15, ఫిబ్రవరి 2011, మంగళవారం

ఉపఎన్నికలపై అబ్బాయి, బాబాయి పట్టు

పులివెందులలో వైఎస్ ప్రకాష్‌రెడ్డి నివాసంలో మంగళవారం ఉదయం కడప నియోజకవర్గం మాజీ ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తమ కుటుంబసభ్యులతో సమావేశమయ్యారు. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై వారు చర్చలు జరిపినట్లు తెలియవచ్చింది.

మరోవైపు తన అల్లుడికి కడప పార్లమెంటు సీటు ఇవ్వవలసిందిగా కోరేందుకు వ్యవసాయ శాఖామంత్రి వైయస్ వివేకానంద రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లినట్లుగా తెలుస్తోంది. వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డిని కడప జిల్లా పార్లమెంటు అభ్యర్థిగా దింపాలనే యోచనలో వివేకా ఉన్నారు.