5, ఫిబ్రవరి 2011, శనివారం

వచ్చే నెల ఏడున జగన్ పార్టీ

వైఎస్ జగన్మోహనరెడ్డి తన రాజకీయ పార్టీని వచ్చే నెల ఏడున ప్రకటించనున్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. 'వైఎస్ఆర్ కాంగ్రెస్' లేదా 'రాజన్న రాజ్యం పార్టీ'లలో ఒకదానికి ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని, 'వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ' వైపే జగన్ మొగ్గు చూపుతున్నారని, మార్చి మొదటి వారంలోనే గుర్తింపు లభిస్తే.. ఉప ఎన్నికల్లో పార్టీ జెండాతోనే రంగంలోకి దిగేందుకు ఆయన సన్నద్ధమవుతున్నారని తెలిసింది.