4, మే 2011, బుధవారం

వివేకా గెలుపుతోనే పులివెందుల అభివృద్ధి : పురందేశ్వరి

  ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ అహంకారానికి, కడప ఆత్మగౌరవానికే ఉప ఎన్నికలు అన్న వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కేంద్రమంత్రి పురందేశ్వరి చెప్పారు. బుధవారం పులివెందులలో విలేకరులతో మాట్లాడుతూ.  మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి తన తరఫున ప్రచారానికి రమ్మని చెప్పినందు వల్లే తాను పులివెందులకు వచ్చానని చెప్పారు. ఉప ఎన్నికల పోరులో కాంగ్రెసు గెలుపు ఖాయమని ...దశాబ్దాలుగా ప్రజలు కాంగ్రెసును అదరిస్తున్నట్టే ఇప్పుడు కూడా ఆదరిస్తారని...వైయస్ వివేకానందరెడ్డి గెలుపుతోనే పులివెందులలో అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.