1, అక్టోబర్ 2012, సోమవారం

రేపు పార్టీని ప్రకటించనున్న కేజ్రీవాల్


రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటన చేయడం ద్వారా మంగళవారం రోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. కాన్టిట్యూషనల్ క్లబ్‌లో ఏర్పాటు చేసే సమావేశంలో పార్టీ ఏర్పాటు ప్రకటనను మనీష్ సిసోడియాతో కలిసి కేజ్రీవాల్ ప్రకటించనున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని పార్టీ ప్రకటన, విధివిధానాలను రేపు ప్రకటిస్తామని చెప్పారు. తనకు హజారేతో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు.