15, ఫిబ్రవరి 2011, మంగళవారం

సీరియల్ కిల్లర్ సురేంద్ర కోలీకి మరణశిక్ష ఖరారు

నిఠారీ సీరియల్ కిల్లర్ సురేంద్ర కోలీకి సుప్రీంకోర్టు మంగళవారం మరణశిక్షను ఖరారు చేసింది. రింపా హల్దార్ హత్య కేసులో కోలీకి విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే సహ నిందితుడు మనీందర్ సింగ్ పంధేర్‌కు కల్పించిన విముక్తిని సవాల్ చేస్తూ దాఖలు చేసిన అపీల్‌ను సుప్రీంకోర్టు పెండింగులో పెట్టింది.

కోలీ, మనీందర్‌లపై అదే విధమైన రేప్ ‌చేసి హత్యలు చేశారనే ఆరోపణలపై 18 కేసులు పెండింగులో ఉన్నందున మనీందర్ సింగ్ పంధేర్‌ను హల్దార్ హత్య కేసులో నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు పెండింగులో పెట్టింది. సురీందర్ కోలీ నేరం కిరాతకమైందని, భయానకమైందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.