4, డిసెంబర్ 2011, ఆదివారం

కళని”ఒడిసి”పట్టి బుద్ధిమాంద్యం జయించి..

మానసిక బుద్ది మాద్యం తనని బాధిస్తున్నా... దానిని అధిగమించి.. ఒడిస్సీ నాట్యంలో తనకో ప్రత్యేకత నిలుపుకుని నేడు నేషనల్‌ అవార్డు గ్రహీతగా నిలచింది ఒరిస్సా రాష్ట్రంలోని రూర్కెలాకు చెందిన రేష్మి రేఖా సాహు. 27 ఏళ్లు వచ్చి వనితలా ఎదిగినా... కేవలం 12 ఏళ్లు కూడా మించని...చిన్నారిలా కనిపించే ఆమె కేవలం నృత్యంలోనే కాదు, గాయనిగా, క్రీడాకారిణిగా ప్రతిభ చూపిస్తు ఎందరికో ఆదర్శవంతంగా నిలుస్తోంది.
మానసిక బుద్ది మాద్యం తనని బాధిస్తున్నా... దానిని అధిగమించి.. ఒడిస్సీ నాట్యంలో తనకో ప్రత్యేకత నిలుపుకుని నేడు నేషనల్‌ అవార్డు గ్రహీతగా నిలచింది ఒరిస్సా రాష్ట్రంలోని రూర్కెలాకు చెందిన రేష్మి రేఖా సాహు. 27 ఏళ్లు వచ్చి వనితలా ఎదిగినా... కేవలం 12 ఏళ్లు కూడా మించని చిన్నారిలా కనిపించే ఆమె కేవలం నృత్యంలోనే కాదు, గాయనిగా, క్రీడాకా రిణిగా ప్రతిభ చూపిస్తు ఎందరికో ఆదర్శ వంతంగా నిలుస్తోంది.
మానసిక వికలాంగురాలిగా రూర్కెలా లోని ఉక్కు కర్మాగారంకి చెందిన టౌన్‌ సేవావిభాగం నేతృత్వంలో నడుస్తున్న శిక్షణాలయంలో నృత్యంలో శిక్షణ పొంది.. ప్రదర్శనలు ఇచ్చే స్ధాయికి ఎదిగిన రేష్మి దేశంలోని వివిధ ప్రాంతా లలో తన ప్రతిభాపాటవాలు చాటుకుంది. చిన్నతనం నుండి రూర్కెలా కేంద్రంగా నడుస్తున్న హూప్‌ స్వచ్చంధ సంస్ధ కేంద్రం లోనే విద్యాబ్యాసం చేస్తుిన్న సమయంలోనే నృత్యంలోనూ, క్రీడల లోనూ ఆమెకున్న ఆసక్తిని గమనించిన ఆ సంస్ధ ఆయా రంగాలలో ప్రోత్సహించారు. ఈ క్రమంలో ఆమె జాతీయ స్ధాయిలో అనేక అవార్డులు, రివార్డులు దక్కించుకొని ప్రతిభాపాటవాలకు అంగ వైకల్యమే కాదు మానసిక వైకల్యం కూడా అడ్డుకాదని నిరూపించింది.
నృత్యంలో అవార్డులు...
శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందిన రేఖాసాహు 1999లో ఉత్సవ్‌- 1999 జాతీయ పండగలలో పాల్గొని నృత్య, సంగీత విభాగంలో బహుమతులు గెలుచుకుంది. 2000లో హైదరాబాద్‌లో జరిగిన జాతీయ స్ధాయి నృత్య పోటీలలో పాల్గొని తన ప్రతిభతో అలరించి హైదరాబాద్‌ ఉత్సవ్‌అవార్డు దక్కించుకుంది.ఆపై క్రీడలను, నృత్యం లోనూ సమాంతర ప్రాధాన్యత ఇస్తూ..ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న ఆమె ప్రతిభని గుర్తించిన భారతీయ రెడ్‌ క్రాస్‌ సొసైటీ 2006లో ఉత్కల్‌ దివస్‌ సందర్భంగా ప్రత్యేక పుర స్కారం అందించి సత్కరించింది. ఈ సందర్భంగా రేష్మి కి 5000 రూపాయల క్యాష్‌ అవార్డుతొ పాటు కత్తి, డాలు అందించారు.
అలాగే కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఏటా అందించే జాతీయ ట్రస్ట్‌ అవార్డుని 2007లో దక్కించుకుందామె. విభిన్న ప్రతి భా పాటవాలను తానున్న స్ధాయికిమించి అందునా క్రీడలు, నృత్యా లలో ప్రదర్శిస్తున్నందుకుగాను ఆమెని ఈ పురస్కారం వరించిం ది. దీనిని లోక్‌ సభ స్పీకర్‌ మీరాకుమార్‌ చేతులు మీదుగా అందు కున్నారామె. 2010లో జరిగిన జాతీయ పిల్లల పండగ (అంజలి ప్రోగ్రామ్‌) సందర్భంగా బహుళ రంగాలలో ప్రతిభ ప్రదర్శిస్తున్న వ్యక్తిగా గుర్తింపు దక్కించుకుని సమర్ధ మహిళా అవార్డు అందు కుంది రేష్మి. తాజాగా నేడు (డిశంబర్‌ 3) జరగనున్న ప్రపంచ మానసిక వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రతిభ గల మానసిక వికలాంగులకు అందించే అవార్డుని ఈ సారి రేష్మి దక్కించుకోవటంతో రూర్కెలాలో పండగ వాతావర ణం నెలకొంది. మానసిక వికలాంగురాలిగా అసాధారణ ప్రజ్ఞ చూపిస్తున్న రేష్మి ఈ అవార్డు అందుకోవటానికి అన్ని విధాలుగా తగినదని భావించి ఎంపిక చేసినట్లు ఇప్పటికే కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికాకత మంత్రిత్వశాఖ ముఖ్యకార్యదర్శి పంకజ్‌జోషి ప్రకటించారు. మానసిక అంగవైకల్యంతో బాధ పడుతూనే ఇతరులకు స్పూర్తినిచ్చేలా ప్రతిభ చూపించే మహిళల వర్గంలో ఈ 27 ఏళ్ల రేష్మిని ఎంపిక చేసినట్లు తెలిపారామె. డిశంబర్‌3న ఢిల్లీలోని విజ్ఞ్‌ాన్‌భవన్‌లో జరిగే ప్రపంచ డిజేబుల్‌ డే ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ చేతులు మీదుగా రేష్మి ఈ జాతీయ అవార్డు అందుకోనున్నారు.
ఆటలలోనూ పతకాలు...
అలాగే ఆటలలో తన సత్తా ప్రదర్శిస్తూ 2005లో న్యూఢిల్లీలో ప్రత్యే క ఒలంపిక్‌ క్రీడలు నిర్వహించగా... ఆ పోటీలలో పాల్గొని 100 మీటర్ల పరుగు పందెంలోనూ.. స్వర్ణ పతాకాన్ని చేజిక్కించుకోవట మే కాక 50 మీటర్లు 100 మీటర్ల నడక పోటీలలో పాల్గొని రజిత పతకాన్ని దక్కించుకుందామె.

ఆనందానికి హద్దేలేదు
రేష్మి చిన్నతనంలో సాధారణంగా ఉన్నా వయసు పెరుగు తున్న కొలది ఆమె బుద్ది మాద్యానికి లోనవుతున్న విష యాన్ని గమనించా... అమ్మగా మాటలు కూడా సరిగా పలకలేని బిడ్డని చూసి తల్లడిల్లిపోయి... ఏడ్చిన రాత్రులు చాలా ఉన్నాయి. కన్న మమకారం ఆమెని దగ్గరకు తీసు కుని ఏది ఏమైనా పెంచి పెద్ద చేయాలని నిర్ణయించుకున్న సందర్భంలో హూప్‌ సంస్ధ నాకు అండగా నిలచింది. రేష్మి పరిస్ధితి చూసి తమ వద్దే ఉంచుకుని చదువు తదితరాలు చెప్పించేందుకు ముందుకు రావటం నాకు కాస్త ఊరట నిచ్చింది. ఏళ్లు గడుస్తున్నా... ఇంకా చిన్న పిల్లలానే మనిషి ఉండిపోవటం ఆ తీరుగానే ప్రవర్తించడం ఓ వైపు ఆందోళ న కలిగిస్తున్నా... ఆటలలో నృత్యంలో శిక్షణ పొంది జాతీయ స్ధాయిలో అవార్డులు సొంతం చేసుకున్నప్పుడు అమ్మగా అక్కున చేర్చుని మళ్లీ ఏడ్చిన సందర్భమూ ఉం ది. తాజాగా మరో మారు రాష్ట్రపతి చేతుల మీదుగా అవా ర్డు తీసుకోబోతోందని తెల్సి మనసు చేస్తున్న ఆనందానికి హద్దే లేకుండా పోతోంది.  - శుభాంగి సాహు, రేష్మి తల్లి
అందరికీ ఆదర్శమే...
మానసిక వికలాంగురాలిగా అసాధారణ రీతిలో అమె అందుకుంటున్న విజయాలు అనితర సాధ్యమనిపిస్తోంది. కృషి చేస్తే చేయలేనిది ఏదీ లేదనటానికి నిలువెత్తు నిద ర్శనం రేఖా సాహు అని చెప్పక తప్పదు. దాదాపు 20 ఏళ్ల పాటు మా సంస్ధలోని విద్యా కేంద్రంలో ఉంటూ శిక్షణ పొందిన ఆమె నిష్ణాతురాలైన ఒడిస్సీ కళాకారిణిగా రూపొందటమే కాకుండా..క్రీడాకారిణిగా కూడా తన ప్రత్యే కత నిరూపించుకుంది.
ఆమెని అన్ని విధాలా ముందుకు తీసుకు వెళ్తేందుకు ఆమె తల్లి పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ఆమె ప్రతిభ కార ణంగానే నేడు మా సంస్ధ పేరు కూడా జాతీయ స్ధాయిలో గుర్తింపు తెచ్చుకోవటం ఆనందంగా ఉంది. మరిన్ని విజ యాలు అందుకొనే సత్తా తనలో ఉందని ఆమె మొక్కవోని ఆత్మస్ధైర్యం యువతరానికే కాదు అందరికీ ఆదర్శమవు తుందనటంలో సందేహమే లేదు... - నారాయణ్‌ పాటి, హూప్‌ కార్యదర్శి, రూర్కెలా...

నాద నీరాజనం

కళలతో పండిత పామరులనే కాదు... భగవంతుడిని కూడా ఓలలాడించి సాక్షాత్కరింప చేసుకోవచ్చన్నది నమ్మకం. ఇందుకు నృత్యం, గానం, సంగీతం ఇలా అనేక కళా రూపాలతో భగవంతుడిని ఆరాధించి, మెప్పించి.. ప్రసన్నం చేసుకుని వరాలందుకున్నట్లు మన పురాణాలలో అనేక కధలు కూడా ప్రచారంలో ఉన్నాయి. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సాంప్ర దాయాన్ని కొనసాగిస్తూ... భాష ఏదైనా... లక్షలాది మంది కళాకారులు తమ కళను దేవుని సన్నిధిలో ప్రదర్శించి ఆయన కరుణా కటాక్ష వీక్షణాలు పొందాలని ఉత్సాహం చూపిస్తారు. అందునా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుని పాదా ల చెంత తన కళను ప్రదర్శించి ఆ దేవ దేవుని కృపకు పాత్రులు కావాలని పరితపించే వారు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. అలాంటి కళాకారుల కోసమే 'నాదనీరాజనం' ఏర్పాటు చేసింది తిరుమల తిరుపతి దేవస్ధానం.
ఆన్నమయ్య తన పద కవితల గానంతో వెంకటేశ్వ రుని మైమరిపించి కైవల్య ప్రాప్తి పొందగా... వెంగ మాంబ కూడా అదేస్ధాయిలో సంకీర్తనలతో ఏడుకొం డల స్వామిని స్తుతించి...ఆయనలో లీనమైంది. ఇలా కళా రూపా లకు కళాకారులకు సాక్షాత్తు ఆ భవంతుడే పెద్దపీట వేయటం జరిగిందన్నది వాస్తవం. ఈ క్రమం లోనే భగవంతుని సాన్నిధ్యంలో కళారూపాల ప్రదర్శ నకు వీలు కల్పిస్తూ... తిరుమల తిరుపతి దేవస్ధానం చేపట్టిన అద్భుత కళాపోషక వేదిక 'నాద నీరాజనం'.
ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఎన్ని సంపా దిం చినా... ఆ దివ్య మంగళరూపం చెంత తమ ప్రతిభని ప్రదర్శించాలనుకునే వారికి నాద నీరాజనం మంచి వేదికగా నిలుస్తోందనటంలో సందేహం లేదు. ఎందరో మహాను భావులు తమ కళా నైపుణ్యాన్ని కలియుగ దైవం శ్రీనివాసుని పాదాల చెంత ప్రదర్శించేం దుకు ఉవ్విళ్లూరు తున్నారు ప్రపంచ ప్రఖ్యాతి గాం చిన కళాకారులెం దరో నాదనీరాజనం వేదికపైన తమ నృత్యంతో, గానంతో, వాయిద్యాలతో పాటు అనేక నాటకాలు, పద్య ప్రదర్శనల నొసంగి భక్తులను తన్మయత్వంలో ఓలలాడించారు.
పుట్టిందిలా...
తిరుమల గిరులన్నింటినీ కలిపి మహా ప్రాకారం నిర్మాణం చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం అడ్డంకి వస్తున్న వేయి కాళ్ల మండపాన్ని దశాబ్ధకాలం క్రితం తొలగించిన తితిదే... అనేక విమర్శలకు నోచుకొంది. ఆ క్రమంలో జరిగిన అనేక పరిణామాల కారణంగా మహాప్రాకార నిర్మాణానికి స్వస్తి పలకడం మంచిదన్న అనేక మంది సూచనల మేరకు నిర్ణయం తీసుకున్న తితిదే.. వేయి కాళ్ల మండపం తొలగింపు ద్వారా శ్రీవారి ఆలయ మహాద్వారం ఎదు ట సువిశాలమైన ఖాళీ ప్రదేశం ఏర్పడటం.. ఇది బ్రహ్మౌ త్సవాలలో పాల్గొ నేందుకు వస్త్తున్న భక్తులకు ఎంతో సౌకర్యం ఉండటంతో.. ఆ ప్రాంతంలో సేద తీరుతున్న అనేక మంది భక్తులను నిత్యం అలరిం చేలా
సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని.. అనేక మంది అభిప్రా యం మేరకు భక్తిరస పూర్వకకార్య క్రమాల ను అందించేందుకు ఇక్కడ ఓ వేదికను రూపొందించాలని నిర్ణయించింది.అప్పటివరకు తిరుమల లో ఆస్ధాన మండపంలో జరిగే భక్తిరస ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించేందుకు భక్తులు ఇబ్బంది పడుతుం డటంతో...శ్రీవారి మహాద్వారం సమీపం లో మండప నిర్మాణం అనువైన ప్రదేశ మని అప్పటికార్యనిర్వహాణాధికారి రమణా చారికృషితో మండపం ప్రారంభిం చి కార్యరూపం దాల్చాంచింది.
ఈ క్రమంలో మాగుంట శ్రీనివాసులరెడ్డి సహకారంతో.. 20అడుగుల వెడల్పు 40 అడుగుల పొడవు, 50 అడుగుల ఎతుతో భారీ మండప నిర్మాణం చేపట్టి, పూర్తి చేసింది. ఇందులో శ్రీవారి నిలువెత్తు విగ్రహంతో పాటు అన్నమయ్య, త్యాగరాజు, బీబీ నాంచారి, వెంగమాంబ, శ్రీకృష్ణ దేవరాయలు తదితరుల విగ్రహాలను ఏర్పాటు చేసి అత్యంత శోభాయయానంగా తీర్చిదిద్ది. 2009 సంవత్సరం ఆగష్టు 15న మండ పంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది తిరుమల తిరుపతి దేవస్ధానం. ఆనాటి నుంచి ప్రతి సాయంత్రం వేళలో ్లఅనేక భక్తిరస కార్య క్రమాలునిర్వహిస్తున్నారు. వేలాది మంది కళాకారులు తమ ప్రతిభానైపుణ్యం ప్రదర్శిం చారు నాదనీరాజన మండపం ప్రారం భించిన నాటి నుండి 800 పైగా కార్యక్రమాలు జరిగాయి.
ఎందరో కళాకారులు...
ఏ చానల్‌లోనూ ప్రసారం కాని కర్ణాటక, శాస్త్రీయ సంగీతాలను సైతం నాదనీరా జనం వదికపై ప్రదర్శించారు. మొట్టమొదట తిరుపతికి చెందిన శ్రీవేంకటేశ్వర మ్యూజి క కళాశాల విద్యార్ధినులచే నాదస్వర కచేరీ ప్రారంభించి అదేరోజు 25మంది వయొలి న్‌ కళాకారులచే చెన్నైకి చెందిన కన్యా కుమా రి బృందం వాయిద్య సమ్మేళనం కచేరీ ఏర్పాటు చేశారు.తదుపరి ప్రఖ్యాతి గాం చిన కళాకారులు సారపల్లి రంగనాధం, పద్మశ్రీ కదిరి గోపాల్‌నాథ్‌, నది మారు కల్యాణరాం నామ సంకీ ర్తన, టి.టి.డి, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌, బెంగుళూరు కు చెందిన సుకన్య రాజగోపాల్‌, విట్టల్‌దాస్‌ మహారాజ్‌, టి.యం, కృష్ణ గాత్ర కచేరీ, మాంబలం సిస్టర్స్‌ గాత్రం, విజయసింహ గాత్ర కచేరీ, ద్వారం లకి్ఝ, ఉన్నికృష్ణన్‌, బెంగుళూరుకు చెందిన పద్మభూషణ్‌ హరిప్రసాద్‌ చౌరాసియా, బొంబాయి సిస్టర్స్‌, పదుక్కటై ఆర్‌.కృష్ణమూర్తి, తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాగా, ఇండోనేషియాకు చెందిన విదేశీయులు బాలి రామాయణ నృత్యరూపక కావ్యాన్ని 2010 ఆగష్టు 15న ప్రధమ వార్షికోత్సవం సందర్భంగా ప్రదిర్శించారు. వీరేగాక యల్లా వేంకట ేశ్వరరావు తన మృదంగ వాయిద్య కచేరీతో భక్తు మనస్సులను దోచా రు. హైదరాబాద్‌ సిస్టర్స్‌ గాత్రం, ప్రముఖ నర్తకి శోభానాయుడు బృం దం కూచిపూడి నృత్యరూపకం 2010జనవరిలో 2009 డిశంబరులో సినీనటి మంజుభార్గవి నాదనీరాజ నం వేదికపై తన నృత్య ప్రదర్శనతో భక్తులను మైమర పింపచేసింది.2009 అక్టో బరు 31న పద్మజారెడ్డి నృత్యం, ద్వారం దుర్గా ప్రసాదరావు, కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీ కృష్ణవంటి ఎందరో ప్రతి భావంతుల తమ ప్రతిభను ప్రదర్శించారు.
కళాకారుల ఎంపిక ఇలా...
నాదనీరాజనం వేదికపైన అన్ని భాషలకు చెందిన కళాకారులు తమ భక్తిరస భావ ప్రదర్శనలను ప్రదర్శించారు. ప్రదర్శనలు నిర్వహించడా నికి వీరిలో టి.టి.డి, మాజీ కార్యనిర్వహణాధికారి సీనియర్‌ ఐ.ఏ.ఎస్‌. అధికారి పి.వి.ఆర్‌.కె.ప్ర్రసాద్‌ ఛైర్మన్‌గా కమిటీని నియమించింది. ఆల్‌ఇండియా రేడియో నిర్ణయించిన గ్రేడ్‌ కళాకారులకు, ప్రదర్శనలో ప్రాముఖ్యత కల్పిస్తునే... ప్రదర్శనలు అన్నీ భక్తిరస భావం పెంపొం దించి సాంప్రదాయ బద్ధంగాఉండాలని నిర్ణయించారు.
నాద నీరాజనం వేదికపై ప్రదర్శించే కళాకారులు తమ ప్రదర్శన కోసం సంబంధిత సి.డి.ని గ్రేడుధృవీకరణ పత్రాలను నాదనీరాజనం, భక్తి ఛానల్‌, అలిపిరి అతిథిగృహం తిరుపతి చిరునామాకు పంపితే కార్యా లయానికి వచ్చిన వాటిలో రెండు నెలలకొక పర్యాయం కమిటీ సమా వేశం జరిపి, పరిశీలించి అర్హత కలిగిన వాటికి నాదనీరాజనం వేదిక పై ప్రదర్శించేందుకు అనుమతి మంజూరు చేస్తున్నారు. ప్రదర్శిన ఇచ్చిన కళాకారులకు వారి బృందాల ప్రకారం 50వేలు, 30వేలు, 20ాలుే, 15 వేలుగా తగిన పారితోషకం, అందచేయటమే కాకు ండా...శ్రీవారి దివ్య మంగళర్శనంతో పాటు ఉచిత భోజన వసతిని టి.టి.డి కల్పిస్తుంది. అనేక మంది ప్రఖ్యాత కళాకారులు శ్రీవారిసన్నిధి యందు నెలకొన్న నాదనీరాజనంలో ప్రదర్శిం చి దశదిశలా తమ కీర్తిని చాటుతున్నారు. ఈ కార్యక్రమాలు టి.టి.డి. ధర్మ ప్రచారపరిషత్‌ పఖ్యాత కళాకారులు శ్రీవేంకటే శ్వర భక్తి ఛానల్‌ సం యు క్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలకు టిటిడి భక్తి చానల్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా ప్రసారం చేస్తుంది. ఈ వేదికెపై ప్రదర్శన పొందాలంటే ఆ ఏడు కొండల వాడి దయ కావాల్సిందే అని ఆతృతగా వేచి చూస్తున్న కళాకారులు చాలా మంది ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు.
కళలను కాపాడే వేదిక ఇది...
ఈ వేదికపై నుండి భారతీయ, సంస్కృతీ సాంప్రదాయాలను పరి రక్షించడమే కాకుండా సాంప్రదాయంగా అనాదిగా వస్తున్న కళలని ప్రోత్సహించడం,
ప్రజలలో భక్తి భావ న పెంపొందించడం ప్రధానంగా ఇక్కడ కళారూపాల ప్రద ర్శన జరుగు తోంది. అంతే కాకుం డా ఎన్నో వ్యయప్రయాశల కోర్చి తిరుమ ల వస్తున్న లక్షలాది భక్తుల ను ఆనందడోలికల్లో ఊపు తూ సాగే కర్ణాటక, హిందు స్ధానీ సంగీతం, అనేక మంది కళాకారు లు చేసే భజనలు, ప్రదర్శించే పౌరాణ ిక కళారూపాలు వారిని సేద తీరుసు ్తన్నాయనటంలో సందేహం లేదు. తితిదే. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌లు సంయుక్తగా ఎందరో కళాకారులను ప్రోత్సహిస్తు...వారితో ఇప్పిస్తున్న స్వర హారతే నాదనీరాజనంగాచెప్పక తప్పదు.