21, సెప్టెంబర్ 2012, శుక్రవారం

యూపీఏకు ములాయం మద్దతు

ములాయం సింగ్ యాదవ్ యూపిఏ ప్రభుత్వాన్ని ఆపద సమయంలో ఆదుకున్నారు. యూపీఏ సర్కాకు బయట నుంచే మద్దతు ఇస్తామని సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ పేర్కొన్నారు. అయితే డీజిల్ ధర పెంపు, వంట గ్యాస్ పరిమితి, ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. మతతత్వ శక్తులు అధికారంలో రాకూడదనే యూపీఏకు మద్దతునిస్తున్నామని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా శుక్రవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ యూపిఏకి మద్దతు ఇస్తున్నప్పటికీ ప్రజా వ్యతిరేక కేంద్ర విధానాలపై తాము ఉద్యమిస్తామన్నారు. 2014లో మూడో ఫ్రంట్‌దే విజయమని ధీమా వ్యక్తపరిచారు. ప్రస్తుతం మద్యంతరానికి అవకాశం లేదని ములాయింసింగ్ యాదవ్ తేల్చిచెప్పారు.


ఆంధ్రజ్యోతి సౌజన్యంతో