11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

వజ్రాల స్మగ్లింగ్‌ కి కండోమ్స్‌

ఏదైనా పని నిర్విఘ్నంగా చేయాలనుకుంటే మార్గాలు అనేకం. అయితే మంచి కోసం ఆ మార్గాలను వినియోగించుకోవచ్చు. కానీ ఓ వ్యక్తి కడుపులో విలువైన వస్తువులు దాచుకుని స్మగ్లింగ్‌ పాల్పడిన ఘటన గురువారం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం బయట వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీలంక వాసి (43) అయిన స్మగ్లర్‌ కండమ్స్‌లలో భారీ సంఖ్యలో వజ్రాలు నింపి కడుపులోకి మింగేసి అమాయకుడిగా చెన్నైకి చేరుకున్నాడు. ఈ విషయమై చెన్నై సబర్బన్‌ పోలీసులు స్థానిక అంతర్జాతీయ విమానాశ్రయం బయట అనుమానాస్పద స్థితిలో తచ్చాడుతున్న ఈ వ్యక్తిని పట్టుకుని ప్రశ్నించారు. తొలుత తనకేం తెలియదని సదరు స్మగ్లర్‌ బుకాయించాడు. కానీ పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లి 'ఎక్స్‌ రే' తీయడంతో అసలు విషయం బయట పడింది.

పోలీసులు అతన్ని ఆసుపత్రిలో అడ్మిట్‌ చేసి అరటి పండ్లు, కొన్ని మందులు తినిపించడంతో వాంతి చేసుకున్నాడు. దాంతో కడుపులో ఉన్న వజ్రాల ప్యాకెట్లన్నీ బయట పడ్డాయి. 42 ప్యాకెట్లలో 2065 వజ్రాలున్నాయని పోలీసులు తెలిపారు.కేవలం రూ.10,000 కోసమే తానీపని చేస్తున్నానని చెప్పాడు.