21, సెప్టెంబర్ 2012, శుక్రవారం

పదిలక్షల మందితో సమైక్యాంధ్ర మార్చ్

ఈ నెల 30వ తేదిన తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చేపట్టనున్న తెలంగాణ మార్చ్‌కు ధీటుగా తాము సమైక్యాంధ్ర మార్చ్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆంధ్ర ప్రదేశ్ రైతాంగ సమాఖ్య శుక్రవారం ప్రకటించింది.
తెలంగాణ మార్చ్ నిర్వహించే రోజునే తాము సమైక్యాంధ్ర మార్చ్ నిర్వహిస్తామని చెప్పారు. సీమాంధ్ర ప్రాంత నేతలు సమైక్యాంధ్ర కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ముందుకు రాని వారిని సమైక్యాంధ్ర వ్యతిరేకులుగా గుర్తిస్తామని, తమకు మద్దతు పలికే వారిని వచ్చే సాధారణ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని సూచించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఎంపీలు రాజీనామా చేయాలని వారు పిలుపునిచ్చారు.  తెలంగాణ నేతలు లక్ష మందితో మార్చ్ చేస్తే తాము పదిలక్షల మందితో చేస్తామన్నారు.