23, నవంబర్ 2010, మంగళవారం

7న ఒంగోలులో సమైక్యాంధ్ర గర్జన

శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించేందుకు గడువు దగ్గరపడుతుండటంతో సమై క్యవాదులు కూడా ఆందోళనలకు స మాయత్తమవుతు.. ఈనెల 7న ఒంగోలులో సమైక్యాంధ్ర గర్జన నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజన ద్వారా కలిగే నష్టాలను ప్రజలకు వివరించి వారి లో కూడా పోరాట స్ఫూర్తిని నింపనున్నారు

తెలుగు ప్రజల ఔన్నత్యాన్ని కాపాడుకునేందుకు సమయం ఆసన్నమైందన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములును స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలన్నారు సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ శ్యా మ్యూల్ ..

కొంత మంది వేర్పాటువాదులు ఉస్మాని యా యూనివర్సిటీని అడ్డంపెటు ్టకొని కొంత మంది ని వాడు కుంటున్నారని, వారికి నెలవారీ జీతాలు కూడా చెల్లిస్తున్నారని,,ప్రజలను భయభ్రాంతులకు గురిచ్చెస్తున్నారని ఆరో పించారు.

బాలల వారోత్సవాల పేరిట కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం

రం రోజుల పాటు నిర్వహించిన బాలల వారోత్సవాల సందర్భంగా కార్మికులుగా పని చేస్తున్న బాల బాలికలను గుర్తించి వారిని బడిలో చేర్పించాల్సి వుంది.. అధికారుల అలసత్వం... ఎవరేం చెలేరన్న మొండి ధైర్యానికి నిలువెత్తు నిదర్సనంగా నేటికీ . అనేక మంది బాల బాలికలు కార్మికులుగా పని చేస్తూ దర్శనమి స్తున్డటం తో వారం రోజుల పాటు నిర్వహించిన బాలల వారోత్సవాలు నిరుపయోగంగా మారాయని చెప్పవచ్చు

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఖర్చు చేస్తున్న కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అవుతు.... ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరక పోగా కార్ఖాణాలలో బాలలు మగ్గిపోతూనే వున్నారు.

అనేక మంది బాల కార్మికులను గుర్తించి స్కూల్స్‌లో చేర్పించామని సంబంధితులు లెక్కలు చెపుతున్నా.. ఇవన్నీ కాకి లెక్కలు అన్నది ప్రభుత్వానికీ తెలిసిన నిజం అనడంలో స౦దేహం లేదేవ్వరికీ,,

రోశయ్య ప్రభుత్వంలో అవినీతి పాలన

రోశయ్య ప్రభుత్వం అవినీతి పాలనలో కూరుకుపోయిందని, సంక్షేమ పథకాలు అమలుకు నోచుకోవడం లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి విమర్శించారు.

50 ఏళ్లుగా తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందన్నారు. అలాంటి పార్టీతో కేసీఆర్ కుమ్ముకై మరోసారి ప్రజలను మోసం చేసేందుకు కుట్ర పన్నుతున్నాడని విమర్శించారు.

తెలంగాణ ప్రజల పట్ల కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో బిల్లు పెట్టేందుకు సోనియాతో ఒత్తిడి చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తుందనే దుష్పప్రచారం మానుకోవాలని ఆయన హెచ్చరించారు.

సాక్షిని చదువొద్దు..చూడొద్దు...

కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ సాక్షి టీవీని చూడవద్దు, సాక్షి పేపర్‌ను చదవవద్దని ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి రిజ్వాన్ హర్షద్ పి లుపునిచ్చారు.

కాంగ్రెస్ కార్యకర్తలు సాక్షి చానల్‌ను, పేపర్‌ను తమవాటిగా భావిస్తూ అభివృద్ధి చేశారని, అలాంటి ది అదే చానల్ కాంగ్రెస్ పార్టీ అధినేత ను అగౌరవపరుస్తూ తప్పుడు కథనాలను ప్రసారం చేసినందుకు నిరసనగా సాక్షి దినపత్రికలను దహనం చేయడం జరిగిందన్నారు.

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై దొంగ క్లిప్పింగ్‌లను చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి చెంది ఆ పార్టీకే నామాలు పెట్టడం అంటే తి న్నింటి వాసాలు లెక్కించినట్టేనని వి మర్శించారు.

పోల వరం డిజైన్ మార్పు సాధ్యం కాదు

పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుంటే ఐదు జిల్లాలు తీవ్రంగా నష్టపోతాయని పోల వరం ప్రాజెక్టు సాధన కమిటీ కన్వీనర్ యర్రా నారాయణస్వామి అన్నారు.

30 ఏళ్ళ కిందట అప్పటి ముఖ్యమం త్రి టి.అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, అదే డిజైన్‌తో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో తిరిగి శంకు స్థాపన చేసి వేలాది కోట్ల రూపా యలు ఖర్చుపెట్టారని ఆ ప్లాన్ మేరకు కుడి, ఎడమ కాలువలు తవ్వారని అన్నారు. ఈ పరిస్థితుత్లో డిజైన్ మార్పు సాధ్యం కాదని.. మారిస్తే తాగునీరు, సాగునీరు కు తీవ్ర కొరత ఏర్పడుతుందని యర్రా స్పష్టం చేశారు.