5, ఏప్రిల్ 2011, మంగళవారం

లిమిటెడ్ కంపెనీగా టీఆర్‌ఎస్

టీఆర్‌ఎస్ కుటుంబ సభ్యుల లిమిటెడ్ కంపెనీగా మారిందని ఎంపీ రమేశ్‌రాథోడ్ ఎద్దేవా చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సమష్టిగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని .. . ఉద్యమాన్ని కొన్ని పార్టీల నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని...టీఆర్‌ఎస్ పై విరుచుకు పడ్డారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి ఉద్యమాన్ని తాకట్టు పెట్టారని.. వీరిని తెలంగాణా ద్రోహులని ప్రకటించి హడావిడి చేసిన కే సి ఆర్ ఇప్పుడు మౌనంగా.. ఉండటం వెనుక ఒప్పందాలు జరిగి ఉంటాయని విమర్శించారు.