14, మార్చి 2011, సోమవారం

మళ్లీ ప్రతిష్టిస్తే... మేం ఒప్పుకోం..

ట్యాంక్‌బండ్‌పై కూల్చేసిన విగ్రహాలను పునఃప్రతిష్టించాలని ప్రభుత్వం చేసున్న హడావిడిని తామంతా కలసి కట్టుగా తిప్పి కొడతామని ప్రకటించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హెచ్చరించారు.

సోమవారం లోయర్ ట్యాంక్ బండలోని కట్టమైసమ్మ దేవాలయం నుండి పోతన విగ్రహం వరకు స్వాభిమాన్ యాత్ర జరిపిన ఆమె అనంతరం మీడియాలో మాట్లాడుతూ....తెలంగాణ వైతాలికుల విగ్రహాలు లేకుండా వేరే విగ్రహాలు ప్రతిష్టించకూడదని...కాదని సిద్దపడితే మరోమారు విధ్వంసం జరిగినా ఆశ్చర్యపోన్నఖ్ఖరేదని వ్యాఖ్యానించారు.

600 మంది తెలంగాణా కోసం ప్రాణ తాగాలు చేసే... కనీసం పలుకరించిన పాపాన పోని సీమాంధ్ర నేతలు జరిగిన విగ్రహాల విధ్వంసాన్ని మాత్రం అతిగా చూపుతున్నారని... తెలంగాణాకు వ్యతిరేకంగా పలు మీడియా సంస్ధలు చేసున్న వాఖ్యల వల్లే నాడు మీడియా ప్రతినిధులపై దాడి జరిగిందని... తాను భావిస్తున్నట్లు చెప్పారు