20, మే 2011, శుక్రవారం

ప్రభుత్వంపై తిరుగుబాటు చేయండి

'రైతులూ.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయండి' అని అన్నదాతలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోళ్ల సమస్యను పరిష్కరించే వరకు రైతు చైతన్య యాత్రలకు వచ్చే మంత్రులను నిలదీయాలని సూచించారు. ప్రభుత్వం మెడలు వంచైనా రైతాంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఇందుకు అవసరమైతే దీర్ఘకాలిక ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు.