26, ఫిబ్రవరి 2011, శనివారం

మెరుపు సినిమా నిలిచిపోయినట్టే ...

రామ్‌చరణ్‌ నటిస్తున్న మెరుపు సినిమాకు బ్రేక్‌ పడిందనేది తాజా వార్త. మెగా సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ నిర్మిస్తున్న చిత్రమిది. తిరుపతికి చెందిన ఎన్‌.వి.ప్రసాద్‌ ఇందులో పార్టనర్‌. ఈయన చిరంజీవికి అత్యంత ఆప్తులు. తిరుపతి నుండి చిరంజీవి పోటీ చేసినపుడు దగ్గరుండి అన్నీ చూసుకున్నారని అంటారు. ఆ అభిమానంతో రామ్‌చరణ్‌ డేట్స్‌ పొందారు. ఇంతకు ముందు పవన్‌కల్యాణ్‌తో 'బంగారం' సినిమా తీసిన ధరణి ఈ చిత్రానికి దర్శకుడు. కాజల్‌ నాయిక. అట్టహాసంగా ప్రారంభించిన ఈ చిత్రం ఇప్పుడు నిలిచిపోయినట్టే అంటున్నారు. ఆ మధ్య ఒక పాటని చెన్నైలో తీశారు. దీనికోసం మూడున్నర కోట్లు అయిందట. ఇంకా కొన్ని సన్నివేశాల చిత్రీకరణకు మరికొన్ని కోట్లు అయ్యాయట. ఇదే పద్దతిన సినిమా తీస్తే దాదాపు 40 కోట్లు ఖర్చవుతుందని నిర్మాత అంచనాకి వచ్చారు. ఇంత ఖర్చు పెడితే వర్కవుట్‌ కాదని నిర్మాతలు తెలుసుకున్నారు. రామ్‌చరణ్‌ 'ఆరెంజ్‌' సినిమా కూడా అధిక బడ్జెట్‌ వల్ల నష్టపోయిన విషయం మెరుపు నిర్మాతల కళ్లముందు మెదిలింది. రామ్‌చరణ్‌ మార్కెట్‌ పరిధిని మంచి ఖర్చు చేయడం కంటే సినిమా నిలిపివేయడమే బెటర్‌ అనే ఆలోచనతో ఉన్నారట. సినిమా ఆగిపోతే ఇబ్బంది కాబట్టి, ఎలాగైనా సరే కంటిన్యూ చేసేలా చిరంజీవి వర్గీయులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు దర్శకుడిని మార్చేయాలని కూడా ఆలోచిస్తున్నారట. ఈ విషయమే చెన్నైలో చర్చలు జరుగుతున్నాయి.

సునీల్‌ పుట్టిన రోజు ఫిబ్రవరి 28.

కొందరికి తొలి ప్రయత్నమే ఘనవిజయం తీసుకొచ్చి, రెండుమూడు విజయాలు వరసగా వచ్చి, కిక్కిచ్చేయడంతో అహం పెరిగి అది డీలా పడేట్టు చేస్తుంది. కొందరికి రెండు మూడు ప్రయత్నాలు చేసినా పని జరగక నిరాశ నిస్పృహలకు గురిచేసి ప్రాప్తం లేదు కలిసిరాదు అనే వేదాంత ధోరణితో ఏర్పరుచుకుని ఏ ప్రయత్నాలూ చేయరు. కొందరికి తొలి ప్రయత్నం ఫెయిల్‌ అయినా నిరుత్సాహం రాక పోవడంతో మరి ప్రయత్నం సక్సెస్‌ అవుతుంది. అలాటి వారిలో సునీల్‌ ఒకరు.

డ్యాన్సులమీద దృష్టి పెడితే, నాటకం మీద దృష్టి పెడితే కలిసిరాలేదు. తరువాత డ్యాన్స్‌ పోటీల్లో వరసగా గెలుపొందారు. హైదరాబాద్‌ వచ్చి డ్యాన్స్‌ స్కూల్లో కొంతకాలం డ్యాన్సు ప్రాక్టీసు చేసారు. అలాగే సినిమా చాన్సులకోసం ప్రయత్నిస్తే 'సెకండ్‌ హాండ్‌' చిత్రంలో చాన్స్‌ వచ్చాక ఆ సినిమా ఆగిపోయింది. భీమవరం పరిసర ప్రజల ఇష్టదైవమైన మావుళ్ళమ్మ భక్తుడుగా ఆమె అనుగ్రహంచి చిరునవ్వు నవ్వగా 'చిరునవ్వు' చిత్రం వచ్చింది. ఆ తరువాత 'నువ్వే కావాలి'లో నటించారు. 'నువ్వే కావాలి' ముందు విడుదల కావడంతో గుర్తింపు వచ్చింది. వరసగా ఆరు చిత్రాలు హిట్‌ కావడంతో హాస్యనటుడుగా స్థిరపడిపోయారు. తన పెర్సనాల్టిdకి విలన్‌ పాత్రలు వస్తాయని అనుకుంటే కామెడీ వేషాలు వచ్చి కామెడీ ఆర్టిస్ట్‌ అయిపోయారు.

డ్యాన్సులు తెలిసి బాగా చేయగలిగే కామెడీ ఆర్టిస్ట్‌ సునీల్‌- అని రామ్‌గోపాల్‌ వర్మ నుంచి ప్రశంసలు పొందారు. అందాల రాముడులో హీరో అయిన సునీల్‌ని రాజమౌళి 'మర్యాద రామన్న' గా చూపారు. రెండూ హిట్‌ కావడంతో వర్మ దృష్టిలో పడి 'కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం అప్పల్రాజు' చిత్రంలో దర్శకుడు అయ్యారు. హీరోగా ఒక చిత్రానికి మరో చిత్రానికి వచ్చిన గ్యాప్‌లో కామెడీ ఆర్టిస్ట్‌ గానే కొనసాగుతున్నా, హీరోగానే చేస్తాడట ఇక కామెడీ పాత్రలకు ఫుల్‌స్టాప్‌ అనే వదంతులూ వ్యాపించాయి. సునీల్‌ పుట్టిన రోజు ఫిబ్రవరి 28.

ఇద్దరూ డాక్టర్ల యాక్షన్‌ సినిమా

ఒకరు ఒరిజినల్‌ డాక్టర్‌ మరొకరు డాక్టరేట్‌ పురస్కార గ్రహీత. ఇప్పుడు వీరిద్దరు కలిసి నటిస్తున్నారు. డా.రాజశేఖర్‌, డా.శ్రీహరి కాంబినేషన్‌లో సినిమా తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇద్దరూ హీరోలుగానా లేక ఇద్దరిలో ఒకరిది ప్రత్యేక పాత్ర అనే విషయాన్ని దర్శక, నిర్మాతలు త్వరలో ప్రకటిస్తారు. యాక్షన్‌ చిత్రాలు తీయడంలో తనకంటూ ప్రత్యేకత కలిగిన కె.ఎస్‌.నాగేశ్వరరావు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుందని తెలిసింది. దీనిని వస్త్ర వ్యాపారి నాగభూషణం నిర్మిస్తారని సమాచారం. శ్రీహరి హీరోగా నిలబడడానికి కె.ఎస్‌. నాగేశ్వరరావు ఎంతగానో తోడ్పాటు అందించారు. శ్రీహరి హీరోగా ప్రారంభంలో వచ్చిన మూడు సినిమాలు పోలీస్‌, దేవా, సాంబయ్య వీటికి ఆయనే దర్శకుడనే విషయం తెలిసిందే.

ఫిమేల్‌ ఉన్నికృష్ణన్‌

మలయాళంలో 'ఫిమేల్‌ ఉన్నికృష్ణన్‌' టైటిల్‌తో పూర్తి హాస్యభరితంగా రూపొందిస్తున్నారు. డూప్లికేట్‌ చిత్రంతో హీరోగా రంగప్రవేశం చేసిన సూరజ్‌ వెంజర్‌ మూడు ఇందులో టైటిల్‌ పాత్ర పోషిస్తున్నాడు. ఇతడు మహిళ పాత్ర పోషించడం లేదు అయినా ఆ టైటిల్‌ పెట్టారు.

కొంతమంది మగవాళ్ళ కంఠస్వరం ఆడవాళ్ళు మాట్లాడుతున్నట్టు విచిత్రంగా వుంటుంది. అదే ఈ చిత్రానికి ముఖ్యమైన పాయింట్‌. ఆడవాళ్ళ కంఠస్వరంలా వుండటంతో అతడు మగవాడే అయినా ఫిమేల్‌ ఉన్ని కృష్ణన్‌గా పాప్యులర్‌ అయ్యాడు తన వూరు జనానికి. ఎందుకంటే అతను మాట్లాడుతూంటే ఆ స్వరం అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంది. దీన్ని బేస్‌ చేసుకుని కథ అల్లారు దర్శకుడు మధు.

సలీమ్‌ కుమార్‌, జగతి, బిజూ కుట్టన్‌, కళాభవన్‌ ప్రజోడ్‌ మున్నగు హాస్య నటులు కూడా నటించడంతో ప్రతి సీన్‌ కామెడీని పండిస్తుందంటున్నారు దర్శకుడు కె.బి.మధు.

మహాలక్ష్మి అనే యువతి హీరోయిన్‌గా, షాజి సుకుమారన్‌ సంగీత దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. తుళుజి, వేగమాన్‌, మున్నార్‌ పరిసరాల్లో సినాలి ఫిలిమ్స్‌ పతాకాన నిర్మాత షిజాయ్‌ వర్గీస్‌ షూటింగ్‌ పూర్తి చేసారు.

సోనియా మౌనరాగం ... మన్మోహన్‌ ప్రేక్షకపాత్ర ...

తెలంగాణ అంశం పల్లె నుండి ఢిల్లీ చేరింది. జరగాల్సింది అదే. గతంలో కూడా అనేకసార్లు ఆ విధంగా జరిగింది. అయితే, ఢిల్లీ పెద్దలు సమస్యను సత్వరంగా పరిష్కరించలేకపోగా, తెలంగాణ నేతలను, ప్రజలను సంయమనం పాటించాలని కోరుతున్నారు. సోనియాగాంధీ మౌనరాగాన్ని అర్థం చేసుకున్న ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ పార్లమెంట్‌ సాక్షిగా ప్రేక్షకపాత్ర వహించగా, కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సభ్యులు, వీరప్ప మొయిలీ, ప్రణబ్‌ ముఖర్జీలు మాత్రం తమదైన శైలిలో స్పందించారు. మొన్నటి లోక్‌సభ సమావేశాల్లో మొదటిరోజు రాష్ట్రపతి ప్రసంగం అయిన వెంటనే కాంగ్రెస్‌ ఎం.పి.లు ''తెలంగాణ కావాలి, సోనియా గాంధీ జిందాబాద్‌'' అనే నినాదాల ప్లకార్డులు ప్రదర్శించి తమ ద్విపాత్రాభినయం చేశారు. రెండవ రోజు, ఢిల్లీ చేరుకున్న కెసిఆర్‌, విజయశాంతిలు వాయిదా తీర్మానం కోసం పట్టుపడుతుండగా, కాంగ్రెస్‌ ఎం.పి.లు తమ సీట్లలో కూర్చొని 'జిందాబాద్‌'లకు పరిమితమైనారు. స్పీకర్‌ మాటలను నమ్మిన కెసిఆర్‌ కూడా తన కార్యక్రమాన్ని మూడో రోజుకు వాయిదా వేసుకున్నాడు. తీరా మూడో రోజు వచ్చేసరికి, వాయిదా తీర్మానం బదులు శూన్యకాలం (జీరో అవర్‌) లోనే తెలంగాణ అంశం ప్రస్తావించాలని స్పీకర్‌ చెప్పడంతో, గత్యంతరం లేని పరిస్థితిలో కెసిఆర్‌ తదితరులు పోడియం వద్దకు వెళ్ళే ప్రయత్నం చేయగా, సభను మూడుసార్లు వాయిదా వేశారు. ఆ సందర్భంలో కాంగ్రెస్‌ ఎం.పి.లు తమ స్థానాలను అట్టిపెట్టుకుని 'జిందాబాద్‌' నినాదాలను కొనసాగించారు. తెలంగాణ తెలుగుదేశం ఎం.పీల్లో ఒకరు మౌనంగా ఉండగా, మరొకరు జిందాబాద్‌ అంటూ నవ్వులపాలైనారు. బి.జె.పి. నేత సుష్మా స్వరాజ్‌ చొరవ, తెలంగాణ పట్ల ఆమె ప్రస్తావన నాటి సభికుల కళ్ళు తెరిపించినట్లయింది. సందర్భోచితంగా ఆమె చేసిన వ్యాఖ్యలు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టటమే కాకుండా తెలంగాణ డిమాండ్‌ న్యాయబద్ధతను ఢిల్లీ పెద్దలు గుర్తించేలా ఉన్నాయి!

ప్రతి అంశం రాజకీయం చేసి, ఎన్నికల్లో ప్రయోజనాలు ఎలా పొందాలని ఎత్తుగడలేసే అన్ని పార్టీల నేతలు, సహజంగా తెలంగాణ లాంటి కీలక అంశాన్ని నిజాయితీగా పరిష్కరిస్తామని అనుకోలేము. అందుకే, దశాబ్దాల తరబడి కాలయాపన చేసి ఎవరు అధికారంలో ఉన్నా, సమస్యను మరింత సంక్లిష్టం చేయడమే గాని ఇంతవరకు పరిష్కరించలేదు. ప్రతిపక్షంలో వున్నప్పుడు మాత్రం, వీరోచిత పోరాటాలకైనా, ప్రకటనలకైనా సిద్ధం అన్నట్లు వ్యవహరిస్తారు. దాదాపు అన్ని పార్టీలు, వారి మిత్రపక్షాలు తెలంగాణ సమస్యను నాన్చటంలో ప్రధాన భూమిక పోషించాయి. అందుకే, నేడు తెలంగాణ అగ్నిదావానలంలా అన్ని పార్టీలకు అంటుకుని ఉంది. రాష్ట్రం మొత్తం (తెలంగాణతర ప్రాంతాలు కూడా) ఈ తెలంగాణ సెగతో ఉడికిపోతోంది. దశాబ్దాల పోరాటం సరే, గత ఏడాదిగా రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఉద్యమ ప్రకంపనలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రులు మారినా, ప్రభుత్వాలు అచేతనంగా ఉన్నాయి. విద్యావ్యవస్థ కుప్పకూలింది. ఉద్యోగులు సహాయ నిరాకరణ చేస్తుండగా ప్రభుత్వ యంత్రాంగం అస్తవ్యస్తమైంది. సగటు పౌరులు, అన్ని ప్రాంతాల వారు ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రత్యేకించి, రోడ్డు రవాణా పరిస్థితులు అతలాకుతలమైనాయి. అయినా, ఆమాత్యులు మాత్రం తమ పాలన సాఫీగా జరుగుతున్న భ్రమల్లో ఉన్నారు. సహజంగా, సగటు ప్రజలు బేజారైనట్టి భావన వుంది. ఎంత త్వరగా తెలంగాణ సమస్యను పరిష్కరిస్తే అంత మేలు జరుగుతుందని ఆశిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రమొచ్చినా ఫర్వాలేదని సీమాంధ్ర ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. కాకపోతే, సుహృద్భావ వాతావరణంలో రాష్ట్ర విభజన జరగాలే కాని, అంతర్యుద్ధ పరిస్థితులు తెచ్చి పెట్టవద్దని రాజకీయ పార్టీలను కోరుతున్నారు.

మహాభారతంలో అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకున్న పరిస్థితి నేటి కాంగ్రెస్‌ ప్రభుత్వానిదైంది. 2004 ఎన్నికలనాడు తెరాసతో పొత్తు పెట్టుకుని, తెలంగాణకు సానుకూలంగా చెప్పి, అధికారంలోకి వచ్చి, మొండిచెయ్యి చూపాలనుకుంటే, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ వారికి చావుతప్పి కన్నులొట్టపోయిన పరిస్థితి ఎదురైంది. వైఎస్‌ఆర్‌ మరణంతో, దాదాపు చావు పరిస్థితే కాంగ్రెస్‌ ఎదుర్కోవలసి వస్తుంది. కనీసం తెలంగాణను తక్షణమే పరిష్కరించినా నేడా పద్మవ్యూహ పరిస్థితి ఉండకపోయేది కాదు. మొదట్లోనే కెసిఆర్‌ను విశ్వాసంలోకి తీసుకొని, రాష్ట్ర సాధనకొక కాలపరిమితిని ప్రకటించి ఉండాల్సింది. డిసెంబర్‌ 9, 2009 నాటి చిదంబరం ప్రకటననుసారం తెలంగాణ ప్రక్రియ కొనసాగవలసింది. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు స్పష్టంగా ప్రకటించాల్సి వుండేది. కాలయాపన జరిగినా సరే శ్రీకృష్ణ కమిటి సిఫార్సులు పరోక్షంగానైనా తెలంగాణకు అనుకూలంగా ఉన్నందున కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సింది. కమిటీ సిఫార్సులు నెలలు గడిచినా ఇంకా కేంద్ర విధానం అస్పష్టంగా ఉండడం వల్ల నేడా పద్మవ్యూహం ఎదురౌతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ ప్రజలు, పార్టీల కతీతంగా ఉద్యమబాట పట్టారు. ఉధృతం చేస్తున్నారు. ఇంకెంత కాలయాపన చేస్తే, ఆ మేరకు కాంగ్రెస్‌ ఎలాగు నష్టపోతుంది. యావత్‌ రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు నష్టపోతారు. కేవలం రెండు రోజుల తెలంగాణ బంద్‌నే చూశాము. వారం రోజుల బంద్‌ ప్రకటిస్తే ఏమవుతుందో ఆలోచించాలి. రాజధాని హైదరాబాద్‌ తెలంగాణలో ఉన్నందున, యావత్‌ రాష్ట్ర పరిపాలన కుంటుపడుతుంది. కనీసం తిరుపతి లాంటి పుణ్య క్షేత్రాలు కూడా దర్శించుకోలేని పరిస్థితి ఏర్పడింది. వీటన్నింటి ప్రభావం చివరికి తెలుగువారి మధ్య మానసిక దాడులతో పాటు, భౌతిక దాడులు జరిగే దుస్థితికి కారణమవుతుంది.

ఈ నేపథ్యంలో పరిశీలిస్తే, సత్వరమే తెలంగాణ ప్రకటనతో పాటు పార్లమెంటరీ ప్రక్రియ కొనసాగిస్తే, కాంగ్రెస్‌ గట్టెక్కవచ్చు. పద్మవ్యూహం నుండి బయటపడవచ్చు. కాదంటే, ప్రతిపక్ష బి.జె.పి.తో బిఎస్‌పి లాంటి ఇతర పక్షాలు, తెలంగాణాలో అనుకూలంగా తీర్మానించాయి. సభలో గట్టిగా నిలబడ్డాయి. అటువంటప్పుడు, 2జి స్పెక్ట్రం కుంభకోణంపై జెపిసిని వేయటానికి వెనుకంజవేసి ఇంతకాలం పరాభవం పాలైన కాంగ్రెస్‌ మాదిరిగా, తెలంగాణ విషయంలో కాలాతీతమౌతోంది. ఇటు రాష్ట్రంలో, తెలంగాణలో, బయటా కాంగ్రెస్‌ పరపతి దిన దినగండంగా మారుతోంది. ఈ తెలంగాణ పోరాటాలు ఇంత కంటె తీవ్రరూపం దాల్చి, కాంగ్రెస్‌ను అధోగతి పాలు చేస్తాయి. పరిస్థితి విషమిస్తే, మరో రెండేళ్ళు ఆగటానికైనా తెలంగాణ వాదులు సిద్ధపడి, బి.జె.పి. ప్రభుత్వం ఏర్పడటానికి సాయపడవచ్చు. ఆ దిశలో కెసిఆర్‌ తదితరులు ప్రయత్నిస్తున్న సంకేతాలొస్తున్నాయి. అటువంటప్పుడే, కాంగ్రెస్‌లో విలీనం కావాల్సిన దుస్థితి కెసిఆర్‌కి కూడదు. తెరాసనే బలోపేతం చేస్తూ, కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో కెసిఆర్‌ చక్రం తిప్పవచ్చు. కేవలం తెలంగాణ కోసం, కాంగ్రెస్‌ చెప్పినట్లు నడుచుకోటానికి కెసిఆర్‌ సిద్ధంగా లేడిప్పుడు. కుప్పిగంతులు వేయదు. కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పటానికి బి.జె.పి.తో, టిడిపితో జట్టు కట్టడానికైనా ఆయన వెనుకాడడని అర్థం చేసుకోవాలి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కెసిఆర్‌ వ్యూహాలను తెలంగాణ ప్రజలు సమర్థించాల్సి వస్తోంది. అదే జరిగితే తెలంగాణ రాష్ట్రం వాయిదా పడి కెసిఆర్‌ రాజకీయాలు గెలుస్తాయి. కాంగ్రెస్‌ బదులు బి.జె.పి. అధికారంలోకి వచ్చినంత మాత్రాన తెలంగాణ వస్తుందా అనే ప్రశ్న ఎలాగున్నా, కుక్కకాటుకు చెప్పుదెబ్బ అవసరమని తెలంగాణ ప్రజలు భావిస్తారు. అందుకే ఆలస్యం వల్ల అమృతం విషమవుతుందని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి!

డా కె.విద్యాసాగర్‌ రెడ్డి

అమరజీవి అంకుల్‌ పాయ్‌

అంకుల్‌ పారు అంటేనే 'అమర్‌ చిత్రకథ, టింకిల్‌ కామిక్స' గుర్తుకొస్తాయి. అనంతపారు గురువారం నాడు అనంతలోకా లకు తరలి వెళ్లిపోయారు. ఈ చిత్రకథల రారాజు ఎందరో తమ విశిష్ట సేవలతో, గత 44 సంవత్సరాలుగా తన కథ లతో, కామిక్సతో నవ్వుల పువ్వుల్ని పండిస్తూ, దేశంలోనే కాక ప్రపంచఖ్యాతినార్జించి, ఎందరో బాలబాలికల అభిమా నాన్ని చూరగొన్నారు.

అనంతపారు వెంకటరాయ, సుశీల పారు దంపతులకు సెప్టెం బర్‌ 17, 1929లో కర్ణాటకలోని కర్క లలో జన్మించారు. వారు కెమిస్ట్రీ, ఫిజిక్స, కెమికల్‌ టెక్నాలజీ చదివినా, ప్రవృత్తి రీత్యా కామిక్స ప్రచురణలంటే ఎంతో ఇష్టమాయనకు. 1954లో 'ఎడిటింగ్‌ పబ్లిషింగ్‌' రంగంలోకి ప్రవేశించారు. అమర్‌ చిత్ర కథ సిరీస్‌ను 1967 లో ప్రారంభించారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పుస్తక ప్రచురణ విభాగం 'ఇంక్రజాల్‌' పేరుతో కామిక బొమ్మల సిరీస్‌ని ప్రారంభించారు.

టింకిల్‌ పత్రికను 1980లో ప్రారంభించారు. అమర్‌ చిత్ర కథ 20 భాషలలో వెలువడింది. అంకుల్‌పారుకి పేరు తెచ్చిన టైటిల్స్‌ కృష్ణా, అశోక, అక్బర్‌, రాణిఝాన్సీ, వివేకానంద మొదలగునవి.

చారిత్రకం, జానపదం, వివిధ మతాల సంప్రదాయాలు - వాటి విశి ష్టత, జాతక కథలు, పంచతంత్ర కథలు లాంటి ఎన్నో కథలు,కథానికలు పారుకు అవార్డులు-రివార్డులు సంపాదించి పెట్టాయి. హనుమాన్‌, చాణక్య, అభిమన్యు గాథలు ఆయన కీర్తి ప్రతిష్టలను మరింత పెంచ డమే కాక, బాలబాలకలకు స్ఫూర్థి ప్రదాయకంగా వున్నాయి. ప్రతాప్‌ మల్లిక, రామ్‌ వయీర్‌కర్‌ కుంచెలు తోడవడంతో కథ లకు బొమ్మల అందాలు కలిసి వచ్చి కథలోని పాత్రలు ప్రాణం పోసుకున్నాయి.

అనంతపారు వీరుల గాథలే కాకుండా, ప్రముఖుల జీవిత చరిత్రలు అనేకం రాసారు.

ప్రముఖ చిత్రకారులు ప్రతాప్‌ మాలిక, సౌరెన్‌రారు, ఝప్రే ఫౌలర్‌, హెచ్‌.ఎస్‌. చవాన్‌, మధు పౌలే, చంద్రకాంత్‌, డి.రాణి పారు కథలకు బొమ్మలు వేయడానికి ముందుకు వచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా అంకుల్‌ పారు కథలకు ప్రాముఖ్యత ఏర్పడింది.

అనేక పుస్తకాల షాపుల్లో టింకిల్‌, అమర్‌ చిత్ర కథ పుస్తకాలు కొనుగోలుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రముఖ పాఠశాలలు, గ్రంథాలయ సంస్థలు వీటిని తెప్పించుకోవడం, అనంతపారు ప్రతిభా సంపత్తులకు తార్కాణం. అనంతపారు కర్ణాటక ప్రాంతం వారైనా, వారు వివిధ ప్రాంతాల విద్యార్థుల మనసులను దోచుకున్నారు. వారు ముంబరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నా, అనేక ప్రాంతవాసులు, వారు కథలు చెప్పే తీరు చూసి వారి వారి ప్రాంతాలకు రప్పించుకొని, సత్కార కార్యక్రమాలెన్నో నిర్వహించారు. పారు కేవలం పిల్లలకు కథలు చెప్పడమే కాకుండా వారితో సరదాగా మెలిగేవారు. వారు ఏ అంశం తీసుకున్నా, ఆ కథను తన రచనాశైలితో రక్తి కట్టించేవారనడంలో ఎంతమాత్రం సం దేహం లేదు. వారు వయసు పై బడినా తరం తరం, నిరంతరం వారిని గుర్తుంచుకునేలా రచనలు చేసేవారు. తన రచనలతో ఆబాలగోపాలాన్ని అలరించేవారు. ఈయన కలం నుంచి జాలువారిన ఎన్నో కథలు సిడీలుగా , డివిడిలుగా రూపుదిద్దుకొని మార్కెట్‌లో విస్తారంగా చోటు చేసుకున్నాయి. ఆంధ్రపాఠకులకు చందమామ,బాల మిత్రల్లా, పారు కథలు ప్రపంచ వ్యాప్తంగా చిన్నపిల్లల్ని విపరీ తంగా ఆకర్షిస్తున్నాయి.

ముంబరులోని బెస్ట్‌ బస్సులు అమర్‌ చిత్రకథలను బ స్సులపైకి ఎక్కించాయంటే ఆయన ఎంతటి ప్రతిభాశాలో అర్థం చేసుకోవచ్చు. కొం దరు పాఠశాలలోని ఇళ్ళల్లో కూడా ఇంటీరియర్‌ డిజైన్లుగా అమర్‌చిత్ర కథలను గోడల పైకి ఎక్కించారు.

దీన్నిబట్టి చూస్తే వారు కథలు చెప్పే విధానం, ఆబాల గోపాలాన్ని ఆశ్యర్యపరుస్తుంది. పలు పాఠశాలలు, బోధనా సంస్థలు అమర్‌ చిత్ర కథలను నీతిపాఠాలుగా బోధిస్తున్నాయి.

నేడు టీవీల ప్రభావంగా పుస్తకాలు కొని చదివే అలవాటు కొరవడుతోంది. అయినా, అనంత్‌పారు రాసిన పుస్తకాలకు, టింకిల్‌ మ్యాగజైన్లకు ఏమాత్రం డిమాండ్‌ తగ్గలేదు.

అంకుల్‌ పారు అజరామర కృషి ఫలితంగా ఆయన కలం నుంచి అనేకానేక పుస్తకాలు పిల్లల్లో చైతన్యస్ఫూర్తిని కలిగించి నీతిని బోధిస్తు న్నాయి. నేడు కృష్ణా, హనుమా త్రీడిలుగా వస్తున్నాయంటే వారి స్ఫూర్తికి, అనంతపారు ముఖ్యకారకులు.

వర్ధమాన కాలమానపరిస్థితులకనుగుణంగా, పిల్లల సైకాలజీకి తగి నట్లుగా వారి రచనలు సాగుతూ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. అనంత పారు కథలు కేవలం పిల్లలకే కాక పెద్దలకు కూడా ఆసక్తిదాయకంగా ఉండేవి. దీనికి కారణంగానే వారు కూడా పిల్లలు చదివిన తర్వాత పెద్దలు కూడా చదివేవారు.

అనంతపారు భౌతికంగా నేడు లేకున్నా, చిన్నారి హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న అమరజీవిగా ఆయన పేరు కలకాలం నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.

వివాహానికీ ఉంది బీమా

భారత్‌లో గత సంవత్సరం జరిగిన వివాహ వేడుకల ఖర్చు 1.9 నుంచి 2.25 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా. మీ జీవితంలో దాచి వుంచుకున్న డబ్బులో అత్యధిక భాగం పెళ్ళికి వెచ్చించాలని భావిస్తుంటే మాత్రం ఖచ్చితంగా సెక్యూరిటీని కోరుకుంటారు. మీ డబ్బకు భద్రత కల్పించేందుకు, దురదృష్టకర సంఘటనలు జరిగితే మీకు కలిగిన నష్టానికి పరిహారం అందుతుంది.

చాలా కంపెనీలు ప్రస్తుతం ఈవెంట్‌ ఇన్స్యూరెన్స్‌లో భాగంగా పెళ్ళిళ్లకు బీమా చేస్తున్నాయి. ఈ పాలసీ ప్రధానంగా ప్రమాదం, వివాహం రద్దు లేదా వాయిదా, పెళ్ళి మండపంలో అద్దె వస్తువులకు జరిగే నష్టంలపై కవరేజ్‌ను ఇస్తున్నాయి. ఇదే సమయంలో ఈ పాలసీలను ఎవరికి తగ్గట్టుగా వారు మలచుకోవచ్చు. ఉదాహరణకు ఫుడ్‌ పాయిజనింగ్‌ జరగడం, పవర్‌ ఫెయిల్యూర్‌, భారీ వర్షాలతో కార్యక్రమం రసాభాస కావడం తదితర రైడర్లను ఎంపిక చేసుకోవచ్చు.

దీంతో పాటు ఆభరణాల దొందతనం, సమయానికి పెళ్ళి కొడుకు లేదా పెళ్ళి కూతురు మండపానికి చేరుకోలేక పెళ్ళి వాయిదా పడడం వంటి సంఘటనలకు బీమా ఉంది. ఒకవేళ ఉగ్రవాదుల దాడి జరిగితే... అందుకూ బీమా కవరేజ్‌ లభిస్తుంది.

కవరేజ్‌లోకి రానివి: ఒకవేళ ఇరు వర్గాల మధ్యా మనస్పర్ధలు వచ్చి వివాహం రద్దయితే, బీమా ఉండదు. అయితే, కొన్ని సంస్థలు మాత్రం కట్నం విషయంలో తేడా వచ్చి పెళ్ళి ఆగితే బీమా అందిస్తున్నాయి. పార్టీల అజాగ్రత్తే నష్టానికి కారణమని తేలితే బీమా కంపెనీలు క్లయిమ్‌ చెల్లింపులకు ముందుకు రావు. చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే బీమా కంపెనీ అందించే నియమ నిబంధనలను క్షుణ్ణంగా చదివి పూర్తిగా అర్ధం చేసుకోవాలి.

ప్రీమియం ఎలా..: బజాజ్‌ అలయన్స్‌ 20 లక్షలు, 35 లక్షలు, 58 లక్షలు, 73 లక్షలు ఇలా వివిధ రకాలుగా వివాహ బీమాను అందిస్తోంది. వీటికి వరుసగా 2,252, 4,004, 6,232, 8,273 రూపాయల ప్రీమియంను (సేవా పన్ను కలుపుకొని) చెల్లించాల్సి వుంటుంది.

114 కేంద్రాల్లో 'మిరపకాయ్‌' అర్థశతదినోత్సవం

సంక్రాంతికి విడుదలైన రవితేజ 'మిరపకాయ్‌' 114 కేంద్రాల్లో 50 రోజుల ప్రదర్శన పూర్తిచేసుకుందని ఎల్లోఫ్లవర్స్‌ అధినేత, నిర్మాత రమేష్‌ పుప్పాల తెలిపారు. 'మా సంస్థ తీసిన తొలిచిత్రమే ఇంతటి విజయాన్ని సాధించడం ఆనందంగా ఉంది. ఈ విజయానికి కథానాయకుడు రవితేజ, దర్శకుడు హరీష్‌శంకర్‌, ఇతర యూనిట్‌ సభ్యులు కారణం. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. త్వరలో వేడుక నిర్వహిస్తాం' అన్నారు.

'ఈ సక్సెస్‌ క్రేడిట్‌ అంతా దర్శకుడు హరీష్‌శంకర్‌కు చెందుతుంది. నిర్మాత రమేష్‌ నాకు మంచి స్నేహితుడు అయ్యారు ఈ విజయానికి కారణమైన అందరికీ థాంక్స్‌' అన్నారు రవితేజ.

'షాక్‌' ఫలితంతో నిరాశపడిన నాకు మళ్ళీ మిరపకాయ్‌ చేసే అవకాశం కల్పించారు రవితేజ, రమేష్‌ పుప్పాల. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను' అన్నారు హరీశ్‌శంకర్‌

అంతవరకు దోమలను కొట్టుకుంటూ బతకాల్సిందే....

ఇంట్లో దోమల వెూతతో బెంబేలెత్తుతున్నారా దోమలు కుట్ట డం తో జబ్బు పడాల్సివస్తుందని బాధపడుతున్నారా దోమలను చంపే మస్కిటోకాయిల్స్‌కోసం వందలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారా మలేరియా మహామ్మారికి భయ పడుతున్నారా అయితే మీకో శుభ వార్త...ఇకపై దోమలకు మీరు భయపడాల్సిన పనిలేదు. దోమ కాటు వల్ల ఇకపై ఎలాంటి అనా రోగ్య సమస్యలు ఉండవు. నిజం ... దోమకాటు వల్ల వచ్చే వ్యాధు లను నివా రించేలా సరికొత్త టీకా మందును అమెరికాలోని టులేన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు తయారు చేస్తు న్నారు.

భారతీయ శాస్త్రవేత్త నిర్భరు కుమార్‌ నేతృ త్వంలోనే ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. విషానికి విషమే విరుగుడు అన్న సూక్తి నిర్భరు బాగా వంట పట్టించుకున్నాడేవెూ దోమకాటుతో వ్యాపించే మలేరియాను దోమకాటుతోనే అడ్డుకోవాలని ఆయన చేస్తున్న ప్రయోగాలు ఫలితాలను ఇస్తున్నాయి. ఆయన రూపొంది స్తున్న ఈ టీకా మందులో ఇకముందు మలేరియాను శాశ్వతంగా నిర్మూలించే వీలు కలుగుతుందట. ఈ టీకా వేసుకున్నవారిని దోమ కుట్టినపుడు ఆ యాంటీ బాడీస్‌ మలేరియా పరాన్నజీవి పునరు త్పత్తికి అవసరమైన ప్రోటీన్స్‌ ను నిర్వీర్యం చేసి మలేరియా వ్యాధి రాకుండా నియంత్రి స్తాయి. అంతవరకు దోమలను కొట్టుకుంటూ బతకాల్సిందే....

ఆమ్‌..ఆద్మీ..ఔర్‌..అమ్మో!

ప్రజలు అంటున్నది, మీడియా మొత్తుకుంటున్నది నిజమేనని ఆర్థికమంత్రి ప్రణబ్‌ ముఖర్జీ శుక్రవారంనాడు లోకసేభకు సమర్పించిన 2011-12 ఆర్థిక సంవత్సరపు ఆర్థికసర్వే స్పష్టం చేసింది. మంత్రిగారు సమర్పించిన నివేదిక ప్రకారం

ఆర్థిక ప్రగతి మందగించింది

ద్రవ్యోల్బణం పెరిగిపోయింది

ఆహార ద్రవ్యోల్బణ విలయం

ద్రవ్య సరఫరా, వినిమయం వల్ల విషమ పరిస్థితులు

ప్రపంచ ఆర్థిక సంక్షోభ ఛాయల దుష్ప్రభావం

వంటి భయంకర పరిస్థితులను కళ్ళకు కట్టింది. ఇందుకు ప్రభుత్వం చేసిన కృషి ఫలించకపోవడం, అంతర్జాతీయ ఆర్థిక సంక్షో భాల ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ మీద పడడం ప్రధాన కారణాలుగా అది చూపింది. దేశంలో నెలకొన్న ఈ విపత్కర పరిస్థితుల వల్ల ప్రభుత్వాలతో పాటే ప్రజలు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారని, నిత్యవసర, అత్యవసర రేట్లు తారస్థాయికి చేరడంతో ప్రజలు పడుతున్న బాధలు తారస్థాయికి చేరుతున్నాయని తేల్చి చెప్పింది. ఏదో చేసేస్తున్నామని, ఎంతెంతో కష్టపడిపోతున్నామని డపðకొట్టుకుని చెపðకుం టున్న సర్కారు ప్రచారాలలో పసలేదని, అవి వాస్తవ విరుద్ధాలని ఈ నివేదిక చెప్పకనే చెప్పింది. ఈ 2011-12లో 9% అభివృద్ధి రేటు సాధించాల్సిన అవసరాన్ని నివేదిక నొక్కి చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కనుక ఈ యేడాది ఎంత కష్టపడాలనుకున్నా ఆ స్థాయిలో ప్రగతిరేటు రాదన్నది నిర్వివాదాంశం.

రాష్ట్రంలో అనిశ్చితి కి బీజేపీయే కారణం

శాసనసభలో తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపిస్తామని చెప్పినవారు సమావేశాలను అడ్డుకుంటున్నారని,ఇక సోమవారం నుండి వారు పద్దతి మార్చుకోకుండా సభను అడ్డుకుంటే శాసనసభ్యులను సస్పెండ్ చేస్తామని..చేసేందుకు వెనకాడబోమని.. సభను నడిపించేందుకు తమకున్న అన్నిఅధికారాలను వినియోగించుకుంటామని ప్రభుత్వ చీఫ్ విప్ మల్లుభట్టి విక్రమార్క చెప్పారు.

శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలోఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై చర్చించాలిగాని, ఇలా దుర్వినియోగం చేయడం తగదని అన్ని పార్టీల సభ్యులు సహకరించాలని కోరినప్పటికీ కొన్ని పార్టీలు పనిగట్టుకుని కావాలనే సమావేశాల్ని అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. శాసనసభ సమావేశాలకి ఎంత డబ్బు వృధా అవుతుందో ఆలోచించాలని, ఇదంతా ప్రజల సొమ్మేనని ఆయన గుర్తు చేశారు. ప్రతి విషయంలోనూ కాంగ్రెస్‌ను తప్పుబట్టడం బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి అలవాటైపోయిందని, అసలు ప్రత్యేక తెలంగాణా అక్కరలేదని అద్వానీ అన్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తూ రాష్ట్రంలో సమస్యలు రావడానికి, అనిశ్చితి నెలకొనడానికి కారణం బీజేపీయేనని విమర్శించారు

గవర్నర్ వైఖరి మార్చుకోకపోతే రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తా

తెలంగాణపై గవర్నర్ నరసింహన్ కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని, గవర్నర్ తన వైఖరి మార్చుకోకపోతే రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని..కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు తమ పార్టీ సీమాంధ్ర శాసనసభ్యులు జెసి దివాకర్ రెడ్డి, గాదె వెంకటరెడ్డి సమైక్యవాదాన్ని తెర మీదికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మండిపడ్డారు. 

ఉద్యమంలో పాల్గొనాలని కోరడం వేరు, వారిని లక్ష్యం చేసుకోవడం వేరని..తెలంగాణ జెఎసి తమ పార్టీ శాసనసభ్యులను లక్ష్యం చేసుకోవద్దని.. సీమాంధ్ర నేతలు తెలంగాణను వ్యతిరేకిస్తే తీవ్ర పరిణామాలుంటాయని, సీమాంధ్ర నాయకులు సమైక్యవాద నిర్ణయాన్ని వదిలేసి జై ఆంధ్ర నినాదాన్ని ముందుకు తేవాలని ఆయన కోరారు.

ఎమ్మెల్యే పదవికి పోచారం రాజీనామా ?

తెలంగాణపై పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి రెండ కళ్ల సిద్ధాంతానికి నిరసనగా రాజీనామా చేయాలని ఇది వరకే నిర్ణయం తీసుకుని.. తెరాసతో కలిసి ఆయన పని చేస్తూ వస్తున్నా. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ తెలుగుదేశం శాసనసభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి త్వరలో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం.
ఆయన శనివారం డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసి త్వరలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయన్నుట్లు తెలిపారు. కాగా పోచారం రాజీనామా చేస్తే తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది.

ఢిల్లీలో కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ సెగ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ సెగ తాకింది. ఢిల్లీ పర్యటనకు వచ్చారని తెలుసుకున్న హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు, ఢిల్లీలోని జెఎన్‌యు విద్యార్థులు శనివారం ఉదయం కిరణ్ కుమార్ రెడ్డి బస చేసిన ఎపి భవన్ వద్ద ధర్నాకు దిగారు. విద్యార్థులు ఒక్కసారిగా కాకుండా విడివిడిగా వచ్చి వ్యూహాత్మకంగా ధర్నాకు దిగారు.మా తెలంగాణ మాకు కావాలంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

మార్చి 10న 'మిలీనియం మార్చ్‌ టు హైదరాబాద్‌'

మార్చి 10న 'మిలీనియం మార్చ్‌ టు హైదరాబాద్‌' పేరుతో పది లక్షల మందితో హైదరాబాద్ దిగ్బంధం చేస్తామని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు హెచ్చరించారు. హైదరాబాద్ రోడ్లపైనే వంటావార్పు చేస్తామన్నారు. ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ లెక్చరర్లకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహాయ నిరాకరణ చేస్తున్న ఉద్యోగులకు అండగా ఉంటామని, వారిపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందన్నారు. 

తెలంగాణా ఏర్పాటు సాగే వరకు ఉద్యోగుల సహాయ నిరాకరణ ఆగబోదని.. అందుకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు తెలంగాణా ప్రజలంతా అందించేందుకు సిద్దంగా ఉన్నారని భరోసా ఇచ్చారు. తెలంగాణ వచ్చాక ఉద్యోగులకు స్పెషల్ తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు.

జీతాలు ఇవ్వకపోతే ఊరుకునేది లేదు

కాంగ్రెస్, జగన్‌తో టీఆర్‌ఎస్ కుమ్మక్కు అయినట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అర్థం లేని విమర్శలు చేస్తున్నదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ...చంద్రబాబునాయుడే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఇస్తామని చెప్పిన టీడీపీ, కాంగ్రెస్‌లు ఇప్పుడు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నాయన్నారు. తెలంగాణ విషయంలో చంద్రబాబు చేసిన మోసానికి పశ్చాతాపపడి అప్రూవర్‌గా మారితే ప్రజలు క్షమిస్తారన్నారు. సహాయ నిరాకరణ చేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని కేటీఆర్ హెచ్చరించారు.

వివేకాకు మద్దతిస్తాం... కానీ...

రానున్న కడప, పులివెందుల ఉప ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని జగన్ వర్గం వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. శనివారం జగన్ వర్గానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, తదితర శాసనసభ్యులు సమావేశమై.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప జిల్లా నుంచి వ్యవసాయ శాఖ మంత్రి, వైయస్ జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించారు.

సమావేశం వివరాలు వెల్లడించేందుకు వీరు నిరాకరించినప్పటికీ.. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం విడిపోకూడదనే ఉద్దేశంతోనే తాము ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ వివేకానంద రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నామని... చెప్తున్న నేతలు.. ఉప ఎన్నికల్లో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైయస్ విజయలక్ష్మిపై వివేకానంద రెడ్డి పులివెందుల నియోజకవర్గం నుంచి కానీ, కడప పార్లమెంట్‌ నుండి కానీ పోటీకి దిగరాదని మెలిక పెట్టినట్లు సమాచారం.

వివేకా కాదంటే... తాము ఆయనపై పోటీ చేసేందుకు ఇప్పటికే అభ్యర్ధిని సిద్దంగా ఉంచామని జగన్‌ వర్గం చెప్తోంది.