28, ఏప్రిల్ 2011, గురువారం

కడుపులు కాలడంతోనే జనం తిరుగుబాటు

 తెలంగాణ ఉద్యమం ఇంత జోరుగా సాగుతున్నాఆంధ్రా వలసవాదుల దోపిడీ కొనసాగుతూనే ఉందని తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ ధ్వజమెత్తారు. అమరవీరుల ఆత్మ శాంతించాలంటే వారి ఆశయసాధనకోసం ఉద్యమించాల ని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు.బొగ్గు, నీళ్ళు, గుట్టలు, ఇసు క, కలప తదితర సంపద తరలిపోతూ తమ కడుపులు కాలడంతోనే జనం తిరుగుబాటుచేసి వేరు తెలంగాణ కావాలంటున్నారన్నారు. ఇన్నేళ్ళ పోరులో సమైక్యవాదులు సంపన్నులైతే తెలంగాణ ప్రజలకు గోరీలే మిగిలాయని పేర్కొన్నారు. చిన్నరాష్ట్రాలను ఇచ్చిన బీజేపీ ఎవరో అడ్డుతగిలితే తెలంగాణను ఇవ్వలేదని, అలాగని మనం బోర్లా పడమని, ప్రత్యేకరాష్ట్రాన్ని సాధించుకునేంతవరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.