1, డిసెంబర్ 2011, గురువారం

మేడలే వ్యవసాయ క్షేత్రాలుగా..

నగరాలలో రాను రాను సేంద్రీయ పదార్థాలపై అవగాహన పెరుగుతుంది.
అందుకే పలుచోట్ల పురుగుమందులు, రసాయనిక ఎరువులు వేయని
ఆహార పదార్థాల వినియోగంపై మక్కువ చూపుతున్నారు.
దీని కారణంగా 'ఆర్గానిక' దుకాణాలు జోరందుకుంటున్నాయి.
ముఖ్యంగా దంపుడు బియ్యం, బెల్లం, చోళ్లు, రాగులు, మొలకెత్తు విత్తనాలు,
సజ్జలను ఖరీదు చేస్తున్నారు. ఉదయాన్నే నడక చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
పట్టణాలలో బాల్కనీలు, డాబాలపై ఆకు కూరలు, పళ్లమొక్కలను వేస్తు న్నారు. మంబై, హైదరాబాద్‌ ,ఢిల్లీ, కోల్‌కత్తా ఇలా దేశంలోని అనేక ప్రధాన నగరాలలో ఈ తరహాలో మెక్కలని పెంచుతూ... స్వచ్చమైన గాలిని పీల్చే అవకాశాన్ని పొందటమే కాకుండా... కాంక్రీట్‌ జంగిల్‌గా మారిపోతున్న నగరాలల్లో కాలుష్య నివారణకి తమవంతు సాయపడు తునే.. అనేక తాజా కూరగాయలు, పళ్ల రుచిని ఆస్వాది స్తున్న వారు చాలానే ఉన్నారు.
ముంబైలో...
ముంబైలోని భారతీవెూట్వానీ కాకరకాయ, టొమేటో, పుచ్చకాయ మొక్కలను ముంబైలో తమ నివాసంలో వేశారు. పచ్చి మిరపకాయలు, వంకాయలు, బెండకాయలు అధికంగా కాస్తే ఇరుగు పొరుగుకి కూడా యిస్తున్నారు. ఇంటి ఆవరణలో కాసిన పుచ్చకాయలను చూసి మురిసి పోతున్నారు. ప్రీతీ పాటిల్‌ పచ్చిమిరప, పుదీనా, పాలక, పసుపు, అల్లం, లెమన్‌ గడ్డిని వేశారు. అంతేకాక మామిడి, సీతాఫలం, జామ, అరటి మొక్కలు కూడా వున్నాయి. జ్యోతి తన యింటిలో కాసిన 15 దోసకాయలను చూసి తెగ మురిసిపోతుంది. బొప్పాయి చెట్లు నోరూరి స్తున్నాయి. జ్యోతి పవస, ములగ, మొక్కలే కాక ప్యాషన్‌ ఫ్లవర్‌, పారిజాత, గులాబీ యిలా పలు రకాల మొక్కలను వేసింది. ఇంటిలో ఏ మాత్రం జాగా వున్నా మొక్కలను వేస్తున్నారు. 'ప్రయోగ్‌ పరివార్‌' సంస్థ సేంద్రీయ వ్యవసాయాన్ని ముంబైలో ప్రోత్సహిస్తుంది. శ్రీపాద్‌ దభోల్కర్‌ నాట్కూ ఎకో ఫార్మింగ్‌పై అవగాహన కలుగజేస్తున్నారు.
అరుణ్‌షౌరీ, ఎమ్‌పి కొలాహపూర్‌లోని దభోల్కర్‌ యింటికి వెళ్లి మొక్క జొన్న మొక్కలు, చెరకు మొక్కలను కుండీలలో చూసి ఆశ్చర్య పోయా రు. వారింట్లోని సుబాబుల్‌ చెట్టు రెండస్తు లకు ఎదిగింది. దభోల్కర్‌ పలుచోట్ల ద్రాక్ష తోటలను వేయటానికి ప్రోత్సహించి అంద రినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా దాక్ష కరవు ప్రాంతాలలో పనికి రాదనే వాదన ను తిరగవ్రాశారు. నేడు దబోల్కర్‌ ప్రోత్సా హంతో ఎకరానికి 16 టన్నులను పండిం చడం చూసి అరుణ్‌షౌరి కరవుకు సమా ధానం దభోల్కర్‌ వంటి రైతులన్నారు. వీరి స్ఫూర్తిని చెన్నై వాసులు కూడా పొందు చున్నారు.
ముంబైలో 'విద్యావారిధి ట్రస్ట్‌' తరఫున 'అర్బన్‌ లీవ్స్‌' సంస్థ ప్రీతి పాటిల్‌ ఆధ్వర్యంలో రూఫ్‌ గార్డెన్లపై మొక్కల పెంపకాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ముందుగా సెంట్రల్‌ పోర్ట్‌ట్రస్ట్‌ భవనంలో ఈ పనిని ప్రారంభించారు. అక్కడ 3,000 చదరపు గజాల రూఫ్‌టాప్‌ గార్డెన్‌ను పెంచుతున్నారు. 150 మొక్కలకు రీసైకిల్‌ చేసిన వ్యర్థ పదార్థాలను వాడుచున్నారు. దభోల్కర్‌ ఏమంటారంటే 10 గుం తల (10,000 చదరపు అడుగులు) విస్తీర్ణంలో రెండు ఆవులు, మొక్క లతో ఐదుగురు కుటుంబ సభ్యులకు పోషణ లభిస్తుంది. ముంబైలోని చిన్న ఫ్లాట్స్‌లో కూడా నిత్యావసరాలకు ఆకుకూరలు, కూరగాయలను, పళ్లను పండించుకుంటున్నారు. ప్రీతిని తల్లిదండ్రులు 'యింత చిన్న ఫ్లాట్‌'లో నువ్వేం పండిస్తావని ఎద్దేవా చేశారు. నేడు బాల్కనీలో దోస కాయలు, వంకాయలు, కొత్తిమీర, టొమేటో,పచ్చి మిరపను కాయిస్తుం ది. నగరాలలో తక్కువస్థలంలో కూరలు ఎలా పండించాలనే దానిపై మెకేల్‌ లెవెన్‌స్టన్‌ షషష. షఱ్‌ా టశీతీ ఎవఅ. ఱఅటశీ పేరున చక్కటి అవ గాహనను కలుగ జేస్తున్నారు.
ఈ మధ్య అమృత్‌మిట్టి, కంపోస్టింగ్‌, డ్రిప్‌, స్ప్రింకిల్‌ ఇరిగేషన్‌ నగరా లలో ప్రాచుర్యం పొందుతున్నాయి. ముంబై మహానగరంలోనే 4,000 టన్నుల చెత్త రోజూ పేరుకుంటుంది. ఈ చెత్తను ఎరువుగా మార్చేం దుకు కొందరు ముందుకు వస్తున్నారు.
నేడు ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాలలో 40 శాతం ప్రజలు స్వయంగానే ఆహార పదార్థాలను పండించుకుంటున్నారు. రష్యా, చైనాలలో కూడా ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యంగా క్యూబా సేంద్రీయ వ్యవసాయం ద్వారా స్వయంగా ఆహార పదార్థాలను పండించడంలో ముందంజలో వుంది. హవాయిలో ఏ మాత్రం ఖాళీస్థలం వున్నా చక్కా సేద్యం ప్రారంభిస్తున్నారు. ఔషధ మొక్కలను కూడా వేస్తున్నారు.
ముంబైలో పదవీవిరమణ చేసిన వారు, గృహిణులు, యువతీ, యువకులు మహీం నేచర్‌పార్క్‌, నానీనానీ పార్క్‌లో అనేక రకాల కూరగాయాల మొక్కల ను, పూలమొక్కలను పెంచుతున్నారు. ఖాళీ సమయాల్లో యిక్క డ పలువురు సేద్యం చేయ డం కానవ స్తుంది. 'అర్బన్‌ లీవ్స్‌' సంస్థ వర్క్‌షాపుల ద్వారా వాలెంటీర్ల సంఖ్యను పెంచుతుంది. నామ మాత్రం ఫీజుతో వారు ఎంతోమందికి బాల్కనీ, రూఫ్‌ గార్డెన్లపై వ్యవసా యా న్ని ప్రోత్సహిస్తున్నారు.
బాల్కనీ వ్యవసాయంకి సంబం ధించి విషయాలు తెలుసుకోవాల నుకుంటే ఈ క్రింది వెబ్‌సైట్లలో చూడొచ్చు.
షషష. బతీశిశఅ శ్రీవశఙవర ఱఅ ఱఅసఱశ.షశీఎ
షషష. జూతీశాశీస్త్రజూశతీఱఙశతీ.అవ్‌
3. షషష. షశ్‌వతీరఎశత్‌ీజూశ్‌ీ.షశీఎ
సంస్థలు/ వ్యక్తులు
మరాఠీ విద్యాన్‌ పరిషత్‌ - 022- 5224714
డా.బి.ఎన్‌.విశ్వనాథ్‌, బెంగళూరు 28485717
ఆంధ్రప్రదేశ్‌లో
సేంద్రీయ వ్యవసాయం ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఊపందుకుంటుంది. రామ్‌దేవ్‌బాబా, మంతెన సత్యనారాయణరాజు తదితర యోగా చార్యు ల స్ఫూర్తి, కారణాన దంపుడు బియ్యం, సేంద్రీయ వ్యవసాయం ఆహార పదార్థాల కొనుగోళ్లు పెరిగాయి. హైదరాబాద్‌లో నర్సాపూర్‌ వద్ద నాగార్జున సిమెంట్‌ గ్రూప్‌ అధినేత కలిదిండి రామచంద్రరాజు సేంద్రీ య వ్యవసాయానికి నాంది పలికారు. వారు వ్యవసాయ క్షేత్రంలోనే మకాం వుంటూ రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా సేద్యం చేశారు. వారి పొలంలో పండిన వరిని సొంత ఉప యోగానికే కాకుండా, ఉద్యోగులకు, సేంద్రీయ వ్యవసాయ ప్రేమికులకు యిచ్చేవారు.
ఓ సారి విదేశీయుడు మొత్తం పంటను కొనుగోలు చేస్తానంటే, అమ్మకానికి

విముఖత వ్యక్తంచేశారు.వారి తోట లోని చెరకు ద్వారా లభిం చిన బెల్లంఎంతో రుచిక రంగా వుండేది.తోట లోని పళ్లను కూడా ఉచిత గా పంచేవారు. వారి వ్యవసా య క్షేత్రం వద్ద ఫార్మ్‌హౌస్‌ చూడముచ్చటగా వుంటే బాపు, రమణలు వారి చిత్రాల ను యిక్కడే షఉటింగ్‌ చేసు కునే వారు.
హైదరాబాద్‌లోని ఆర్గానిక స్టోర్స్‌, నేచురల్‌ సంస్థలలో విక్రయా లు ఊపందుకుంటున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తేతలివాసి భూపతిరాజు రామకృష్ణం రాజు, జస్టిస్‌. పర్వతరావు గారి వ్యవ సాయ క్షేత్రంలో చాలా కాలంగా సేంద్రీ య వ్యవసాయాన్ని చేస్తున్నారు. వీరి దంపుడు బియ్యానికి విశేష ప్రజాదరణ వుంది.
చెన్నైలోని రామకృష్ణ మిషన్‌, విద్యా సంస్థలు వీరివద్దనే బియ్యాన్ని కొనుగోలు చేస్తారు. వీరు దేశవాళీ గోవులతో గోశాలను సమర్థవంతంగా నిర్వహిస్తు న్నారు. పంచగవ్యను వ్యవసాయానికి వినియోగిస్తున్నారు.
బెంగళూరులోని ఇస్కాన్‌ సంస్థ (హరేకృష్ణ) సేంద్రీయ వ్యవసాయాన్ని మైసూర్‌ సమీపంలో నిర్వహిస్తున్నారు. వీరి సేంద్రీయ ఆహార పదార్థాలకు గిరాకీ వుంది. హైదరాబాద్‌ సమీపంలో పలు క్షేత్రాల్లో ఈ మధ్య 'ఆర్గానిక ఫార్మింగ్‌'ని చేపట్టారు. నేడు పలు సూపర్‌ బజార్లు కూడా సేంద్రీయ ఆహార పదార్థాలను కొనడానికి ముందుకు వస్తున్నారు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి, కానీ కీడు చేయవు. రుచికి రుచి వుంటాయి.
రసాయన ఎరువులు, పురుగుల మందుల వాడకం కారణాన పండ ిన ఆహార పదార్థాలు ఆరోగ్యానికే చేటు చేస్తున్నాయి. తల్లిపాలు కూడా శక్తిని కోల్పోతున్నట్లు కొన్ని నివేదికలు తెలుపు తున్నాయి. కొన్ని విదేశాలు కూడా ఆర్గానిక దిగుమతులకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి.

తోటల పెంపకంపై సెమినార్‌
నగరాలలో కాయగూరలు, పూలతోటలు, పళ్ల తోటల పెంపకంపై ముంబైలో డిసెంబర్‌ 10-12వ తేదీ వరకు సెమినార్‌ను నిర్వహిస్తున్నారు. అర్బన్‌ సంస్థ సారవంతమైన మట్టిని ఎలా తయారు చేయాలనే అంశంపై తెలియజేస్తుంది. దేశంలోని ప్రముఖ సేంద్రీయ నిపుణులు తమ అనుభవాలను తెలియజేస్తారు.
ఈ సెమినార్‌ ఔషధ మొక్కల గూర్చి, ఆరోగ్య పరిరక్షణ గూర్చి ప్రముఖులు మాట్లాడెదరు. మహారాష్ట్ర నేచర్‌ పార్క్‌, మహీం, ముంబైలో ఈ సదస్సు జరుగుతుంది.
టెర్రేస్‌ గార్డెనింగ్‌
బెంగళూరులోని డా్ప్ప బి.ఎన్‌. విశ్వనాథ్‌ టెర్రేస్‌ గార్డెనింగ్‌పై ఓ హ్యాండ్‌బుక ప్రచురించారు. 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిలోనే చెత్త, చెదారం నుండి ఎరువుని చేసి వేస్తు.. 10 కిలోల సేంద్రీయ కూరగాయాలను వారం రోజులలో పండించ వచ్చని నిరూపించారీయన
రోజూ ఓ గంట 'గార్డెనింగ్‌' చేస్తే కుటుంబానికి పోషణ లభించడమే కాకుండా మంచి ఆరోగ్యం కూడా దొరుకుతుందని ఈయన తన వెబ్‌సైట్లు, యూట్యూబ్‌లలో చేస్తున్న ప్రచారం బహుళ ప్రజాదరణ పొందాయి.

- దండు కృష్ణవర్మ