26, ఏప్రిల్ 2011, మంగళవారం

నా ఆత్మహత్యనే 'నేనూ..నా రాక్షసి' కి మూలం

పూరి జగన్నాధ్‌ తాజాగా రూపొందించిన చిత్రం 'నేను... నా రాక్షసి' కథ వెనుక ఓ రియల్ స్టోరీ వుందట. ‘ఏ సమస్యకైనా ఆత్మహత్య శాశ్వత పరిష్కారం కాదు’ అనే కాన్సెప్ట్‌తో దీనిని రూపొందిం చిన పూరి జగన్నాధ్‌ వ కధకు మూలం..ఆమధ్య భారీ నష్టాలతో ఆర్ధికంగా బొక్క బోర్లా పడ్డ పూరి అప్పులపాలై చివరికి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట. అయితే, ఓ తెలియని వ్యక్తీ చెప్పిన మాట విని.. ఆలోచించి ఆ ప్రయత్నాన్ని విరమించుకు న్నాడట... పరిస్తితి తట్టుకుని నిలబdutoo.. తరువాత సక్సెస్‌లు సాధిస్తు.. ఇప్పుడు అప్పుల ఊబి లోంచి బైట పడ్డాడట. ఇలా... తన అనుభవంలోంచి కధనే కాస్త తనదైన స్త్య్లేలో మసాలాలు దట్టించి జనామీదికి వదులు తు 'నేను..నా రాక్షసి' అనే టైటిల్‌తో సినిమాగా మార్చాడ ట. అదండీ విషయం

శరవేగంగా రెడీ అవుతున్న 'బబ్లూ'

ఎస్‌.పి.జె. క్రియేషన్స్‌ పతాకంపై రవిచరణ్‌రెడ్డి దర్శకత్వంలో మనోతేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ, అదితీశర్మ కథానాయికగా గూడూరు శివరామకృష్ణ నిర్మిస్తున్న 'బబ్లూ' చిత్రం నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా ఈ వారంలో ఆడియోను విడుదల చేస్తామని చక్కటి కమర్షియల్‌ అంశాలు కలగలిసిన ప్రేమకథాచిత్రమిదని నిర్మాత శివరామకృష్ణ తెలిపారు. చక్రి సంగీతం ఓ హైలైట్‌ అని, మేలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.

పునీత్‌ హీరోగా 'పృథ్వి ఐ.ఎ.యస్‌.'

తెలుగులో 'పండుగాడు, జాకీ'గా పరిచయమైన పునీత్‌రాజ్‌కుమార్‌ ఐఎయస్‌ అధికారిగా నిజాయితీ పరుడైన జిల్లా కలెక్టర్‌ అక్రమ మైనింగ్‌ను ఎలా అరికట్టాడు, ఈ నేపథ్యంలో అతనికి ఎదురైన అనుభవాలేమిటీ? అనే కథాంశంతో 'పృథ్వి ఐ.ఎ.యస్‌.' చిత్రం రూపొందింది. గత సంవత్సరం కన్నడంలో 'పృథ్వి' పేరుతో విడుదలై ఘనవిజయం సాధిం చిన ఈ చిత్రాన్ని తెలుగులో అనువదిస్తున్నారు.
పునీత్‌రాజ్‌కుమార్‌, సరసన నటించారు. మళయాలం, కన్నడలో పేరొందిన పార్వతిమీనన్‌ నాయికగా నటించింది. మణికాంత్‌ కద్రి సంగీతం అందించారు. జాకప్‌ దర్శకత్వంలో కన్నడంలో రూపొం దిన చిత్రాన్ని తెలుగులో రాజేష్‌ ఫిల్మ్‌ 'పృథ్వి ఐ.ఎ.యస్‌.' పేరుతో అనువ దిస్తోంది.

'తేడా'..'మాడా'..ల తర్వాత 'థర్డ్‌మ్యాన్‌'

నూనూగు మీసాలు మొలిస్తే మగాడు, నాజూకు జడవుంటే ఆడది. అదే నూనూగు మీసాలు, నాజూకు జడ ఒక్కరిలోనే వుండటం సాధ్యపడుతుందా... సృష్టికి విరుద్ధమైనా అది సాధ్య అని 'థర్డ్‌మ్యాన్‌' (బొమ్మాకాదు బొరుసూ కాదు) అనే కొత్తకథాంశంతో నిరూపించబోతున్నామని ధన్వంతరి క్రియేషన్స్‌ అధినేత లక్ష్మయ్యచారి తెలిపారు. ఆడది, మగాడు కాని వాణ్ణి కొందరు 'తేడా' అంటారు. మరికొందరు 'మాడా' అంటారు. కానీ ఈ చిత్రం తర్వాత వారిని 'థర్డ్‌మ్యాన్‌' అంటారని, ఆ పేరు ఈ చిత్రానికి అన్ని భాషల్లో మంచి పేరు తెస్తుందని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఇంద్రమోహన్‌ తెలిపారు. కథ, కథనాల విషయాల్లో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా, ముంబాయి, వారణాసి, గంగానది తీరాల్లో నిజమైన హిజ్రాలతో, అఘోరాలతో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో చిత్రీకరణ జరుపుతామన్నారు. లవ్‌, యాక్షన్‌ సెంటిమెంట్‌ అన్నీ సమపాళ్ళలో ఉన్నాయని చెప్పారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: పోలూర్‌ ఘటికా చలం, పాటలు: రామ జోగయ్యశాస్త్రి, బిక్కికృష్ణ కథ, దర్శకత్వం: ఇంద్రమో హన్‌, సమర్పణ: పార్వతమ్మ కె., నిర్మాత: కె.లక్ష్మయ్యచారి.

పోసాని 'నిత్య పెళ్ళికొడుకు' కేరాఫ్ జగదంబ సెంటర్ .. సెన్సార్ కట్స్

పోసాని కృష్ణమురళి టైటిల్‌ పాత్ర పోషించిన నిత్య పెళ్ళికొడుకు చిత్రంలో గౌరీపండిట్‌, అంజలి, భావన, శివాజీరాజా ముఖ్య పాత్రధారులు. సెవెన్‌ హిల్స్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకాన జి.వి.సుబ్బయ్య నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు అళహరి.

అయిదుగురు సభ్యులతో కూడిన ఇసి ఈ చిత్రాన్ని చూసి 27-1-2011న 'యుఎ' సర్టిఫికెట్‌ జారీ చేసింది.

1. మొదటి రీల్‌లో చిత్రీకరించిన దృశ్యంలో గల 'మీ ఫ్రంట్‌ ఒరిజినలా ప్యాడింగా, మీ బ్యాక్‌ ఒరిజనలా ప్యాడింగా' అనే వాక్యం తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.

2. మొదటి రీలులోనే మరో దృశ్యంలో 'అమ్మాయిలకు అబ్బాయిలు కావాలి... వాళ్ళకు కూడా జిల్‌ వుంటాది' అనే డైలాగ్‌ తొలగించి శబ్దం వినరాకూడదన్నారు.

3. మూడవ రీలులో పెదవితో పెదవి కలిపి శిరీషను ముద్దాడే దృశ్యాన్ని తొలగించడం వల్ల 4.12 అడుగులు ఫిలిం కత్తిరింపుకు గురి అయింది.

4. నాల్గవ రీలులో 'ముమైత్‌ ఖాన్‌' అని ఎక్కడ వచ్చినా అది వినబడకుండా తొలగించమన్నారు.

5. నాల్గవ రీలులోనే చిత్రీకరించిన ఓ సన్నివేశంలో భార్య స్వచ్ఛతను పరీక్ష చేసే మొత్తం దృశ్యాన్ని, హీరో అతని స్నేహితుడు మధ్య జరిగిన సంభాషణని శబ్దంతో సహా తొలగించారు.

6. రెండవ రీలులో నీటి జల్లులో రస్న, శిరీష పెదవి పెదవి కలిపి ముద్దాడే దృశ్యాన్ని తొలగించడం వల్ల 2.14 అడుగుల ఫిలిం కత్తెర పాలయింది.

7. ఏడవ రీలులో డ్రగ్స్‌ వాడంకి సంబంధించిన దృశ్యాలను తొలగించడం వలన 30.09 అడుగుల ఫిలిం కత్తిరింపుకు గురి అయింది.

8. ఏడవ రీలులో పబ్‌లో హీరో, ఐశ్వర్య పాల్గొనగా చిత్రీకరించిన డ్యాన్స్‌ని తొలగించి ఫ్లాష్‌లా చూపమన్నందున 46.09 అడుగుల ఫిలిం కత్తెర పాలయింది.

9. ఏడవ రీలులోని ఐటమ్‌సాంగ్‌లో ఎక్స్‌పోజింగ్‌లో కూడిన క్లీవేజ్‌ దృశ్యాలను తొలగించడం వల్ల 60.04 అడుగుల ఫిలిం కత్తిరించబడింది.

10. పదకొండవ రీలులోని 'మగాడు మానసికంగా శారీరకంగా వ్యభిచారం చేస్తాడు' అనే డైలాగ్‌ శబ్దంతో సహా తొలగించారు.

11. పదమూడవ రీలులోని 'లంగాగాడు, లుచ్చాగాడు పదాలను తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.

12. పన్నెండవ రీలులోని 'పక్కలో పడుకున్నావా', 'పిచ్చి నా కొడకా', 'బ్రోకర్‌ వెధవా', 'బుడ్డే కె బాల్‌' పదాలను తొలగించి శబ్దం వినరాకూడదన్నారు.

13. 14వ రీలులో ఆహుతయ్యే దృశ్యాలను సగానికి తగ్గించడం వల్ల 18.07 అడుగుల నిడివిగల ఫిలిం కత్తిరింపుకు గురి అయింది.

14. పన్నెండవ రీలులో గల 'ఆ చీర చింపింది నేను, నేనే కట్టుకుంటానంటే వద్దంటారేంటి?' డైలాగ్‌ని తొలగించి శబ్దం వినరాకూదన్నారు.

15. రెండవ రీలులో చిత్రీకరించిన 'బాబూ అక్కడ చెయ్యి పెట్టకూడదు రెస్ట్రిక్టెడ్‌ ఏరియా' అనే డైలాగ్‌ని శబ్దంతో సహా తొలగించారు.

16. తొమ్మిదవ రీలులో చిత్రీకరించిన దృశ్యంలో 'అక్కుం బక్కుం లేదా' అనే డైలాగ్‌ని తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.

మొత్తం మీద 16 కట్స్‌లో 163.07 అడుగుల ఫిలిం కత్తిరింపుకు గురి అయింది. 14 రీళ్ళ నిడివిగల 'నిత్య పెళ్ళికొడుకు' 11.3.11న విడుదలయింది.

బాబా మహాసమాధికి రంగం సిద్ధo

పుట్టపర్తి సత్య సాయి బాబా మహాసమాధికి రంగం సిద్ధమైంది. బాబా పార్థివదేహాన్ని సమాధి చేయడానికి వీలుగా కుల్వంత్ హాల్‌లో అన్ని ఏర్పాట్లూ చేశారు. ఏడు అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పుగల విస్తీర్ణంలో సమాధిని సిద్ధం చేశారు. బాబా అంత్యక్రియలకోసం పుణ్య నదీ జలాలు, ప్రత్యేక పట్టు వస్త్రాలు తెప్పించి ఉంచారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు బాబా మహా సమాధి కార్యక్రమం పూర్తి అవుతుంది.

చిరంజీవి మాట్లాడితే నైతికతా.. ?

రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు చంద్రబాబునాయుడేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ఘాటుగా విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారాన్ని అడ్డు పెట్టుకొని కోట్లు సంపాదించింది చంద్ర బాబేనని జగన్ సమపదిన్చిన్డానికి ప్రతిదీ లేక్కలున్నాయని, ప్రభుత్వానికి న్యాయ పరంగా చెల్లించిన విషయం తెలుసుకోవల్లన్నారు.
రాజకీయ్యాల్లో నైతికత విలువలకు తిలోదకాలిచ్చిన కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీ పార్టీల న్ని daani గురించి మాట్లాడే హక్కు ఏనాడో కోల్పోయయని వ్యాఖ్యానించారు. వైఎస్ తిక్కట్లిచి, గెలిపించుకొన్న ఎమ్మెల్యేలు జగన్ వెంట తిరిగితే అనైతికతా...?, కాంగ్రెస్‌ను దుమ్మెత్తిపోసిన చిరంజీవి మాట్లాడితే నైతికతా.. అని సూటిగా ప్రశ్నించారు.

సిగ్గు, లజ్జ ఉంటె తక్షణం రాజీనామా చేయండి

ఒక పార్టీ పేరు మీద గెలిచి మరో పార్టీలో తిరగడం నైతిక కాదని... తమ కాంగ్రెసు తరఫున గెలిచి వైయస్సార్ కాంగ్రెసులో తిరుగుతున్న శాసనసభ్యుల కు సిగ్గు, లజ్జ ఉంటె తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలని మంత్రి రఘువీరా రెడ్డి డిమాండ్ చేసారు. మంగళ వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైయస్సార్ పథకాలను తాము నిలిపేస్తున్నట్లు జగన్ ప్రచారం చేసుకొంటూ రాజకీయాలు నడుపుతున్నాడని ఎక్కడా వాటి అమలు ఆగలేదని, ఉప ఎన్నికల వల్ల సంక్షేమ పథకాల అమలుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఆయన అన్నారు.

అస్సోంలో అధికారం మాదే : గడ్కారీ ధీమా

అస్సోం రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో తమ సత్తాను చాటేందుకు తమ శక్తిమేరకు కృషి చేస్తున్నట్టు తమ పార్టీ విజయం సాధిస్తుందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళ వారం ముంబైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అస్సోంలో తమ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా విజయం సాధిస్తుంద ని, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం దేశం రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయని ఆయన జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాల తో తమ పార్టీ పటిష్టత మరింత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేసారాయన.

దమ్ముంటే మీరంతా రాజీనామా చేయండి

వైయస్ జగన్ వర్గానికి చెందిన నలుగురు కాంగ్రెస్ శాసనసభ్యులకు ఆ పార్టీ ఫిర్యాదు మేరకు స్పీకర్ షోకాజ్ నోటీసులు జారీ నేపథ్యంలో వైయస్ ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ ల మధ్య రాజీనామాలపై సవాళ్లు, ప్రతి సవాళ్లు జోరందుకున్నాయి.
మంగళ వారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్స్ పార్టీకి దమ్ముంటే తన శాసన స్భులందరి తో రాజీనామా చేయించి మళ్ళి ఎన్నికలకి సిధం కావాలని అన్నారు. రాజీనామా చేసే కాంగ్రెసు పార్టీ నాయకులు సోనియా ఫొటోతో పోటీ చేయాలని, తమ పార్టీ వైయస్సార్ ఫొటో పెట్టుకుని పోటీ చేస్తామని, ఎవరు గెలుస్తారో చూద్దామని అన్నారు. కడప ఎన్నికల ఫలితాలే కాంగ్రెసుకు సమాధానమిస్తాయని ఆయన అన్నారు.

గెస్ట్ రోల్స్ కి పరిమితమై పోతున్న నితిన్

ఈ మధ్య సరైన సినిమాలు లేక, ఉన్నా అవి సక్సెస్ జేక.. చాటికిల్ల పడ్డ హీరో రేసులో బాగా వెనుకపడిపోయిన నితిన్ ఇప్పుడు పాత్ర దొరకడమే అరుదనుకోతున్నాడూ ఏమో.. సెకండ్ హీరో గా కూడా రెడీ ఐపోతున్నాడు. పవన్ సినిమాలో రెండూ పాత్రనే పోషించేందుకు సిద్దమైన నితిన్ ఇప్పుడు ప్రభాస్ కథానాయకుడుగా రాజమౌళి రూపొందించే సినిమాలో ఓ ముఖ్య పాత్రకు సెలెక్ట్ అయినట్లు సమాచారం.

గతంలో రాజమౌళి దర్శకత్వంలో 'సై' సినిమా లో నితిన్ నటించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు వచ్చిన ఆఫర్ మాత్రం గెస్ట్ రోల్ అని తెలుస్తోంది.. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు ఈ చిత్రం 'ఈగ' సినిమా పూర్తయ్యాక ప్రారంభిస్తాడు.

నాగ ప్లేస్ లో అల్లు అర్జున్‌కి చోటిచ్చిన దశరథ్

ఈ మధ్యనే దర్శకుడు దశరథ్ ప్రభాస్ తో రూపొందించిన 'మిస్టర్ పెర్ ఫెక్ట్' హిట్ టాక్ తెచ్చు కావటంతో.. కాస్త గాప్ లో తన తదుపరి చిత్రం కోసం ప్లాన్ చేసుకుంటున్నడట . ఐతే గతంలో ఈ చిత్రాన్ని నాగార్జునతో రూపొందించాలని భావించినా.. ఇప్పుడు తాను అనుకున్న కధకి నాగ్ కన్నా అల్లు అర్జున్‌ అయితేనే బెటర్ అని భావిస్తున్నాడట. దీంతో ఇటీవల దశరథ్ అర్జున్ ని కలసి కథ చెప్పడం జరిగిందట. కధ పక్కగా ఉన్నా కమర్షియల్ ఎలిమెంట్స్ తగ్గుతున్నట్లు వుందని దీన్ని మార్చుకొంటే చేయటానికి అబ్యంతరం లేదని అర్జున్‌ చెప్పాడట. ఏది ఏమైనా వీరి కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్క డం ఖాయమని ఫిల్మ్‌ నగర్‌ వర్గాల సమాచారం.

దాసరి 'రామ సక్కని తల్లి' అనుష్క?

బాలకృష్ణతో తీసిన 'పరమ వీర చక్ర' బాక్సాఫీసు ముందు పల్టీ కొట్టడంతో ఈ మధ్య ఒసేయ్...రాములమ్మా' రేంజ్ లో విజయశాంతి తో ఓ చిత్రానికి ప్లన్చేసాడు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు.

. త్వరలో మరో భారీ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తునే 'రామ సక్కని తల్లి' అనే టైటిల్ ను చేశారు. అయితే, దాసరి వ్యవహారం ఇబ్బందులు గా ఉండటంతో.. విజయ శాంతి.. ఈ సినిమాకి నో చెప్పేసిందట దీంతో నేటి యంగ్ హీరోయిన్ తో ee చిత్రాన్ని దాసరి రూపొందించాలనుకుంటున్నారనీ తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో అనుష్క నటించే అవకాశం వుందని అంటున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

కడపలో ధనం ఏరులై పారుతోంది.

లోక్‌పాల్ బిల్లును కుందిo చాలని   చూడటం దుర్మార్గమైన చర్య అని..  బిల్లు పరిధిలోకి ప్రధానమంత్రి, చీఫ్ జస్టిస్‌లనూ తీసుకురావాలని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభు త్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం త్రిశంకు స్వర్గంలో వే లాడుతోందన్నారు.చట్టాలు, బిల్లుల ద్వారా అ వినీతి నిర్మూలన సాధ్యం కాదన్నారు. అవినీతి ఎజెండాతో ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రచారాలు చేపడతామన్నారు.భారతదేశంలో ఏ పార్లమెంటు ఎన్నికలకు ఖర్చు పెట్టని విధంగా కడపలో ధనం ఏరులై పారుతోందని నారాయణ ఆరోపించారు.  ఎన్నికలు పేరు చెపితేనే భయపదీలా ఈ ఎన్నికల్ని మార్చేశారని ఆవేదన వ్యక్తం చేసారాయన.