30, ఏప్రిల్ 2011, శనివారం

ఉద్యమ లక్ష్యాన్ని చాటడానికే ప్రజాభియాన్ యాత్ర

తెలంగాణ వాదాన్ని ప్రతి పల్లెకు చేర్చి ప్రతి ఒక్కరికి ఉద్యమ లక్ష్యాన్ని చాటడానికే ప్రజాభియాన్ యాత్రను చేపట్టినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. శనివారం తన మూడో రోజు యాత్రని ప్రారంభిస్తూ.. జూన్ మాసం చివరి కల్లా ఎటూ తేల్చక పోతే తెలంగాణ ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నా రు. తెలంగాణ కోసం ఆరువందల మంది విద్యార్థుల ప్రాణత్యాగం కన్నా, ఈ పదవులు ముఖ్యం కాదని మంత్రి వ్యాఖ్యానించారు