4, ఏప్రిల్ 2011, సోమవారం

ఉప ఎన్నికల్లో గెలుపు మాదే : నన్నపనేని

కడప ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయన్న ఆరోపణలపై తీవ్రస్థాయిలో స్పందించిన ఆమె అందుకు రుజు వులు చూపించగలరా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యే దుస్థితికి దిగజారదని స్పష్టం చేశారు. కడప ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులే లేరు కదా అన్న ప్రశ్నకు మైసూరారెడ్డి ఉన్నారు కదా...ఎవరు అభ్యర్థులుగా ఉన్నా గెలవడమే తమ లక్ష్యమన్నారు.

"దమ్మరో దమ్" పై హైకోర్టుకెళ్లనున్న గోవా మంత్రి

రానా, అభిషేక్ బచ్చన్, బిపాసా బసు, దీపికా పదుకునె నటిస్తున్న "దమ్మరో దమ్" చిత్రంపై హైకోర్టుకెళ్లనున్నట్లు గోవా పర్యాటక మంత్రి నీలకంఠ హలార్కర్ తెలిపారు. చిత్ర దర్శకుడు రోహన్ సిప్పీ గోవా ప్రతిష్టను దిగజార్చే విధంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని మంత్రి ధ్వజమెత్తారు.

ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని అసెంబ్లీలో సైతం లేవనెత్తారు గోవా మాజీమంత్రి మిక్కీ . ఎట్టి పరిస్థితుల్లో ప్రదర్శించనీయకుండా అడ్డుకోవాలని ప్రజలకి సూచిన్చారాయన. భారతదేశంలోనే ప్రముఖమైన టూరిస్ట్ స్పాట్‌గా ఉన్న గోవాను చిత్రంలో దారుణంగా చూపారనీ, ఈ చిత్రం వల్ల పర్యాటకం కేంద్రంగా భాసిల్లుతున్న గోవాకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

సోనియా ఇక ఇటలీకి వెళ్లక తప్పదు

డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పార్టీకి క్వార్టర్ బాటిల్ గుర్తు ఇచ్చి ఉండాలని జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి ఎద్దేవా చేశారు. తాగిన మైకంలో విజయకాంత్ తన అభ్యర్థిని ప్రచారసభలో కొట్టడం దారుణమన్నారు. జీ స్పెక్ట్రం కుంభకోణంలో రాజా ఒక్కరే నిందితుడు కాదని ఇందు లో దయాలు అమ్మాళ్, రాజాత్తి అమ్మాల్, కనిమొళి, చిదంబరం కూడా ఉన్నారని, చిదంబరం దేశంలోనే పెద్ద కోటీశ్వరుడు ... ఇతర దేశాల్లోని బ్యాంకుల్లో రూ. 50 వేల కోట్లను దాచి ఉంచారని ఆరోపించారు. మాఫి యా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు పాల్వాకు లెసైన్స్ ఇవ్వకూడదని హోంమంత్రి చిదంబరం అప్పటి టెలి కాం శాఖ మంత్రి రాజాకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ ఇక రోజు లు లెక్క పెట్టుకోవాల్సిందేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆఖరి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అని, సోనియాగాంధీ ఇక ఇటలీకి వెళ్లక తప్పని పరిస్థితి వస్తుం దని అన్నారు. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలవడం తథ్యమన్నారు.

పూనం నగ్నప్రదర్సన ప్లేస్ మారింది

మొన్నా మధ్య భారత జట్టు ప్రపంచకప్‌ గెలుచుకుంటే... ఆ క్రీడామైదానంలోనే తాను నగ్నప్రదర్శన చేస్తానని సంచలన ప్రకటన చేసిన బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే .. మాచ్ విన్ అయ్యాక మనిషి కనిపించాడ మానేయతమే కాకుండా. మీడియాకి అందుబాటులో లేకుండా సెల్ స్విచా ఆఫ్ చేసి పడేసింది. నగ్నప్రదర్శన పూర్తిగా వ్యక్తిగతమైనది పెద్దలకు ఇదొక చికిత్సాధ్యయనం లాంటిది ఇది ఎంతమాత్రం నేరం కాదు అని గర్వంగా ప్రకటించు కొన్న ఈ భామా.. తన ప్రదర్సన ముంబై లో జరగకపోవటం విచారం వ్యక్తం చేస్తూ... ప్రేమనగరంగా ఖ్యాతిగడించిన పారిస్‌కు మర్చేసినట్లు సన్నిహితుల వద్ద ప్రకటించిందట. అభిమానుల నిరాసాని అర్ధం చేసుకొనే పూనమ్‌ పాండే గుర్తించారో నగ్నప్రదర్శన చేస్తానంటూ ప్రకటించింద ట. భారత్‌లో కాకుంటే మరే దేశంలోనైనా తన నగ్నప్రదర్శనకు అవకాశం కల్పించాలని కూడా అమ్మడు బికికిఐ కి చేసిన విజ్ఞప్తి పై ఇప్పటికే భోపాల్‌ కోర్టులో ఓ కేసు నమోదైంది. అంతేగాక ముంబై పోలీస్‌ కమిషనర్‌కు కూడా బిజెపి మహిళా నేత అరుప్‌ పట్నాయక్‌ ఫిర్యాదుచేశారు. ఈనేపధ్యంలో పూనమ్‌ తన పంతం ఎలా నేరవేర్చుకొంటుందోచూడాలి

మా ఆయన తగ్గితే.. పులివెందుల బరిలో నేనున్నా

దివంగత మహానేత వైఎస్ఆర్ సతీమణి వైఎస్.విజయలక్ష్మిపై తన భర్త రాష్ట్ర మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి పోటీకి వెనుకంజ వేస్తె.. తాను పోటీ చేసేందుకుసిద్ధంగా ఉన్నట్టు సతీమణి వైఎస్.సౌభాగ్యమ్మ తన కుటుంబ సభ్యులకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఉగాది పర్వదినాన.. వివేకా కుటుంబ సభ్యులంతా ఇంట్లో సమావేశమై.. పులివెందుల ఎన్నికల గురించి మాట్లాడు కొన్నట్లు తెలుస్తోంది. పులివెందులలో పోటీ తప్పుకోవడం ద్వారా వైయస్ అంటే అధిష్టానానికి అభిమానం ఉందనే సానుభూతిని కడప పార్లమెంట్ స్తానంలో ఉపయోగించుకోవాలని తద్వారా పార్లమెంటు అభ్యర్థిగా వివేకాను పోటీకి నిలిపితే జగన్ మెజార్టీ భారీగా తగ్గిన్చవచ్చాన్న వాదనతో సౌభాగ్యమ్మ అంగీకరించలేదు సరికదా... తన భర్త వెనుకంజ వేస్తె.. తాను పోటీ చేసేందుకుసిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పడంతో అడిసగా కాంగ్రెస్స్ పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఆత్మగౌరవం కోసం రాజీనామాలివ్వల్సిందే

తెలంగాణ ఆత్మగౌరవం కోసం ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేయాలని తెలంగాణ జిల్లాల ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తడగొండ సత్యరాజ్ వర్మ డిమాండ్ చేశారు. తెలంగాణలోని ప్రజాప్రతినిధులు పదవులను పట్టుకుని వేలాడుతూ రాజీనామాలు చేయకపోవడంతోనే కేంద్రం స్పందించడంలేదన్నారు.

ఇప్పటికైనా తెలంగాణలోని ఎంపీ,ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు.లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఆదరిస్తున్న అందరికి 'ఉగాది' శుభాకాంక్షలు

పోచారంకి పూలు.. చంద్రబాబు కి చెప్పులు

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన శ్రీనివాస్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ కుల సంఘాల ఐక్యవేదిక తెలంగాణ వి షయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న చంద్రబాబు చిత్రపటానికి చెప్పులదండ వేసి నిరసన వ్యక్తం చేసింది. ఆది లాబాద్ జిల్లా బెల్లం పల్లెలో తెలంగాణ కుల సంఘాల ఐక్యవేదిక ఈ విన్నూత్న నిరసన కార్యక్రమం చేసింది.

శివాజి హీరోగా పెళ్ళాం ఊరెళితే... సీక్వెల్

శ్రీకాంత్, వేణు కాంబినేషన్ లో ఎస్.వి.కృష్ణారెడ్డి దర్సకత్వంలో వచ్చిన పెళ్ళాం ఊరెళితే చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే.ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ రెడీ కాబోతోంది.శివాజి హీరోగా ఈ చిత్రం త్వరలో తెరకెక్కబోతోంది. కామిడీ చిత్రాల డైరక్టర్ గాంధీ ఈ సినిమా కి డైరక్ట్ చేయనున్నట్లు సమాచారం..గతంలో అదిరిందయ్యా చంద్రం, మిస్సమ్మ, శ్రీరామచంద్రులు వంటి ఫ్యామిలీ చిత్రాలలో నటించిన శివాజి ఈ చిత్రం తో మళ్ళి ఓ వెలుగు వేలుగుటాడని పరిశ్రమ వర్గాలు కూడా భావిస్తున్నాయి.

14 న పవన్ కళ్యాణ్ 'తీన్ మార్'

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం తీన్ మార్ చిత్రం ఈ నెల 14 వ తేదిన విడుదల చేయనున్నట్లు నిర్మాత గణేష్ బాబు ప్రకటించారు.

ఈ సందర్బంగా నిర్మాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ...పవన్‌కళ్యాణ్ ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో నటించారు. అర్జున్ పాల్వాయ్, మైఖేల్ వేలాయుధం పాత్రల్లో ఆయన అద్భుతం. పవన్‌కళ్యాణ్ నుంచి ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అదే వంద శాతం స్క్రీన్‌మీద ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కెరీర్‌లోనే ఇది బెస్ట్ మూవీగా నిలుస్తుం దన్నారు.

ఎన్టిఆర్ వివాహానికి ఆనందసాయి భారీ సెట్

మే ఐదున జరగబోయే ఎన్టిఆర్ వివాహానికి భారీ సెట్ వేస్స్ భాద్యతలు సినీ ఆర్ట్ డైరక్టర్ ఆనందసాయి తీసుకొన్నారు. తాజాగా పనిచేసిన శక్తి చిత్రం విడుదలై రిజల్ట్ ఎలా ఉన్నా అందులోని ఆనందసాయి వేసిన సెట్స్ కు మంచి పేరు వచ్చాయి. 35 అడుగుల కాళికా దేవి విగ్రహాన్ని ఆయన రూపొందించిన తీరు చిత్ర సీమలో నే కాదు యావత్ ఆంధ్ర దేశమంతా
చర్చనీయాంశంగా మారింది. ఈ నేపద్యంలో ఎన్టిఆర్ వివాహానికి పెళ్లి సెట్ వేసీ అవకాశం రావటం తో ఉబ్బి, తబ్బిబ్బవుతున్నాడు.

గొంతు తడిపేందుకు.. బీరు, విస్కీలు పుష్కలం

అసలే వేసవి కాలం.. అందులో భ గ్గున మండే ఎండలు.. గుక్కెడు నీళ్లు తాగి దూప తీర్చుకోవడం కంటే చల్లని బీరు తాగి సేద తీరడమే మేలంటున్నా రు 'బీర్' ప్రియులు. గొంతు తడిపేందుకు గుక్కెడు నీళ్లు దొరకకున్నప్పటికీ చల్లని బీర్లు మాత్రం అందుబాటులో ఉంటున్నాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అం తటా మద్యం దుకాణాలు వెలిశాయి. ఇక ప్రతి పల్లెలోనూ, పల్లెల్లోనీ వాడల్లోనూ బెల్ట్‌షాపులు వెలిశాయి. పల్లెల్లో చెంబెడు నీళ్ల కోసం మైళ్ల దూరం నడవాల్సి ఉండగా బీర్లు మాత్రం ప్రతి పల్లెలోని ప్రతి గల్లీలో దొరుకుతున్నాయి.

మంచినీళ్లు దొరకకున్నప్పటికీ బీర్లు మాత్రం పొంగిపొర్లుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోనప్పటికీ అబ్కారీ అధికారుల పుణ్య మా..! అని పల్లె పల్లెల్లో వెలసిన బెల్ట్‌షాపుల మూలంగా చల్లని బీర్లు లభిస్తున్నాయి.

పల్లె ప్రజానీకానికి తాగునీరందించేందుకు పెద్దగా శ్రద్ధాసక్తులు కనబరచని ప్రభుత్వం ప్రతి ఏటా మద్యం విక్రయాలపైనే దృష్టిని కేంద్రీకరించింది. ఫలితంగా ఇటు మద్యం దుకాణాలతోపాటు అటు దాబాలు, బెల్ట్‌షాపుల్లో చల్లనీ బీరు, విస్కీలు పుష్కలం గా లభిస్తున్నాయి.

తాగేందుకు బిందెడు నీళ్లు తెచ్చేందుకు నిరాకరించే మందుబాబులు చల్లని బీర్లు తెచ్చుకుని తాగడంపైనే మక్కువ కనబరుస్తున్నారు.

స్వాతంత్రాన్ని ఇప్పుడే సాధించుకోన్నామా?

భారత్ మ్యాచ్ గెలిచిన తర్వాత స్వాతంత్రాన్ని ఇప్పుడే సాధించుకోన్నామా అన్నంత ఆనందం ప్రతి ఒక్కరిలో కలిగిందని అమితాబ్ ట్విట్టర్‌లో రాసుకున్నారు. సాధారణంగా భారత్ మ్యాచ్ జరిగేటప్పుడు తాను అసలు చూడనని, అయినా 33 పరుగులకు 2 వికెట్లు పడిపోయినా.. చివరి మ్యాచ్ విన్నింగ్ షాట్ లో కెప్టెన్ ధోని సిక్స్ కొట్టేవరకూ టెలివిజన్‌కు అత్తుకుపోయి కూర్చున్నానని ఆయన తెలిపారు. భారత్ గెలిచినా ఆనందంలో.. నేనే అది గెలిచానన్న ఫీలింగ్ కలిగి చిన్నపిల్లలా మాదిరిగా అభిషేక్, ఐశ్వర్యల తో కలిసి కారు టాప్‌పై కూర్చుని త్రివర్ణ ప్రతాకాన్ని ఊపడం చెప్పనలవి కాని గొప్ప అనుభూతి అని అన్నారు. అల్లాగే సినీ ఇండస్ట్రీ లో సాద్యం కాని రజని, గజనీ, ధోనీల అపూర్వ కలయిక క్రికెట్ తో సాధ్యమైంది అని తెగ ఆనంద పడిపోయారు అమితాబ్...