17, ఏప్రిల్ 2011, ఆదివారం

రెండెకరాల నుంచి రెండు వేల కోట్ల కి ఎలా ఎదిగారో...

రెండెకరాల చంద్రబాబు రెండు వేల కోట్ల రూపాయల ఆస్తికి ఎలా ఎదిగారో... తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెపితే తాము టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఆస్తులపై విచారణ జరపడానికి ఉ సిద్ధమేనని సవాల్ విసిరారు టిఆర్ఎస్ నేత తారక రామారావు. ఆది వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సొంత మామకే పంగనామాలు పెట్టిన చంద్రబాబు డిసెంబరు 9 ప్రకటన తరువాత నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచాడన్నారు. టిడిపిలో ఎన్టీఆర్ కుటుంబం తప్ప ముఖ్య నాయకులు ఎవరు లేరని.. అల్లాంటి పార్టీ నేతలు తమ పార్టీని కుటుంబ పార్టీ అంటూ విమర్శలు చేయటం విద్దురంగా ఉందన్నారు. తెలంగాణ కోరుకునే ప్రజలందరూ టిఆర్ఎస్ సభ్యులేన న్న విషయాన్నీ తెలుగుదేశం నేతలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.