15, ఫిబ్రవరి 2011, మంగళవారం

ఉండేవారెవరో.. వెళ్లేవారెవరో..ముందు తేల్చుకొండి

కాంగ్రెస్‌లో ఉండేవారెవరో, బయటకు వెళ్లేవారెవరో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని..రాష్ట్ర స్తాయి నుంచి మండలస్థాయి వరకూ ఈ స్పష్టత రావాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ మానిటరింగ్ కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..పార్టీలో నిజమైన కాంగ్రెసు వాదులు ఎవరో కానివారెవరో గుర్తించాల్సినఅవసరం ఎంతైనా ఉoదని.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేయాలన్నారు.

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని.. ఇందుకు పార్టీ కార్యకర్తలు అందరూ సర్వసన్నద్ధం కావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సుస్థిరతకు ఎలాంటి ఢోకా లేదని. ప్రభుత్వం 2014 వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు.