4, నవంబర్ 2021, గురువారం

 ● గాజువాక: 


◆ విశాఖలోని అగనంపూడి టోల్‌గేట్‌ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. 


◆ ఆనందపురం నుంచి తమిళనాడుకు వెళుతున్న మినీ వ్యానులో 1,200 కేజీల గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.


◆ బంగాళదుంపల బస్తాల లోడు కింద అక్రమంగా గంజాయి తరలిస్తున్నారని దువ్వాడ పోలీసులకు సమాచారం అందింది. 


◆ ఈ మేరకు తనిఖీలు నిర్వహించిన పోలీసులు వాహనాన్ని గుర్తించి గంజాయిని సీజ్‌ చేశారు. దాన్ని తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.


◆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.