రేపటి నుంచి జరగవలసిన ఓయు పిజి పరీక్షలు యథాతథంగా జరిపేందుకు రేపటి నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఓయు పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించారు.
ఐతే ఓయూ పీజీ పరీక్షలను వాయిదా వేయాలంటూ విద్యార్థులు వీసీ ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అక్కడినుంచి తరిమేసే ప్రయత్నం చేశారు. విద్యార్థులు రాళ్ల దాడికి దిగారు. దీంతో . పోలీసులు లాఠిచార్జి చేసి బాష్పవాయువు ప్రయోగించారు. తెలంగాణ వచ్చేవరకు పరీక్షలు రాయమని విద్యార్థులు ఆందోళనకు దిగటంతో
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.