29, ఏప్రిల్ 2011, శుక్రవారం

'నగరం నిద్రపోతున్న వేళ' ఆడియో విడుదల

‘నగరం నిద్రపోతున్న వేళ’ చిత్రం ఆడియో హైదరాబాద్‌, శిల్పారామంలో జరిగిన కార్యక్రమంలో విడుదలైంది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి మునియప్ప ఆడియో సీడీలను విడుదల చేసి, తొలి సీడీని హీరో జగపతిబాబుకు అందజేశారు. ఈ వేడుకలో కథానాయిక చార్మి, తిప్పేస్వామి, నటుడు బాబూమోహన్‌, సహ నిర్మాత టేకుల ముక్తిరాజ్‌, దర్శకులు సాగర్‌, చంద్రసిద్ధార్థ, కాశీవిశ్వనాథ్‌, చంద్ర మహేష్‌, రాంప్రసాద్‌, గీత రచయితలు సుద్దాల అశోక్‌తేజ, భాస్కరభట్ల, అనంత్‌శ్రీరామ్‌, ఆదిత్యా మ్యూజిక్‌ దయానంద్‌ తదితరులు పాల్గొన్నారు.