15, ఫిబ్రవరి 2011, మంగళవారం

సీతక్క పాదయాత్రకు విద్యార్ధుల అడ్డు

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యే సీతక్క మంగళవారం వరంగల్ జిల్లాలో చేపట్టిన పాదయాత్రను ములుగు మండలంలో విద్యార్థులు అడ్డుకున్నారు.

టీడీపీ కార్యకర్తలకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరగడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆమె రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో అక్కడ ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం ఘట్టమ్మ దేవాలయం వద్ద సీతక్క దీక్షకు దిగారు.