14, ఏప్రిల్ 2011, గురువారం

కృష్ణ వంశీ ట్రేడ్ మార్క్ సినిమా 'మొగుడు'

ప్రేక్షకుల్ని ఆకర్షించడంలో ఈ మద్య కృష్ణ వంశీ బాగా వెనిక బడి పోయాడు. ఇంతకు ముందు మాస్ ని దృష్టిలో పెట్టుకొని తీసిన 'మహాత్మ' చిత్రం కమర్షియల్ గా సక్సెస్ కా క పోవటంతో మళ్ళి తన ఫ్యామిలీ డ్రామాలకు తెర లేపాడు.. అందులో భాగంగానే గోపీచంద్ హీరోగా ఈసారైనా హిట్ మూవీ అందించాలని ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా 'మొగుడు' చిత్రాన్ని రూపొందిస్తున్నాడట.

గతంలో తానుఅందించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్.. నిన్నే పెళ్లాడతా, మురారి, చందమామ, సూపర్ హిట్ అయ్యాయి అలా ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తీయడంలో వున్న తన అనుభవాన్ని ఇక్కడ కూడా ఉపయోగించి, హిట్ కొట్టాలనుకుంటున్నాడని టాలీవుడ్ సమాచారం!