26, సెప్టెంబర్ 2012, బుధవారం

విజయసాయితో లింకేంటి?

తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా ఎబికె ప్రసాద్ అసత్య కథనాలు రాస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ పార్లమెంటు సభ్యులు ఎర్రన్నాయుడు బుధవారం అన్నారు. ఐఎంజి భూములను దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి రద్దు చేశాక ఇప్పుడు పిటిషన్ వేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబును దెబ్బతీసేందుకు ఐఎంజి భూముల వ్యవహారం తెర పైకి తీసుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయ సాయి రెడ్డితో ఎబికె ప్రసాద్‌కు ఉన్న సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. విజయ సాయి రెడ్డి తరఫున ఎబికె ప్రసాద్ ప్రమాణం చేయాల్సిన అవసరమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐఎంజి కేసులో అవతవకలు లేవని కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని గుర్తు చేశారు. ఎలాంటి అక్రమాలు లేవని ఎసిబి కోర్టు కేసును కొట్టేసినప్పటికీ ఇదే విషయంపై పిటిషన్ వేయడం, కొట్టి వేసిన అంశాన్ని ఆ పిటిషన్‌లో ప్రస్తావించక పోవడం అందరూ గుర్తించాలన్నారు. పదవి ఇచ్చారు కాబట్టే ఎబికె ఆరోపణలు చేశారన్నారు.

కాగా ఐఎంజి కేసులో చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలపై ఎర్రంనాయుడు రెండు రోజుల క్రితం కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. దేశంలో మూడో ఫ్రంట్ ఆవిర్భావం కోసం ప్రయత్నిస్తున్నందునే చంద్రబాబుపై ఐఎంజీ కేసు వంటి కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఐఎంజీ వ్యవహారంలో చంద్రబాబు నిర్దోషి అని అనేక సందర్భాల్లో కోర్టులు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

ధర్మాసనం ఆదేశిస్తే 'ఐఎంజీ భారత' సంస్థకు భూ కేటాయింపుల్లో అక్రమాలపై ప్రాథమిక విచారణ చేస్తామని సిబిఐ తెలిపిన నేపథ్యంలో ఎర్రంనాయుడు ఆ మాటలు అన్నారు. ఆ విషయం తెలియజేస్తూ సోమవారం హైకోర్టులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. ఐఎంజీ భారత సంస్థకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నగర శివార్లలోని అత్యంత ఖరీదైన భూములను కారుచౌకగా కట్టబెట్టిందని ఆరోపిస్తూ న్యాయవాది శ్రీరంగరావు, ప్రముఖ పాత్రికేయులు ఎబికె ప్రసాద్, ఆడిటర్ విజయసాయిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

వీటిని సోమవారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ అఫ్జల్ పుర్కర్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఐఎంజీ భారత సంస్థ కుదుర్చుకున్న ఒప్పందంలోని అక్రమాలపై ప్రాథమిక విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం 2006లో జీవో 310ను జారీ చేసిందని, అంతకుముందే ఔటర్ రింగ్‌రోడ్ భూసేకరణలో అక్రమాలపైనా ప్రాథమిక విచారణ కోరిందని కోర్టుకు సిబిఐ తెలిపింది.

తగిన సిబ్బంది లేకపోవడంతో ఐఎంజీ వ్యవహారంపై రాష్ట్రస్థాయి దర్యాప్తు అధికారులతోనే ప్రాథమిక విచారణ చేయించాలని, ఆధారాలు లభిస్తే సీబీఐ విచారణను కోరాలని రాసిన లేఖపై ఇంతవరకు ఎలాంటి సమాధానం రాలేదని తెలిపింది. ప్రస్తుతం తాము దర్యాప్తు చేస్తున్న కేసులన్నీ ఓ కొలిక్కి వచ్చాయని, సిబ్బంది కొరత సమస్య ఉండే పరిస్థితి లేదని సిబిఐ కోర్టుకు తెలిపింది. తాజాగా సీబీఐ కౌంటర్‌ను పరిశీలించిన ధర్మాసనం విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

ఎలమంచిలి ఎమ్మెల్యే ఉక్కిరిబిక్కిరి

మకుటం లేని మహారాజుగా చెలామణి అయిన ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజును వరుస కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రజాప్రతినిధిగా ఉంటూ రియల్ ఎస్టేట్, కాంట్రాక్టులు, మద్యం వ్యాపారాల ద్వారా సంపాదించిన ఆస్తులు వందల కోట్ల రూపాయల్లో ఉండడంతో అవన్నీ అక్రమాస్తులేననే ఆరోపణలు అధికమయ్యాయి. విశాఖ నగరం నడిబొడ్డున(హోటల్ మేఘాలయ) భారీ స్థలం, అందులో చేపడుతున్న షాపింగ్‌మాల్, సినిమా థియేటర్ల నిర్మాణానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ స్థలం రిజ్రిస్టేషన్ విలువే 26 కోట్ల రూపాయలు ఉంటే...వాస్తవంగా మార్కెట్ విలువ ఇంకెంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చునంటూ ఆయన ప్రత్యర్థులు సవాళ్లు విసురుతున్నారు. సీతమ్మధారలో ఆయన నిర్మించుకున్న భవంతికి విశాఖ నగర పాలక సంస్థ ఎందుకు అనుమతులు ఇవ్వలేదు? నిబంధనలు ఉల్లంఘించి నిర్మించినా ఎందుకు చర్యలు చేపట్టలేదో అధికారులు నోరు విప్పాలనే వాదన ఊపందుకుంది. ఆ భవనం, అందులో స్విమ్మింగ్‌పూల్ సినిమా సెట్‌ను తలపిస్తున్నాయంటే..ఆయన ఎంత సంపాదించారో అంతుచిక్కడం లేదంటూ పలువురు ఆశ్చర్యం ప్రకటిస్తున్నారు. ఆయన ఎంత సంపాదించుకున్నా ఫరవాలేదని, అయితే తినడానికి కూడు లేని పేదలు తన దగ్గర పనిచేస్తుంటే..వారి పేరు మీద బ్యాంకులో రుణం తీసుకొని, ప్రభుత్వం నుంచి కోటి రూపాయల రాయితీని అక్రమంగా కొట్టేయడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి.

వీటిని విజిలెన్స్ విభాగం నిర్ధారించి, ఎమ్మెల్యే కుమారుడు తేజపై క్రిమినల్ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించినా ప్రభుత్వం మిన్నకుండిపోవడంతో ఆయన ప్రత్యర్థులు ఇక న్యాయస్థానమే దిక్కుగా భావించి నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఎలమంచిలి నియోజకవర్గానికి చెందిన కొయిలాడ వెంకట్రావు ఎమ్మెల్యే అక్రమ ఆస్తులు, ఎస్సీల పేరుతో ఆయన ప్రభుత్వం నుంచి పొందిన రాయితీపై హైకోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని విచారణకు స్వీకరించిన కోర్టు విజిలెన్స్ ఏ నివేదిక ఇచ్చిందో తమకు సమర్పించాలని ఆదేశించింది.

దాంతో ఎమ్మెల్యే కన్నబాబు గుండెల్లో రాయి పడింది. ఇన్నాళ్లు ప్రభుత్వంలో మేనేజ్ చేయగలిగినా న్యాయస్థానానికి వచ్చేసరికి ఏం చేయాలో పాలుపోక ఆపసోపాలు పడుతున్నారు. అది సరిపోదు అన్నట్టు విశాఖ ఏసీబీ కోర్టులో ఆడారి ఆదిమూర్తి ఎమ్మెల్యే అక్రమ సంపాదన, కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులపై కేసు వేశారు. దానిపై విశాఖలో ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయంటూ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. జిల్లాలో ఇలాంటి కేసును ఎదుర్కొంటున్న మొదటి ఎమ్మెల్యే ఆయనే కావడం విశేషం.

ఏసీబీ విచారణ మొదలుపెడితే..ఆదాయ వ్యయాలు, పన్నుచెల్లింపులు, కొనుగోళ్లు అమ్మకాలు అన్నింటిపైనా కూపీ లాగుతుంది. మొత్తం వ్యవహారాలు బయటకొస్తాయి. వీటికి తోడుగా భూమి విషయంలో ఎమ్మెల్యే తనను బెదిరిస్తున్నారంటూ ఇటీవల సన్యాశిరాజు అన్యే భూ వ్యాపారి నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఒక్కొక్కటిగా కేసులు పడుతుండడంతో రాజకీయ దురుద్దేశాలతో ప్రత్యర్థులు దాడి చేస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడించడానికి ఈ ఎత్తులు వేస్తున్నారని పేర్కొంటున్నారు.

వచ్చే ఎన్నికల సంగతి ఏమో కానీ వీటన్నింటిపై విచారణ జరిగితే...ఎమ్మెల్యేపైన, ఆయన కుమారుడిపైనా క్రిమినల్ కేసులు నమోదు కావడం ఖాయమని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కన్నబాబురాజు సీరియస్‌గా వుడా అధ్యక్ష పదవికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ కేసులన్నీ దాఖలు కావడంతో ఆయన అవకాశాలు నీరుగారిపోయినట్టేనని ప్రత్యర్థులు సంతోషం ప్రకటిస్తున్నారు. ఈ పదవి కోసం ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేయడానికి నగరానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ముందుకొస్తే...వారికి ఏమాత్రం తీసిపోకుండా పార్టీకి ఫండ్ ఇస్తానంటూ కన్నబాబు వుడా ఛైర్మన్ గిరి కోసం పోటీ పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈయనకు జిల్లా మంత్రులు బాలరాజు, గంటా శ్రీనివాసరావుల మద్దతు ఉండడంతో దాదాపుగా పదవి ఖాయమని భావిస్తున్న తరుణాన ఈ కేసులతో ఆ పదవి వస్తుందో రాదోననే అనుమానం మొదలైంది. ఈ కేసులు ఏ మలుపులు తిరుగుతాయోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మార్చుకు అనుమతి ఇప్పించే యత్నం : కేకే

తెలంగాణ మార్చ్‌పై సీఎం, హోమంత్రి తనతో మాట్లాడారని అయితే ఇప్పటికే ఆలస్యమైందని, మార్చ్ వాయిదా వేయలేమని తేల్చి చెప్పినట్లు కేకే తెలిపారు. తాను మధ్యవర్తిత్వం జరిపే ప్రసక్తే లేదన్నారు. మార్చ్ వాయిదా ప్రయత్నం చేస్తున్నామని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాంత మంత్రులమంతా కలిసి మార్చుకు అనుమతి ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని కేకే పేర్కొన్నారు
కాశ్మీర్‌లో 45 మంది సర్పంచ్‌లో రాజీనామా చేస్తే దీనిపై రాహుల్ గాంధీ సీడబ్ల్యూసీలో ప్రస్తావించారని, అయితే తెలంగాణ కోసం 118 మంది ప్రజాప్రతినిధులు రాజీనామా చేసినా మాట్లాడినవారు లేరని, ఇది ఎంతో ఆవేదన కల్గిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత కే.కేశవరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మార్చ్‌లో హింసకు అవకాశం

ఈనెల సెప్టెంబర్ 30న జరిగే తెలంగాణ మార్చ్‌లో హింస జరిగే అవకాశం ఉన్నట్లు నిఘావర్గాల నుంచి సమాచారం ఉందని లా అండ్ ఆర్డర్ డీజీ హుడా పేర్కొన్నారు. బుధవారం ఉదయం తెలంగాణ మార్చ్, వినాయక నిమజ్జనంపై డీజీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ మార్చ్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదన్నారు.

ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తామని, ప్రజల ఆస్తులపై దాడికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ మార్చ్‌కు వచ్చే వారంతా కేసులు లేని వారన్నారు. మతఘర్షణలు,తీవ్రవాదుల చొరబాటుకు అవకాశం ఉన్నట్లు హుడా తెలిపారు. హైదరాబాద్‌కు కేంద్ర బలగాలు వస్తున్నారని, ప్రజలకు ఎలాంటి హానీ జరగకుండా చూస్తామని హుడా పేర్కొన్నారు.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఏరియాలో మార్చ్ నిర్వహించే అవకాశం ఉంద న్నారు. అసెంబ్లీ, ట్యాంక్‌బండ్, నెక్లస్‌రోడ్డు పైనా దాడుల చేస్తారనే సమాచారం ఉందని హుడా చెప్పారు. జేఏసీ ఆయుధాలను అడ్డు కట్టేందుకు తమ వద్ద ఆయుధాలు ఉన్నాయన్నారు. దాడులు జరిగినా రబ్బరు బుల్లెట్లు ఉపయోగించబోమని, ముందస్తు అరెస్ట్‌లు తప్పవని హుడా ప్రకటించారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలను సైతం అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ చుట్టూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, మిలియన్ మార్చ్ అనుభవంతో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు డీజీ హుడా తెలియజేశారు.

మార్చ్ వాయిదాపై సీఎం ఫోన్‌ మంతనాలు

తెలంగాణ మార్చ్ వాయిదాపై ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా కొందరు తెలంగాణ మంత్రులతో సీఎం కిరణ్ ఫోన్‌లో సంభాషణలు జరిపారు. తెలంగాణ జేఏసీ నేతలతో చర్చలు జరిపే బాధ్యతలను డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రి జానారెడ్డి, సీనియర్ నేత కేకేలకు అప్పగించారు.

తెలంగాణ పొలిటికల్ జేఏసీతో మాట్లాడి మార్చ్ వాయిదా వేసేలా చూడాలని తెలిపారు. జీవవైవిద్య సదస్సు తర్వాత మార్చ్ జరిగేలా జేఏసీ నేతలను విజ్ఞప్తి చేయాలని ఆయన మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సీఎం తనతో చర్చించారని,అటు మార్చ్‌కు అనుమతి ఇప్పించాల్సిందిగా జేఏసీ నేతలు కూడా కోరారని ఈ విషయాలన్నింటిపైనా పార్టీ నేతలు సీఎం చర్చిస్తారని జానారెడ్డి తెలిపారు.

అటు సీఎం ప్రతిపాదనపై సీనియర్ నేత కేకే అసంతృప్తి వ్యక్తపరిచారు. కాశ్మీర్‌లో 45 మంది సర్పంచ్‌లు రాజీనామా చేస్తే దీనిపై రాహుల్ గాంధీ సీడబ్ల్యూసీలో ప్రస్తావించారని, అయితే తెలంగాణ కోసం 118 మంది ప్రజాప్రతినిధులు రాజీనామా చేసినా మాట్లాడినవారు లేరని, ఇది ఎంతో ఆవేదన కల్గిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత కే.కేశవరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ మార్చ్‌పై సీఎం, హోమంత్రి తనతో మాట్లాడారని అయితే ఇప్పటికే ఆలస్యమైందని, మార్చ్ వాయిదా వేయలేమని తేల్చి చెప్పినట్లు కేకే తెలిపారు. తాను మధ్యవర్తిత్వం జరిపే ప్రసక్తే లేదన్నారు. మార్చ్ వాయిదా ప్రయత్నం చేస్తున్నామని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాంత మంత్రులమంతా కలిసి మార్చుకు అనుమతి ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని కేకే పేర్కొన్నారు.

మరోవైపు తెలంగాణ మార్చ్ నేపథ్యంలో వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలో పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు, ప్రధాన రహదారుల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. పలువురు టీఆర్ఎస్, జేఏసీ, విద్యార్థి జాక్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్‌లో 16 ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌కు వెళ్లే మార్గంలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు.

అంతరిస్తున్ననగర పచ్చదనం

నగర పచ్చదనంపై నిర్లక్ష్యపు నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయి. అభివృద్ధి పేరిట జరుగుతున్న నిర్మాణాల కింద మహా వృక్షాలు మాయమవుతుంటే కొత్తగా చెట్లు నాటేందుకు ఎవరికీ చేతులు రావడంలేదు. సుమారు కోటి మంది జనాభా గల నగరంలో పచ్చదనం ప్రశ్నార్థకంగా మారుతోంది. పట్టణీకరణ, పారిశ్రామిక అభివృద్ధి పేరిట పచ్చని అడవులతో పాటు, మహా వృక్షాలను సైతం నరికివేయడంతో జీవరాశుల మనుగడ ప్రశ్నార్తకంగా మారుతోంది. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాల మూలంగా కాలుష్యం పెరిగి నగర జీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. పర్యావరణ సమతుల్యత పాటించాల్సిన అధికార యంత్రాంగం మానవాళికి మేలు చేసే చెట్లను నరికి నగరాన్ని కాంక్రీట్ జంగిల్‌గా మర్చివేస్తున్నారు. వృక్ష సంపద అంతరించడం వల్ల జరిగే నష్టాన్ని గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంలోనూ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయనీ, ఫలితంగా కాలుష్యం పెరగడంతో పాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని సేవ్ కన్వీనర్ విజయరాం అన్నారు.

మహా వృక్షాలు మాయంనగరంలో చేపట్టిన పలు నిర్మాణాల్లో భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. మానవ మనుగడకు అవసరమైన ఆక్సిజన్ అందించి పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే వృక్షాలను నరికి బహుళ అంతస్థుల భవనాలను నిర్మిస్తున్నారు. ఫలితంగా పచ్చదనం నాశనమై నగరం కాంక్రీట్ జంగిల్ మారుతోంది. మొక్కల పెంపకానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న హెచ్ఎండీఏ ఆ బాధ్యతలను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించి చేతులు దులుపుకుంటోంది. ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా వందల ఏళ్లనాటి మర్రి, వేప, కానుగ చెట్లను సుమారు 400పైగా తొలగించారు. ట్రాన్స్‌లొకేషన్‌కు అవకాశమున్నా ప్రభుత్వం శ్రద్ధ పెట్టకపోవడం గమనార్హం. బెంగళూరు, విజయవాడ హైవేలపై ఒకనాడు కనిపించిన మహా వృక్షాలు కనుమరుగయ్యాయి. గతం లో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం సందర్భంగా వందల వృక్షాలను తొలగించారు. వాటిలో సుమారు 40కి పైగా చెట్లను ప్రైవేటు వ్యక్తులు తీసుకోవడం గమనార్హం. విస్తరణలో భాగంగా...నగర విస్తరణలో భాగంగా చుట్టూ ఉన్న అడవులను నరికి నిర్మాణాలు చేపట్టారు. భారీ పరిశ్రమలు, సెజ్‌ల నిర్మాణంలో వందల చెట్లను నరికి వేశారు. ఫలితంగా ఆయా చెట్లపై ఆధారపడి జీవించే లక్షల జీవులు అంతరించాయి. నగరం చుట్టూ ఒకప్పుడు వందల ఎకరాల్లో వ్యవసాయం జరుగుతుండేది. ఫాం హౌస్‌లు, కాలేజీలు, సెజ్‌ల పేరిట వందల ఎకరాల్లో సాగును ధ్వంసం చేసి, కంచెలు నిర్మించుకుంటున్నారు. వృక్ష, జంతుజాలం అంతరించడం మూలంగా జీవ వైవిధ్యం దెబ్బతింటోందని 'ఆంత్ర' సంస్థకు చెందిన ఆశాలత అంటున్నారు.

పెరుగుతున్న కాలుష్యంకార్బన్‌డయాక్సైడ్‌ను స్వీకరించి మనిషి జీవించడానికి అవసరమైన ఆక్సిజన్ అందించే మొక్కలు నరికివేయడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. నగరంలో పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమల నుంచి వెదజల్లే కాలుష్యం మూలంగా ప్రజలకు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.

ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించే ఉద్యానవనాల పట్ల సైతం హెచ్ఎండీఏ లాంటి సంస్థలు నిర్లక్ష్యం వహించడం మూలంగా కాలనీలలో పచ్చదనం నశిస్తోంది. మొత్తంగా మనిషి మనుగడకు ఉపయోగపడే, ఒకనాడు నగరంలో విరివిగా కనిపించిన మర్రి, వేప, చింత, కానుగ లాంటి వృక్షాలు కానరాకుండా పోయాయి. నగరంలో జీవవైవిధ్య సదస్సు నిర్వహిస్తున్న సందర్భంగా ప్రభుత్వ సంస్థలు చేస్తున్న ఆర్భాటం సంవత్సరం పొడువునా పచ్చదనాన్ని కాపాడడంపై చూపాలని నగర వాసులు కోరుతున్నారు.

నిమజ్జన ఊరేగింపు దారులివి

వినాయక నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు పోలీసు శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈనెల 29న జరిగే సామూహిక నిమజ్జనానికి హుస్సేన్ సాగర్‌కు వచ్చే విగ్రహాలు, ఊరేగింపు కోసం ప్రత్యేక రూట్‌లను రూపొందించారు. ప్రధాన ఊరేగింపునకు సాధారణ ట్రాఫిక్‌తో ఇబ్బందులు కలుగకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ తెలిపారు. నిమజ్జనానికి సంబంధించిన రూట్ మ్యాప్‌ను విడుదల చేశారు. విగ్రహాలు ఇలా వెళ్లాలిజూ ప్రధాన ఊరేగింపు కేశవగిరి నుంచి ప్రారంభమై నాగుచింత. ఫలక్‌నుమా, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, ఆబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ మీదుగా ట్యాంక్‌బండ్ పైకి లేదా ఎన్‌టీఆర్ మార్గ్‌కు చేరుకుంటుంది. జూ సికింద్రాబాద్ ప్రాంతం వినాయక విగ్రహాలు ఆర్‌పీ రోడ్డు, ఎంజీ రోడ్డు, కర్బలా మైదాన్, కవాడిగూడ, ముషీరాబాద్, ఆర్‌టీసీ, నారాయణగూడ క్రాస్‌రోడ్స్, హిమాయత్‌నగర్ వై జంక్షన్ మీదుగా లిబర్టీ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళతాయి. జూ ఉప్పల్ నుంచి వచ్చే విగ్రహాలు రామంతపూర్, అంబర్‌పేట, ఎన్‌సీసీ, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ హాస్పిటల్ మీదుగా ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లోని ప్రధాన ఊరేగింపులో కలుస్తుంది.జూ పడమర నుంచి వచ్చే ఊరేగింపు తెలుగు తల్లి విగ్రహం వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తుంది.జూ విగ్రహాల తరలింపు సమయంలో సాధారణ వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 29వ తేదీ ఉదయం ఆరు నుంచి 30వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు పలుప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఊరేగింపు జరిగే ప్రాంతంలో సా«ధా రణ వాహనాల అనుమతిని నిషేధిస్తున్నట్లు చెప్పారు. ఉత్తరం నుంచి తూర్పుకు వచ్చే వాహనాలకు బషీర్‌బాగ్ జంక్షన్, బేగంపేట ప్రాంతాల్లో మాత్రమే మళ్లింపులు ఉంటాయి. మరికొన్ని మళ్లింపు దారులు దక్షిణం: కేశవగిరి, మహబూబ్‌నగర్ క్రాస్ రోడ్స్, ఇంజిన్‌బౌలి, నాగుల చింత, హిమ్మత్‌పూర్, హరిబౌలి, అస్రాఆస్పతి, మొగుల్‌పురా, లకడ్‌కోఠి, మదీనా క్రాస్‌రోడ్స్, ఎంఏ బ్రిడ్జి, దారుల్‌షిపా క్రాస్‌రోడ్స్, సిటీ కాలేజీ ప్రాంతాల్లో మళ్లింపులు ఉంటాయి.తూర్పు: చంచల్‌గూడ జైల్ క్రాస్ రోడ్స్, మూసారాంబాద్, చాదర్‌ఘాట్ బ్రిడ్జి, సాలార్‌జంగ్ బ్రిడ్జి, అఫ్జల్‌గంజ్, పుత్లీబౌలి క్రాస్ రోడ్స్, ట్రూప్‌బజార్, జామ్‌బాగ్ క్రాస్‌రోడ్స్, కోఠి ఆంధ్రాబ్యాంకు వద్ద మళ్లింపులు ఉంటాయి.పడమర: తోప్‌ఖానా మసీదు, అలాస్కా హోటల్ జంక్షన్, ఉస్మాన్ గంజ్, శంకర్‌బాగ్, సీనా హోటల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద అంజతా గేట్, అబ్కారీ లేన్, బర్తన్ బజార్, ఏఆర్ పెట్రోల్ పంపు వద్ద మళ్లింపులుంటాయి.మధ్యమం (సికింద్రాబాద్): వాహనాలను నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్ బండ్ వైపు అనుమతించారు. సీటీఓ, వైఎంసీఏ, ప్యారడైజ్ క్రాస్‌రోడ్స్, పాట్నీ క్రాస్ రోడ్స్, బాటా క్రాస్ రోడ్స్, మండి క్రాస్‌రోడ్స్ మీదుగా మళ్లిస్తారు.వాహనాలు ఇక్కడ పార్కింగ్ చేయాలినిమజ్జనాన్ని తిలకించేందుకు వచ్చే సందర్శకులు వాహనాలను పోలీసులు సూచించిన ప్రాంతాల్లో పార్కింగ్ చేయాలి. ఇందు కోసం పది పార్కింగ్ పాయింట్‌లను ఏర్పాటు చేశారుఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, ఖైరతాబాద్, ఎంఎంటీఎస్ స్టేషన్, ఖైరతాబాద్, ఆనందనగర్ కాలనీ నుంచి రంగారెడ్డి కలెక్టరేట్ జంక్షన్ వరకు, బుద్ధ భవనం వెనుకవైపు, గో సేవా సదన్, లోయర్ ట్యాంక్ బండ్, కట్ట మైసమ్మ దేవాలయం, ఎన్‌టీఆర్ స్టేడియం, నిజాం కళాశాల, పబ్లిక్ గార్డెన్స్.లారీలకు...జూ విగ్రహాలతో వచ్చిన లారీలు ఎన్‌టీఆర్ మార్గ్‌లో నిమజ్జనం పూర్తి చేసుకున్న అనంతరం నెక్లెస్ రోటరీ, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, వీవీ విగ్రహం, కేసీపీ గేస్ట్‌హౌస్ వైపుకు వెళ్లి అక్కడి నుంచి గమ్యస్థానాలకు చేరుకోవాలి.జూ అప్పర్ ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం అయిన వెంటనే ఖాళీ లారీలు పిల్లల పార్కు, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ, ముషీరాబాద్ మీదు గా వెళ్లాలి.జూ రవాణా కోసం వచ్చే లారీలను 29, 30వ తేదీలలో నగర రోడ్లపైకి అనుమతించరు.ట్రాఫిక్ నిబంధనలు ఆర్టీసీ బస్సులకు కూడా వర్తిస్తాయని పోలీసులు చెబుతున్నారు.

జూ మెహిదీపట్నం నుంచి వచ్చే బస్సులు మాసబ్‌ట్యాంకు వరకు నడుస్తాయి.

జూ కూకట్‌పల్లి నుంచి వచ్చే బస్సులు వీవీ విగ్రహం వరకే నడుస్తాయి.

జూ సికింద్రాబాద్ నుంచి వచ్చే బస్సులు సీటీఓ, వైఎంసీఏ, రేతిబౌలి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, క్లాక్ టావర్, చిలకలగూడ క్రాస్‌రోడ్స్ వరకు నడుస్తాయి.

జూ ఉప్పల్ నుంచి వచ్చే బస్సులు 6 నెంబర్ క్రాస్ రోడ్స్ వరకు నడుస్తాయి.

హైదరాబాద్ శాస్త్రవేత్తలకు రజత పతకాలు

హైదరాబాద్‌లోని నేషనల్ జి యోగ్రాఫికల్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్ఐ)కు ఉత్తమ పరిశోధనా సంస్థల మూడోవిభాగంలో రజత పతకం లభించింది.

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసె ర్చి (సీఎస్ఐఆర్) 70వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వివిధ వి భాగాల్లో ఉత్తమ పరిశోధనా సంస్థ లు, శాస్త్రవేత్తలకు మంగళవారం అ వార్డులు బహూకరించారు. సీఎస్ఐఆర్ కార్యాలయంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి వయలార్ ర వి చేతుల మీదుగా.. ఎన్‌జీఆర్ఐ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఆర్‌కే చద్దా, ఏ వో ఎ.బాలకృష్ణ, ఎస్‌వో జీ.వెంకటేశ్వర్లు రజత పతకాలు, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.