16, ఫిబ్రవరి 2011, బుధవారం

చిరంజీవిని విమర్శించే నైతిక హక్కు అంబటికి లేదు

ప్రజాధనాన్ని కొల్లగొట్టి దోచుకున్న అంబటి రాంబాబు ఎంత ? చిరంజీవి ఎంత ? కోట్ల ప్రజాభిమానమున్న మచ్చలేని చిరంజీవి గురించి ఆయన విమర్శించడమేమిటంటూ ప్రజారాజ్యం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సి.రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా రాజంపేటలో బుధవారం జరిగిన ప్రజారాజ్యం పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకరి మోచేతుల కింద నీరు తాగే అంబటి రాంబాబు పేపర్లలో పేర్లు వేయించుకోవడానికి, పాపులారిటీ కావడానికి చిరంజీవిని విమర్శిస్తున్నారన్నారు.

తండ్రి శవాన్ని పక్కనపెట్టి ముఖ్యమంత్రి పదవి కోసం 20 మంది ఎమ్మెల్యేలను చిరంజీవి వద్దకు పంపిన జగన్ వర్గంలోని అంబటికి చిరంజీవిని విమర్శించే నైతిక హక్కులేదన్నారు. వైఎస్ ఉన్ననాడు చిరంజీవి మద్దతు కోరడం తప్పు కానప్పుడు ఇప్పుడు ఎలా తప్పవుతుందని నిలదీశారు..