5, ఏప్రిల్ 2011, మంగళవారం

సత్య సాయి ఆరోగ్య పరిస్థితిపై సిఎం సమీక్ష

సత్య సాయిబాబా ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వ హించారు. మంగళవారం ఉదయం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు రఘువీరారెడ్డి, పితాని సత్యనారాయణ, సుదర్శన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ హాజరు అయ్యారు. కాగా ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పుట్టపర్తి పర్యటన కు వెళ్ళాల్సి ఉండగా... అది ఇంకా ఖరారు కాలేదు.