4, నవంబర్ 2021, గురువారం

 నాలుగవ రోజుకు రాజధాని రైతుల మహా పాదయాత్ర

అమరావతి: ‘అమరావతి’ రాజధాని కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్ర నాలుగవ రోజుకు చేరుకుంది. న్యాయస్దానం నుంచి దేవస్దానం పేరుతో మహా పాదయాత్ర చేపట్టారు. పుల్లడిగుంట నుంచి నాలుగవ రోజు పాదయాత్ర ప్రారంభంకానుంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో నాల్గవ రోజు పాదయాత్ర సాగనుంది. మూడు రోజులలో 43 కిలోమీటర్ల వరకు పాదయాత్ర సాగింది. పాదయాత్రలో వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు పాల్గొంటున్నాయి.