25, మార్చి 2011, శుక్రవారం

సచిన్ కోసం వరల్డ్‌కప్ ట్రోఫీ ప్రతి రూపం

క్రికెట్ ప్రియుల ఆరాధ్యదైవమైన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కోసం బెంగుళూరులోని శ్రీసాయిగోల్డ్ ప్యాలెస్ నిర్వాహకులు టి.ఎ.శరవణ సుమారు 4.5 కిలోల బంగారు తాపడం చేసిన వరల్డ్‌కప్ ట్రోఫీ ప్రతి రూపాన్ని సిద్దం చేశారు. 4.5 కిలోల బరువున్న ఈ వెండి ట్రోఫీకి బంగారు తాపడం చేయడానికి 60 గ్రాముల బంగారాన్ని వినియోగించినట్లు తెలిపారు. దీంతోపాటు ఒక బాల్, బ్యాట్ కూడా తయారు చేసినట్లు..ఈ ట్రోఫీ, బాల్, బ్యాట్ తయారీకి రూ.5 లక్షలు వెచ్చించినట్లు టి.ఎ.శరవణ తెలిపారు.

ఉద్యమం పేరిట కేసీఆర్ చేస్తున్నదేమిటి?

తెలంగాణ ఉద్యమం పేరుతో రాజకీయ లబ్ది పొందుతూ ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నారని, ఉద్యమం పేరిట కేసీఆర్ చేస్తున్నదేమిటని తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ రఘునందన్‌ ప్రశ్నించారు. ఉద్యమ స్ఫూర్తితో స్థాపించిన టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా కేసీఆర్ మాట్లాడటం శోచనీయమని అన్నారు. ఎందరో విద్యార్థుల బలిదానాలు చేసి తెలంగాణ కోసం ఉద్యమాన్ని నిర్వహిస్తుంటే కేసీఆర్ తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కాంగ్రెస్‌తో పోతామనడం విడ్డూరంగా ఉందన్నారు.

పాన్‌ కార్డు పొందటం ...వివరాల అప్‌డేట్‌ చేయటం సులభమే

పాన్‌ కార్డు లేకుంటే ఇంతవరకు కొన్ని వ్యవహారాలు అందుబాటులోకి రాకుండా వున్నాయి. ఇక ముందు పాన్‌ కార్డు లేని వారిపై అధిక పన్నుల మోత కూడా వుంటుంది. పాన్‌ కార్డు లేని వారితో పాటు, తప్పుడు పాన్‌ నంబరు ఇచ్చే వారి వద్ద నుంచి పన్ను మినహాయింపు (టీడీఎస్‌)ను అధికంగా రాబట్టదలచినట్లు కేంద్రం కొత్త బడ్జెట్‌లో పేర్కొంది. ఇందుకు సంబంధించి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి నిబంధన వర్తించే విధంగా ఆదాయపు పన్ను చట్టంలో సవరణలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

ఇప్పటికే పలు రకాల వ్యవహారాలకు పాన్‌ను తప్పనిసరి చేశారు. ఆదాయపు పన్ను పరిథిలోకి రాని వారు వీటిని పొందక తప్పటం లేదు. పెట్టుబడి మార్కెట్‌లోని అన్ని రకాల లావాదేవీలకు పాన్‌ తప్పనిసరిగా వుండాలని ఇంతకు ముందే స్పష్టం చేశారు. ఇప్పుడు పాన్‌ లేకపోతే ఇక ఆయా వ్యక్తులపై భారాన్ని పెంచే చర్యలు చేపడతామని కేంద్రం కొత్త బడ్జెట్‌లో స్పష్టం చేసింది.

జీవితకాలం పాటు అమలులో వుండే పాన్‌ కార్డు ద్వారా వ్యక్తుల, సంస్థల ఆర్థిక లావాదేవీలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పన్ను ఎగవేతదారులను గుర్తించాలని ఆదాయపు పన్ను శాఖ భావిస్తోంది. అందుకే ఎన్నో రకాల ఆర్థిక లావాదేవీలకు దీన్ని విస్తరించుకొంటూ వెళుతోంది. రాష్ట్రంలో పాన్‌ కార్డు దరఖాస్తులను స్వీకరించేందుకు యుటీఐ, ఇతర సంస్థలతో ఆదాయపు పన్ను శాఖ పొత్తు కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈనాటి వరకు 45 లక్షల మందికి పాన్‌ కార్డులున్నట్లు తెలుస్తోంది.

ఒకరు ఒక పాన్‌ కార్డును మాత్రమే కలిగి వుండాలి. రెండో కార్డు వుంటే రూ. 10,000 వరకు జరిమానా విధించబడుతుంది. అయితే రాష్ట్రంలో దాదాపు 55,000 మంది వద్ద రెండు పాన్‌కార్డులు వున్నట్లు ఆదాయపు పన్ను (ఐటి) శాఖ గుర్తించి చాలా వాటిని రద్దు చేసింది. ఒకసారి కేటాయించిన పాన్‌లో ఇక మార్పులు చేయరు. కేవలం చిరునామాలో మార్పులను మాత్రమే నమోదు చేస్తారు. పాన్‌ను ఇవ్వటానికి గతంలో బాగా ఆలస్యం జరిగేది. ఇప్పుడు 15రోజుల వ్యవధిలోనే వస్తోంది. ఆన్‌లైన్‌ ద్వారా కూడా పాన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు అందజేశాక దాని పరిస్థితి ఏమిటనేది ఐటీ శాఖ వెబ్‌సైట్‌ సాయంతో తెలుసుకోవచ్చు.

తప్పనిసరి వేటికి?

ఏదైనా సంస్థ జీతాలు చెల్లించేటప్పుడు టీడీఎస్‌ను వసూలు చేసే వ్యక్తులకు సంబంధించిన పాన్‌ కార్డు నెంబరు తప్పనిసరి. ఐటీ రిటర్న్‌ దాఖలుకు, ఆ శాఖ అధికారితో జరిపే అన్ని రకాల ఉత్తర ప్రత్యుత్తరాలకు, అక్కడ చెల్లించే చలానాలకు పాన్‌ అవసరం వుంది.

వ్యాపారి వార్షిక టర్నోవర్‌ రూ. 5 లక్షలు దాటినప్పుడు, ఐటీ చట్టాలకింద పన్నులు, సుంకాలు చెల్లించే వారికి పాన్‌ అవసరం. కొనుగోలుదారుడైన వ్యాపారి నుంచి పన్నును వసూలు చేసేటప్పుడు అతని పాన్‌ను అమ్మకందారు పేర్కొనాలి. ఎగుమతిదారులు, దిగుమతిదారులు, పన్ను కట్టలేకపోయినా పాన్‌ వుండితీరాలి.

స్థిరాస్తి విలువ రూ.5లక్షలు దాటినప్పుడు వాటి కొనుగోలు, అమ్మకాలు, మోటారు వాహనాలు కొనుగోలు, హోటళ్లలో నగదు రూపేణా రూ. 25,000కు మించి చెల్లింపు, సెల్‌ఫోన్‌ సహా టెలీఫొన్‌ కనెక్షన్‌ పొందటానికి పాన్‌ అవసరం. బ్యాంకు, పోస్టాఫీసులో రూ.50,000కు మించిన డిపాజిట్లకు, ఫండ్లు సంబంధిత వ్యవహారాలకు, డీమ్యాట్‌ ఖాతా ప్రారంభించడానికి పాన్‌ కార్డు తప్పనిసరి.

పాన్‌ కార్డు వివరాల అప్‌డేట్‌ సులభమే

ఆదాయపు పన్ను శాఖ అధికారులు అందించే పర్మినెంట్‌ ఎకౌంట్‌ నెంబర్‌ (పాన్‌-శాశ్వత ఖాతా సంఖ్య) ఎంతో ముఖ్యమైన ప్రస్తుత తరుణంలో వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా చిరునామా మారిన పక్షంలో పాన్‌కార్డు వివరాల్లోని సమాచారం ఎంతో ఉపకరిస్తుంది. ఒకసారి పాన్‌కార్డు తీసుకునేటప్పుడు చూపే శ్రద్ధ తదుపరి వివరాలు అప్‌డేట్‌ చేయడంలో మనవారు ఎంతో వెనుకబడి వున్నారు. చాలా సులభమైన పద్ధతుల్లో ఇల్లు కదలకుండానే తాజా సమాచారాన్ని చేర్చే సదుపాయం ఇప్పుడు అందుబాటులో ఉంది.

నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌డిఎల్‌) ఆధ్వర్యంలో సేవలందిస్తున్న టాక్స్‌ ఇన్ఫర్మేషన్‌ నెట్‌వర్క్‌ (టిన్‌) అప్‌డేట్‌ సేవలందిస్తుంది. తాజా ఫొటోను చేర్చడం, చిరునామా, సంతకం మార్పు తదితర వివరాలను సులభంగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. పాన్‌ కార్డు మార్చుకుంటూ ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయవచ్చు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు

ఎన్‌ఎస్‌డిఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు పొంది పేరు, చిరునామా, తాజా ఫొటోగ్రాఫ్‌లను జత చేర్చి ఆన్‌లైన్‌లోనే సబ్‌మిట్‌ చేయడం ద్వారా 15 అంకెల యునీక్‌ నెంబర్‌ జనరేట్‌ అవుతుంది.

డిస్పాచ్‌ ద్వారా అయితే ఏఏ సమాచార మార్పు కోరుకుంటున్నారో ఆయా వివరాలను డాక్యుమెంట్లు సహా ఎన్‌ఎస్‌డిఎల్‌, థర్డ్‌ ఫ్లోర్‌, సఫైర్‌ చాంబర్స్‌, నియర్‌ బానెర్‌, పూనె - 411045, చిరునామాకు అకనాలెడ్జ్‌ సహా పంపాలి.

చెల్లింపుల పద్ధతి: మార్పులు కోరుకునే భారతీయులు 94 రూపాయలను, ఎన్‌ఆర్‌ఐలు 744 రూపాయలను ఆన్‌లైన్‌ ద్వారా లేదా ముంబాయిలో చెల్లుబాటయ్యే విధంగా డిడి, చెక్‌లనైనా పంపవచ్చు.

డెలివరీ అండ్‌ ట్రాకింగ్‌: కొత్త పాన్‌ కార్డు డెలివరీ పోస్టు ద్వారా అవుతుంది. ఈ బట్వాడా ఏ దశలో ఉందన్న విషయాన్ని ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

గుర్తుంచుకోవాల్సింది: ఆన్‌లైన్‌లో ముందుగా పాన్‌ కార్డుపై ఉన్న సమాచారాన్ని ఫీడ్‌ చేయాలి. ఆపై మార్పులు కోరుతున్న వివరాలు అందించాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసిన 15 రోజుల్లోగా ఆ సమాచారాన్ని సపోర్ట్‌ చేసే డాక్యుమెంట్లు ఎన్‌ఎస్‌డిఎల్‌ కార్యాలయానికి అందాలి.

పాన్‌ కార్డు పోయిన పక్షంలో కూడా ఇదే దరఖాస్తును వినియోగించి కొత్త కార్డు పొందవచ్చు.

పాన్‌ కార్డు పొందటం ...వివరాల అప్‌డేట్‌ చేయటం సులభమే

పాన్‌ కార్డు లేకుంటే ఇంతవరకు కొన్ని వ్యవహారాలు అందుబాటులోకి రాకుండా వున్నాయి. ఇక ముందు పాన్‌ కార్డు లేని వారిపై అధిక పన్నుల మోత కూడా వుంటుంది. పాన్‌ కార్డు లేని వారితో పాటు, తప్పుడు పాన్‌ నంబరు ఇచ్చే వారి వద్ద నుంచి పన్ను మినహాయింపు (టీడీఎస్‌)ను అధికంగా రాబట్టదలచినట్లు కేంద్రం కొత్త బడ్జెట్‌లో పేర్కొంది. ఇందుకు సంబంధించి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి నిబంధన వర్తించే విధంగా ఆదాయపు పన్ను చట్టంలో సవరణలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

ఇప్పటికే పలు రకాల వ్యవహారాలకు పాన్‌ను తప్పనిసరి చేశారు. ఆదాయపు పన్ను పరిథిలోకి రాని వారు వీటిని పొందక తప్పటం లేదు. పెట్టుబడి మార్కెట్‌లోని అన్ని రకాల లావాదేవీలకు పాన్‌ తప్పనిసరిగా వుండాలని ఇంతకు ముందే స్పష్టం చేశారు. ఇప్పుడు పాన్‌ లేకపోతే ఇక ఆయా వ్యక్తులపై భారాన్ని పెంచే చర్యలు చేపడతామని కేంద్రం కొత్త బడ్జెట్‌లో స్పష్టం చేసింది.

జీవితకాలం పాటు అమలులో వుండే పాన్‌ కార్డు ద్వారా వ్యక్తుల, సంస్థల ఆర్థిక లావాదేవీలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పన్ను ఎగవేతదారులను గుర్తించాలని ఆదాయపు పన్ను శాఖ భావిస్తోంది. అందుకే ఎన్నో రకాల ఆర్థిక లావాదేవీలకు దీన్ని విస్తరించుకొంటూ వెళుతోంది. రాష్ట్రంలో పాన్‌ కార్డు దరఖాస్తులను స్వీకరించేందుకు యుటీఐ, ఇతర సంస్థలతో ఆదాయపు పన్ను శాఖ పొత్తు కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈనాటి వరకు 45 లక్షల మందికి పాన్‌ కార్డులున్నట్లు తెలుస్తోంది.

ఒకరు ఒక పాన్‌ కార్డును మాత్రమే కలిగి వుండాలి. రెండో కార్డు వుంటే రూ. 10,000 వరకు జరిమానా విధించబడుతుంది. అయితే రాష్ట్రంలో దాదాపు 55,000 మంది వద్ద రెండు పాన్‌కార్డులు వున్నట్లు ఆదాయపు పన్ను (ఐటి) శాఖ గుర్తించి చాలా వాటిని రద్దు చేసింది. ఒకసారి కేటాయించిన పాన్‌లో ఇక మార్పులు చేయరు. కేవలం చిరునామాలో మార్పులను మాత్రమే నమోదు చేస్తారు. పాన్‌ను ఇవ్వటానికి గతంలో బాగా ఆలస్యం జరిగేది. ఇప్పుడు 15రోజుల వ్యవధిలోనే వస్తోంది. ఆన్‌లైన్‌ ద్వారా కూడా పాన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు అందజేశాక దాని పరిస్థితి ఏమిటనేది ఐటీ శాఖ వెబ్‌సైట్‌ సాయంతో తెలుసుకోవచ్చు.

తప్పనిసరి వేటికి?

ఏదైనా సంస్థ జీతాలు చెల్లించేటప్పుడు టీడీఎస్‌ను వసూలు చేసే వ్యక్తులకు సంబంధించిన పాన్‌ కార్డు నెంబరు తప్పనిసరి. ఐటీ రిటర్న్‌ దాఖలుకు, ఆ శాఖ అధికారితో జరిపే అన్ని రకాల ఉత్తర ప్రత్యుత్తరాలకు, అక్కడ చెల్లించే చలానాలకు పాన్‌ అవసరం వుంది.

వ్యాపారి వార్షిక టర్నోవర్‌ రూ. 5 లక్షలు దాటినప్పుడు, ఐటీ చట్టాలకింద పన్నులు, సుంకాలు చెల్లించే వారికి పాన్‌ అవసరం. కొనుగోలుదారుడైన వ్యాపారి నుంచి పన్నును వసూలు చేసేటప్పుడు అతని పాన్‌ను అమ్మకందారు పేర్కొనాలి. ఎగుమతిదారులు, దిగుమతిదారులు, పన్ను కట్టలేకపోయినా పాన్‌ వుండితీరాలి.

స్థిరాస్తి విలువ రూ.5లక్షలు దాటినప్పుడు వాటి కొనుగోలు, అమ్మకాలు, మోటారు వాహనాలు కొనుగోలు, హోటళ్లలో నగదు రూపేణా రూ. 25,000కు మించి చెల్లింపు, సెల్‌ఫోన్‌ సహా టెలీఫొన్‌ కనెక్షన్‌ పొందటానికి పాన్‌ అవసరం. బ్యాంకు, పోస్టాఫీసులో రూ.50,000కు మించిన డిపాజిట్లకు, ఫండ్లు సంబంధిత వ్యవహారాలకు, డీమ్యాట్‌ ఖాతా ప్రారంభించడానికి పాన్‌ కార్డు తప్పనిసరి.

పాన్‌ కార్డు వివరాల అప్‌డేట్‌ సులభమే

ఆదాయపు పన్ను శాఖ అధికారులు అందించే పర్మినెంట్‌ ఎకౌంట్‌ నెంబర్‌ (పాన్‌-శాశ్వత ఖాతా సంఖ్య) ఎంతో ముఖ్యమైన ప్రస్తుత తరుణంలో వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా చిరునామా మారిన పక్షంలో పాన్‌కార్డు వివరాల్లోని సమాచారం ఎంతో ఉపకరిస్తుంది. ఒకసారి పాన్‌కార్డు తీసుకునేటప్పుడు చూపే శ్రద్ధ తదుపరి వివరాలు అప్‌డేట్‌ చేయడంలో మనవారు ఎంతో వెనుకబడి వున్నారు. చాలా సులభమైన పద్ధతుల్లో ఇల్లు కదలకుండానే తాజా సమాచారాన్ని చేర్చే సదుపాయం ఇప్పుడు అందుబాటులో ఉంది.

నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌డిఎల్‌) ఆధ్వర్యంలో సేవలందిస్తున్న టాక్స్‌ ఇన్ఫర్మేషన్‌ నెట్‌వర్క్‌ (టిన్‌) అప్‌డేట్‌ సేవలందిస్తుంది. తాజా ఫొటోను చేర్చడం, చిరునామా, సంతకం మార్పు తదితర వివరాలను సులభంగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. పాన్‌ కార్డు మార్చుకుంటూ ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయవచ్చు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు

ఎన్‌ఎస్‌డిఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు పొంది పేరు, చిరునామా, తాజా ఫొటోగ్రాఫ్‌లను జత చేర్చి ఆన్‌లైన్‌లోనే సబ్‌మిట్‌ చేయడం ద్వారా 15 అంకెల యునీక్‌ నెంబర్‌ జనరేట్‌ అవుతుంది.

డిస్పాచ్‌ ద్వారా అయితే ఏఏ సమాచార మార్పు కోరుకుంటున్నారో ఆయా వివరాలను డాక్యుమెంట్లు సహా ఎన్‌ఎస్‌డిఎల్‌, థర్డ్‌ ఫ్లోర్‌, సఫైర్‌ చాంబర్స్‌, నియర్‌ బానెర్‌, పూనె - 411045, చిరునామాకు అకనాలెడ్జ్‌ సహా పంపాలి.

చెల్లింపుల పద్ధతి: మార్పులు కోరుకునే భారతీయులు 94 రూపాయలను, ఎన్‌ఆర్‌ఐలు 744 రూపాయలను ఆన్‌లైన్‌ ద్వారా లేదా ముంబాయిలో చెల్లుబాటయ్యే విధంగా డిడి, చెక్‌లనైనా పంపవచ్చు.

డెలివరీ అండ్‌ ట్రాకింగ్‌: కొత్త పాన్‌ కార్డు డెలివరీ పోస్టు ద్వారా అవుతుంది. ఈ బట్వాడా ఏ దశలో ఉందన్న విషయాన్ని ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

గుర్తుంచుకోవాల్సింది: ఆన్‌లైన్‌లో ముందుగా పాన్‌ కార్డుపై ఉన్న సమాచారాన్ని ఫీడ్‌ చేయాలి. ఆపై మార్పులు కోరుతున్న వివరాలు అందించాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసిన 15 రోజుల్లోగా ఆ సమాచారాన్ని సపోర్ట్‌ చేసే డాక్యుమెంట్లు ఎన్‌ఎస్‌డిఎల్‌ కార్యాలయానికి అందాలి.

పాన్‌ కార్డు పోయిన పక్షంలో కూడా ఇదే దరఖాస్తును వినియోగించి కొత్త కార్డు పొందవచ్చు.

టేలర్‌ అందగత్తా...నాన్‌సెన్స్‌!

హరిలాల్‌కు గాంధీగారంటే ఎనలేని అభిమానం. ఒకసారి లోహియాను గాంధీగారి వద్దకు తీసుకువెళ్ళాడు. ఆ తరువాత ఒకటికి రెండుసార్లు గాంధీగారిని కలిసే అవకాశం లోహియాకు కలిగింది. బాపూతో సాహచర్యం లోహియాకు ఒక కొత్త ఊపునిచ్చింది. స్వరాజ్య ఉద్యమం పట్ల అభిమానం ముమ్మరమైంది. గాంధీకి ఉన్న ఆధ్యాత్మిక ధోరణి, నిగ్రహ శక్తి చూసి లోహియా ఎంతగానో ఆకర్షితుడయ్యాడు. గాంధీ అడుగుజాడలలో నడిచే లోహియా తన పదవయేటనే సత్యాగ్రహ ఉద్యమంలో కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగాడు. 1921లో జవహర్లాల్‌ నెహ్రూతో లోహియాకు పరిచయమైంది. ఆ తరువాత కాలంలో ఆయనతో గాఢమైన స్నేహానుబంధం ఏర్పడింది. అయినా నెహ్రూతో రాజకీయంగా ఎప్పటికపðడు విభేదించే వాడు. ఆయన రాజకీయ ఆలోచనలు నచ్చేవి కావు. అందుకని కీలకమైన ఏ అంశంపైనైనా నెహ్రూను తూర్పారబట్టేందుకు వెనకాడేవాడు కాడు. సైమన్‌ కమిషన్‌ గోబ్యాక అంటూ నినదించి ఉద్యమాన్ని నడిపించాడు. స్వతంత్ర పోరాటాలలో ఇలా తలమునక లుగా ఉంటూనే ఇంటర్మీడియెట్‌, మెట్రిక్యులేషన్‌లలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై తన చదువులలో తన సత్తా చాటుకున్నాడు. 1929లో జర్మనీ వెళ్ళాడు. అక్కడి జాతీయ అసెంబ్లీలో మన దేశ ప్రతినిథిగా బికనూర్‌ రాజా ఉండేవాడు. తెల్లదొరల తొత్తుగా ఉన్న ఆయన నిర్వాహకాన్ని నిరసిస్తూ మన దేశానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపుతూ విజటర్స్‌ గ్యాలరీ నుంచే నినాదాలు చేశాడు. అక్కడి భారతీయులు ఒక సంఘంగా ఏర్పడేందుకు సాయం చేసి ఆ సంఘానికి కార్యదర్శిగా వ్యవహరించాడు. గాంధీగారి ఉపðసత్యా గ్రహం పై పరిశోధన చేసి పిహెచ్‌డి తీసుకున్నాడు. ఈ ప్రయత్నం సాక్షిగా ఆయన గాంధీగారి సామాజిక ఆర్థిక కోణాలను విపులంగా చర్చించి దేశ విదేశాలలో పెద్దయెత్తున చర్చకు దారి తీశాడు.

స్వదేశానికి తిరిగి వచ్చాక సోషలిజం వైపు మొగ్గుచూపి 1934లో సోషలిస్టు కాంగ్రెస్‌ పార్టీని ఏర్పాటు చేశాడు. 1936లో ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీకి ఎన్నికయ్యాక విదేశీ వ్యవహారాల కమిటీని ప్రారంభించాడు. నెహ్రూ ఈ కమిటీకి తొలి కార్యదర్శిగా నియమించాడు. అనేక సవాళ్ళకు తట్టుకుని బలంగా నిలిచిన మన విదేశాంగ విధానానికి శ్రీకారం చుట్టింది లోహియానే! సత్యాగ్రహించండి అంటూ గాంధీగారు నడిపే హరిజన్‌ పత్రికలో వారం రోజుల ధారావాహిక వ్యాసపరంపర రాశాడు.

దీన్ని తపðగా నిర్ణయించి తెల్ల మెజిస్ట్రేట్‌ రెండేళ్ళ జైలు శిక్ష విధించినా లోహియా గురించి వ్యాఖ్యానిస్తూ 'లోహియా టాప్‌క్లాస్‌ మేధావి. సంస్కారవంతుడు. స్వేచ్చా మయ భావాలున్నవాడు. గొప్ప నైతిక విలువలున్నవాడు' అని కీర్తించాడు. గాంధీగారు కూడా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో మాట్లాడుతూ లోహియా జైలులో ఉన్నంత కాలం నా మానాన నేను ఉండలేను.

ఆయన కన్నా సాహసవంతుడు, ఆయన కన్నా నిరాడంబరుడు మరొకడు ఇంత వరకు నా కంట పడలేదు. ఆయన ఎన్నడూ హింసావాదాన్ని రెచ్చగొట్టలేదు. ఆయన చేసిన పనులన్నీ ఆయన గౌరవ మర్యాదలను పెంచాయి' అన్నారు. లోహియాను జైలర్లు మానసికంగా, శారీరకంగా ఎంతగానో హింసించేవారు. వలస పాలకుల దాష్టీకం పోవాలంటే రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యం పోయి దేశాలు విముక్తం కావాలి. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా దేశాలలో స్వేచ్ఛ అవసరం ఎంతైనా ఉంది. ఈ దేశంలో రాష్ట్రాలు సర్వ సౌభాగ్యాలతో తులతూగాలి. పోలీసుల అవసరం రాకుండా జనజీవితం హాయిగా సాగిపోవాలి అని లోహియా మనసా కోరుకున్నాడు.

-డాక్టర్‌ వంగల రామకృష్ణ

బ్యాంకాక్‌లో 'నాకూ ఓ లవరుంది'


కృష్ణుడు తాజా చిత్రం 'నాకూ ఓ లవరుంది'. శ్రీ శివపార్వతి కంబైన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజన షూటింగ్‌ ప్రారంభించారు. అప్పటి నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగు తోంది. కృష్ణుడు, రితిక, అలీ, ఎమ్మెస్‌.నారాయణ తదితరులపై కొన్ని ముఖ్య సన్నివేశాలు. రెండు పాటలు చిత్రీకరించడం జరిగిందని నిర్మాత కె.సురేష్‌బాబు తెలిపారు

ఐదుగురు హీరోల 'శ్రీ జగద్గురు ఆదిశంకర'


'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'శ్రీమంజునాథ' చిత్రాల రచయిత జె.కె.భారవి స్వీయ దర్శకత్వంలో నిర్మించే 'శ్రీ జగద్గురు ఆదిశంకర' చిత్రం షూటింగ్‌ ఉగాది పర్వదినాన మొదలవుతుంది. గ్లోబల్‌ పీస్‌ క్రియేటర్స్‌ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం వివరాలను గురువారం ఫిలిం చాంబర్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో జె.కె.భారవి వెల్లడించారు. 'శంకరాచార్య జీవితత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సినిమా టైటిల్‌కు 'ఎ ఫిల్మ్‌ ఫర్‌ యూత్‌' అనే ఉపశీర్షిక ఉంటుంది. నేటితరానికి సనాతన ధర్మం గురించి తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 32 ఏళ్లకే తనువుచాలించిన శంకరాచార్య రాసినన్ని రచనలు మరెవరూ రాయలేదు. నాలుగు సార్లు కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశారు. ఈ చరిత్ర అంతా యువతరానికి కౌన్సిలింగ్‌లాగా ఉపయోగపడుతుంది ' అని భారవి పేర్కొన్నారు. 'ఈ చిత్రం గురించి చాలామంది స్వాములకు చెప్పడం జరిగింది. వారంతా బావుందని అభినందించారు. కథ గురించి, పాటల గురించి విన్న తారలు, సాంకేతిక నిపుణులు స్పందించారు. ఇప్పటికి ఐదుగురు హీరోలు నటించడానికి అంగీకరించారు. ఇతర తారల వివరాలు, సాంకేతికనిపుణుల గురించి ఉగాది రోజన వెల్లడిస్తాం. ఇందులో 16 పాటలున్నాయి. ప్రముఖ నేపథ్యగాయనీగాయకులు శంకర్‌మహదేవన్‌, హరిహరన్‌, మధుబాలకృష్ణ, మను, కార్తీక్‌, ఉన్నికృష్ణన్‌, రంజిత, శ్రీరామచంద్ర తదితరులు ఆలపించారు. బాలుగారు పాడాల్సిన పాట కూడా ఉంది. ఈ చిత్రం ద్వారా నాగ్‌శ్రీవత్స సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు' అని భారవి వివరించారు.

ప్రేమకావాలి సెన్సార్ కట్స్

మాక్స్‌ ఇండియా ప్రొడక్షన్‌ నిర్మించిన 'ప్రేమకావాలి' చిత్రం ద్వారా ఆది, ఇషా చావ్లా హీరో హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. బ్రహ్మానందం, దేవగిల్‌, సింధుతులాని, నాగబాబు, జయసుధ ముఖ్య తారాగణం.

ఛాయా గ్రహణం ఛోటా కె నాయుడు, సంగీతం అనూస్‌ రూబెన్స్‌, కూర్పు గౌతంరాజు నిర్వహించిన ఈ చిత్రానికి కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం కె. విజయ భాస్కర్‌ సమకూర్చారు. నిర్మాత కె. అచ్చిరెడ్డి.

అయిదుగురు సభ్యులతో కూడిన ఇసి ఈ చిత్రాన్ని చూసి ఏ విధమైన కట్స్‌ లేకుండా 'యూఎ' సర్టిఫికెట్‌ని 21-2-2011న జారీచేసింది.

16 రీళ్ల నిడివిగల 'ప్రేమకావాలి' చిత్రం 25-2-2011న విడుదలయింది.

కుదిరితే కప్పుకాఫీ సెన్సార్ కట్స్

కుదిరితే కప్పుకాఫీ చిత్రాన్ని శివా ప్రొడక్షన్స్‌, మూన్‌ వాటర్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. రమణ సాల్వ తొలిసారి దర్శకత్వం వహించి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే కూడా సమకూర్చారు. యోగీశ్వర శర్మ సంగీతాన్ని, సంతోష్‌రాయ్‌ ఛాయాగ్రహణాన్ని నిర్వహించారు. ఈ చిత్రానికి నిర్మాతలు శివ, మహి. వరుణ్‌ సందేశ్‌, సుమ భట్టాచార్య, తనికెళ్ళ భరణి, భీమనేని శ్రీనివాసరావు, శివనారాయణ, సుకుమారి ముఖ్య పాత్రధారులు.

అయిదుగురు సభ్యులతో కూడిన ఇసి 'కుదిరితే కప్పు కాఫీ'ని చూసి ఏ విధమైన కట్స్‌ లేకుండా 'యు' సర్టిఫికెట్‌ని 21-2-2011న జారీ చేసింది.

14 రీళ్ళ నిడివిగల ఈ చిత్రం 25-2-11న విడుదల అయింది.

సోనియా ఇంటి ముందు ధర్నా చేస్తాం

మరో తెలుగుదేశం శాసనసభ్యుడు దేవినేని ఉమ మాట్లాడుతూ, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలుగు ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటోందని, కేంద్రం రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయమే తీసుకుంటే సోనియాగాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.

శ్రీకృష్ణ నివేదికను స్వాగతిస్తున్నాం ...

శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ, ఈ 8వ అధ్యాయంలో తెలంగాణ, సీమాంధ్రలు కలిసి ఉండడం మినహా మరో మార్గం లేదని స్పష్టం చేసిందని, ఇది హర్షణీయమన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం మినహా కేంద్ర ప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయమే లేదన్నారు. ఈ నివేదికలోని కొన్ని అంశాలు మాత్రమే బయటకు వచ్చాయని, అన్ని అంశాలు బయటకు వస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయంలో పొందుపరిచిన అంశాలను తాము స్వాగతిస్తున్నామని,..8వ అధ్యాయాన్ని సంపూర్ణంగా బహిర్గత పరచాలని ఆయన సూచించారు.

శ్రీకృష్ణ కమిటీ దిష్టి బొమ్మల దగ్ధం

పలువురు తెలంగాణా ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాజకీయ జెఎసి పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా శ్రీకృష్ణ కమిటీ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు.

శ్రీకృష్ణ కమిటీ సభ్యులు శిక్షార్హులు

శ్రీకృష్ణ కమిటీ అంటే తమకు గౌరవం ఉందని, నివేదికలో తెలంగాణ అంటేనే నక్సలైట్లనే భావనను తీసుకురావడం సిగ్గుచేటన్నారు. కచ్చితంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేదిగా ఈ నివేదిక ఉందంటూ మండిపడ్డారు భారతీయ జనతాపార్టీ సీనియర్‌ నాయకుడు సి.హెచ్‌. విద్యాసాగర్‌రావు, ఈ కమిటీ నివేదికపై సామాన్యులకు అసహయం కలుగుతోందన్నారు. కమిటీ తన పరిధి దాటి చెప్పకూడని విషయాలను రహస్య నివేదికలో చేర్చి తెలంగాణను వ్యతిరేకించడం అప్రజాస్వామికం అన్నారు. అణచివేసేందుకు సూచనలు చేయడం దుర్మార్గమన్నారు. తెలంగాణ ప్రజల అవస్తలను, ఆత్మబలిదానాలను కనీసం చూపించకపోవడం తెలంగాణ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉందన్నారు. శ్రీకృష్ణ కమిటీ సభ్యులు శిక్షార్హులని ఆయన పేర్కొన్నారు.

'దొంగల ముఠా'గా..శ్రీకృష్ణ కమిటీ...

'దొంగల ముఠా'గా..శ్రీకృష్ణ కమిటీపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్‌ ఎంపి పొన్నం ప్రభాకర్‌ . శ్రీకృష్ణ కమిటీపై తెలంగాణ ప్రజల్లో నమ్మకం లేదని, ఐదో, పదో పైసల వంతు గౌరవం ఉండేదని, ఇప్పుడు శ్రీకృష్ణ 8వ అధ్యాయం ద్వారా ఆ గౌరవం కూడా పోయిందన్నారు. సీమాంధ్ర నాయకులు ఎవరిని ఎలా మేనేజ్‌ చేయాలో ప్రపంచానికి తెలియజేశారని, వారి కుటిల బుద్ధికి ఇదొక నిదర్శనంగా ఆయన అభివర్ణించారు. ఇంత అన్యాయంగా ఉద్యమాన్ని ఎలా మేనేజ్‌ చేయాలి, పత్రికలను ఎలా మేనేజ్‌ చేయాలి అనే విషయాలను సూచించి, మీడియాపై ఉన్న గౌరవాన్ని తగ్గించేదిగా ఉందంటూ ధ్వజమెత్తారు. విద్యలో, నీటి పారుదలలో, ఉద్యోగాలలో తెలంగాణాకు ఎంత అన్యాయం జరిగిందో కమిటీ ప్రస్తావించకపోవడం సిగ్గుచేటని, ఇది కేవలం సీమాంధ్రుల కన్సల్టెంట్‌ ఏజెన్సీగా వ్యవహరించినట్లుగా కమిటీ నివేదిక ఉండడం దౌర్భాగ్యమన్నారు

లగడపాటి ఎంత మొనగాడో ...

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేదిగా ఉన్న కమిటీ నివేదికలోని 8వ అధ్యాయం ఉందని, కమిటీ సీమాంధ్రులకు అమ్ముడుపోవడమే కారణమని సీనియర్‌ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి , ఆరోపించారు. కమిటీ సభ్యులను ప్రాసిక్యూట్‌ చేసి తప్పుడు నివేదిక ఇచ్చినందుకు కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి కమిటీని నియమిస్తే తెలంగాణలో జరిగిన ఆత్మ బలిదానాలపై కనీసం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

లగడపాటి రాజగోపాల్‌ రహస్యంగా ఇచ్చిన నివేదిక, శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయంలోని నివేదిక ఒక్కటే. అయితే లగడపాటి ఎంత మొనగాడో అర్థమవుతోందన్నారు. ఈ నివేదిక రూపొందించడంలో జరిగిన అవినీతిపై న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వం సక్రమంగా గమనిస్తే వీరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించే అవకాశం ఉంటుందని, వీలైతే వీరికి ఉరిశిక్ష వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

'ఆంధ్ర కసబ్‌' రాజగోపాల్‌

తెలుగుదేశం శాసన సభ్యుడు రేవంత్‌రెడ్డి, రాజగోపాల్‌ను 'ఆంధ్ర కసబ్‌'గా అభివర్ణించారు. ఆయన రాసిచ్చిన అంశాన్నే శ్రీకృష్ణ కమిటీకి ప్రభుత్వానికి ఇచ్చిందని ఆరోపించారు. ఈ 8వ అధ్యాయం తెలంగాణ ప్రజలను అగౌరపరిచేలా ఉందని, ఇందుకు బాధ్యుడైన జస్టిస్‌ శ్రీకృష్ణకు ఉరిశిక్ష వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. శ్రీకృష్ణ కమిటీకి అనువాదకులు సీమాంధ్రవాదులేనని, ఈ పరిస్థితుల్లో తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటీ సీమాంధ్ర పెట్టుబడిదారులు ఇచ్చిన కాసుల మూటలకు లొంగిపోయారని తెలంగాణ ప్రజలు ఆ మూటలు ఇవ్వలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకృష్ణను న్యాయమూర్తిగా పోల్చడం విచారకరమని కమిటీ నివేదిక న్యాయబద్ధంగా లేదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

చర్చలు జరపడం శుద్ధ దండగ

తెలంగాణ ప్రజల ఆత్మహత్యలపై, ఉద్యమాలపై ఎక్కడా ప్రస్తావించకపోవడం విడ్డూరమని, ఈ కమిటీ నివేదికపై అఖిలపక్షాలు ఏర్పాటు చేయడం, చర్చలు జరపడం శుద్ధ దండగని, వెంటనే పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ సారథ్య బృంద కో నిర్వాహకుడు జి.నిరంజన్‌ డిమాండ్‌ చేశారు. అందరిని మేనేజ్‌ చేయడంలో సీమాంధ్ర నాయకులు, పెట్టుబడిదారులు ఎంత సిద్ధహస్తులో దీంతో రుజువైందన్నారు. ఈ కమిటీని వదిలిపెట్టమని కమిటీ చైర్మన్‌తో సహా సభ్యులకు శిక్ష పడేంత వరకు న్యాయపోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను కమిటీ సభ్యులు నిర్లజ్జగా మోసగించారని ఆరోపించారు.

శ్రీకృష్ణ శకుని పాత్ర

శ్రీకృష్ణ కమిటీ నివేదిక న్యాయ వ్యవస్థపై విశ్వాసం కోల్పేయే విధంగా ఉందన్నారు హరీష్‌రావు. శ్రీకృష్ణుని పాత్ర పోషిస్తాడనుకున్న జస్టిస్‌ శ్రీకృష్ణ శకుని పాత్ర పోషించాడని కమిటీ తన రక్తదాహాన్ని చూపించిందన్నారు. శ్రీకృష్ణ కమిటీ సీమాంధ్ర నేతలకు అమ్ముడుపోయి వారు చెప్పిందే నివేదికలో పొందుపరిచారని ఆయన ఆరోపించారు. వీరి నిర్వాకం వల్ల కమిటీలపై ప్రజల్లో విశ్వసనీయత తగ్గి, ప్రజాస్వామ్యంపై విలువ కోల్పోయేదిగా ఉందన్నారు. లగడపాటి రాజగోపాల్‌ గతంలో చేసిన వ్యాఖ్యలు ఈ కమిటీ నివేదికలో ఉండడం గమనించాల్సిన విషయమన్నారు.

'8వ అధ్యాయం'పై నీరు-నిప్పు

రాష్ట్రంలోని పరిస్థితులను అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసిన శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయం మాత్రం రహస్యంగా ఉంచింది. ఈ రహస్య నివేదికపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కొన్ని అంశాలు వెల్లడయ్యాయి. దీంతో ఈ 8వ అధ్యాయం కలకలం రేపుతోంది. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకే ఈ విధంగా పరిధులు దాటి నివేదికలో కొన్ని అంశాలను పొందుపర్చిందంటూ తెలంగాణ వాదులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయగా, సమైక్యవాదులు శ్రీకృష్ణ కమిటీ నివేదిక రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఉందంటూ పలువురు నాయకులు స్వాగతిస్తున్నారు.

రహస్యంగా ప్రభుత్వానికి అందజేసిన శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయం రాష్ట్ర హైకోర్టు తీర్పు వల్ల కొంతమేర బయటపడింది. ఈ బయటపడిన అంశాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జరిగే పరిణామాలు, ఇబ్బందులకు గురిచేస్తాయని నక్సలిజం వ్యాప్తి చెందడంతో పాటు, మత ఘర్షణలు కూడా జరిగే అవకాశం ఉంటుందని నివేదికలో శ్రీకృష్ణ కమిటీ స్పష్టం చేసింది. తెలంగాణ ఉద్యమాన్ని నియంత్రించేందుకు తీసుకోవలసిన చర్యలపై కూడా కమిటీ కొన్ని సలహాలు సూచించింది. ఈ విషయాలన్నీ తెలంగాణాకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీల సభ్యులే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి మరొక అడుగు ముందుకేసి తీవ్రమైన ఆరోపణలు గుప్పించింది.

జగన్‌ అక్రమ ఆస్తులపై విచారణ జరిపించాలి

తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకునే వేలకోట్ల రూపాయల అక్రమ ఆస్తులు సంపాదించిన కడప మాజీ ఎంపీ వై.ఎస్‌.జగన్‌ ముఖ్యమంత్రి అయితే ఏకంగా రాష్ట్రాన్నే అమ్మేయడం ఖాయమని రాష్ట్రానికి చెందిన సీనియర్‌ కాం గ్రెస్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆరోపించారు. సొం త పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని ఉవ్విళ్లూరుతున్న జగన్‌ కూడబెట్టిన అక్రమ ఆస్తులపై విచారణ జరిపించాలని ఆయన గురువారంనాడిక్కడ ఏర్పాటు చేసిన పత్రికా గోష్ఠిలో డిమాండ్‌ చేశారు. దివంగత నేత వైఎస్‌ అధికారంలో ఉండగా దానిని అడ్డుపెట్టుకుని జగన్‌ రాష్ట్రాన్ని దోచుకొన్నట్లు ఈమధ్య కాలంలో వెలుగులోకి వస్తున్న అనేక విషయాలతో స్పష్టమౌతోందని ఆయన చెప్పారు. ప్రస్తుతం జగన్‌ వద్ద ఉన్నంత డబ్బు దేశంలోని ఏ ముఖ్యమంత్రి వద్ద కూడా లేదని, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న జగన్‌ తన విశ్వసనీయతను పెంచుకోవాలంటే కేవలం ఆరేళ్ల వ్యవధిలో ఇన్ని వేలకోట్ల ఆస్తులు ఎలా సమకూరాయో వెల్లడించాలని ఆయన డిమాండ్‌ చేశారు. జగన్‌ ఆస్తులపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని కోరినట్లు హనుమంతరావు వెల్లడించారు.

అయితే, వైఎస్‌ హయాంలోనే విపరీతమైన అవినీతి చోటుచేసుకున్నట్లు ప్రతిపక్ష తెలుగు దేశం చేసిన ఆరోపణలపై కాంగ్రెస్‌ పార్టీ గత ఆరేళ్లుగా ఎందుకు నోరుమెదపలేదన్న ప్రశ్నలకు సమాధానంగా ఆనాడు ప్రతిపక్షం కావాలనే కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిపై బురద జల్లుతున్నదనే అభిప్రాయం ఉండేదని, అయితే, ఆ తర్వాత వెలుగులోకి వస్తున్న అనేక కుంభకోణాలు, అవకతవకలను చూసిన తర్వాత తండ్రి అధికారంలో ఉండడాన్ని జగన్‌ అడ్వాంటేజ్‌గా తీసుకొన్నారని రుజువౌతున్నదని వివరించారు.

కృష్ణ... కృష్ణా...నిందలెందుకు?

అర్ధ శతాబ్దానికి పైగా వివిధ రూపాల్ని సంతరించుకున్న తెలంగాణ ఉద్యమం రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కూడా కాలరాచే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర విభజనాంశాలపై అధ్యయనం చేసి సిఫార్సులిచ్చే నిమిత్తం కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ సభ్యుల భావప్రకటనా స్వేచ్ఛను కూడా తప్పుబడుతోంది. కమిటీ సభ్యులు తమకనుకూలంగా సిఫార్సులివ్వలేదని, తమ మనోభావాల్ని గౌరవించలేదని, వారందరినీ ప్రాసిక్యూట్‌ చేసి జైలుపాలు చేయాలంటూ ఉద్యమాకారులు చేస్తున్న డిమాండ్‌లు ఉద్యమగతికి అద్దం పడుతున్నాయి. కేంద్రంపై విభజనవాదులు తెచ్చిన ఒత్తిడి కారణంగానే గత ఏడాది మార్చిలో యుపిఎ ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని నియమించింది. ఈ కమిటీ పది మాసాల పాటు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించింది. వివిధ వర్గాల ప్రజల మనోభావాల్ని తెలుసుకుంది. గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలు, సామాన్యుల నుంచి సంపన్నులు, నిరక్షరాస్యుల నుంచి విద్యాధికులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా సమాజంలోని అన్ని వర్గాల్లో విభజనపై నెలకొన్న అభిప్రాయాల్ని ఆరాతీసింది. తమ దృష్టికొచ్చిన అంశాలన్నింటితో ఒక నివేదికను రూపొందించి కేంద్రానికి అందజేసింది. అయితే సమస్య మూలాలు జటిలంగా ఉండడంతో ఏకపక్ష పరిష్కారం సాధ్యం కాదని తలచి కొన్ని సిఫార్సులు చేసింది. వీటిలో ప్రభుత్వానికి అనుకూలమైన ప్రతిపాదనలపై సానుకూల నిర్ణయం తీసుకోమని సూచించింది. వీరి సిఫార్సులేవీ తమకనుకూలంగా లేవన్నది తెలంగాణ వాదుల ఆరోపణ. తాజాగా ఎనిమిదో ప్రతిపాదనపై వీరు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రతిపాదనలన్నీ తమకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ సభ్యుల్ని దూషిస్తున్నారు.

ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ సభ్యుల్లో ఏ ఒక్కరికీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతో గాని, ఇక్కడి రాజకీయాలు లేదా ప్రాంతాలు, రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం లేదు. వీరిలో ఒక్కొక్కరు ఒక్కో రంగంలో నిష్ణాతులు. తమ తమ రంగాల్లో అనేక రకాల అధ్యయనాలు నిర్వహించి ప్రభుత్వానికి సమర్పించిన మేధావులు. రాష్ట్ర విభజన చేయాల్సొస్తే నైసర్గిక భౌగోళిక స్వరూపంతో పాటు ఖనిజాలు, జలవనరులు, విద్యుత్‌, సంపద ఇలా సంయుక్త వనరుల విభజనపై కూడా అధ్యయనం నిర్వహించి సిఫార్సులు చేస్తారన్న ఉద్దేశంతోనే వీరిని కమిటీ సభ్యులుగా కేంద్రం నియమించింది. వీరిలో ఒక మహిళ, ముస్లిం కూడా ఉన్నారు. ఇలా అన్ని వర్గాలకు ఈ కమిటీలో ప్రాతినిథ్యం కల్పించారు. కమిటీ సభ్య కార్యదర్శిగా వ్యవహరించిన వినోద్‌ కుమార్‌ దుగ్గల్‌ కేంద్ర హోమ్‌ శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు. 1968 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్‌ అధికారి ఆయన. తొలుత నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో కొంతకాలం సేవలందించారు. ఆ తర్వాత ఐఎఎస్‌కు ఎంపికయ్యారు. దీర్ఘకాలం పాటు జలవనరుల శాఖలో ఆయన పని చేశారు. దేశంలో జలవనరుల పంపిణీపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. అంతేకాదు కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాల్ని పునర్‌నిర్వచించే నిమిత్తం ఏర్పాటు చేసిన జస్టిస్‌ పూంచి కమిషన్‌లో కూడా ఆయన సభ్యుడిగా వ్యవహరించారు. డాక్టర్‌ రవీంద్రకౌర్‌ పంజాబీ మహిళ. ఢిల్లీ ఐఐటిలో సోషియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. భారత సమాజంలో సామాజిక వర్గాల మధ్య విభేదాలు, రిజర్వేషన్లపై ఆమె ప్రత్యేక అధ్యయనం నిర్వహించారు. దేశంలో పట్టణ, గ్రామీణ ప్రజల మధ్య సంబంధాలపై ఆమె పలు పుస్తకాలు వెలువరించారు. సామాజిక రంగంలో ఆమె విశేష కృషి చేశారు. వివిధ ప్రాంతాల ప్రజల మధ్య భావ ప్రకటన స్వేచ్ఛలో వ్యత్యాసాలు, జీవన విధానాలపై అధ్యయనాలు నిర్వహించారు. మరో సభ్యుడు అబుసలేషరీఫ్‌ ఇండియన్‌ ముస్లిం. మంచి ఆర్థికవేత్త. నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో చీఫ్‌ ఎకానమిస్ట్‌గా సేవలందించారు. ఆయన ఆహార విధానంపై పలు అధ్యయనాలు

నిర్వహించారు. ఆర్థిక వ్యత్యాసాలు, ఆహారం సమకూర్చుకోవడంలో అసమానతలు, తద్వారా ఒనగూరే నష్టాలపై అనేక పేపర్లను ప్రజెంట్‌ చేశారు. అమెరికాలోని ఎకనామిక్‌ గ్రోత్‌సెంటర్‌కు విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా సేవలందించారు. దేశంలోని ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యాపర వివరాలపై అధ్యయనం నిర్వహించి కేంద్రానికో నివేదిక సమర్పించారు. ఇటీవలె భారత్‌లో మానవ వనరుల అభివృద్ధిపై పుస్తకాన్ని వెలువరించారు. దీర్ఘకాలం పాటు కేంద్ర హోమ్‌ మంత్రిత్వ శాఖలో సభ్యుడిగా పనిచేశారు. ప్రతిష్టాత్మక ఇండియా టుడే మ్యాగజైన్‌ 2000 జనవరి నాటి సంచికలో ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నికగన్న మేధావుల జాబితాను ప్రచించింది. ఇందులోని 25 మందిలో షరీఫ్‌ స్థానం సంపాదించారు. ఇక రణబీర్‌సింగ్‌ నేషనల్‌ లా యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌గా వ్యవహరించారు. న్యాయ వ్యవస్థను పరిరక్షించే వేలాది మంది న్యాయ నిపుణుల్ని ఆయన తీర్చిదిద్దారు. కమిటీకి నాయకత్వం వహించిన జస్టిస్‌ బిఎన్‌ శ్రీకృష్ణ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారు.

1991--92లో ముంబయ్‌లో జరిగిన మతకల్లోలాలపై ప్రభుత్వం నియమించిన కమిషన్‌కు ఆయనే నేతృత్వం వహించారు. బాబ్రీ మసీదు విధ్వంసానంతరం జరిగిన ఈ అల్లర్లతో ముంబయ్‌ నగరం అతలాకుతలమైంది. ఆయనకు ముందు మరికొంత మంది న్యాయ నిపుణుల్ని కేంద్రం సంప్రదించినప్పటికీ ఆ కమిటీకి నాయకత్వం వహించేందుకెవరూ ముందుకురాలేదు. 1998 వరకు సాక్షుల్ని విచారించిన జస్టిస్‌ శ్రీకృష్ణ ముంబయ్‌ అల్లర్ల మూలకారకుల వివరాల్ని బట్టబయలు చేయడంతో ఒక్కసారిగా ఆయన పేరు దేశమంతా మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత మద్రాస్‌ హైకోర్టులో 2009 ఫిబ్రవరి 19న జరిగిన అల్లర్లకు సంబంధించి శ్రీకృష్ణ నేతృత్వంలోనే ఏకసభ్య కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఇందులో కూడా ఆయన ఇచ్చిన నివేదిక నిందితుల్ని బయటపెట్టింది. యుకెలోని ఇంటర్‌నేషనల్‌ బార్‌ అసోసియేషన్‌లో జీవితకాల సభ్యుడిగా ఉన్న శ్రీకృష్ణకు భారత్‌లోనేకాదు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.

ఇలా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని శ్రీకృష్ణ కమిటీ సభ్యులుగా కేంద్రం నియమించింది. తెలంగాణ ప్రాంతంలోని ముస్లింల సంఖ్యను దృష్టిలో పెట్టుకునే సభ్యుల్లో ఒక ముస్లింను కూడా చేర్చింది. తెలంగాణ , సీమాంధ్ర ప్రాంతాల మధ్య నెలకొన్న ఆర్థిక అసమానతలు, జీవన వైరుధ్యాలపై స్పష్టమైన నివేదికిచ్చే నిమిత్తమే ఆయన రంగాల్లో ప్రతిభావంతులకు కమిటీలో స్థానం కల్పించింది. వీరంతా తమకు నిర్దేశించిన విధుల్ని పూర్తి చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధికుల మనోభావాల్ని గౌరవించి తీరాల్సిందే. అలాగే ప్రతిఒక్కరికి స్పష్టమైన భావప్రకటనా స్వేచ్ఛ ఉంది. ఈరెండింటికి రాజ్యాంగం తగిన రక్షణ కల్పించింది. కానీ తెలంగాణ వాదులు తమకనుకూలంగా సిఫార్సులివ్వలేదన్న ఏకైక కారణంతో రాష్ట్రానికి సంబంధంలేని జాతీయ స్థాయి మేధావులైన కమిటీ సభ్యుల భావ ప్రకటనా స్వేచ్ఛను కూడా ప్రశ్నించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని పరిశీలకులు పేర్కొంటున్నారు. అయినా తెలంగాణ ఏర్పాటు అన్నది ఓ రాజకీయ ప్రక్రియ. ఇంత వరకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలేవీ దీనిపై ఇదమిత్ధంగా తమ విధానాల్ని స్పష్టం చేయలేదు. కాంగ్రెస్‌, తెలుగుదేశం రెండూ తకూడా దోబూచులాట లాడుతున్నాయి. తెలంగాణ వాదులు రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చిరాష్ట్ర విభజనపై ఏకాభిప్రాయ తీర్మానాన్ని అమోదింపజేయడం ద్వారానే తెలంగాణ ఏర్పాటు సాధ్యపడుతుందని వీరు సూచిస్తున్నారు. అంతేగాని ఓ గౌరవనీయ వృత్తి అయిన ప్రొఫెసర్‌ హోదాలో ఉన్న కోదండరామ్‌ కూడా శ్రీకృష్ణ కమిటీ సభ్యులపై విరుచుకుపడటం వారి రాజ్యాంగ హక్కులకు విరుద్ధంగా మాట్లాడటం తగదని వీరు పేర్కొంటున్నారు.

రాజీనామా చేస్తాం జగన్‌ పార్టీలో చేరతాం

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అభిమానులమైన తాము అవసరమైతే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీలో చేరతామని కాంగ్రెస్‌ సభ్యులు శ్రీకాంత్‌రెడ్డి, గురునాథ్‌రెడ్డి, ప్రజారాజ్యం ఎమ్మెల్యే శోభానాగిరెడ్డిలు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, తెదేపాలు కలిసి జగన్‌ను ఎదుర్కొనడానికే పనిచేస్తున్నాయని ఆయనను దెబ్బతీసేందుకు టార్గెట్‌ పెట్టుకున్నారని వారు ఆరోపించారు. జగన్‌ను గానీ, ఆయన కుటుంబాన్ని గానీ ఎవరైన కామెంట్‌ చేస్తే సహించబోమని వారు హెచ్చరించారు. జగన్‌ గురించి అనవసరమైన మాటలు మాట్లాడకుండా ప్రజల కోసం మాట్లాడితే మంచిదన్నారు. 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌, 30 సంవత్సరాల చరిత్ర కలిగిన తెదేపా నేతలకు నైతిక విలువలు ఉన్నాయా? అని వారు ప్రశ్నించారు.

వైఎస్సార్‌ కడప జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రమంత్రులు అధికారదుర్వినియోగానికి పాల్పడ్డారని, టిడిపి ఎంపిటిసిలతో లోపాయకారీ ఒప్పందం కుదుర్చుకున్నారని వారు ఆరోపించారు. కడపలో జగన్‌ తరఫున గెలిపొందిన ఎమ్మెల్సీ అభ్యర్థికి వైఎస్సార్‌ బొమ్మ చూసి ఓటర్లు ఓట్లు వేశారన్నారు. ఇదిలావుండగా, చంద్రబాబు తన హయాంలో చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీలో రోజు ఏదో గొడవ సృష్టిస్తున్నారని వారు ఆరోపించారు.