30, ఏప్రిల్ 2011, శనివారం

తెలంగాణ ఏర్పాటుకుసీమాంధ్రులు రెడీ

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మెజార్టీ సీమాంధ్ర ప్రజలు, ప్రజా ప్రతినిధులు సిద్దంగా ఉన్నారని.. ఐతే కొంతమంది స్వార్థ సీమాంధ్ర రాజకీయ వ్యాపారుల కుట్రల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జాప్యానికి కారణమవుతోందని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మంద జగన్నాథ్ అన్నారు.మీడియాతో ఆయన మాట్లాడుతూ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పూర్తీ కాగానే డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి జూన్ నెలాఖరుకి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. హైద్రాబాద్ రాజధానిగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉంటుందని, ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా తెలంగా ణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని ఆయన ఉద్ఘాటించారు.