24, నవంబర్ 2011, గురువారం

నడుం జర భద్రం

ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న ఫ్యాషన్‌ ప్రపంచం నేడు మన భారత మగువల మనసుల్నికూడా దోచుకుంటోందన్నది వాస్తవం. దీంతో వారి వస్త్ర అలంకరణలో ఎన్నో మార్పులు పుటుకొచ్చాయన్నది జగమెరిగిన సత్యం. నిన్న టి తరం చీరలు, లంగా ఓణీలు కేవలం పండగ పబ్బాలకో పెళ్లి పేరంటాలకో పరిమితం చేసిన నేటి తరం మహిళలు కొత్త కొత్తగా పుట్టు కొస్తున్న ఫ్యాషన్‌ ప్రపంచంలో అడుగు పెడుతూ.. మైమరిచిపోతున్నారు.
ఈ క్రమంలో ఇటీవల కాలంలో జీన్స్‌ ధరించిన మహిళలే కాకుండా వివిధ డ్రస్సులకు తగ్గట్టు బెల్టులు పెట్టడం బాగా పెరుగుతోంది. ఇన్‌షర్టు చేసుకుంటే దాని హూందా తనమే వేరుగా ఉండటంతో మహిళల్లో ఇన్‌ చేసుకుని, బెల్టు వాడే పద్దతి బాగా పెరుగుతోంది.
దీంతో వారి దృష్టి మార్కెట్‌లోకివస్తున్న అనేక రకాల బెల్టులపై పడింది. అనేక రంగుల్లో, కళ్లు చెదరగొట్టేలా కనిపిస్తున్న ఈ బెల్టులు విషయంతో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
స్త్రీల నడుము నాజూకుగా ఉంటుంది కనుక వీరు లావుపాటి, మందంగా ఉండే బెల్టులు వాడితే నడుము కంది పోయి, ఎలర్జీలు ఇతర రుగ్మతలకు దారి తీసే అవకాశాలున్నాయని... నడుముకు సరిపోయిన, మెత్తని, సన్నని బెల్టుని వాడుకుంటే మంచిదని వారు సూచిస్తున్నారు. బెల్టులు, లెదర్‌ షాపులకి వెళ్లేప్పుడు మీరు కంఫర్ట్‌ బెల్టు అడిగితే మంచిదని... వారు చెప్పారు.

తెలుగు జాతి వెలుగు జాతే..

  • ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొక్కటే...
  • నేడు తెలుగువారందరిదీ ఒకటే రాష్ట్రం..
  • భవిష్యత్‌లో రెండు రాష్ట్రాలు, మూడు రాష్ట్రాలు ఏర్పడ వచ్చు.
  • కానీ తెలుగువారి సమైక్యతకు సమగ్రతకు పోరాడిన చరిత్రను విస్మరించలేం. మనముందు నూతన చరిత్ర ఆవిష్కృతమైనా..
దానితో పాటు పూర్వ చరిత్రనూ స్మరించుకోవలసిందే త్యాగధనుల్ని తలచుకోవాల్సిందే.
వారి త్యాగాల స్పూర్తిగా తెలుగువారి సమగ్రాభివృధ్ధికి ముందుకు సాగాల్సిందే...
సువిశాల భారత సామ్రాజ్యానికి స్వాతంత్రం వచ్చాక అంతే స్ధాయిలో రాష్ట్రం కోసం పోరాటం జరగటం ఆంధ్ర ప్రదేశ్‌తోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. 1912 లోనే తెలుగు భాష మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం ఉండా లని టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవ రెడ్డి, భోగరాజు పట్ట్టాభి సీతారామయ్య తదితరుల సారధ్యంలో అలుపెరగని పోరాటం జరిగింది. 40 ఏళ్ల పాటు పోరా డినా... అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం కానీ తరువాత వచ్చిన స్వతంత్ర భారత ప్రభుత్వం కానీ ఆంధ్ర ప్రజల ఆకాంక్షని నెరవేర్చలేదు. ఆ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పాటులో పొట్టి శ్రీరాములు చేసిన ఎనలేని కృషి చిరస్మరణీయం.అని చెప్పక తప్పదు.
అమరజీవి...
1901 మార్చి 16న చెన్న పట్టణంలో జన్మించిన పొట్టి శ్రీరాములు ప్రాధమిక విద్య పూర్తయ్యాక శానటరీ ఇంజనీ రింగ్‌ కోర్సు చేసి పశ్చిమ రైల్వేలో ఉద్యోగం చేసేవారు. ఈ క్రమంలో నాడు స్వాతంత్ర పోరాటంలో అనేక మంది పాల్గొనటంతో ఉత్తేజభరితుడై స్వాతంత్ర సమరం వైపు అడుగులు వేసాడు. ఓ వైపు తన తల్లి చనిపోయినా... వెర వక మాతృభూమిని విదేశీ కబంధహస్తాల నుండి కాపా డటమే లక్ష్యంగా గాంధీ సాగించిన మహౌద్యమానికి తానూ బాసటగా నిలచి ఉపð సత్యాగ్రహం, క్విట్‌ ఇండి యా ఉద్య మాల్లో చురుకుగా పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చే నాటికి ఈ దేశంలో 22 జిల్లాలో తెలుగు మాట్లాడే వారుండేవారు. 1952లో మద్రాస్‌ ప్రెసిడెన్సీలో ఉండి దక్షణ భారత దేశంలో సాంప్రదాయలకు పెద్ద పీట వేస్తూ వచ్చిన తెలుగు జాతి ఎన్నో ఈసడిం పులకు అవమానాలకుగురవుతు ఏహ్యభావం పెరుగుతున్న దశలో వాటిని సహించలేక తెలుగుభాష మాట్లాడే వారందరినీ ఒకే రాష్ట్ర పరిధిలోకి తేవాలన్న ఏకైక డిమాం డ్‌తో 1952 అక్టోబ ర్‌ 19న చెన్నై పట్టణంలోని బులుసు సాంబ మూర్తి ఇంట్లో ఆమరణ దీక్షను ప్రారంభించారు. అంచెలం చెలుగా ఆమరణ దీక్ష ఫలితాలు తెలుగునాట విస్తరిం చడంతో పాటు తెలుగునాట ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపం దుకుం ది. లక్షలాది ప్రజలువీధుల్లోకొచ్చి పొట్టి శ్రీరాములుకు మద్దతుగా ప్రదర్శనలు, నిరసనల దీక్షలు చేపట్టారు. నాటి కేంద్ర సర్కారు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా దీక్ష విర మణకు ససేమిరా అనటంతో పాటు తెలుగురాష్ట్ర ఏర్పా టుకు భీష్మించడంతో క్రమేణా ఆరోగ్యం కృసించి 1952 డిశంబర్‌ 15న దీక్షలోనే ఆయన పరమపదిం చారు.
డిశంబర్‌ ప్రకటన.
పొట్టిశ్రీరాములు మరణ వార్త యావత్‌ ఉమ్మడి రాష్ట్రాన్ని కుదిపేసింది. మద్రాసు నుంచి విశాఖ సాగర తీరం వర కు లక్షలాది ప్రజలు ఆమరజీవి మరణం పట్ల ఆగ్రహావే శాలు వ్యక్తం చేస్తూ. విధ్వంసానికి దిగారు. అనేక హింసా త్మక చర్యలకు కూడా పాల్పడ్డారు. నాడు జరిగిన పోలీసు కాల్పు ల్లో అనేక మంది అసువులు బాసారు. చివరికి ఆయన చేసినప్రాణత్యాగాన్ని గుర్తించిన నాటి ప్రధాని జవహ ర్‌ లాల్‌ నెహ్రూ 1952 డిశంబర్‌ 19 నఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కు శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు.. 1953 అక్టోబర్‌1న తెలుగు వారి కోసం ప్రత్యేక ఆంధ్ర ఏర్పా టు చేసారు.అయితే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న కోస్టల్‌ ఆంధ్రా, రాయలసీమ జిల్లాలను విడి రాష్ట్ర ఏర్పాటు సన్నాహాల దిశలో ఉండగా నాడు ఉమ్మడి ముఖ్యమంత్రిగా వ్యవహరి స్తున్న చక్రవర్తుల రాజగోపాలచారి.. ఆంధ్ర రాష్ట్రం ఏర్పా టు చేస్తే,వెంటనే ఆంధ్రులు వెళ్లిపోవాలని తెగేసి చెప్పడం తోరాజధానిఏర్పాటుపై అనేక తర్జనభర్జనలు జరిగాయి.
రాజధాని కోసం తర్జన భర్జనలు...
ఈ క్రమంలో ఆంధ్రకు రాజధానిగా కాకతీయులు పాలించిన వరంగల్‌ని రాజధానిగా చేస్తే అందరికీ సౌల భ్యంగా ఉంటుందని... అలాగే రాజమండ్రిని పరి గణలో కి తీసుకోవచ్చని రాజ్యాంగ ప్రదాత బాబా సాహేబ్‌ అంబే డ్కర్‌ ప్రతిపాదనచేసారు. మధ్యే మార్గంగా విజయ వాడని కూడా ఎంపిక చేయాలని తలచారు. అయితే అప్పటికే విజయవాడని కమ్యూనిస్టులు తమ కంచుకోటగా మార్చు కోవటంతో అక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే తమకు ఇబ్బం దులు ఏర్పడటం ఖాయమని కాంగ్రెస్‌ నేతలు ససేమిరా అనటంతో రాజధాని కధ మళ్లీ మెదట ికొచ్చింది.
అదే సమయంలో చెన్నైకి దగ్గరగా ఉన్న తమని ఆంధ్ర లో కలపడం వల్ల రాజధాని దూరం అవుతుందని.. తద్వారా తమ రాయలసీమ జిల్లాల అభివృధ్ధి ఆగిపోతుందని... అక్కడి కాంగ్రెస్‌ నేతలు కొత్త మెలిక పెట్టడంతో పాటు రాజధానిని కోస్తా ప్రాంతాలలో ఏర్పాటు చేస్తే తాము అంగీకరించే ప్రశ్నే లేదని, కోస్తా వారిని తాము ఎట్టి పరి స్ధితిలోనూ నమ్మబోమంటూ రాయల సీమలోనే రాజధాని ఉండాలి. లేదంటే తమకు ప్రత్యేకరాష్ట్రమే అవసరం లేదం టూ నీలం సంజీవరెడ్డి లాంటి నేతలు ఎదురు తిరగటం ఓ వైపు అయితే తిరువళ్లూరు, బళ్లారీ, బరంపురం తది తర తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలను కూడా వదులుకునేందుకు సిద్దపడాల్సి వచ్చింది మరో వైపు.. మద్రాసు రాష్ట్రాన్ని వదిలి పెట్టి ఎట్టి పరిస్ధితిలోనూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు త్వరితగతిన ఏర్పాటు చేసుకోవాలని ఒకే ఒక కాంక్షతో రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు రాజ ధానిగా చేసి 1953 అక్టోబర్‌1న ఆంధ్ర రాష్ట్రంని ఏర్పాటు చేసారు. దీనికి తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్రకేశరి టంగు టూరి ప్రకాశం పంతులు వ్యవహరించారుఆపై ఆంధ్ర రాష్ట్రంలోనిజాంస్టేట్‌లోని తొమ్మిది జిల్లాలను కలిపి 1956 నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ని ఏర్పాటు చేసి దీనికి హైదరా బాద్‌ని రాజధానిగా చేసారు. నాటి నుండి తెలుగు వాళ్లు ప్రపంచవ్యాప్తంగా తమ సత్తా చూపి స్తూ, తెలుగుభాషకు, మన రాష్ట్రానికి ఎనలేని పేరు ప్రఖ్యా తులు తెచ్చి పెట్టారు. ఖండా తరాలలోనూ తెలుగువాడి ఖ్యాతి మిన్నంటింది. తెలుగు రాష్ట్ర ఏర్పాటుకు కృషిచేసిన పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షకు దిగిన ఇంటిని ఆయన స్మృతి చిహ్నంగా కాపా డుతూ వస్తోంది. చెన్నైలోని మైలాపూర్‌, రాయపేట హైవే రోడ్డులో ఉన్న 126 నంబర్‌ ఇంటిని మీరెపðడైనా చెన్నై వెళ్తే దర్శించండి. ఇక మన రాష్ట్ర ప్రభుత్వ ఆ మహనీ యుని పేరు మీద పొట్టి శ్రీరా ములు తెలుగు విశ్వ విద్యాల యాన్ని స్ధాపించగా... 2008 లో నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసింది.
రాష్ట్రం సరే... భాషను కాపాడుకొందాం...
కానీ నేడు తెలుగు రాష్ట్ర భవి ష్యత్‌ అగమ్యగోచరంగా తయా రైంది. మా తెలుగు తల్లికి మల్లె పూదండ... అం టూ తెలుగు భాషకి అమ్మలోని కమ్మదనాన్ని మేళవించి చేసిన శంకరంబాడి కలం విన్యా సాలు... చేయెత్తి... జై కొట్టు తెలు గోడా... గతమెంత ఘన కీర్తి కల వోడా... అంటూ వేముల పల్లి శ్రీకృష్ణ తెలుగు జాతి గొప్ప తనాన్ని... నిండు గౌరవాన్ని ప్రపంచం పిక్కరి ల్లేటట్లు చేసినా అవి పాటలకే పరిమితం అయిపో వాల్సిన దుస్ధితి నెలకొంది. కనీ సం తెలుగుభాషకీ గౌరవం దక్కకుండా పోతోంది.
విదేశీయులు మన భాషని ఆశ్వాదిస్తుంటే...
ఒకపðడు ఇటాలియన్‌ ఆఫ్‌ ఈస్ట్‌గా... దేశ భాషలందు తెలుగు లెస్సగా ఎందరో దేశ విదేశాలకు చెందిన అనేక మంది ఈ భాషపై మక్కువతో...తెలుగు నేర్చుకుని.తమ అభిమానాన్ని చాటుకొంటు ప్రపంచంలోని ఏ భాషకూ లేని తెలుగు భాష నుడికారాన్ని, వీనుల విందైన పదకట్టు విన్యాసాలని నేర్చుకుని మన భాష సౌందర్యాన్ని ఆస్వాది స్తుంటే... మనం మాత్రం పరాయి భాషల వెూజు లో పడి తెలుగుభాష కమ్మదనాన్ని పక్కకు నెట్టేస్త్తూన్నా మన తెలు గు భాష అంత్యంత ప్రాచీన భాషగా గుర్తింపు పొందడమే కాకుండా ప్రాధాన్యతా క్రమంలో ప్రపంచవ్యాప్తంగా 6వ స్ధానాన్ని భారతదేశంలో 2వ స్ధానాన్ని దక్కించుకొందంటే మనమింకా అప్రమత్తతగా ఉంటే ఆస్ధాయి ఎక్కడికి పెర గొచ్చో, తెలుగు భాషలోని జాతీయాలు, మాట్లాడేందుకు ఉండే సౌలభ్యం ఉన్నతంగా ఉండటంతో అనేక మంది తెలుగు వారిని తమభాషల్లో కలిపేసు కోవాలని చూసినా అనేక అనువాదాలను తెరపైకి తెచ్చినా వీలుకా లేదు.మన భాషాబలం అలాం టిది మరి.
జాతికి ద్రోహం చేసినట్లే....
కానీ మన వాళ్లే సొంత ఇంటి భాషని నిర్లక్ష్యం చేస్తూ... పరాయి భాషల చూరు పట్టుకు వేలాడుతున్నారు. ఉపాధి కోసం ఇంగ్లీషు నేర్చుకున్నంత మాత్రాన తెలుగు భాషని మరచిపోవాలన్న రూలేమీ లేదు. మాతృభాషలో ఎవరైనా మాట్లాడటం వింటే చాలు...వికృత ముఖం పెట్టి చూడ టం...తెలుగు వచ్చినా మాట్లాడకుండా సాటి తెలుగు వారి ని ఇబ్బంది పెడుతూ పైశాచిక ఆనందం పొడటం అంటే తెలుగు జాతికి ద్రోహం చేసినట్లే భావించాలి. ఇక తెలుగు మాట్లాడేవారంతా ఒక్కటిగా ఉండాలని నినదించిన వారిని ఏహ్యభావనతో చూడటం ఆశ్చర్యకరం. తెలుగు జాతి, భాషావికాసాలకు ఎనలేని కృషి చేసి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మాండలికా లను యావత్‌ తెలుగు జాతి మొత్తానికీ పరిచయం చేసిన ఎందరో మహనీయులని, కవులు, కళా కారులని తలచుకుంటూ.వారు చూపిన బాటలో నడుస్తూ భవిష్యత్‌లో మన రాష్ట్రం ఎన్ని ముక్కచెక్కలైనా తెలుగు వాళ్లంతా తమ భాష సంస్క ృతులును కాపాడుకోవాల్సిన అవసరం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడానికి ఏ మాత్రం సందేహ పడనఖ్ఖర్లే...
అక్కడ వికసిస్తూ.. ఇక్కడ మందగిస్తూ...
విదేశాల్లో ఆటా, తానా, సిలికానాంధ్ర పేర్లతో అక్కడ ఉన్న తెలుగు వారు తమ మాతృభాష గొప్పదనాన్ని ఎప్పటిక పðడు గుర్తు చేసుకుంటూ తెలుగు సంస్కృతి, భాషా వికా సాలకి ఎంతగానో తొడ్పడుతుసాటి తెలుగువారిలో జాతీ యతా భావాన్ని రగిలిస్తున్నాయి. తెలుగు పతాకాన్ని అక్కడ రెపరెపలాడిస్తున్నా.. మన తెలుగు గడ్డపై మాత్రం తెలుగు జాతి ఏకీకరణకుగానీ, భాష పట్ల గౌరవాన్ని కానీ ప్రదర్శిం చక పోవటం విచారకరం.ఇప్పటికే ఇంగ్లీషు మాద్యమానికే పెద్ద పీట వేస్తూ... మాతృభాషలో విద్యాబోధన పట్ల చిన్న చూపు జరుగుతున్న క్రమంలో నేడు స్పోకెన్‌ ఇంగ్లీషు కేంద్రాలొచ్చినట్లే... భవిష్యత్‌లో స్పోకెన్‌ తెలుగు కేంద్రాలు పుట్టుకు వచ్చినా ఆశ్చర్యపోనఖ్ఖర్లే...
ప్రభుత్వమేం చేయాలి...
ఇప్పటికే ఇంటర్నెట్‌లో తెలుగు భాష చదువుకునేందుకు వీలుగా జరిగిన ఏర్పాట్లు సామాన్యజనానికి కూడా అర్ధమ య్యేలా చట్టాలను తెలుగు భాషలోనే అందుబాటులోకి తీసుకు రావాలి. అలాగే ఏ ప్రభుత్వ పధకమైనా ధరఖా స్తు తెలుగులో ఉంటేనే పరిశీలనకు తీసుకుంటామని.. ప్రభుత్వం ప్రకటించాలి. పాలనాపరమైన సౌలభ్యం పేరు తో ఇంగ్లీషు ఎంత ముద్దనుకున్నా...ప్రతి ఆదేశాన్ని ప్రజల చెంతకు చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల ప్రతి జిఓ ప్రజలకు తెలుగులోనే అందుబాటులోకి తీసుకు రావాలి. మరో స్వాతంత్ర పోరాటం జరిపినట్లే తెలుగు ప్రజలంతా యాసలకు, ప్రాంతీయా విధ్వేషాలకు అతీ తంగా ఐక్యంగా మన భాషని రక్షించుకోవటానికి ప్రతి తెలుగు వాడూ నడుంబిగించాలి.



అపðడెందుకు పాల్గొన్నారు
రాష్ట్రం ఎన్నిగా విభజించినా, అది జరిగే వరకు అంతా కల్సి ఉండాల్సిందే కదా ఆంధ్ర ప్రదేశ్‌ అవరతణ దినోత్సవం అంతా జరుపుకోవాల్సిందే...
2004లో మంత్రివర్గంలో ఉన్న నేటి విభజనవాదులు అప్పట్లో ఎందుకు అవతరణ దినోత్సవాలలో పాలొ ్గన్నారు... నేడెందుకు బ్లాకడేేలుగా పాటిస్తున్నారన్న విష యంపై ప్రజల కు వివరణ ఇవ్వాల్సిందే కాదా
వి.శ్రీనివాస్‌, పాలకొండ, శ్రీకాకుళం


పరస్పరం గౌరవించుకోవటం అవసరం
గతంలో జరిగిన జైతెలంగాణా, జై ఆంధ్ర ఉద్యమాలను చూసిన నాకు ప్రస్తుతం రాష్ట్రంలో నెల కొన్న పరిస్ధితి చూస్తుంటే బాధ కలుగుతోంది. విధ్వేషాలు రెచ్చ గొడుతూ పబ్బం గడుపుకుంటున్న రాజ కీయనేతలకు దూరంగా ఈ సారి రాష్ట్ర అవతరణ దినోత్సవాల నిర్వహణ బాధ్యతల్ని కలెక్టర్ల కివ్వటం సరైనదే, ఇక నుండి వారు రాజ కీయ వత్తిళ్లకు లొంగకుండా జనం బాధల్ని గుర్తెరిగి జాగుర కతతో వ్యవహరించాలి. అడుగున పడుతున్న సంక్షేమం ప్రజల ముంగిటకు చేర్చాలి. ప్రజలు కూడా రాజకీయ నేత ల మాటలకు రెచ్చి పోకుండా కేంద్రం విభజన రేఖలు పూర్తి చేసే వరకు సాటి తెలుగు వారిని పరస్పరం గౌరవిం చుకోవాల్సిన అవసరం ఉంది.
- మనోరంజన్‌ రావు, రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి,
ఆర్‌కె నగర్‌, సికింద్రాబాద్‌



రెచ్చగొట్టే వారిని శిక్షించాలి...
రాష్ట్రంలో విపరీత ధోరణులు పెరిగి పోవటానికి నేతల స్వార్ధ రాజకీ యాలే కారణం అన్నది వాస్తవం. లక్ష్య సాధన కన్నా తమ రాజకీ య భవిష్యత్‌పైనే దృష్టి పెడుతూ ఇష్టా నుసారంగా ప్రవర్తిస్తూ... జనానికి సమస్యగా తయారయ్యా రు. ఇలాంటి వారిని జనమే శిక్షించాలి.
గోపాల్‌ రెడ్డి, హౌసింగ్‌ బోర్డు కాలనీ,
ఇసీఈఎల్‌, సికింద్రాబాద్‌


రెండు రాష్ట్రాలు ఏర్పడితే తప్పేంటి
తెలుగువారికి రెండు రాష్ట్రాల డిమాండ్‌ తప్పుకాదు. నాడు పొట్టి శ్రీరాములు అప్పటి పరిస్ధితిలకు అనుగుణంగా తెలుగువారికి రాష్ట్రాన్ని సాధించారు. అలాగే తెలంగాణా వారికి ఇప్పుడొక రాష్ట్రం కావాలి. మరి తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఏర్పడితే తపేపండి అయితే తెలంగాణా రాష్ట్రాన్ని డిమాండ్‌ చేస్తూనే తెలుగు వారిని గౌరవించాలి. పొట్టి శ్రీరాములును స్మరించాలి. అదే భావ సమైక్యతకు, తెలుగు జాతి మనుగడకి శ్రేయాేెదాయకం.
- ప్రసాద్‌, శ్రీకాకుళం


ప్రత్యేక దేశం కావాలన్న నిజాం
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడానికి పూర్వమే హైదరా బాద్‌ నిజాంపాలనలో ఉండేది. భారతదేశానికి స్వాతం త్రమొచ్చినా...తాము మాత్రం అందులో కలిసేది లేదని ససేమి రా అంటూ ప్రత్యేకదేశంగా ఏర్పాటు కావాలని నిజాం తన ప్రయత్నాలు ప్రారం భించా డు. ఈ క్రమంలో ఆయుధాల సమీకరణ చేసుకొంటూనే ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిని ఆశ్రయించి సైన్యాన్ని పెంచుకొన్నారు. ఆపై రజాకార్ల హింస పెరిగి పోవ ట తో ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టులు సాయుధ పోరాటానికి దిగారు. దీంతో హైద రాబాద్‌లో హింస ప్రజ్వరిల్లటంతో 1948లో సెప్టెంబర్‌ 13న భారత ప్రభుత్వం పోలీ సుచర్యకి దిగింది. 5 రోజుల పాటు సాగిన ఈ పోరులో నిజాం ఓటమి పాలవ్వగా 18న పోలీసులు నిజాం సంస్ధానాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. దీంతో తప్పని పరి స్ధితిలో భారత దేశంలో తన సంస్ధానాన్ని కలిపేసేందుకు అంగీకరించాడు.


సైనిక పాలన నుంచి సమైక్యం వైపునకు...
హైదరాబాద్‌ని సైనిక పాలనలోకి తీసుకు వచ్చి సైనిక గవర్నర్‌గా మేజర్‌ జనరల్‌ జెఎస్‌ చౌదరిని నియమించారు. 1949 చివరి వరకూ గవర్నర్‌ పాలనలో ఉన్న నిజాంను హైదరాబాద్‌ రాష్ట్రంగా ప్రకటించి 1950లో రాజ్‌ ప్రముఖ్‌గా నిజాంని ప్రకటించి... ఎం.కె వెల్లోడిని ముఖ్యమంత్రిని చేసారు. ఆపై 1952లో జరిగిన ఎన్నికల్లో భూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అయితే 1953లో ఏర్పాటైన సయ్యద్‌ ఫజిల ఆలీ నేతృత్వంలోని రాష్ట్రాల పునర్విభజన కమి టీ, విశాలాంధ్ర ప్రయోజనాలు గుర్తిస్తునే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు సై అంది. దీనిపై విభేదించి.. హైదరాబాద్‌ అసెంబ్లీ మెజార్టీ సభ్యులతో పాటు కమ్యూనిష్టులు విశాలాంధ్ర ఏర్పాటును సమర్ధించడంతో తెలంగాణా, ఆంధ్రా నేతల మధ్య పెద్ద మనుషుల ఒప్పందం జరిగి 1956 నవంబర్‌1న ఆంధ్ర ప్రదేశ్‌ అవతరించింది.

కాలమేదైనా... నోరూరించే.. ఐస్‌క్రీమ్‌

వేసవి కాలమే... కాదు... శీతాకాలం లో నైనా... చలిపులి చంపేస్తున్నా.... ఐస్‌క్రీమ్‌ చూస్తే... తినాల్సిందే...
అనేక రకాల రంగుల్లో.. అనేక రుచుల్లో... వివిధ వాసనల్లో ఏదైశస్ధులైనా...
ఏ ప్రాంతానికి చెందిన వారినైనా అబ్బురపరిచేలా ఇట్టే ఆకర్షించేది ఐస్‌ క్రీమ్‌.
చిన్నా.. పెద్ద్ద, ముసలి, ముతక అని వయసు తేడాలే లేకుండా మక్కువ చూపిస్తుంటారంటే...
ప్రపంచంలో దీన్ని దాదాపుగా ఇష్టపడని వారే ఉండరనే చెప్పాలి.
చల్లగా... మనసుని ఆహ్లాదకర తీరాలకు చేర్చే సత్తా ఐస్‌ క్రీమ్‌ల సొంతం అని అన్నా ఆశ్చర్యపోనఖ్ఖర్లే...
ఒకప్పుడు కేవలం ఖరీదైన కుటుంబాలకే పరిమి తమైన ఈ ఐస్‌ క్రీమ్‌ నేడు సామాన్యుడికి చాలా అందుబాటు లోకి వచ్చింది. ఇప్పుడు సామాన్యుడి ఇంట కూడా ఏఫంక్షన్‌ చూసినా... అక్కడ జరిగే లంచ్‌, డిన్నర్‌, పార్టీ లు ఐస్‌క్రీమ్‌తోనే ముగియాల్సిందన్నంతగా మనం చేరి పోయామంటే...ఐస్‌ క్రీమ్‌లని ఎంతలా ఇష్టపడుతున్నా మో అర్ధం చేసు కోవచ్చు.
తొలి నాళ్లలో ఐస్‌ క్రీమ్‌ కోసం ప్రత్యేకంగా డైరీ పార్ల ర్లు ఉండగా... కాల క్రమంలో అవి దాదాపుగా ఐస్‌ క్రీమ్‌ పార్ల్లర్లుగా మారిపోయాయి. దీనికి తోడు డైరీ ఫాంలతో పాటు అనేక కార్పొరేట్‌ సంస్ధలు కూడా ఈ ఐస్‌ క్రీమ్‌ తయారీలోకి రావటంతో ఐస్‌ క్రీమ్‌ ఉత్పత్తి దారులు తమ అమ్మకాలను మరింత పెంచు కునే దశలోలో నేరుగా సామాన్యుడి ఇంటి ముంగిటికే ఐస్‌క్రీమ్‌ చేర్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించి ఐస్‌ క్రీమ్‌వ్యాపారం కూడా అభివృద్ది పధంలో పయనిస్తోంది.
తొలినాళ్లలో ఐస్‌ క్రీమ్‌ని నిలవ ఉంచేందుకు తగిన స్ధాయి సామా న్యుడికి లేక పోవటంతో అది ఏ రాజ ప్రాసాదాలకో, ధనవంతులు, సంపన్నకుటుంబాలకో పరిమితమైనా..ఈ క్రమంలో జరిగిన సాంకే తిక విప్లవం కారణంగా ధరలు తగ్గి... చాలా ఇళ్లలో రిఫ్రిజిరేటర్లు వచ్చి చేరాక సామాన్యుడికి బాగా అందుబాటులోకివచ్చింది.
మరోవైపు ఇంట్లో మహిళలు కూడా ఐస్‌క్రీమ్‌ తయారు చేసుకు నేందు కు తెగ ఆసక్తి ప్రదర్శించారు. ఇందుకు తగ్గట్టుగానే అనేక కంపెనీలు ఇందుకు కావాల్సిన సామగ్రిని అందుబాటులోకి తెచ్చాక ఇంట్లోనే ఐస్‌క్రీమ్‌ తయారవ్వటం ప్రారంభించింది.
ఇంతకీ ఐస్‌ క్రీమ్‌ వెనక కధ ఏంటంటే...
రుచికరంగా మనం తింటున్న ఈ ఐస్‌ క్రీమ్‌ల వెనుక పెద్ద్ద కధే ఉంది. దాదాపు 700 ఏళ్ల్ల క్రితం చైనాలోని మార్కొపోలో అక్కడి వంట వాళ్లు, మంచుకి పాలు చక్కెర కలిపి రుచికరమైన ఐస్‌ని తయారు చేసారు. అక్కడి నుండి ఇటలీ, ఫ్రాన్స్‌ దేశాలను చేరిన ఈ వంటకం అమెరికాతో సహా ప్రపంచమంతా విస్తరించినట్లు ఓ కధ ప్రచారం లో ఉండగా... అసలు ఐస్‌ క్రీమ్‌ అంటూ ప్రత్యేకంగా తయారు చేసిన వంటకమే కాదని నాటి కాలంలో ఇంగ్లాండ్‌ సామ్రాజ్యాన్ని పాలిస్తున్న మొదటి ఛార్లెస్‌ దగ్గర ఫ్రెంచి వంటకాలు తయారు చేసేందుకు ప్రత్యే కంగా ఓ వంట వాడు ఉండేవారు. మత్తు పానీయాలను తాగే క్రమం లో వాటిని చల్లబరుచుకుని తాగెె వాడు. ఓరోజు ఇదే విధంగా ప్రిన్స్‌కి కూడా అందచేయగా... మత్తు పానీయంతో తయారు చేసిన ఐస్‌ గడ్డ లు రుచికరంగా ఉన్నాయని ఈ విధానాన్ని ఎవ్వరికీ చెప్పవద్దని ఆదేశాలు జారీచేసినా... ఆ వంటవాడు తన సహచరులకు వివరించ డం... అది వారి ద్వారా యూరోపియన్లకు చేరటం జరిగిందని... అక్కడి నుండి ఈ ఐస్‌ క్రీమ్‌ రహస్యం అమెరికాకు పాకింద ని... అప్పట్లోనే న్యూయార్క్‌ కు చెందిన పలు వార్త్తా సంస్ధలు కధనాలు ప్రచురించినట్లు చెప్తారు. ఇలా అమెరికా పాకిన ఈ ఐస్‌ క్రీమ్‌పై అనేక మంది ఐస్‌ని రకరకా లుగా చేసే విధానాలపై ఎన్నో ప్రయోగాలు చేయటం వల్లనే ఇప్పు డు మనం తింటున్న ఐస్‌ క్రీమ్‌ పుట్టిందని చెప్తారు.
అంచెలంచెలుగా ఎదిగి...
1851లొ బాలిమోర్‌కి చెందిన జేకబ్‌ ఫన్సల్‌ తొలిసారి ఐస్‌క్రీమ్‌ని మార్కె ట్‌లో అమ్మకాలు ప్రారంభిస్తూ... ఓ షాపుని ఏర్పా టు చేయగా... 1903లో డెమాస్కస్‌ నుంచి వచ్చిన సిరియా దేశస్దుడైన ఎర్నెస్ట్‌ ఏ హాంనీ ఐస్‌ క్రీమ్‌లు ప్రత్యేకంగా తినేందుకు వీలుగా కోన్‌ లని తయారు చేసి... వీటిలో అమ్మడం ప్రారం భిం చాడు. ఈ క్రమంలోనే న్యూ జెర్సీకి చెందిన నాన్సీ జాన్సన్‌ సులభ పద్ధతిలో ఐస్‌ క్రీమ్‌ తయారు చేసేం దుకు మిషన్‌ని రూపొందించడంతో ఐస్‌క్రీమ్‌ వాణిజ్యం మరింత విస్తృతమైంది.
1904లో సెయింట్‌ లూయిస్‌లో
జరిగిన ప్రపంచప్రదర్శనలో తొలిసారిగా ఐస్‌ క్రీమ్‌ని ప్రద ర్శించగా...1920లో నీటి ఆవి రి, విద్యుత్‌ శక్తులతో ఐస్‌ తయారీ విధానం అందుబాటు లోకి రావటంతో 1921లో తొలి ఐస్‌ క్రీమ్‌ బార్‌ని తెర చారు. ఇక రెండో ప్రపంచ యుద్ద కాలంలోదక్షిణ ఫసిపిక్‌ నౌకా శాఖలో పనిచేస్తూ.. ఐస్‌ క్రీమ్‌ పై అనేక ప్రయోగాలు చేసిన బుర్టన్‌ బుచ్‌ బాస్కిన్‌ ఐస్‌ క్రీమ్‌ ఫీజర్‌తో తొలిసారిగా 31 రకాలలో ఐస్‌ క్రీమ్‌లని రూపొందించి ప్రపం చ దృష్టిని ఆకర్షించాడు.
1945లో పరిచయమైన ఇర్విన్‌ రాబిన్స్‌ అనే వ్యక్తితో కల్సి చేసిన అనేక ప్రయోగాల అనంతరం ప్రపం చానికి చాక్లొట్‌, వెనిలా, స్టాబెర్రీ ఫ్లావర్లను పరిచయం చేయగలి గాడు. దీంతో ఐస్‌ క్రీమ్‌ తయారీలోనూ పెను మార్పులు సంభవిం చాయ నే చెప్పక తప్పదు.

ఐస్‌ క్రీమ్‌
ఎలా తయారు చేస్తారంటే...
రిఫ్రిజిరేటర్లు వచ్చాక ఐస్‌ క్రీమ్‌లలో అనేక మార్పులు ఊపందుకున్నాయి. పాలు, చక్కెరలతో పాటు తేనె, కోడి గుడ్లు, చాక్లెట్లు, అనేక రకాల పళ్లు, ఆరోగ్యాన్ని అందించే మొలకలతో కూడా ఐస్‌ క్రీమ్‌లు తయారు చేయ టం ప్రారంభమైంది. కమర్సియల్‌ గా కూడా ఐస్‌ క్రీమ్‌లు అనేక రూపా లను సంతరించుకుని ఆకర్షణీయంగా తయా రవుతున్నాయి.
మిల్క్‌ సాలిడ్‌లు, నీళ్లు, పాలు, సుగర్‌, ఫ్యాట్స్‌పూర్తి స్ధాయిలో కలిపి వాటిని ఐస్‌క్రీం ప్లాంట్లలో 'పాయిశ్చరైజర్‌' చేస్తారు. ఆపై హోమోజె నెజేషన్‌ పేరుతో జరిగే ప్రక్రియతో అందులోని కొవ్వు పదా ర్ధాలని కరిగించి, దాదాపు 4 గంటల పాటు స్టోరేజ్‌ ట్యాంకులలో నిలవఉంచాక ఆమిశ్రమాన్ని విభజించి...కావా ల్సి న రంగులు, రుచుల కోసం ఫ్లేవర్లు కలుపు తారు. దీన్ని లిక్విడ్‌ అమోనియంతో 30 డిగ్రీల సెంటీగ్రేట్‌ టెంపరేచర్‌ వద్ద స్ధిర పరుస్తారు.
ఓవర్‌ రన్‌ తప్పని సరి...
ఈ ఏర్పాడ్డ గట్టి పదార్ధాన్ని నేరుగా తింటే కేవలం ఐస్‌గడ్డలు తిన్నట్లుగా ఉంటుంది కనుక గాలిని చొప్పించాల్సింటుంది. గాలి చేకూరిస్తేనే మెత్త్తబడి... తినేందుకు వీలవుతుంది. అందు కు అత్యధిక వేగంగా తిరిగే బ్లేడ్లు ఉన్న ఫీజర్లలో ఉంచి బాగా మిక్స్‌ చేస్తారు. దీని వల్ల ఐస్‌ క్రీమ్‌ తేలిక పడి పరిణామం కూడా పెరుగు తుంది.ఇలా ఐస్‌గా ఉన్న దాన్ని గాలి చొప్పించి క్రీమ్‌గా మార్చే విధానాన్ని ఓవర్‌ రన్‌ అని పిలు స్తారు. ఇంటి అవసరాలకు కావాల్సిన ఐస్‌ క్రీమ్‌లలో 80 శాతం ఈ ఓవర్‌ రన్‌ ఉండాల్సిందే.
ఆపై ప్యాకింగ్‌ చేసే ముందుకు అనేక పళ్లు, రక రకాల విత్తనాలతో అలంక రించి 'హార్డెనింగ్‌ రూమ్‌లో పెట్టి 23 డిగ్రీల సెంటీగ్రేడ్‌ టెంపరే చర్‌లో 12 గంటలు తక్కువ కాకుండా ఈ హార్డెనింగ్‌ కొనసాగిస్తారు. దీని వల్ల ఐస్‌ క్రీమ్‌లో ఉన్న నీటి భాగం గడ్డ కట్టి... తీసుకు వెళ్లేందుకు వీలు కలిగేలా చేస్తుంది.
ఐస్‌క్రీం యూనివర్శిటీ...
నిజమే.. సెంట్రల్‌ ఇటలీలో ఐస్‌ క్రీమ్‌ తయారు చేయటంలో శిక్షణ ఇచ్చేందుకు ఏకంగా యూనివర్శిటీనే నెలకొల్పారంటే ఆశ్చర్యం కలగక మానదు. బొలొగ్నా సమీపంలో కారిగానీ గెలాటో పేరుతో ఏర్పాటు చేసిన ఈ విశ్వ విద్యా లయంలో గ్రాడ్యుయేషన్‌తో పాటు ఐస్‌ క్రీమ్‌ తయారీపై శిక్షణ ఇస్తారు అలాగే వారం నుండి నాలుగు వారాల సర్టిఫికేట్‌ కోర్సులు కూడా ఆఫర్‌ చేస్తోందీ విశ్వ విద్యాలయం.
ఐస్‌క్రీమ్‌ తయారీలో అనేక పద్దతులు, పరిశోధనలు చేసి అనేక పుస్తకాలు కూడా రాసిన మాల్కొల్మ్‌ స్టోగో 1992లో ఈ యూనివర్శి టీని స్ధాపించాడు. చైనా, స్పెయిన్‌, యూనైటెడ్‌ స్టేట్స్‌ ఇలా పలు దేశా ల్లో శాఖలున్న ఈ వర్శిటీలో అమెరికాతో సహ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నఅనేక దేశాల నుండి ఐస్‌ క్రీమ్‌ ప్రేమికులైన విద్యార్ధులు శిక్షణ పొందుతున్నారు.
అనేక రకాల సాంప్రదాయ కళలతో కలగల్సి ఐస్‌ క్రీమ్‌లని తయారు చేసేందుకు వీలుగా శిక్షణ ఇచ్చేందుకు ఈవర్శిటీలో 400 మంది ఉద్యో గులు పనిచేస్తుండగా..ఏటా 12 వేల మంది విద్యార్ధులు శిక్షణ పొందు తున్నారు. రస్ప్‌ బెర్రీ, హసెల్‌ నట్‌, ఫెనెన్న్ల్‌, మోర్టాడెల్లా, లెమన్‌ ఇలా పలు ఫ్లేవర్లకు ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఉంటుంది.
ఐస్‌ క్రీం తయారీ విధానాలపై సెమినార్లని నిర్వహించ డమే కాకుండా డెవలప్‌ మెంట్‌, ఎడ్యుకేషన్‌, ప్రోడక్ట్‌రీసెర్చు, ఫ్లేవర్స్‌, కన్సల్టింగ్‌ బుక్స్‌లపై శిక్షణ ఇస్తారు. అలాగే అన్ని కోర్సులలో టెక్నికల్‌, మార్కె టింగ్‌, మేనేజ్‌ మెంట్‌, విభాగాలలో శిక్షణ పొందిన విద్యార్ధులు అన్ని యూనివర్శిటీలలోగానే ప్రాక్టికల్స్‌ని కూడా చేసి అందులోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
ఈ యూనివర్శిటీలో చేరే విద్యార్ధులకు ఉచిత వసతిసౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అయితే నెలపాటు ఉండే ఒక్కో కోర్సుకు సగటున 1150 యూరోలతో పాటు ఇతర టాక్సులు వసూలు చేసా ్తరు. అంటే దాదాపుగా 19 లక్షల పైమాటే... ఇక వారం కోర్సులు, రెండు వారాల కోర్సులు కూడా ఉన్నాయి. ఇందుకు 6 నుండి 10 లక్షలు వ సూలు చేస్తారు.
మరి మీకూ ఐస్‌క్రీమ్‌ తయారీపై ప్రత్యేక శిక్షణ పొందాలనుకుంటే... ఈ కోర్సుల్లో చేరిపోండి. మరెందుకు ఆలస్యం.

సొంత తయారీకే మహిళల మక్కువ
బైట ఎన్ని పార్లర్లు వెలసినా. కమర్షియల్‌గా తయారయ్యే ఐస్‌ క్రీమ్‌లకి ధీటుగా నిలవకపోయినా... చాలామంది గృహిణిలు ఐస్‌ క్రీమ్‌ల తయారీ పట్ల మక్కువ చూపుతూ... స్వయంగా తయారు చేసుకుకొంటు సంతృప్తి చెందుతున్నారు. వెనిలా, చాక్లెట్‌, పిస్తా, ఫ్రూట్స్‌ ఇలా అనేక ఫ్లేవర్లు అందు బాటులోకి రావటంతో ఐస్‌ క్రీమ్‌ తయారీ ఈజీ అయిపోయింది. దీనికితోడుగా... పిల్లలు అమితంగా ఇష్టపడే... పళ్లను చాక్లెట్‌ ముక్కలను, కేకులని, ఫుడ్డిం గ్‌ ఐటమ్స్‌ని అద్దుతూ... ఆకర్షణీయంగా రూపొందించడమే కాకుండా వారి ఆరోగ్యాన్నిపరిరక్షించడంలోతగిన జాగ్రత్తలు తీసు కోవటం గమనార్హం.

అందరి చూపులు అటు వైపే...

అమెరికాలోని అనేక విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఇండియా నుండి వెళ్తున్న విద్యార్థులకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడుతోంది. దీంతో చివరకి తమ పిల్లలు హైస్కూలు విద్యను అభ్యసించేందుకుకూడా ఇబ్బందులు రావటం ఖాయమని అమెరికాలోని అనేక కుటుంబాల్లో ఆందోళన మొదలైంది.
ప్రపంచంలో అమెరికాలో ఎక్కువగా విద్యను అభ్యసించే వారిలో భారత్‌ విద్యార్థులు రెండవ స్థానంలో ఉన్నారు. చైనాతో పోలిస్తే మన విద్యార్థులు ఏటా 10 లక్షల 50వేల మంది 2009-10లో ఉన్నట్లు అమెరికా పేర్కొంది. అమెరికాలో చదివేందుకు వెళ్లే విద్యార్థుల విసాలు ప్రస్తుతం 20 శాతం పెరిగినట్లు అమెరికా రాయబార కార్యాలయం సమాచారం.
ఇంతలా అమెరికాలో భారత విద్యార్ధులు పెరిగిపోవటానికి ముఖ్య కారణం అమెరికాలోని ఎన్నో విద్యాసంస్థలు తమ విద్యా వ్యాపారాన్ని పెంచుకునేందుకు భారత్‌లో అనేక బ్రాంచీలను ఏర్పాటు చేసుకుంటు..భారత్‌లో సంబంధాలు పెంచుకునే దిశలో యుఎస్‌ - భార త్‌ ఉన్నత విద్యా అవగాహన సదస్సులను జార్జ్‌టౌన్‌ యూని వర్సి టీ వివిధ దేశాలలో భాగస్వామ్య మీటింగ్‌లు చేస్తూ... విద్యార్ధుల ను తమ వైపు ఆకర్షిస్తోంది.
మెజారిటీ మనదే...
ఇక అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించే వారిలో మెజారిటీ విద్యార్థులు భారత్‌కు చెందిన వారే కాగా... ఇప్పుడు ప్రాథమిక విద్యను అభ్యసించేం దుకు తమ బిడ్డలకి అమెరికానే మార్గంగా ఇండియాలో ధనవంతులైన తల్లిదండ్రులు నిర్ణయించుకోగా... ఆదిశగా మధ్య తరగతి కుటుంబాలకు కూడా యత్నిస్తుండటంతో... 'సేఫ్టీ స్కూల్స్‌' పేరుతో సంవత్సరాది పరీక్షల్లో చాలావరకు కోతలు విధిస్తూండటంతో మున్ముం దు తమ బిడ్డల జీవితాలేమైపోతాయో అని తల్లి దండ్రులు ఆందోళనకు గురిచేస్తోంది. ఇండియాలో విద్యార్థులకు పరిమిత సీట్లు విధించడం, సీటు లభించకపోవడంతో ప్రాథమిక విద్య, ఉన్నత విద్యలకోసం అమెరికాను ఆశ్రయిస్తున్నారు. అలాగ కొన్ని ప్రాముఖ్యమైన కోర్సులైన ఆర్థికశాస్త్రం, గణాంకాలు, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ కోర్సులను అభ్యసిం చేందుకు వెళుతున్నారు.
నాలాగే ఎందరో...
మాలశ్రీ మోహన్‌ అనే ప్రతిభావంతురాలై విద్యార్ధిని పాఠశాల విద్యానం తరం ఆమె తల్లిదండ్రులు ఇండియాలొన ప్రాధాన్యత గల కళాశాలలో తమ కూతురును చేర్పించాలని అనుకున్నారు. ఢిల్లిdలోని ఢిల్లిd యూని వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకుంటే... సీటు లభించలేదు. అయితే యుఎస్‌లోని డార్ట్‌మౌత్‌లో ఓ కళాశాలకు సరదా గా ఆమె చేసిన ధరఖాస్తు....20వేల అమెరికన్‌ డాలర్ల స్కాలర్‌షిప్‌తో సీటిస్తామని ఆహ్వానించింది. నాలాంటి వాళ్లు చాలామంది ఉన్నారం టొరదామె.. గ్రేడ్‌ వన్‌ మార్కులతో పాసైన తమ కూతురుకు ఇక్కడ సీటు రాకపోవడమేంటని తన మార్కులు చూసి ఆశ్చ్యర్యానికి గురైన ఆమె తల్లి మాధవి చంద్రఈ విషయాన్ని ట్విట్టర్‌లో పేర్కొంది.
అలాగే మరో విద్యార్ధికి 1500వేల డాలర్ల స్కాలర్స్‌తో స్మిత్‌ నుంచి స్వాగతించడంపై సంభ్రమాశ్చ్యర్యాలకు గురయ్యారు. ఇలా పలువురు ప్రతిభావంతులైన విద్యార్ధులకు భారత్‌లో ఉన్నత స్ధానం మాదే అని చెప్పుకునే కాలేజీల్లో సీటు దక్కకపోగా కోర్నెల్‌, బ్రయాన్‌ మార్‌, డ్యూక్‌, వెస్లియాన్‌, బార్‌నార్‌డ్‌, అంతేగాక యూనివర్సిటీ ఆఫ్‌ వర్జీనియా నుంచి కళాశాల విద్యకోసం అవ కాశాలు లభించాయి.
ఇక్కడ కాదంటే... అక్కడ ఫ్రీ
అలాగే నిఖిత ఢిల్లిd పబ్లిక్‌ స్కూల్‌ నుంచి 2010 నుంచి గ్రాడ్యుయేట్‌లో ఉత్తీర్ణురాలయ్యింది. ఈమెకు 94.5 శాతం ఉత్తీర్ణత సాధించింది. అయితే ఆమెకు ఎకనామిక్స్‌ సబ్జెక్టులో మార్కులు ఎక్కువ రాకపోవడంతో ఆమెకు సీటు ఇవ్వడంలో సెయింట్‌ స్టీఫెన్స్‌ కళాశాల నిరాకరించింది. అప్పుడే నిఖిత ఒక సంవత్స రం ఖాళీగానే ఉండి అమెరికాలోని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌కు దరఖాస్తు చేసుకోగా అమెరికన్‌ లిబరల్‌ ఆర్ట్స్‌ ఎడ్యుకేషన్‌లో ఉచితంగా సీటు లభించింది.
అయితే ఈ విద్యార్ధులంతా పాఠశాల విద్యలో 93.5 శాతం పైగా అత్యధిక మార్కులు సాధించిన వారే కావటం విశేషం.ఇలా అత్యధిక పోటీ ఉన్న తరుణంలో ఒక భారత్‌లో తప్పా... ప్రపంచంలోని అన్ని దేశాలూ అత్యధిక ప్రతిభావంతులైన విద్యార్థులకు తమ దేశాల్లోని విద్యాసంస్ధలలో అవకాశాలు అందించడం కొసమెరుపు. ఏటా విదేశాల్లో ఉన్నత విద్యలను అభ్యసించేందుకు వెళుతున్న భారత్‌ విద్యార్థులలో 1.2 బిలియన్‌ మంది 25 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన వారే ఉండటం గమనార్హం. దేశంలో అత్యధిక విజ్ఞానవంతులైన విద్యార్థులు ఇతర దేశాలకు ఎంపిక అవుతుండగా... వీరిలో మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువ గా ఉండటం ఆసక్తికర విషయమే...
డిస్టెన్స్‌ విద్యార్ధుల పరిస్ధితేంటో...
100 శాతం వరకు మార్కులు వచ్చినప్పటికీ సీటు ఇవ్వ డంలో మన భారత యూనివర్శిటీలు విఫలమవుతున్న నేపధ్యంలో ఇక డిస్టెన్స్‌, గ్రేడ్‌ వన్‌ స్టూడెంట్స్‌ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించా ల్సిన విషయమే. ఇండియన్‌ ఇన్‌ స్ట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజి భారత్‌లో విస్తరిం చింనా... తీసుకునే సీట్ల సంఖ్య మాత్రం రెండు శాతం కంటే తక్కువే.. రెండు సంవత్సరాలు ప్రత్యేకంగా కోచింగ్‌ తీసుకుంటున్నప్పటికీ సీటు లభించడంలేదు.
ప్రమాణాలు మించి చదువుకోవడానికే ...
కాగా...మన వద్ద లభించే ఉన్నత విద్యా ప్రమాణాలు మించి చదువుకోవ డానికే బయటి దేశాలకు వెళుతున్నారని... కేంద్ర మంత్రి కపిల్‌ సిబాల్‌ అభిప్రాయ పడటం విడ్డూరంగా ఉంది.
భారత విద్యార్థులను విదేశాలకు ప్రమోట్‌ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ఢిల్లిd యూనివర్సిటీ ఇలా మంచి మార్కులు వచ్చిన విద్యార్ధులకు సీట్లు ఇవ్వకుండా పోతోందని... అనేక మంది ఆరొపణలు వస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోవట్లేదని... తల్లిదండ్రుల ఆరోపణ.
చికాగో యూనివర్సిటీలో ఆర్థిక ప్రణాళిక శాఖ వ్యాసకర్తగా స్థిరపడిన భారత్‌కు చెందిన నిఖిత స్కాదేవ్‌ మాట్లాడుతూ... భారత్‌లో అవకాశాలు రాకపోతే చింతించ వద్దని...ఇంగ్లీష్‌ ప్రావిణ్యత పెంచుకుంటూ పోతే... అది మీ జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకు వెళ్తుందని అభిప్రాయ పడ్డారు. ఇండియన్‌ ఇన్‌స్ట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజి సైన్స్‌ సంస్థలో విద్యను అభ్యసించిన సిద్ధార్థ పూరి అనే విద్యార్థి కంప్యూటర్‌ ఇంజనీర్‌ కావలనేది అతని కోరిక. అయితే భారత్‌లో అవకాశాలు సన్నగిల్లడంతో... జర్మని భాషలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ను యూనివర్సిటీ ఆఫ్‌ కాలి ఫోర్నియా, బెర్కిలిలో చేరే అవకాశం రావటంతో అక్కడ చేరి పోయాడు. ఇదే విషయంపై బ్రౌన్‌ యూనివర్సిటీకి చెందిన అంతర్జాతీయ సంబంధాల వ్యవహారాల చైర్మన్‌ మాథ్యూ గౌతమ్‌ మాట్లాడుతూ... మేథోసంపత్తి గల విద్యార్థులను పెంచుకునేం దుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని దీనికి భారత్‌లోని ఢిల్లిdలో విద్యార్థులను ఎంపిక చేసుకునేందుకు ఒక కార్యాలయాన్ని ప్రారంభించి ఎక్కువగా మందిని ఈ విద్యా సంవత్సరం ఎంపిక చేసుకో వడమే లక్ష్యంగా పెట్టుకుంటామన్నారు. ఇండియాలో అన్నింటికంటే ముఖ్యంగా తమ పిల్లల చదువుకోసమే ఎక్కువ ధనాన్ని వెచ్చించేందుకు మధ్య తరగతి కుటుంబాలు ఇష్టపడుతున్నాయి. ఇన్‌స్ట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ ప్రసిడెంట్‌ ఆలెన్‌ గూడ్‌మెన్‌ అన్నారు.

బౌలింగ్‌తో “గోల్‌”

అనంతపురం జిల్లాకు చెందిన సల్మాభాను అందరి కన్నా భిన్నంగా...
తానిష్టపడిన క్రికట్‌పైనే మక్కువ ప్రదర్శిస్తూ...
తనకంటూ క్రీడా ప్రపంచంలో ప్రత్యేక స్ధానం దక్కించుకోవాలని...
చిన్నతనం నుండే కలలు కంటూ... ఒడిదుడుకులెదురైనా...
పట్టు వదలని దీక్షతో నిరంతరం క్రికెట్‌పైనే దృష్టి కేంద్రీకరించి...
తన సత్తా నిరూపించుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
చదువుకునే పిల్లలు ఆడుతున్నా... టివి వేసి క్రికెట్‌ చూస్తూ... దానికే అంకితమైపోయినట్లు కనిపిస్తే... మన ఇళ్లలో గయిమనే వాళుల చాలా మంది ఉన్నారు. ఆసకిత కర అంశాలపై తదేక దృష్టి కేంద్రీకరించిపనిచేసే వారిని ఆ క్రమంలోనే ప్రోత్సహిస్తే.. ఆ రంగం లో ప్రతిభా పాటవాలు సాధించి ముందుకేగ గలరని తెలిసినా ప్రతి ఒక్కరూ తన బిడ్డల్ని డాక్టరుగానో... ఇంజనీర్లుగానో చూడాలన్న తపనే వారిని ఇతర రంగాల వైపు మళ్లకుండా చేసోందన్నది వాస్తవం.
అనంతపురం పట్టణానికి సరిహద్దులోని గుత్తి రోడ్డులో నివాస ముంటున్న సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన సల్మా భాను , అందరి ఆడపిల్లల్లానే తన తల్లిదండ్రులు సయ్యద్‌ అప్సర్‌, మహా ముదాల పెంపకంలో సాంప్రదాయ బద్దంగానే పెరిగిన ఆడపిల్ల.
అయితే క్రీడా ప్రపంచంలో అంతా మక్కువ ఎక్కువ చూపే క్రికెట్‌పై ఆసక్తి ప్రదర్శిస్తూ..చిన్న తనం లోనే క్రికెట్‌ ఆడటం ప్రారంభిం చింది. సల్మా భాను మగాళ్లు ఆడాల్సిన ఆటలాడుతోందని అంతా చెవులు కొరుక్కునా... ఆమె తల్లిదండ్రులు ఏనాడూ ఆమెని నిరుత్సాహ పరచలేదు. సరికదా... ఆమెకి మరింత ప్రోత్సాహం అందించడంతో ఉత్సాహం ఉరకలేస్తూ... అను నిత్యం తనని తాను క్రికెట్‌ రంగంలో నిరూపించుకునే ప్రయత్నాలు ఆరంభించింది.
ఈ క్రమంలోనే సల్మా ఉత్సాహాన్ని చూసిన జిల్లా క్రికెట్‌ అసోషియేషన్‌ మాజీ కార్యదర్శ సాగర్‌ చౌదరి ఆమెకు క్రికెట్‌లోని ఎన్నో మెలుకువలు నేర్పించడమే కాకుండా అటు బౌలింగ్‌, ఇటు బ్యాటింగ్‌లోనూ ప్రావీణ్యత సంపాదించేలా శిక్షణ ఇస్తూ... ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా నిలచారు. అడపా దడపా గ్రామీణ ప్రాంతాలతో పాటు, వివిధ జట్ల మధ్య జరిగే పోటీలలోనూ పాల్గొంటూ... సామర్ధ్యం ఉన్న మహిళా క్రికెటర్‌గా అందరి ప్రశంస లు అందుకుంటు 2003లో క్రికెట్‌ క్రీడా ప్రపంచంలోకి అడుగు పెట్టింది ఆమె..ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌తో తన సత్తా చూపి అనతి కాలంలోనే అనంతపురం జిల్లా జట్టులో స్ధానం దక్కించు కుని తన సత్తా నిరూపిం చుకుంది. జిల్లా క్రికెట్‌ లో సేవలందిస్తు దూసు కుపోతున్న సల్మా భాను తన ప్రతిభా పాటవాలతో ఆంధ్రా మహిళా క్రికెట్‌ జట్టులోనూ స్ధానం దక్కించుకుంది.
అయితే 2007లో జాతీయ మహిళా క్రికెట్‌ జట్టుకు ఎంపిక కానప్పటికీ ఏమాత్రం నిరాశ, నిస్పుృహలకు తావియ్యకుండా మొక్కవోని ధైర్యంతో నిరంతరం ప్రాక్టీస్‌ చేస్తూ... ఎప్పటికప్పుడు శిక్షకులు, సీనియర్‌ క్రీడాకారుల సలహాలు తీసుకుంటూ 2008లో జరిగిన అండర్‌ 19 జట్టుకు ఎంపికైంది ఇదే ఏడాది జరిగిన సౌతిం డియా టోర్నీలో పాల్గొని తన స్పిన్‌ బౌలింగ్‌ ప్రతిభతో ప్రత్యర్ధి జట్టులైన తమిళనాడుపై 5 వికెట్లు, కర్ణాటకపై 3 కీలక వికెట్లు తీసి క్రీడా ప్రపంచం దృష్టితనవైపుకు మరల్చుకుంది.
సౌత్‌ ఇండియా టోర్నీలో సల్మాభాను చూపిన ప్రతిభా పాట వాలను గుర్తించి నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో స్ధానం దక్కించుకుని బెంగుళూరు క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సిఏ)లో ప్రత్యేక శిక్షణ పొందిం ది. అలాగే సౌతిండిమా సీనియర్‌ క్రికెట్‌ టోర్నీలో కూడా పాల్గొని 13 వికెట్లు తీసి తన బౌలింగ్‌ రుచి చూపించింది. ఇది అమె సౌత్‌ ఇండియా జట్టులో పూర్తి స్ధానం దక్కించుకునేందుకు ఉపయోగ పడిందనే చెప్పాలి. ఇక విశాఖలో జరిగిన ఆలిండియా ఇంటర్‌ జోనల్‌ పోటీల్లో ప్రతిభ చూపిన సల్మా భాను సీనియర్‌ జాతీయ క్రికెట్‌ శిక్షణా శిబిరానికికూడా ఎంపికైంది.
ఇటీవలే బిసిసిఐ ఆధ్వర్యంలో మహిళా చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొనే ఇండియా రెడ్‌ జట్టులొ స్ధానం దక్కించుకుంది. సల్మా ఆశలు ఆశయాలు ఫలించి... మన జాతీయ జట్టులో స్ధానం దక్కించుకుని అంతర్జాతీయ క్రికెట్‌లో తెలుగు'వాడి'ని రుచి చూపిం చాలని... మనసారా మనమూ ఆశిధ్దాం.

జాతీయ జట్టు స్ధానమే ధ్యేయం
ఎప్పటికైనా జాతీయ జట్టులో స్ధానం దక్కించు కోవాన్నదే తన కాంక్ష అని... ఇన్నాళ్లుగా తన ఎదుగు దలకు తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు కోచ్‌ సాగర్‌ చౌదరి శిక్షణ తన కెంతో ఉపయోగ పడిందని దీనికి తోడు చాలా మంది తనని ఉత్సాహ పరుస్తూ విజయాలు అధిరోహించేందుకు సహకరించారని చెప్పిం ది సల్మా భాను.
తనని తాను నిరూపించుకుని,,
2007లో బిసిసిఐ జాతీయ మహిళా క్రికెట్‌ సంఘాన్ని విలీనం చేసుకొని... అదే ఏడాది జాతీయ సెలక్షన్లు జరిపినప్పుడు సల్మా భాను ఆట తీరు సెలక్టర్లని ఆకట్టుకోలేక పోవటంతో... జాతీయ మహిళా క్రికెట్‌ జట్టుకు ఎంపిక కాలకపోయింది. అయినా నిరాస చెంద క నిరంతరం ప్రాక్టీస్‌తో తనని తాను నిరూపించుకుని క్రికెట్‌ ప్రపంచంలో తనకో స్దానం దక్కించుకుంది.

కళ్ల ఊసులకు..కొత్త సొగసులు..

మౌనంగా భావాలు పలికించ గల సత్తా... మన శరీంలో ముఖ్యమైన అవయమైన కంటిదే..
అవి రెప్ప వేసినా...మూసినా..రెప రెపలాడినా... నవరసాలనూ అద్భుతంగా చూపించి...
మనిషి మనసులోని భావాన్ని...ఎదుటివారికి ఎలాంటి శబ్ధంలేకుండానే స్పష్టంగా చూపించే కళ్లు... నిన్నటి తరంలోనే కాదు నేటి తరంలోనూ... భవిష్యతరం కూడా కళ్లు కుమ్మరించే భావాలను
మరింత స్పష్టంగా కనిపించే విధంగానే వాటికి ఎన్నో విధాలైన మెరుగులు దిద్దుతూ వస్తున్నారు.
మనిషి అవయవయవాలలో ముఖ్యమైనది కన్ను. ఇది లేక పోతే... జీవితమే వృధా అన్న భావన మనిష్యుల్లో ఉన్నా... దాన్ని అధిగమించి ఉన్నత శిఖరాలకు ఎదిగిన వారూ లేకపోలేదు. కాగా నేటి తరం లో అందులోనూ యువతరంలో కళ్లకి కొత్త సొగసులద్దటం ఫ్యాషన్‌గా మారిపోయింది. ఎన్నో రకాల రంగు రంగుల కాస్మోటిక్స ఇపðడు కళ్ల ని మరింతగా చేసేందుకు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. ఈ క్రమం లోనే కళ్లకు మరిన్ని అందాలు రంగరించుకునేలా చేసేందుకు నేడు రాష్ట్రవ్యాప్తంగా అనేక బ్యూటీ పార్లర్లు కూడా పుట్టుకొచ్చాయి. వీటిలో ప్రత్యేక శిక్షణ పొందిన బ్యుటీషియన్లు మహిళల కళ్లకు వన్నెలద్దు తూ... వాటిని ఇట్టే ఆకర్షించేలా చేస్తున్నారు.
అయితే సందర్భాను సారంగా మీ మేకప్‌కి తగ్గట్టుగా ఈ కళ్లకీ మేకప్‌ ఉండాలి మినహా అతి అయినా..మరీ వెగటుగా ఏ చంద్రముఖినో చూ సినట్లు మీ ముఖం తయారవ్వటం ఖాయం. అంతెందుకు మీ స్నేహి తురాలు పెళ్లికి వెళ్లి... మిమ్మల్నే పెళ్లి కూతురనుకుంటారనుకుని సింగారించుకోకుండా మానేస్తారా కాస్త తక్కువగానైనా కొట్టొచ్చేట్లు మేకప్‌ చేసుకుంటారుగా... అదే ఏ చావు ఇంటికో వెళ్లేపðడు ఇష్టాను సారం మేకప్‌ చేసుకుని వెళ్తే ప్రశంసల మాట సంగతి దేవుడెరుగు మీ వెనకే మూతులు కొరుక్కుని... నగుబాటు చేయటం ఖాయం. అందుకే 'సింగార ప్రియులు' అయిన మహిళలు తమ కళ్ల మేకప్‌పై ఎంత శ్రద్ద్ధ వహిస్తున్నారో అందుకు సమయం సందర్భం కూడా చూసు కోవాల ని బ్యుటీషియన్లు చెప్తారు. సాధారణంగా మన కళ్లు బాదం గింజల ఆకారంలోనో, పద్మం పువ్వు రెక్కల ఆకారాన్నో.. చేపల ఆకారం లోనో ఉంటాయి. అందుకే పూర్వ కాలం కళ్లు పెద్దగా ఉంటే మీనాక్షి అని, కమలాక్షి అనే పేర్లు పెట్టేవారు. మరి మన కళ్లు ప్రత్యేకతల్ని కాపాడుతూనే అందర్నీ ఆకర్షించేలా రూపొందించాలంటే.... ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూనే కాస్మోటిక్సని వాడాల్సి ఉంటుంది.
కనుబొమ్మలదే ప్రాధాన్యత...
మీ కళ్లు ఏ ఆకారంలో ఉన్నా సరే వాటిని అద్భుతంగా చూపించగలిగేవి కనుబొమ్మలే అనటంలో సందేహంలేదు ఎవ్వరికీ. అంతలా ప్రభావితం చేస్తాయి. అందుకనేవెూ... సాధా రణ మహిళలల్లో కూడా ఐబ్రో పెన్సిల్స్‌ని వాడకం రాను రాను పెరుగుతోంది.
తమ అందాలను మరింత మెరుగు పరుచుకోవాలనుకునే మహిళలు కంటి రెప్పపై ఉన్న శ్రద్ద కన్నా ఈ కనుబొమ్మలపైనే ఎక్కువ శ్రద్ద చూపించాల్సి ఉంటుంది. కనుబొమ్మలు నిత్యం చర్మానికి అంటుకు పోయినట్లు ఉంటేనే మీ అందం మరింత విరజిమ్ముతుంది.
ఒక్కో సారి ముదురు రంగులను ఇష్టాను సారంగా కనుబొమ్మలపై మేకప్‌ వేసుకుంటారు కొందరు. ఇలా చేయటం వల్ల ముందు బాగానే ఉన్నట్లు అనిపించినా... కాస్త ఆరిపోగానే... కనుబొమ్మల వెంట్రుక లు పైకి వచ్చి మిమ్మల్ని అంద వికా రంగా చేసేస్తాయి. అందుకే ఒత్తుగా కనుబొమ్మలుంటే వాటికో షేప్‌ నిచ్చుకోవాలి. అదే లైట్‌గా ఉండే వారు ఐ బ్రోస్‌ సామాగ్రి వాడి జాగ్రత్తగా మేకప్‌ చేసుకుంటే సరి.
కళ్లనిలా మేకప్‌ చేసుకోండి...
కళ్లకి కొత్త సింగారాలు అద్దాలనుకునే వాళ్లు ఖచ్చితంగా ఇంట్లో చిన్న చిన్న చిట్కాలను పాటిస్తూ... నేచురల్‌ ప్రోడక లను వాడుతుండాలి.
నయనాలు మరింత హొయలొలికిస్తూ . మీకో ప్రత్యేకత సంతరించాలనుకుం టే... కేవలం బైటకు వెళ్లేపðడే కాదు ఇంట్లో ఉన్నపðడు కూడా కళ్లకి అందా లు అద్దుకొంటే బెటర్‌.
కళ్ల సైజు ఎంత ఉన్నా.. ముదురు రంగు లైనర్లు వాడితే... ఆకర్షణగా కనిపిస్తాయి. చిన్న కళ్లు ఉండే వారు ముదురు రంగు లైనర్లును కాస్త దళసరిగానే వేసుకుంటే...కళ్లను విశాలంగా... కనిపించేందుకు ఇవి ఉపయోగ పడతాయి. అలాగే పెద్ద కళ్లు ఉన్న వారు వీలైనంత తక్కువగా వాడితే బాగుంటారు. అయితే కంటి లోపలి భాగాలకు తగలకుండా మేకప్‌ వేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే కంటి ప్రమాదం ఏర్పడ టమే కాకుండా లేనిపోని ఇబ్బందులు కోరి తెచ్చుకున్న వాళ్లవుతారు.
బైట ఏపార్టీకో.. ఫంక్షన్‌కో వెళ్లాలనుకునే వారు కనీసం అరగంట ముందైనా మేకప్‌ చేసుకోండి. ఉదయం పూట బైట కెళ్లాలనుకుంటే ముదురు రంగు ఐ లైనర్లు వాడుతూనే సింగిల్‌ కోడ్‌ ట్రాన్స్‌పరెంట్‌ మస్కారాను కూడా వాడాలి. అదే సాయంత్ర వేళల్లోని పార్టీలకు అటెం డ్‌ కావాల్సి వస్తే మాత్రం ముదురు రంగు ఐలైనర్‌ వాడుతునే షాడోను కాస్త ఎక్కువగా వాడితే మరింత అందంగా కనిపిస్తారు. వీలైనంత వరకు నల్లటి షేడ్‌నే వాడితే బెటర్‌ లేదంటే మీ శరీరానికి తగ్గ ఇతర రంగులతో మేకప్‌ చేసుకుంటే మీ అందానికి మరింత మెరుగు కనిపిస్తుంది.
కను రెప్పలకీ అందాలద్దండి...
కళ్లని కాపాడంతో కీలక పాత్ర పోషించే కను రెప్పలకీ రంగులద్ది కొత్త అందాలు కల్పించవచ్చు. రెప్పలపై మేకప్‌ వేసుకునేపðడు చాలా జాగ్ర త్తలు పాటించాలి. రెప్పల వెంట్రుకలకి ఎంత నిగారింపు ఇస్తావెూ.. రెప్ప పైభాగం మేకప్‌ విషయంలోనూ అంతే జాగ్రత్తలు పాటించాలి. రెప్ప పైభాగంలో వేసిన రంగులకి వ్యతిరేక రంగు కనుబొమ్మకి కంటికీ మధ్య భాగంలో వేసుకుంటే అందం మరింత ఇడుమ డింప చేస్తుంది. అయితే ఈతరహా మేకప్‌ కొన్ని సంద ర్భాలలో మాత్రమే బాగుంటుంది. వీలైనంత వరకు సింపుల్‌గా ఉండేలా రెప్పలపై రంగులు వేస్తేనే బాగుంటారు.
సమయానుకూలంగా ఎం త లైట్‌ మేకప్‌ వేసుకుంటే అంత అందంగా కనిపిస్తారు.

జాగ్రత్తలు...
కళ్లకు అసలు హడావిడి మేకప్‌ తగదు. పగటిపూట జాగ్రత్తగా మేకప్‌ వేసుకున్న వెంట నే బైటకు వెళ్లకండి... కనీసం అర గంట అయినా వెయిట్‌ చేయండి. లేదంటే మేకప్‌లోని తడిపై సూర్యకాంతి తగిలి మీ ముఖం జిడ్డుగా మారిపోయే ప్రమాదం ఉంది. దాని వల్ల జిడ్డుకి ధుమ్మూ, ధూళి అంటి, ముఖంపై దురదలు, దద్దుర్లు రావచ్చు. ఇవి అలర్జీలుగా మారిపోవటవెూ... మొటిమలు తదితరాలకు దారి తీయ టవెూ జరగొచ్చు. అలాగే రాత్రి వేళల్లో మేకప్‌ని పూర్తిగా చెరిపి వేసుకోవాల్సిందే... లేదంటే సన్నితంగా ఉండే మీ ముఖ చర్మ మెద్దుబారి మందంగా తయ్యారవుతుంది.
మీరెంత మేకప్‌ వేసుకుని ఎదుటివారిని రెప్ప వేయించని విధంగా అందంగా తయారైనా... మీరు మాత్రం అడపా దడపా రెప్పలు వేయ టం మరిచి పోకండి. ఇలా రెప్ప వేయటం వల్ల మనం పడే శారీరక శ్రమల్ని వత్తుళ్ల నుండి సత్వర ఉపశమనం పొందుతాం.