లేదు. ప్రాథమిక విద్యారంగంలో టీచర్ల నియామకంపై చేసిన సూచనలను కూడా పట్టించుకోలేదు. రుణ ఒప్పందం షరతులను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు'' అని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది. తమ షరతుల్లో ఎంతో కీలకమైన విద్యుత్ రంగంలో పూర్తి స్థాయిలో సంస్కరణలు తేవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది.

"విద్యుత్ సరఫరా, పంపిణీ రంగాల్లో పలు మార్పులు తెచ్చినప్పటికీ... సబ్సిడీలతో ఆ రంగం కుదేలైపోతోంది. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని మేం చెప్పినా అమలు చేయలేదు. వ్యవసాయ విద్యుత్ రేట్లను పెంచలేదు. డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను ప్రైవేటీకరించాలన్న సూచననూ బేఖాతరు చేశారు. రాజకీయ కారణాలు చూపుతూ మా సలహాలను తోసిపుచ్చుతున్నారు'' అంటూ ప్రపంచ బ్యాంకు ఆక్రోశం వెళ్లగక్కింది. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ మూడో దశను నిలిపివేసిందని కూడా ఆరోపించింది.

ఆహార భద్రత పేరుతో ఇస్తున్న బియ్యం సబ్సిడీ ఇంకా పెరుగుతుందని, బోగస్ కార్డులను తొలగించినా ప్రయోజనం లేకుండా పోతోందని తెలిపింది. ఈ కారణాలను చూపిస్తూ... ఇక నుంచి రాష్ట్రానికి నేరుగా ఎలాంటి రుణాలివ్వాల్సిన అవసరం లేదని తేల్చేసింది. తాము విధించిన షరతులను అమలు చేయడంలేదంటూనే... రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి మాత్రం తామే కారణమని ప్రపంచ బ్యాంకు చెప్పుకొంది. వైద్య, విద్యా, ఆర్థిక రంగాలతోపాటు ఇతర అన్ని రంగాల్లో రాష్ట్రం ఇంతగా అభివృద్ధి చెందిందంటే.. అది తామిచ్చిన రుణాల పుణ్యమేనని అభిప్రాయపడింది.

"రాష్ట్ర ప్రభుత్వ పథకాలతోపాటు ప్రభుత్వ శాఖల్లో పరిపాలనాపరంగా, విధానాలపరంగా మేం సూచించినట్లుగా సంస్కరణలు తెచ్చి, తాము ఊహించినదానికంటే ఎక్కువ చర్యలను చేపట్టడం వల్లనే ఆంధ్రప్రదేశ్ ఎంతో పురోగతి సాధించింది. వైఎస్ మరణంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ పెరిగి, రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితి 2014 వరకు, ఆ తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉంది'' అని నివేదికలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ పురోగతి ఎంతో బాగున్నా... అవినీతిని బహిర్గతం చేసే విజిలెన్స్ నివేదికలను శాసన సభకు సమర్పించడంలో ఆసక్తి చూపడం లేదని వ్యాఖ్యానించింది.

మరీ ముఖ్యంగా... ప్రొక్యూర్‌మెంట్ చట్టాన్ని తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఆసక్తి చూపడం లేదో అర్థం కావడం లేదని, రాజకీయ కారణాలేమిటో అంతుబట్టడం లేదని పేర్కొంది. "ప్రగతిశీల రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి వైదొలగడం బాధాకరంగా ఉంది. అభివృద్ధి చెందుతున్న ఆంధ్ర ప్రదేశ్‌కంటే ఇతర పేద రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందించడం సబబుగా ఉంటుంది. అందుకే... రాష్ట్రానికి ఇకపై రుణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఏ రాష్ట్రానికైనా ఒక్క ఆర్థిక సంస్కరణల రుణాన్ని మాత్రమే ఇస్తాం. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌కు మూడు రుణాలను ఇచ్చాం'' అని పేర్కొంది.

అన్నీ అమలు చేశాం: ఆర్థిక శాఖ
ఆర్థిక సంస్కరణల రుణాల ఒప్పందాల్లో పేర్కొన్న అన్ని నిబంధనలను అమలు చేశామని ప్రపంచ బ్యాంకుకు ఆర్థిక శాఖ సమాధానమిచ్చింది. నివేదికలో పేర్కొన్న అంశాలపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పుష్పా సుబ్రహ్మణ్యం ప్రపంచ బ్యాంకు కంట్రీ డైరెక్టర్ రాబర్ట్ జఘాకు లేఖ రాశారు. ప్రపంచ బ్యాంకు రుణంలోని సింహభాగాన్ని అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీ రుణాలుగా మార్చుకోవడానికి వాడుకున్నట్టు తెలిపారు. ఆ నిధులను విద్య, ఆరోగ్య రంగాల్లో ఖర్చు చేసినట్టు తెలిపారు. ఎఫ్ఆర్‌బీఎం చట్టాన్ని తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రెవెన్యూ లోటు నుంచి రెవెన్యూ మిగులు సాధనతోపాటు ద్రవ్య లోటును కూడా తగ్గించుకున్న విషయాన్ని వివరించారు.

"ఉచిత విద్యుత్ ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచాం. ప్రణాళికా సంఘం సూచించినట్టుగా విద్యుత్ సబ్సిడీకి ప్రత్యామ్నాయ మార్గాలపై అంతర్జాతీయ జల నిర్వహణ సంస్థతో కలిసి ఒక అధ్యయనం చేస్తున్నాం. విద్యా రంగంలో పలు విప్లవాత్మక మార్పులు తెచ్చాం. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీక రణ విషయంలో అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నాం. భూ సంస్కరణలను అమలు చేశాం. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం కోసం సెజ్‌లను ప్రోత్సహించాం'' అని పుష్పా సుబ్రమణ్యం ప్రపంచ బ్యాంకుకు తెలిపారు.

భారవి 'ఆదిశంకర'లో నాగార్జున






భారవి 'ఆదిశంకర'లో నాగార్జున
 అక్కినేని నాగార్జున అదృష్టమేమో... కొన్ని అద్భుతమైన పాత్రలు ఆయననే వరిస్తున్నాయి. గతంలో అన్నమయ్య, శ్రీరామదాసు పాత్రలను పోషించి, తాజాగా షిరిడీ సాయిబాబా పాత్రను కూడా ధరించనున్న నాగార్జునకు, ప్రముఖ రచయిత జె.కె.భారవి మరో అద్భుతమైన పాత్రను ఆఫర్ చేశారు. ఆయన డైరెక్ట్ చేస్తున్న 'ఆది శంకర' సినిమాలో ఓ ముఖ్య పాత్రను పోషించడానికి నాగార్జున అంగీకరించారు. ఆది శంకరుని జీవితాన్ని మలుపు తిప్పడంలో కీలక పాత్ర పోషించిన ఓ మాస్ పాత్రను నాగార్జున పోషిస్తున్నారు. ఈ సినిమా కథ విని, ఇంతవరకు తీసిన రషెస్ చూసి ఇన్స్ పైర్ అయిన నాగార్జున ఈ పాత్ర చేయడానికి యాక్సప్ట్ చేశారు. ఈ సినిమా మూడో షెడ్యులు త్వరలో మొదలవుతుంది.